పెన్నానదిలో ఈతకెళ్లి ముగ్గురి మృతి | Three died in the river Penna | Sakshi
Sakshi News home page

పెన్నానదిలో ఈతకెళ్లి ముగ్గురి మృతి

Published Sun, Jul 31 2016 6:01 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM

Three died in the river Penna

 సిద్ధవటం మండలం మాచుపల్లె వద్ద పెన్నానదిలో ఈతకెళ్లి ముగ్గురు మృతిచెందారు. వివరాలు..ఇటీవల కురిసిన వర్షాలకు పెన్నానదిలో నీటి ప్రవాహం పెరగడంతో సరదాగా ఐదుగురు స్నేహితులు పెన్నానదిలో ఈతకు వెళ్లారు. ఈ ఐదుగురు నీటిలోకి దిగిన అనంతరం నీటి ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయారు. ఈ దశలో వీరి అరుపులు విన్న సమీప పొలాల్లోని రైతులు ఇద్దరు యువకులను కాపాడగలిగారు. ముగ్గురు మాత్రం నీటిలో మునిగిచనిపోయారు. మృతులు కడప నగరానికి చెందిన వారిగా భావిస్తున్నారు. మృతిచెందిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement