Penna River
-
పెన్నమ్మకు గర్భశోకం
సాక్షి టాస్క్ఫోర్స్: వైఎస్సార్ జిల్లా యర్రగుంట్ల మండల పరిధిలోని హనుమనుగుత్తి గ్రామ పంచాయతీ పరిధిలోని బిస్మిల్లాబాద్ గ్రామం సమీపంలో పెన్నానదిలోని ఇసుకను అక్రమదారులు ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. పైగా గేటు వసూలు చేస్తున్నారు. క్వారీలో నుంచి అవసరమైనప్పుడు ఇసుకను ఉచితంగా తెచ్చుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. యర్రగుంట్ల మండలం పరిధిలో ఎక్కడా ఇసుక క్వారీ లేదు. దీంతో అక్రమార్కులు ఇసుకను తోడేస్తూ పెన్నామ్మకు గర్భశోకం మిగిలిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బిస్మిల్లాబాద్ గ్రామంలోని కొందరు టీడీపీ నాయకులు పెన్నానదిలోని ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్కు ఒక రేటు పెట్టి గేటును వసూలు చేస్తున్నారు. రోజుకు ఒక్కరు చొప్పును వంతులు వేసుకొని బయట నుంచి ట్రాక్టర్లను రప్పించుకొని అనధికారంగా గేటును పెట్టుకుని వసూళ్లకు తెరలేపారు. రోజుకొకరు చొప్పున ఇసుకను అమ్ముకుంటున్నారు. ప్రొద్దుటూరు, రామేశ్వరం పొట్లదుర్తి గ్రామాల నుంచి ఇసుక కోసం రోజూ ట్రాక్టర్లు వరుసలో నిలబడుతున్నాయి.ఇసుక తరలిపోతుండటం వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. వీరి అక్రమాలను మొదట్లో గ్రామస్తులు అడ్డుకున్నారు. తర్వాత గ్రామం కోసం డబ్బు వసూలు చేస్తున్నామంటూ వారికి నచ్చజెప్పారు. పెన్నాలో అక్రమంగా ఇసుకను గేటు పెట్టి వసూళ్లు చేసుకుంటున్నారని గ్రామంలోని కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
నెల్లూరులో మంత్రి నారాయణ అనుచరుల బరితెగింపు
-
శతాబ్ది స్వప్నం సాకారం
సాక్షి, అమరావతి : ఇది పెన్నా డెల్టా రైతుల శతాబ్ది స్వప్నం. సంగం బ్యారేజ్ను సీఎం వైఎస్ జగన్ రికార్డు సమయంలో పూర్తిచేసి, జాతికి అంకితం చేయడంతో కల సాకారమైంది. దీంతో.. జీవ నదులైన గోదావరి, కృష్ణా బేసిన్లలోని రైతులతో పెన్నా డెల్టా రైతులు పంటల సాగు, దిగుబడులలో పోటీపడే స్థాయికి చేరుకున్నారు. అలాగే, పెన్నా వరదల ముప్పు పూర్తిగా తప్పడంతో ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మరోవైపు.. భూగర్భ జలమట్టం పెరగడంతో తాగు, సాగునీటి కొరత తీరింది. ఇక సంగం–పొదలకూరు మండలాల మధ్య రవాణాకు అడ్డంకులు తీరిపోయాయి. ‘సంగం’ కథాకమామిషు.. నెల్లూరు జిల్లాలో సంగం వద్ద పెన్నా నదిపై 1882–83లో బ్రిటీష్ సర్కార్ 0.9 మీటర్ల ఎత్తున ఆనకట్టను నిర్మించి.. పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువల కింద ఆయకట్టుకు 1886 నుంచి నీళ్లందించడం ప్రారంభించింది. ఈ ఆనకట్టకు దిగువన నదీ గర్భంలో నిర్మించిన రోడ్డు ద్వారా సంగం–పొదలకూరు మండలాల మధ్య రాకపోకలు సాగుతున్నాయి. పెన్నాలో వరద పెరిగితే ఈ రెండు మండలాల మధ్య రాకపోకలు స్తంభించిపోయేవి. ఆ తర్వాత ఆనకట్ట శిథిలావస్థకు చేరుకోవడంతో.. ఆనకట్టపై ఇసుక బస్తాలు వేసి, నీటిని నిల్వచేసినా నీళ్లందించడం కష్టంగా మారింది. దీని స్థానంలో బ్యారేజ్ నిర్మిస్తే ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లందుతాయని.. ఆ బ్యారేజ్ను నిరి్మంచాలని నెల్లూరు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ, 2006 వరకూ ఎవరూ పట్టించుకోలేదు. వందేళ్ల కలను సాకారం చేస్తూ.. నెల్లూరు జిల్లా ప్రజల వందేళ్ల కలను నిజం చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2006, మే 28న సంగం బ్యారేజ్కు శంకుస్థాపన చేశారు. ఈ పనులను రూ.147.50 కోట్ల అంచనా వ్యయంతో 2008, మే 21న చేపట్టారు. మహానేత వైఎస్ హయాంలో బ్యారేజ్ పనులు పరుగులు తీశాయి. అప్పట్లో రూ.30.78 కోట్లు వ్యయం చేశారు. ఆయన హఠాన్మరణం సంగం బ్యారేజ్ పనులకు శాపంగా మారింది. కమీషన్లు వచ్చే పనులకే బాబు ప్రాధాన్యం.. సంగం బ్యారేజ్ను నిర్మిస్తున్న ప్రాంతంలో పెన్నా నది వెడల్పు 1,400 మీటర్లు. కానీ, అప్పట్లో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్ 846 మీటర్ల వెడల్పుతో బ్యారేజ్ (కాంక్రీట్ నిర్మాణం), ఇరువైపులా 554 మీటర్ల వెడల్పుతో మట్టికట్టలు నిర్మించేలా డిజైన్ను ఆమోదించారు. బ్యారేజ్ నిర్మాణ సమయంలో ఇబ్బందులు ఏర్పడటంతో 1,195 మీటర్ల వెడల్పుతో బ్యారేజ్ (కాంక్రీట్ కట్టడం)ను నిర్మించాలని 2014లో నిపుణుల నివేదిక ఇచ్చింది. దీనిని ఆమోదించడంలో రెండేళ్లపాటు జాప్యంచేసిన టీడీపీ సర్కార్.. 2016, జనవరి 21న ఆ సూచన మేరకు బ్యారేజ్ నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో అంచనా వ్యయాన్ని రూ.335.80 కోట్లకు పెంచింది. బ్యారేజ్ను 2017కు పూర్తిచేస్తామని ఒకసారి.. 2018కి పూర్తిచేస్తామని మరోసారి.. 2019కి పూర్తిచేస్తామని ఇంకోసారి మాటమారుస్తూ కేవలం కమీషన్లు వచ్చే పనులకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలో చేసిన పనుల కంటే.. ధరల సర్దుబాటు (ఎస్కలేషన్), పనుల పరిమాణం పెరిగిందనే సాకుతో అధికంగా బిల్లులు చెల్లించింది. రూ.88.41 కోట్లను ఖర్చుచేసినా కమీషన్ల కక్కుర్తితో బ్యారేజ్ పనులను కొలిక్కి తేలేకపోయింది. కరోనా తీవ్రత.. వరద ఉధృతితో పోటీపడుతూ పనులు ఈ నేపథ్యంలో.. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక సంగం బ్యారేజ్పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. శరవేగంగా సంగం బ్యారేజ్ను పూర్తిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో.. ♦ గతంలో ఎన్నడూలేని రీతిలో 2019–20లో 42.52, 2020–21లో 301.52, 2021–22లో 373.52 టీఎంసీలు నెల్లూరు బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసాయంటే పెన్నా నదికి ఏ స్థాయిలో వరద వచ్చిందో అంచనా వేసుకోవచ్చు. ♦ ఓ వైపు కరోనా తీవ్రత.. మరోవైపు పెన్నా వరద ఉధృతితో పోటీపడుతూ బ్యారేజ్ పనులను సీఎం జగన్ పరుగులు పెట్టించారు. ♦ బ్యారేజ్కు ఎగువన ఎడమ వైపున 3.17 కిమీల, బ్యారేజ్కు కుడి వైపున 3 కిమీల పొడవున కరకట్టలను పటిష్టం చేశారు. ♦ సంగం నుంచి పొదలకూరుకు రాకపోకలు సాగించడానికి వీలుగా బ్యారేజ్పై రెండు వరుసల రోడ్ బ్రిడ్జిని పూర్తిచేశారు. ♦ కనిగిరి, కావలి కాలువలకు సంయుక్తంగా నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్, కనుపూరు కాలువకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్లను పూర్తిచేశారు. ♦ ఈ పనులను రూ.128.88 కోట్లతో పూర్తిచేసి.. బ్యారేజ్ను 2022, సెపె్టంబరు 6న సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. తద్వారా నెల్లూరు ప్రజల దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేశారు. సుజలాం.. సుఫలాం.. సస్యశ్యామలం.. ఇక సంగం బ్యారేజ్ పూర్తవడంతో 2022 నుంచి ఏటా పెన్నా డెల్టాలోని 2.47 లక్షలు, కనుపూరు కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేలు వెరసి 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందుతున్నాయి. దీంతో రైతులు విస్తారంగా పంటలు సాగుచేస్తున్నారు. గోదావరి, కృష్ణా డెల్టా రైతులతో పోటీపడుతూ గరిష్టంగా దిగుబడులు సాధిస్తున్నారు. పంటల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు దక్కుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. బ్యారేజ్లో 0.45 టీఎంసీలను నిల్వచేయడంతో భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లో పుష్కలంగా నీళ్లు లభ్యమవుతున్నాయి. అలాగే, సంగం బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని పూర్తిచేయడంతో సంగం, పొదలకూరు మండలాల మధ్య రాకపోకల సమస్య శాశ్వతంగా పరిష్కారమైంది. ఇప్పుడు సమృద్ధిగా నీళ్లందుతున్నాయి.. పెన్నా డెల్టాలో నాకు 16 ఎకరాల పొలం ఉంది. బ్యారేజ్ పూర్తికాక ముందు నీళ్లందక సాగుచేయడానికి ఇబ్బందిపడేవాణ్ణి. సీఎం జగన్ బ్యారేజ్ను పూర్తిచేయడంతో సమృద్ధిగా నీళ్లందుతున్నాయి. సొంత పొలంతోపాటు కౌలుకు 40 ఎకరాలు తీసుకుని వరి సాగుచేస్తున్నా. మంచి దిగుబడులు వస్తున్నాయి. గిట్టుబాటు ధర దక్కుతోంది. వరి సిరులు కురిపించిన ఘనత సీఎం జగన్దే. – మల్లవరం రామకృష్ణారెడ్డి, రైతు, కోవూరు రికార్డు సమయంలో పూర్తిచేశాం.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో సంగం బ్యారేజ్ను రికార్డు సమయంలో పూర్తిచేశాం. 3.85 లక్షల ఎకరాలకు సమృద్ధిగా నీళ్లందించడానికి బ్యారేజ్ దోహదపడుతుంది. బ్యారేజ్లో నిత్యం 0.45 టీఎంసీలను నిల్వచేయడంవల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. దీనివల్ల సాగు, తాగునీటి సమస్యలకు ఇబ్బంది ఉండదు. సంగం బ్యారేజ్ కమ్ బ్రిడ్జి పూర్తవడంవల్ల సంగం–పొదలకూరు మండలాల మధ్య రవాణా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లయింది. – సి. నారాయణరెడ్డి, ఈఎన్సీ, జలవనరుల శాఖ మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ స్వరూపం నిర్మాణం : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సంగం వద్ద పెన్నా నదిపై.. (సోమశిల రిజర్వాయర్కు 40 కిమీల దిగువన) పరివాహక ప్రాంతం : 50,122 చ.కి.మీ. బ్యారేజ్ పొడవు : 1,195 మీటర్లు (బ్యారేజ్కు అనుబంధంగా రెండు వరుసల రోడ్ బ్రిడ్జి) గేట్లు : 85 గేట్లు (12 మీటర్లు ఎత్తు, 2.8 మీటర్ల వెడల్పుతో 79 గేట్లు.. 12 మీటర్ల ఎత్తు, 3.8 మీటర్ల వెడల్పుతో 6 స్కవర్ స్లూయిజ్ గేట్లు) గేట్ల మరమ్మతుల కోసం సిద్ధంచేసిన స్టాప్లాగ్ గేట్లు : 9 గేట్ల నిర్వహణ విధానం : వర్టికల్ లిఫ్ట్ గరిష్ట వరద విడుదల సామర్థ్యం : 7,50,196 క్యూసెక్కులు గరిష్ట నీటి మట్టం : 35 మీటర్లు గరిష్ట నీటినిల్వ : 0.45 టీఎంసీలు కనీస నీటి మట్టం : 32.2 మీటర్లు ఆయకట్టు : 3.85 లక్షల ఎకరాలు అంచనా వ్యయం : 335.80 కోట్లు మహానేత వైఎస్ హయాంలో వ్యయం : రూ.30.78 కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం : రూ.128.88 కోట్లు -
హన్నన్నా.. పెన్నాలో ఇన్ని నీళ్లా?
సాక్షి, అమరావతి: పెన్నా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఏటా 210.12 టీఎంసీల నీటి ప్రవాహం ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. 1985 నుంచి 2015 వరకు పెన్నా నదీ పరీవాహక ప్రాంతం (బేసిన్)లో వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. ఏటా పెన్నా బేసిన్లో కురిసే వర్షపాతం పరిమాణం 1412.58 టీఎంసీలని లెక్కగట్టింది. వరద జలాలతో కలుపుకొంటే ఏటా 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది. కానీ.. పెన్నాలో ఆ స్థాయిలో నీటి లభ్యత లేదని సాగునీటి రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. బేసిన్లో 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతను లెక్కగట్టడం శాస్త్రీయం కాదని చెబుతున్నారు. వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా చేసే అధ్యయనానికే శాస్త్రీయత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అప్పటికి, ఇప్పటికి ఇదీ తేడా.. పెన్నాలో నీటి లభ్యతపై 1993లో సీడబ్ల్యూసీ తొలిసారి అధ్యయనం చేసింది. 1944–45 సంవత్సరం నుంచి 1983–84 వరకు బేసిన్లో 40 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా అప్పట్లో నీటి లభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలుపుకొంటే పెన్నాలో 223.18 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చింది. పెన్నా బేసిన్ 55,213 చదరపు కిలోమీటర్లుగా పేర్కొంది. తాజాగా సీడబ్ల్యూసీ పెన్నా బేసిన్లో 1985–2015 మధ్య అంటే 30 ఏళ్లలో కురిసిన వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలిపితే 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది. 75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే నదిలో 210.12 టీఎంసీలు ఉంటుందని తేల్చింది. కానీ.. బేసిన్ మాత్రం 54,905 చదరపు కిలోమీటర్లకు తగ్గినట్లు గుర్తించింది. అంటే.. 1993తో పోల్చితే బేసిన్ విస్తీర్ణం 308 చదరపు కిలోమీటర్లు తగ్గింది. పెన్నా బేసిన్లో 1944–84తో పోల్చితే 1985–2015 మధ్య వర్షపాతం అధికంగా ఉండటంవల్లే నీటి లభ్యత పెరిగిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. దీన్ని సాగునీటి రంగ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. కేవలం 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాలను ఆధారంగా తీసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. అధ్యయనం పరిధిని తగ్గించుకోవడం వల్లే నీటి లభ్యత పెరిగిందని, ఇది అశాస్త్రీయమని స్పష్టం చేస్తున్నారు. పెన్నా బేసిన్ ఇదీ.. కర్ణాటకలో వర్షాఛాయ ప్రాంతమైన చిక్బళ్లాపూర్ జిల్లా నంది కొండల్లోని చెన్నకేశవ పర్వత శ్రేణుల్లో పుట్టే పెన్నా నది.. రాష్ట్రంలో వర్షాభావ ప్రాంతాలైన శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల మీదుగా 597 కిలోమీటర్లు ప్రవహించి.. ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎడమ వైపు నుంచి జయమంగళ, కుందేరు, కుడి వైపు నుంచి సగిలేరు, చిత్రావతి, పాపాఘ్ని, చెయ్యేరు ఉప నదులు పెన్నాలో కలుస్తాయి. పెన్నా బేసిన్లో 400 800 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. ఈ బేసిన్ విస్టీర్ణం 54,905 చదరపు కిలోమీటర్లని సీడబ్ల్యూసీ తాజాగా తేల్చింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 1.67 శాతానికి సమానం. -
వేసవిలోనూ పెన్నా బేసిన్లో జలరాశి
సాక్షి, అమరావతి: పెన్నా నది పరీవాహక ప్రాంతం (బేసిన్)లోని రిజర్వాయర్లలో వేసవిలోనూ పుష్కలంగా నీటి నిల్వలు ఉన్నాయి. శుక్రవారానికి రిజర్వాయర్లలో 151.94 టీఎంసీలు ఉన్నాయి. పెన్నా బేసిన్లోని రిజర్వాయర్ల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 239.59 టీఎంసీలు. అంటే.. ఖరీఫ్ పూర్తయి, రబీ పంటలు కోత దశలో ఉన్న సమయంలో పెన్నా రిజర్వాయర్ల సామర్ధ్యంలో ఇప్పటికీ 63.42 శాతం నీరు నిల్వ ఉండటం గమనార్హం. సోమశిల రిజర్వాయర్లో 78 టీఎంసీలకుగానూ 52.62 టీఎంసీలు, కండలేరులో 68.3 టీఎంసీలకుగాను 38.65 టీఎంసీలు, గండికోటలో 26.85 టీఎంసీలకుగాను 25.37 టీఎంసీలు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 10 టీఎంసీలకుగాను 8.16 టీఎంసీలు, వెలిగల్లు ప్రాజెక్టులో 4.64 టీఎంసీలకుగాను 4.41 టీఎంసీలు జలాలు ఉన్నాయి. పెన్నా బేసిన్ చరిత్రలో ఏప్రిల్ రెండో వారంలో ఈ స్థాయిలో నీరు ఉండటం ఇదే ప్రథమమని అధికారవర్గాలు తెలిపాయి. రిజర్వాయర్లలో గతేడాది ఇదే రోజుకు 134.74 టీఎంసీలు.. 2021లో 127.6 టీఎంసీలు నిల్వ ఉండేవి. కర్ణాటకలో వర్షాఛాయ ప్రాంతమైన నంది కొండల్లో జన్మించే పెన్నా నది.. జయమంగళి, కుందేరు, సగిలేరు, చిత్రావతి, బాహుదా, పించా, పాపాఘ్ని వంటి ఉప నదులను కలుకుకొని శ్రీ సత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల మీదుగా ప్రవహించి.. ఊటుకూరు వద్ద సముద్రంలో కలుస్తుంది. వర్షఛాయ ప్రాంతంలో ఉన్న ఈ నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురవకపోడంతో 2019 వరకూ పెన్నాలో ప్రవాహం పెద్దగా ఉండేది కాదు. కానీ.. గత నాలుగేళ్లుగా బేసిన్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో పెన్నా నది ఉరకలెత్తింది. చిన్న, మధ్య తరహా, భారీ ప్రాజెక్టులు నిండటంతో ఖరీఫ్లో భారీ ఎత్తున రైతులు పంటలు సాగుచేసుకున్నారు. రబీలోనూ నీరు పుష్కలంగా ఉండటంతో రైతులు అదే రీతిలో పంటలు సాగుచేసుకున్నారు. ప్రస్తుతం రబీ పంటలు కోత దశలో ఉన్నాయి. నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నందున పెన్నా బేసిన్లో వేసవిలో తాగునీటికి ఇబ్బందులు ఉండవని అధికారవర్గాలు చెప్పాయి. గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ ఖరీఫ్లో పంటల సాగుకు ముందస్తుగా నీటిని విడుదల చేయవచ్చని తెలిపాయి. -
నెల్లూరు: పెన్నా నదిలో చిక్కుకున్న ఐదుగురు
నెల్లూరు: పెన్నా నదిలో శనివారం ఐదుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. నది మధ్యలో ఇసుకదిబ్బపై వాళ్లు ఉండడం గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. సాక్షి టీవీ సమాచారంతో స్పందించిన అధికారులు .. పెన్నా బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. తహసీల్దార్తో పాటు పోలీసులు కూడా వచ్చారు. చిక్కుకున్న వాళ్లను మత్యకారులుగా భావిస్తున్నారు. బోట్ ద్వారా వాళ్లను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సోమశిల నుంచి పెన్నాకు నీటిని విడుదల చేయటంతోనే వాళ్లు అలా చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు తమ హెచ్చరికలు పట్టించుకోకుండా వాళ్లు నదిలోకి వెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు. -
నదుల్లో వరద ఉద్ధృతి.. శ్రీశైలానికి పెరిగిన ప్రవాహం
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్టు/విజయపురిసౌత్: పరివాహక ప్రాంతాల్లో (బేసిన్లో) విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, వంశధార, నాగావళి నదుల్లో వరద ఉద్ధృతి పెరిగింది. పెన్నానదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి మంగళవారం సాయంత్రం 6 గంటలకు 3,00,847 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు 8 వేలు, హంద్రీ–నీవాకు 1,013, కల్వకుర్తికి 800 క్యూసెక్కులు తరలిస్తున్నారు. 884.7 అడుగుల్లో 213.38 టీఎంసీలను నిల్వచేస్తూ స్పిల్ వే తొమ్మిదిగేట్లను 10 అడుగులు ఎత్తి 2,51,433, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,537 కలిపి 3,13,970 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు 16 గేట్లను 10 అడుగులు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లు కిందికి వదులుతున్నారు. పులిచింతలకు చేరుతున్న వరదను చేరుతున్నట్లుగా స్పిల్ వే, విద్యుత్ కేంద్రాల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజ్లోకి వరద స్థిరంగా కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్లోకి 2,99,478 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 10,728 క్యూసెక్కులు విడుదల చేస్తూ.. 2,96,625 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
Anantapur: చూపరులను కట్టిపడేస్తోన్న.. జలసోయగం
కూడేరు/ గార్లదిన్నె/ శింగనమల(అనంతపురం జిల్లా): కనీవినీ ఎరుగని రీతిలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు, నదులు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ప్రాజెక్టుల వద్ద గేట్లు ఎత్తడంతో నురగలు కక్కుతూ దూకుతున్న జలసోయగం చూపరులను కట్టిపడేస్తోంది. కూడేరు మండల పరిధిలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) చరిత్రలో పది రోజుల వ్యవధిలో పలుమార్లు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం ఇదే ప్రథమం. మంగళవారం కురిసిన వర్షాలకు పీఏబీఆర్కు 15వేల క్యూసెక్కుల వరద నీరు చేరింది. 5.38 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జేఈఈ లక్ష్మిదేవి తెలిపారు. ఉన్న ఏడు గేట్లలో ఆరు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. గార్లదిన్నె మండలం పెనకచెర్ల వద్దనున్న మిడ్పెన్నార్ రిజర్వాయర్ (ఎంపీఆర్) నిండుకుండను తలపిస్తోంది. పీఏబీఆర్ నుంచి తుంగభద్రజలాలు రోజుకు 17వేల క్యూసెక్కులు ఎంపీఆర్లోకి వస్తున్నాయి. ఈ డ్యాంలో 4.09 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ముందస్తు జాగ్రత్తగా రెండోసారి బుధవారం తొమ్మిది గేట్లు ఎత్తి 17వేల క్యూసెక్కులు పెన్నానది దిగువకు వదిలినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఇక జిల్లాలోనే పెద్దచెరువుల్లో ఒక్కటైన శింగనమల రంగరాయలచెరువు ఉధృతంగా మరవ పారుతోంది. దీంతో బుధవారం శింగనమల వద్ద రాకపోకలు బంద్ అయ్యాయి. అత్యవసర పనులున్న వారిని బోటు ద్వారా అవతలికి తీసుకెళ్లారు. భైరవానితిప్ప ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడంతో బెళుగుప్ప, కణేకల్లు, బొమ్మనహాల్ మండలాల్లో వేదావతి హగరి నది ఉగ్రరూపం దాల్చింది. -
దశాబ్దాల కల ‘సంగం’ సాకారం
మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ నిర్మాణం పూర్తి కావడంతో పెన్నా డెల్టాలోని 2.47 లక్షల ఎకరాలు, కనుపూరు కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేలు వెరసి మొత్తంగా 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించడానికి మార్గం సుగమం అయ్యింది. ప్రధానంగా నెల్లూరుకు ముంపు ముప్పు తప్పింది. చెప్పిన మాట మేరకు యుద్ధ ప్రాతిపదికన బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన నిబద్ధతను చాటుకున్నారు. దీనికి తోడు నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జి కూడా రికార్డు సమయంలో పూర్తి కావడం విశేషం. (మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి రామగోపాలరెడ్డి ఆలమూరు): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజల దశాబ్దాల స్వప్నం సాకారమైంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ పనులను ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేశారు. ఈనెల 6న బ్యారేజ్ను జాతికి అంకితం చేయనున్నారు. దీంతో పాటు నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జిని కూడా రికార్డు సమయంలో పూర్తి చేశారు. సంగం బ్యారేజీ నిర్మాణం ద్వారా పెన్నా వరదలను సమర్థవంతంగా నియంత్రించి, ముంపు ముప్పు నుంచి నెల్లూరు జిల్లా ప్రజలను తప్పించవచ్చు. బ్యారేజ్లో 0.45 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉండటం వల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగడం ఖాయం. తద్వారా తాగునీటి ఇబ్బందులు తీరుతాయి. మేకపాటి గౌతమ్రెడ్డి బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని పూర్తి చేయడం ద్వారా సంగం, పొదలకూరు మండలాల మధ్య రాకపోకల సమస్యను సీఎం వైఎస్ జగన్ శాశ్వతంగా పరిష్కరించారు. శిథిలమైనా పట్టించుకోని దుస్థితి నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నా నదిపై 1882–83లో బ్రిటీష్ సర్కార్ 0.9 మీటర్ల ఎత్తున ఆనకట్టను నిర్మించి.. పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువల కింద ఆయకట్టుకు 1886 నుంచి నీళ్లందించడం ప్రారంభించింది. ఈ ఆనకట్టకు దిగువన నదీ గర్భంలో నిర్మించిన రోడ్డు ద్వారా సంగం–పొదలకూరు మండలాల మధ్య రాకపోకలు సాగుతున్నాయి. పెన్నాలో వరద పెరిగితే ఈ రెండు మండలాల మధ్య రాకపోకలు స్తంభించిపోయేవి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఆనకట్ట శిథిలావస్థకు చేరుకోవడంతో.. దానిపై 0.3 మీటర్ల మేర ఇసుక బస్తాలు వేసి, నీటిని నిల్వ చేసినా.. ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. సంగం ఆనకట్ట స్థానంలో బ్యారేజ్ నిర్మించి, ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లందించాలని నెల్లూరు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే ఆ డిమాండ్ను 2006 వరకూ ఎవరూ పట్టించుకోలేదు. సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసిన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజీ స్వప్నం సాకారం దిశగా అడుగులు.. నెల్లూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసే దిశగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2006 మే 28న సంగం బ్యారేజ్కు శంకుస్థాపన చేశారు. రూ.147.50 కోట్ల అంచనా వ్యయంతో 2008 మే 21న పనులు చేపట్టారు. మహానేత వైఎస్ హయాంలో బ్యారేజ్ పనులు పరుగులు తీశాయి. ఈ పనులకు అప్పట్లో రూ.30.85 కోట్లు వ్యయం చేశారు. అయితే మహానేత వైఎస్ హఠాన్మరణం సంగం బ్యారేజ్ పనులకు శాపంగా మారింది. కమీషన్లు వచ్చే పనులకే టీడీపీ హయాంలో పెద్దపీట సంగం బ్యారేజ్ను నిర్మిస్తున్న ప్రాంతంలో పెన్నా నది వెడల్పు 1,400 మీటర్లు. కానీ.. అప్పట్లో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) చీఫ్ ఇంజనీర్ 846 మీటర్ల వెడల్పుతో బ్యారేజ్ (కాంక్రీట్ నిర్మాణం), ఇరువైపులా 554 మీటర్ల వెడల్పుతో మట్టికట్టలు నిర్మించేలా డిజైన్ను ఆమోదించారు. బ్యారేజ్ నిర్మాణ సమయంలో ఇబ్బందులు ఏర్పడటంతో డిజైన్లలో మార్పులు చేయాలని 2013లో అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం 2013 నవంబర్ 23న నిపుణుల కమిటీని నియమించింది. బ్యారేజ్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ.. 1,195 మీటర్ల వెడల్పుతో బ్యారేజ్ (కాంక్రీట్ కట్టడం) నిర్మించాలని 2014లో నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను ఆమోదించడంలో రెండేళ్ల పాటు జాప్యం చేసిన టీడీపీ సర్కార్.. ఎట్టకేలకు 2016 జనవరి 21న బ్యారేజ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో అంచనా వ్యయాన్ని రూ.335.80 కోట్లకు పెంచింది. బ్యారేజ్ను 2017కు పూర్తి చేస్తామని ఒకసారి.. 2018కి పూర్తి చేస్తామని మరోసారి.. 2019కి పూర్తి చేస్తామని ఇంకోసారి ముహూర్తాలను మారుస్తూ వచ్చింది. టీడీపీ సర్కార్ కేవలం కమీషన్లు వచ్చే పనులకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. బ్యారేజ్లో 85 పియర్స్(కాంక్రీట్ దిమ్మెలు)ను సగటున 22 మీటర్ల చొప్పున అరకొరగా పూర్తి చేసింది. చేసిన పనుల కంటే.. ధరల సర్దుబాటు(ఎస్కలేషన్), పనుల పరిమాణం పెరిగిందనే సాకుతో అధికంగా బిల్లులు చెల్లించింది. రూ.86.10 కోట్లను ఖర్చు చేసినా బ్యారేజ్ పనులను ఒక కొలిక్కి తేలేకపోయింది. పెన్నా నదిపై సంగం బ్యారేజీ దిగువ వైపు నుంచి... అటు కరోనా, ఇటు వరద.. అయినా పూర్తి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక సంగం బ్యారేజ్పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రాధాన్యత ప్రాజెక్టుగా ప్రకటించి, శరవేగంగా పూర్తి చేయాలని జల వనరుల శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 2020 మార్చి నుంచి 2021 ఆఖరుదాకా కరోనా మహమ్మారి విజృంభించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో 2019–20, 2020–21, 2021–22లో పెన్నా నది ఉప్పొంగి ప్రవహించింది. 2019–20 లో 42.52, 2020–21లో 301.52, 2021–22లో 373.52 టీఎంసీల నీరు నెల్లూరు బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసిందంటే ఏ స్థాయిలో వరద వచ్చిందో అంచనా వేసుకోవచ్చు. ఓ వైపు కరోనా మహమ్మారి తీవ్రత.. మరో వైపు పెన్నా వరద ఉధృతితో పోటీ పడుతూ సంగం బ్యారేజ్ పనులను సీఎం వైఎస్ జగన్ పరుగులెత్తించారు. బ్యారేజ్ 85 పియర్లను 43 మీటర్ల ఎత్తుతో పూర్తి చేయించారు. ఈ పియర్స్ మధ్య 12 మీటర్ల ఎత్తు, 2.8 మీటర్ల వెడల్పుతో 79 గేట్లు, కోతకుగురై వచ్చిన మట్టిని దిగువకు పంపడానికి 12 మీటర్ల ఎత్తు, 3.8 మీటర్ల వెడల్పుతో 6 గేట్లు (స్కవర్ స్లూయిజ్) బిగించారు. వరద ప్రవాహం వచ్చినప్పుడు దిగువకు విడుదల చేయడానికి వీలుగా గేట్లను ఎత్తడానికి, దించడానికి విద్యుత్తో పనిచేసే హాయిస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. బ్యారేజ్కు ఎగువన ఎడమ వైపున 3.17 కిలోమీటర్లు, బ్యారేజ్కు కుడి వైపున 3 కిలోమీటర్ల పొడవున కరకట్టలను పటిష్టం చేశారు. సంగం నుంచి పొదలకూరుకు రాకపోకలు సాగించడానికి వీలుగా బ్యారేజ్పై రెండు వరుసల రోడ్ బ్రిడ్జిని పూర్తి చేశారు. కనిగిరి, కావలి కాలువలకు సంయుక్తంగా నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్, కనుపూరు కాలువకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్లను పూర్తి చేశారు. ఈ పనులను రూ.131.12 కోట్ల ఖర్చుతో పూర్తి చేసి.. నెల్లూరు ప్రజల దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేశారు. నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జి ప్రాజెక్టు సైతం రికార్డు సమయంలో నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జిని కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తి చేసింది. జలయజ్ఞంలో భాగంగా దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008–09లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును పదేళ్ల తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి సీఎంగా పూర్తి చేశారు. నెల్లూరు నగరానికి సమీపాన ఇప్పటికే ఉండే పాత ఆనకట్టకు వంద మీటర్ల ఎగువున ఇంకొక కొత్త బ్యారేజీ కమ్ బ్రిడ్జి ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టును కూడా ఈ నెల 6న జాతికి అంకితం చేయనున్నారు. 13 ఏళ్ల క్రితం మొదట్లో రూ.147.20 కోట్ల అంచనాతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టులో 2014కు ముందే రూ.86.62 కోట్ల మేరకు పనులు పూర్తయ్యాయి. తర్వాత ప్రాజెక్టు వ్యయం రూ.274.83 కోట్లకు పెరిగింది. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం రూ.71.54 కోట్లు ఖర్చు చేసినా ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచనతో కాకుండా ప్రాజెక్టు నిర్మాణంలో కేవలం కమీషన్లకు అవకాశం ఉన్న పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపింది. అయితే 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా గుర్తించారు. కేవలం మూడేళ్లలో రూ.77.37 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు ప్రధాన కాంక్రీట్, ఇతర మట్టి పనులన్నింటినీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా 72 గ్రామాల పరిధిలోని 99,525 ఎకరాల్లో సాగు నీటి పారుదల అవకాశాలు మెరుగు పడతాయి. నెల్లూరు– కోవూరుల మధ్య రాకపోకల ఇబ్బందులు పూర్తిగా తొలగిపోనున్నాయి. ఆనకట్టకు ఎగువన ఇన్ఫిల్ట్రేషన్ బావులు నిండడం వల్ల ఆ ప్రాంతంలో భూగర్భ జల మట్టం పెరిగి నెల్లూరు çనగరం.. ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు తాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉంది. ఇదో మహోజ్వల ఘట్టం సంగం బ్యారేజ్ నిర్మాణాన్ని మహానేత వైఎస్సార్ ప్రారంభిస్తే.. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి ఈ నెల 6న జాతికి అంకితం చేయనుండటం మహోజ్వల ఘట్టం. కరోనా తీవ్రత, పెన్నా వరద ఉధృతిని తట్టుకుని.. బ్యారేజ్ను పూర్తి చేశాం. నెల్లూరు జిల్లా ప్రజలకు మేకపాటి గౌతమ్రెడ్డి చేసిన సేవలను స్మరించుకుంటూ బ్యారేజ్కు ఆయన పేరు పెట్టాం. పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువల ఆయకట్టుకు నీళ్లందించి సస్యశ్యామలం చేస్తాం. – అంబటి రాంబాబు, జల వనరుల శాఖ మంత్రి రికార్డు సమయంలో పూర్తి సీఎం ఆదేశాల మేరకు బ్యారేజ్ను రికార్డు సమయంలో పూర్తి చేశాం. 3.85 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి ఇది దోహదపడుతుంది. బ్యారేజ్లో నిత్యం 0.45 టీఎంసీలను నిల్వ చేయడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. సాగు, తాగునీటికి ఇబ్బంది ఉండదు. బ్రిడ్జితో సంగం–పొదలకూరు మధ్య రవాణా సమస్యకు పరిష్కారం లభించింది. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ నాణ్యతకు ప్రాధాన్యత సంగం బ్యారేజ్ పనులను అత్యంత నాణ్యతతో శరవేగంగా పూర్తి చేశాం. సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత ప్రాజెక్టుగా సంగం బ్యారేజ్ను ప్రకటించి.. గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ మేరకు గడువులోగా పూర్తి చేశాం. నెల్లూరు జిల్లా ప్రజల దశాబ్దాల కలను సీఎం వైఎస్ జగన్ నిజం చేశారు. – హరినారాయణ రెడ్డి, సీఈ, తెలుగుగంగ -
కర్ణాటకలో భారీ వర్షాలు.. చిత్రావతి, పెన్నా, జయమంగళి నదులకు భారీగా వరద
-
పెన్నా నది పరవళ్లు.. సువర్ణముఖి చిందులు
సాక్షి, రామగిరి(శ్రీ సత్యసాయి జిల్లా): ఎగువ ప్రాంతం కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు పెన్నమ్మ పరవళ్లు తొక్కుతూ పేరూరు చేరింది. దీంతో డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుండటంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఇప్పటి వరకూ ఒకటిన్నర టీఎంసీ దిగువకు వదిలినా పేరూరు డ్యాంకు ఇన్ఫ్లో ఏమాత్రం తగ్గలేదని, అందుకే నీటిని ఏకధాటిగా వదలుతున్నట్లు డీఈ వెంకటరమణ తెలిపారు. భారీ వర్షాలతో మూడు దశాబ్దాల తర్వాత పేరూరు డ్యాం నిండుకుండను తలపించగా... గత నెలలో తొలిసారి పేరూరు డ్యాం గేట్లు ఎత్తారు. తాజాగా సోమవారం మరోసారి గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతుండగా.. ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు పలు గ్రామాల ప్రజలు డ్యాం వద్దకు వస్తున్నారు. సువర్ణముఖి చిందులు నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి మరువ పారిన చెరువులు అగళి: 20 రోజులుగా కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షానికి సువర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు అగళి మండలంలోని మధూడి, ఇరిగేపల్లి, కోడిపల్లి, రావుడి, వడగుంటనపల్లి చెరువుల్లో చేరడంతో నాలుగు దశాబ్దాల తర్వాత అవన్నీ మరువ పారాయి. దీంతో స్థానికులు తండోపతండాలుగా వచ్చి మరువపారుతున్న ప్రాంతాల్లో జలకాలాటలు ఆడారు. (క్లిక్: ప్రాణం పోసుకుంటున్న నల్ల రాతి శిలలు!) -
తాడిపత్రి పెన్నా నదిలో చిక్కుకున్నవ్యక్తి సేఫ్
-
పర్యాటకానికి కొత్త కళ
జమ్మలమడుగు: పర్యాటక ప్రాంతమైన గండికోట అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా చర్యలు చేపడుతోంది. గండికోట పరిసర ప్రాంతాలలో ఉన్న 1100 ఎకరాల రెవెన్యూ భూమిని పర్యాటకశాఖకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే స్థానిక రెవెన్యూ అధికారులు దానికి సంబంధించిన రికార్డులను పరిశీలించడంతోపాటు సర్వేలను పూర్తిచేశారు. మొత్తం 1100 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను తహసీల్దార్ కార్యాలయం నుంచి అధికారులు విజయవాడకు తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. మూడు నెలల్లో అందుబాటులోకి రోప్వే పెన్నానదిలోయ అందాలను వీక్షించడం కోసం ఏర్పాటు చేస్తున్న రోప్వే మరో మూడు నెలల్లో పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. మరో రెండు మూడు వారాల్లో పూర్తిస్థాయిలో రోప్వే సామగ్రి రానుంది. పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి రోప్వేను పర్యాటకులకు అందుబాటులోనికి తీసుకుని వస్తామని అధికారులు పేర్కొంటున్నారు. పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య ప్రపంచంలో గ్రాండ్ కెన్యాన్గా పేరుపొందిన పెన్నా నది లోయ అందాలతోపాటు, జుమ్మామసీదు, మాధవరాయస్వామి ఆలయం తదితర ప్రాంతాలను తిలకించేందుకు ఇటీవల పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో పర్యాటకులకు కావలసిన వసతుల కల్పన కోసం స్థానికంగా హరితా హోటల్తోపాటు, చాలా మంది ప్రత్యేకంగా లాడ్జిలను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. మరి కొంత మంది హోటల్, కూల్డ్రింక్స్షాపులను పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకులకు ఉన్నత స్థాయిలో విడిది ఏర్పాటు చేయడం కోసం గతంలో ఒబెరాయ్ హోటల్ యాజమాన్యం దాదాపు 30 నుంచి 40 ఎకరాలలో హోటల్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. అలాగే ప్రైవేట్ భాగస్వామ్యంతో సైతం గండికోటకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకు రావడం కోసం పర్యాటక శాఖ ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా సాహసకృత్యాలు, స్పోర్ట్స్లతోపాటు వివిధ రకాల అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించారు. బోటు షికారు అనుమతుల కోసం నిరీక్షణ గండికోటకు సమీపంలోని మైలవరం జలాశయంలో పర్యాటకుల కోసం బోటు షికారును ఏర్పాటు చేశారు. మూడేళ్ల క్రితం గోదావరి నదిలో బోటు మునిగి చాలా మంది మరణించడంతో ఇక్కడ బోటు షికారును నిలిపివేశారు. కాగా నెలన్నర క్రితం బోటు షికారును తిరిగి ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ప్రారంభించారు. జలాశయంలో నీరు తక్కువగా ఉండటంతో తాత్కాలికంగా బోటు షికారును నిలిపివేశారు. 1100 ఎకరాల భూమిని అప్పగించాం పర్యాటక కేంద్రమైన గండికోటను అభివృద్ధి చేసేందుకు 1100 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను ప్రభుత్వానికి అందజేశాము. ప్రభుత్వం ఆ భూమిని పర్యాటక శాఖకు అప్పగిస్తే వారు పర్యాటక అభివృద్ధికోసం వినియోగించనున్నారు. –జి.శ్రీనివాసులు,ఆర్డీఓ,జమ్మలమడుగు అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో గండికోట అభివృద్ధి గండికోట ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో పర్యాటకంగా తీర్చిదిద్దడం కోసం ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యాటకశాఖకు ఆదేశాలు జారీచేసి ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటకులకు అన్ని వసతులు సమకూర్చుతాం. మూడు నెలల్లో రోప్వే పనులు పూర్తిచేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకుని వస్తాం. –ఈశ్వరయ్య, పర్యాటకశాఖ ఈఈ, కడప -
మూడు దశాబ్దాల తర్వాత పెన్నాలో నీటిజాడ
పెన్నా నదిలో నీటిని చూడడమే ఒక వింత అని.. మృతదేహాలను పూడ్చిపెట్టడానికే ఈ ప్రాంతం పనికొస్తుందని.. ముప్పై ఏళ్లకొకసారే పెన్నా ప్రవహిస్తుందని.. ఇలా రక రకాల వాదనలు ఉన్నాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఈసారి పెన్మ్మ పరవళ్లు తొక్కుతోంది. ఏడు నెలల వ్యవధిలోనే భారీ వర్షాలకు రెండు సార్లు నది పారింది. దీంతో నది పరీవాహక ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, వంకలు, పెన్నార్ – కుముద్వతి ప్రాజెక్టు నీటితో కళకళలాడుతున్నాయి. హిందూపురం టౌన్: కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్ జిల్లా నంది హిల్స్లో పుట్టే పెన్నా నది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది. 597 కిలోమీటర్లు ప్రవహించే ఈ నది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు వద్ద తీరంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. శ్రీసత్యసాయి జిల్లాలోకి హిందూపురం మండలం చౌళూరు వద్ద ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి పలు గ్రామాల మీదుగా కోనాపురం వద్ద పరిగి మండలంలో ప్రవేశించి శ్రీరంగరాజుపల్లి సమీపాన పెన్నానదికి ఉపనది అయిన కుముద్వతి నదితో కలిసి పెన్నా–కుముద్వతి ప్రాజెక్టుకు నీరు చేరుతుంది. అక్కడి నుంచి రొద్దం మీదుగా కర్ణాటక రాష్ట్రం నాగలమడక ప్రాజెక్టుకు చేరి.. అలా మరోసారి ఆంధ్రాలో కలిసి కనగానపల్లి మీదుగా రామగిరి వద్ద అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు (పేరూరు డ్యామ్)లోకి కలుస్తుంది. దాదాపు 75 కిలోమీటర్ల మేర పెన్నానది ఈ జిల్లాలో ప్రవహిస్తుంది. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు పెన్నా పారుతోంది. హిందూపురం మండలం చౌళూరు, సంతేబిదనూరు, కిరికెర, బేవినహళ్లి, సుగూరు చెరువులు, పెన్నా–కుముద్వతి ప్రాజెక్టులో కలిసిన తర్వాత లెఫ్ట్ కెనాల్ ద్వారా పరిగి మండలం పరిగి, శాసనకోట, సుబ్బరాయునిపల్లి, కొడిగెనహళ్లి చెరువులు, రైట్ కెనాల్ ద్వారా కొట్నూరు, కొల్లకుంట, ఊటుకూరు చెరువులకు నీరు చేరుతోంది. పరిగి మండలం పైడేటి నుంచి రొద్దం మండలంలోకి ప్రవేశిస్తోంది. జిల్లాలో 18,418 ఎకరాల ఆయకట్టుకు లబ్ధి చేకూరుతోంది. మూడు దశాబ్దాల కిందట (1991 ఏప్రిల్లో) కర్ణాటకలో కురిసిన వర్షాలకు చాలా చెరువులు తెగి పెన్నా, ఉపనది జయమంగళి ఉధృతంగా ప్రవహించాయి. ఆంధ్ర ప్రాంతంలో వర్షాలు తక్కువైనప్పటికీ మన ప్రాంతంలో నదులు పారి చెరువులు నిండి మరువలు పారాయి. మళ్లీ ఇప్పుడు మండు వేసవిలో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో నదులు పరవళ్లు తొక్కుతుంటే జిల్లా ప్రజలు ఆశ్చర్యంలో మునిగిపోయారు. దీనికి తోడు ఏడు నెలల వ్యవధిలోనే పెన్నా నది రెండు సార్లు పారింది. ఇదో అద్భుతంగా అభివర్ణిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భూగర్భజలాల మెరుగు నీటికి కటకటలాడే పరిస్థితుల నుంచి చెరువులు నిండి, భూగర్భజలాలు సైతం మెరుగుపడి బోర్లు రీచార్జ్ అయ్యాయి. పెన్నా నది ఏడు నెలల్లో రెండు సార్లు పారడం పరీవాహక ప్రాంత ఆయకట్టు రైతులకు శుభ పరిణామం. సాగు, తాగు నీటి కష్టాలు తీరనున్నాయి. ఇరిగేషన్ రికార్డుల్లో వేసవిలో పెన్నానది పారినట్లు లేనేలేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెన్నా నది మేలో పారింది. ఖరీఫ్ సీజన్లో చెరువుల కింద పంట పండించే రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. – యోగానంద్, ఇరిగేషన్ డీఈ, హిందూపురం పెన్నా నదికి పునరుజ్జీవం తేవాలి ఎండలు మండే మే నెలలో వర్షాల కారణంగా పెన్నా నది ప్రవహించడం ఇదివరకెన్నడూ చూడలేదు. 30 ఏళ్ల తర్వాత పెన్నా నది గత నవంబర్లో ప్రవహించింది. ఏడు నెలల్లో రెండోసారి పెన్నా పరవళ్లు తొక్కడం సంతోషకరం. పరీవాహక ప్రాంత చెరువుల్లో నీరు చేరుతూ భూగర్భజలాలు మెరుగయ్యాయి. ఖరీఫ్ సీజన్లో ఆయకట్టు కింద పంటల సాగుకు ఎంతో ఉపయోగకరం. పెన్నాపై సర్ఫ్లస్ డ్యామ్లు కట్టి నీరు నిల్వ ఉంచేలా చేసి నదికి పునరుజ్జీవం తేవాల్సిన అవసరం ఉంది. – వెంకటరామిరెడ్డి, ఏపీ రైతు సంఘం నాయకుడు ఆనందంగా ఉంది పెన్నా నది ప్రవాహం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలు, నదిలో నీటి ప్రవాహంతో భూగర్భజలాలు పెరిగాయి. ఎకరా పొలంలో ఇప్పటి వరకు పూల సాగు చేస్తూ వచ్చాను. చెరువు నిండి, బోర్లలోనూ నీరు సమృద్ధిగా ఉన్నందున నీటి కొరత తీరింది. ఖరీఫ్లో మొక్కజొన్న వేస్తాను. ఇప్పటికే పనులు కూడా ప్రారంభించాను. – కేబీ నాగన్న, రైతు, చౌళూరు -
నదుల అనుసంధానమే అజెండా
సాక్షి, అమరావతి: దేశంలో నదుల అనుసంధానమే అజెండాగా ఈ నెల 19న జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశమవుతోంది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ అధ్యక్షతన వర్చువల్ విధానంలో జరిగే ఈ సమావేశంలో ఎన్డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్సింగ్, సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) చైర్మన్ ఆర్కే సిన్హాతోపాటూ అన్ని రాష్ట్రాల జల వనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు. రాష్ట్రం తరఫున జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి హాజరవుతారు. సముద్రం పాలవుతున్న నదీ జలాలను ఒడిసిపట్టి.. లభ్యత ఎక్కువగా ఉన్న నది నుంచి తక్కువ లభ్యత ఉన్న నదికి మళ్లించడం ద్వారా దేశాన్ని సస్యశ్యామలం చేసేందుకు నదుల అనుసంధానాన్ని చేపట్టడం కోసం ఎన్డబ్ల్యూడీఏను కేంద్రం ఏర్పాటు చేసింది. హిమాలయ నదులను అనుసంధానం చేయడానికి 14, ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడానికి 16 ప్రణాళికలను ఎన్డబ్ల్యూడీఏ ఇప్పటికే సిద్ధం చేసింది. వాటిని ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. తొలుత కెన్–బెట్వా, గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి, దామన్గంగ–పింజాల్, పార్–తాపి–నర్మద నదులను అనసంధానించేందుకు నడుం బిగించింది. కెన్–బెట్వా అనుసంధాన పనులు చేపట్టడానికి రూ.44,605 కోట్లకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆ పనులు చేపట్టడానికి వీలుగా కెన్–బెట్వా లింక్ ప్రాజెక్ట్ అథారిటీ (కేబీఎల్పీఏ) పేరుతో ఎస్పీవీని ఎన్డబ్ల్యూడీఏ ఏర్పాటు చేసింది. ఈ పనులకు నిధుల సమీకరణ, టెండర్లపై సమావేశంలో చర్చించనున్నారు. గోదావరి నుంచి కృష్ణా, పెన్నా, కావేరి బేసిన్లకు 216 టీఎంసీలను తరలించే అనుసంధానం పనులపై ఇప్పటికే ఆ బేసిన్ల పరిధిలోని రాష్ట్రాలతో ఎన్డబ్ల్యూడీఏ చర్చించింది. అనుసంధానాన్ని ఎలా చేయాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. -
"చెప్పాడంటే.. చేస్తాడంతే" అని మరోసారి నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్
-
ముందే వేసుకొన్న పథకం.. భార్యను పెన్నా నదిలో తోసేసిన భర్త
సాక్షి, జమ్మలమడుగు : కట్టుకున్న భార్యపై అనుమానంతో ఆమెను పెన్నా నదిలోకి తోసేసిన సంఘటన జమ్మలమడుగులో చోటు చేసుకుంది. పట్టణ సీఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మలమడుగు మండలం గండికోట కొట్టాలపల్లెకు చెందిన ప్రసాద్ ముద్దనూరు మండలం కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన తన అక్క రామాంజనమ్మ కుమార్తె రాధిక (19)ను మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి వీరి దాంపత్య జీవితం సవ్యంగా సాగింది. ఇటీవల భార్య మీద భర్తకు అనుమానం మొదలైంది. దీనికితోడు రాధిక తనకు ఆరోగ్యం బాగుండటం లేదని ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురం గ్రామానికి వెళ్లి అక్కడ ఓ స్వామితో అంత్రాలు వేయించుకొని వచ్చేది. ఈ నేపథ్యంలో గత నెల 20వ తేదీ రాధిక భర్తకు చెప్పకుండా తాళ్లమాపురం గ్రామానికి వెళ్లింది. అయితే అదే గ్రామంలో ఉన్న ప్రసాద్ మరో అక్క అక్ష్మీదేవి తాళ్లమాపురానికి నీ భార్య వచ్చిందని తమ్మునికి సమాచారం చేరవేసింది. దీంతో ప్రసాద్ తన తమ్ముడు నవీన్ను వెంట పెట్టుకుని అదే రోజు తాళ్లమాపురం వెళ్లాడు. అక్కడి నుంచి భార్యను పిలుచుకుని జమ్మలమడుగుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో పెన్నా బ్రిడ్జి వద్దకు రాగానే భార్య రాధిక, భర్త ప్రసాద్ మధ్య వాగ్వాదం జరిగింది. భార్యపై ప్రసాద్ చేయిచేసుకోవడంతో ఆమె కింద పడింది. అన్నదమ్ములు ఇద్దరు ముందే వేసుకొన్న పథకం ప్రకారం పెన్నానదిపై నుంచి ఆమెను నీటిలోకి తోసేశారు. నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో రాధిక నదిలో కొట్టుకుని పోయింది. నాలుగు రోజులైనా కూతురు కనిపించకపోవడంతో అల్లుడు ప్రసాద్, నవీన్పై అనుమానం వ్యక్తం చేస్తూ గత నెల 28వ తేదీ జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్లో రాధిక తల్లి రామాంజనమ్మ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భర్త ప్రసాద్, అతని తమ్ముడు నవీన్ను విచారించగా తామే పెన్నానదిలో తోసేశామని అంగీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
పెన్నా నదిలో 25 మంది కూలీలు.. గంటపాటు శ్రమించి..
సాక్షి, అనంతపురం: జిల్లాలోని పెన్నానదిలో 25 మంది కూలీలు చిక్కుకున్నారు. వరద ఉధృతికి కాజ్వేపై ఐచర్ వాహనం చిక్కుకు పోయింది. పెద్దపప్పూరు మండలం జోడిధర్మాపురం దగ్గర ఈ ఘటన జరిగింది. నదిలో వరద ఉధృతి అధికంగా ఉండటంతో సహాయ చర్యలకు ఆటంకం కలిగింది. అయితే రెస్య్కూ సిబ్బంది అక్కడకు చేరుకుని కూలీలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పెంచలపాడు నుంచి జూటూరు గ్రామానికి వెళ్తుండగా ఐచర్ వాహనం అదుపు తప్పింది. అదే సమయంలో వరద ఉధృతి పెరగడంతో 25 మంది కూలీలు అందులోనే చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తనే గ్రామస్థులు, పోలీసులు, రెస్క్యూ బృందాలు గంటపాటు శ్రమించి జేసీబీ, ఇటాచీల సాయంతో కూలీలను సురక్షితంగా బయటకు చేర్చారు. -
'పెన్నా' పరవళ్లు
సాక్షి, అమరావతి: నీటిచుక్క జాడలేక ఎడారిలా మారిన పెన్నా నది ఇప్పుడు జీవనదిగా అవతరించింది. మూడు దశాబ్దాల తర్వాత 2019లో రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురవడంతో పెన్నమ్మ పరవళ్లు తొక్కింది. గతేడాది, ఈ ఏడాదీ సమృద్ధిగా వర్షాలు కురవడంతో పెన్నమ్మ ఉరకలెత్తుతోంది. బేసిన్లో అన్ని ప్రాజెక్టుల నీటినిల్వ సామర్థ్యం 239.59 టీఎంసీలు. పెన్నా, ఉప నదులు ఉధృతంగా ప్రవహించడంతో బేసిన్లోని ప్రాజెక్టులు నిండిపోయాయి. నైరుతి రుతుపవనాలు నిష్క్రమించినా.. ఖరీఫ్ పంటలకు వాడుకోగా ఇప్పటికీ ప్రాజెక్టుల్లో 175.91 టీఎంసీలు నిల్వ ఉండటం గమనార్హం. గతేడాది ఇదే సమయానికి ఈ ప్రాజెక్టుల్లో 157.84 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అంటే.. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 18.07 టీఎంసీలు అధికంగా నిల్వ ఉండటం గమనార్హం. మొత్తం మీద ప్రాజెక్టులన్నీ నిండటం.. పెన్నా ప్రవాహంతో భూగర్భ జలాలు పెరగడంతో పాడిపంటలతో బేసిన్ సస్యశ్యామలమైంది. సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో.. గోదావరి, కృష్ణా నదులు పశ్చిమ కనుమల్లో పురుడుపోసుకోవడం.. పరీవాహక ప్రాంతంలో అధిక వర్షాలు కురవడంవల్ల ఆ నదులు ఉరకలెత్తుతూ ప్రవహిస్తాయి. కానీ, పెన్నా తద్భిన్నం. వర్ష ఛాయ (రెయిన్ షాడో) ప్రాంతంలో జన్మించి.. ప్రవహించే ప్రాంతంలో సగటున 400–800 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. ఎల్నినో.. లానినో పరిస్థితుల ప్రభావంవల్ల నైరుతి రుతుపవనాల గమనం ఆధారంగా పెన్నా బేసిన్లో వర్షాలు కురుస్తాయి. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం పెన్నా బేసిన్. జైసల్మేర్ తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లా ఈ బేసిన్లోనే ఉంది. కర్ణాటకలో 1995 నుంచి 2004 మధ్య నందిదుర్గం నుంచి నాగలమడక వరకూ ఆ రాష్ట్ర సర్కార్ పెన్నాపై భారీఎత్తున చెక్ డ్యామ్లు, డ్యామ్లు నిర్మించింది. పెన్నా ఉప నదులైన చిత్రావతిపై పరగోడు వద్ద డ్యామ్ నిర్మించింది. జయమంగళి, కుముద్వతిపైనా అదే రీతిలో చెక్ డ్యామ్లు నిర్మించడంతో పెన్నా, ఉప నదుల నుంచి.. ఎగువ నుంచి దిగువకు చుక్కనీరు రాకుండాపోయింది. అదే సమయంలో రాయలసీమలో సక్రమంగా వర్షాలు కురవక.. కరువు పరిస్థితులు ఏర్పడటంతో పెన్నా ఎండిపోయింది. 2019 నుంచి రాష్ట్రంతోపాటూ రాయలసీమలోనూ సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో పెన్నా, ఉప నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పెన్నా వరదకు కృష్ణా వరదను తోడుచేసి.. గత రెండేళ్లుగా గండికోట, సోమశిల, కండలేరు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో తొలిసారిగా గరిష్ఠస్థాయిలో నీటిని నిల్వచేశారు. జీవనదిగా పెన్నమ్మ రూపాంతరం విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పెన్నా, ఉప నదులు జలకళతో తొణికిసలాడుతున్నాయి. పెన్నా ప్రధాన పాయపై అనంతపురం జిల్లాలో పెండేకళ్లు, చాగల్లు, వైఎస్సార్ కడప జిల్లాలో గండికోట, మైలవరం, నెల్లూరు జిల్లాలో సోమశిల, కండలేరుల్లో 2019, 2020, ఈ ఏడాదీ గరిష్ఠస్థాయిలో నీటి నిల్వలున్నాయి. ఉప నదులైన చిత్రావతిపై అనంతపురం–వైఎస్సార్ కడప సరిహద్దులోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, మద్దిలేరు (యోగి వేమన) ప్రాజెక్టుల్లో గరిష్ఠ స్థాయిలో నీటి నిల్వ ఉంది. గతేడాది తరహాలోనే ఈ ఏడాది పాపాఘ్ని ఉప్పొంగడంవల్ల వైఎస్సార్ జిల్లాలోని వెలిగల్లు నిండిపోయింది. చెయ్యేరు, సగిలేరుపై ఉన్న ప్రాజెక్టుల్లో ఇదే పరిస్థితి. బాహుదా ఉరకలెత్తడంతో చిత్తూరు జిల్లాలోని బాహుదా ప్రాజెక్టు, పెద్దేరు నిండిపోయాయి. ఎగువన పెన్నమ్మకు పునరుజ్జీవం కర్ణాటక చెక్ డ్యామ్లు, డ్యామ్ల నిర్మాణంతో ఎగువ నుంచి పెన్నాకు వరద రాకపోవడంవల్ల కర్ణాటక సరిహద్దులో అనంతపురం జిల్లాలో ఉన్న పేరూరు డ్యామ్ (అప్పర్ పెన్నార్) నుంచి పీఏబీఆర్, మధ్య పెన్నార్ వరకూ పెన్నా ఒట్టిపోయింది. దీంతో దిగువ రీతిలో ఎగువన కూడా జీవనదిగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాపాఘ్ని, స్వర్ణముఖి ఉప నదులనూ పునరుజ్జీవింపజేసే చర్యలను వేగవంతం చేసింది. వాతావరణ మార్పుల వల్లే.. వాతావరణ మార్పులవల్ల వర్షాలు పడే రోజులు తగ్గాయి. కానీ.. వర్షంపడే రోజుల్లో ఒకేసారి కుండపోత కురుస్తోంది. దీనివల్ల చెరువులు నిండి.. పెన్నాలోకి వరద ప్రవహిస్తోంది. ఫలితంగా 2019 నుంచి పెన్నా, ఉప నదులపై ఉన్న ప్రాజెక్టులు నిండుతున్నాయి. పాడిపంటలతో ఈ బేసిన్ సస్యశ్యామలమవుతోంది. ఎగువన పెన్నా నదిని పునరుజ్జీవింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించడం శుభపరిణామం. – డాక్టర్ మల్లారెడ్డి, డైరెక్టర్, యాక్షన్ ఫెటర్నా ఎకాలజీ సెంటర్, అనంతపురం సవ్యమైన రీతిలో జలచక్రం ఎన్నడూలేని రీతిలో 2019 నుంచి రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంవల్ల పెన్నా, ఉప నదులు ఉరకలెత్తుతున్నాయి. పెన్నా వరద జలాలకు కృష్ణా వరద జలాలను జతచేసిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులను నింపింది. ఇది పెన్నాలో వాతావరణ సమతుల్యతకు దారితీసింది. జలచక్రం సవ్యమైన రీతిలో మారడంవల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఇదే జీవనదిగా పెన్నా అవతరించడానికి బాటలు వేస్తోంది. – మురళీనాథ్రెడ్డి, చీఫ్ ఇంజనీర్, కర్నూలు జిల్లా -
ఇదీ ఆ ఊరు కథ.. నెల్లి అంటే ఉసిరిక, నెల్లు అంటే వడ్లు!
నెల్లూరు సిటీ: నెల్లూరంటేనే మంచి ధాన్యం, నాణ్యమైన నాగరికత, పెన్నానదీ, ఆ నదీతీరాన వెలసిన రంగనాయకులస్వామీ గుర్తుకు వస్తారు. ఒకప్పుడు ఇదీ దండకారణ్యంలో ఒకభాగం. సింహాలు ఎక్కువగా ఉండేవని, అందువల్ల సింహాపురి అనే పేరు వచ్చిందని ఒక వాదన. నెల్లూరును ఎక్కువ కాలం పాలించిన పల్లవులకు ‘సింహా’ అనే బిరుదు ఉండేది. అందువల్ల ‘సింహాపురి’ అనే పేరు వచ్చిందనేది ఇంకో వాదన. బృహత్పల్లవుల్లో మొదటివాడైనా సింహవిష్ణువు తన పేరిట విక్రమ సింహపురాన్ని నిర్మించారనేది ఒక అభిప్రాయం. నెల్లూరు నగర వ్యూ ముక్కంటి రెడ్డి అనే అతడు ఒకప్పుడు ఈ ప్రాంతానికి నాయకుడిగా ఉండేవారు. అతడికి ఒకరోజు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆ ప్రాంతంలో ఉసిరిక చెట్టు కింద గల శివలింగానికి ఆలయం కట్టించవలసిందిగా కోరాడు. ముక్కంటి రెడ్డి ఆలయం కట్టించి నిత్యోత్సవాలు జరిగే ఏర్పాటు చేశారు. ఆ ఆలయమే ఇప్పుడు మూలాపేటలో ఉన మూలస్థానేశ్వరాలయం. (చదవండి: స్టోన్హౌస్పేట.. ఆ కలెక్టర్ చేసిన సేవలకు గుర్తింపుగా) నెల్లూరు నగర వ్యూ అప్పట్లో నెల్లూరు పట్టణం మూలాపేట, రంగనాయకులపేట, సంతపేట, దర్గామిట్టలకు పరిమితమై ఉండేది. ‘నెల్లి’ అంటే ఉసిరిక చెట్టుగనుక ఆ విధంగా నెల్లూరు అనే పేరు వచ్చిందంటారు కొందరు. పినాకినీ నదీ తీరాన ఈ నగరం ఉండడంతో, వరి పంటకు ప్రసిద్ధి. నెల్లు అంటే వడ్లు గనుక వడ్లు ఎక్కువగా పండే ప్రాంతం కాబట్టి నెల్లూరు అనే పేరు వచ్చిందంటారు మరికొందరు. నెల్లూరు పట్ల ఇన్నీ రకాల అభిప్రాయాలు ఉండడం విశేషం. (చదవండి: AP Special: ప్రోత్సహిస్తే ఇత్తడి భవిత బంగారమే!) -
పెన్నా నదిలో ఇద్దరు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం
సాక్షి, వైఎస్సార్ కడప: వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెన్నూరు వద్ద పెన్నా నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఒకరిని స్థానికులు కాపాడగా మరో ఇద్దరు నదిలో కొట్టుకుపోయారు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో స్థానికులు ఒకరిని మాత్రమే ఒడ్డుకు చేర్చగలిగారు. మరో ఇద్దరు విద్యార్థులు నీటి ప్రవాహం కొట్టుకుపోగా.. ఒకరి మృతదేహం లభ్యమైంది. గల్లంతైన మరో విద్యార్థి కోసం జాలర్ల సాయంతో పోలీసులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. గడ్డకు చేరిన విద్యార్థి కడప రవీంద్రనగర్కు చెందిన విద్యార్థి షేక్ జహీర్గా పోలీసులు గుర్తించారు. గల్లంతై మృతి చెందిన విద్యార్థి కోడూరు చైతన్య కడప ఏఆర్ కానిస్టేబుల్గా పని చేస్తున్న కొండయ్య కుమారుడుగా తెలిపారు. గల్లంతైన మరో విద్యార్థి కమలాపురం మండలం నేటపల్లె గ్రామానికి చెందిన ఉమ్మారెడ్డి శ్రీనాథ్రెడ్డి (16) అని పోలీసులు తెలిపారు. -
పెన్నా కాఫర్ డ్యామ్కు గండి
నెల్లూరు (క్రైమ్): పెన్నా నదికి నీటి ప్రవాహం అధికం కావడంతో కాఫర్ డ్యామ్ (మట్టి కట్ట)కు గండి పడింది. ఆకస్మికంగా పెరిగిన నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఆరుగురిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో పెన్నానదిపై నూతన బ్యారేజీ నిర్మాణంలో ఉంది. బ్యారేజ్కు అవతల వైపు నీటిని నిల్వ చేసేందుకు కాఫర్ డ్యామ్ నిర్మించారు. ఆదివారం సాయంత్రం నీరు అధికం కావడంతో దీనికి గండి పడి, దిగువ ప్రాంతానికి నీటి ప్రవాహం పెరిగింది. పశువులు మేపుకునేందుకు, ఈత కొట్టేందుకు వెళ్లిన మహిళలు, పురుషులు.. మొత్తం ఆరుగురు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు. అందులో భాస్కర్ అనే వ్యక్తి డయల్ 100కు ఫోన్ చేసి తమను రక్షించాలని అభ్యర్థించాడు. స్పందించిన ఎస్పీ సీహెచ్ విజయారావు సిబ్బందిని అప్రమత్తం చేశారు. నగర డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో సంతపేట ఇన్స్పెక్టర్ అన్వర్బాషా, ఎస్ఐ నాగరాజు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన పెన్నానది వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సంబంధిత అధికారులతో మాట్లాడి బ్యారేజీ గేట్లను మూయించారు. తాళ్లు, గజ ఈతగాళ్ల సాయంతో అతి కష్టం మీద భాస్కర్, అతని స్నేహితుడిని, పొర్లుకట్టకు చెందిన కాకు చిన్నమ్మ, ఆర్ సుబ్బాయమ్మ, గుణలను రక్షించారు. మరో వ్యక్తి అప్పటికే రైల్వే బ్రిడ్జి పిల్లర్ను ఎక్కడంతో తాళ్ల సహాయంతో అతన్ని బ్రిడ్జి మీదకు చేర్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని ఎస్పీ అభినందించగా, బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
కావేరికి గోదారి.. ఏపీ అవసరాలను తీర్చాకే
సాక్షి, అమరావతి: ఏపీ అవసరాలు తీర్చాకే కావేరి పరీవాహక ప్రాంతానికి గోదావరి జలాలను తరలించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ అధ్యక్షతన మంగళవారం వర్చువల్ విధానంలో జరిగిన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) పాలక మండలి సమావేశంలో గోదావరి – కృష్ణా – పెన్నా – కావేరి అనుసంధానంపై ప్రధానంగా చర్చించారు. బేసిన్ పరిధిలోని రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఏపీ తరఫున జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. సహకరించాలన్న జల్శక్తి శాఖ కార్యదర్శి జూన్ నుంచి అక్టోబర్ మధ్య 143 రోజుల్లో ఇచ్చంపల్లి నుంచి 247.19 టీఎంసీలను నాగార్జునసాగర్(కృష్ణా)–సోమశిల(పెన్నా) మీదుగా కావేరి (గ్రాండ్ ఆనకట్ట)కు తరలించే పనులు చేపట్టడానికి సహకరించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ కోరారు. దీనిపై ఛత్తీస్గఢ్ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమకు కేటాయించిన 147.9 టీఎంసీలను కావేరికి తరలించడానికి అంగీకరించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది. గోదావరి–కావేరి అనుసంధానంపై ఎన్డబ్ల్యూడీఏ చేసిన ప్రతిపాదనలో ఎస్సారెస్పీ(శ్రీరాంసాగర్ ప్రాజెక్టు)–ఇచ్చంపల్లి మధ్య 176.6 టీఎంసీల లభ్యత ఉంటుందని లెక్క కట్టిందని, కానీ వాటిని ఉపయోగించుకునేలా ఇప్పటికే ప్రాజెక్టులు చేపట్టామని, అంటే అక్కడ ఇక నీటి లభ్యత ఉండదని తెలంగాణ స్పష్టం చేసింది. మహానది–గోదావరి అనుసంధానం చేపట్టాకనే గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని పేర్కొంది. సాగర్ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మార్చడాన్ని అంగీకరించబోమంది. అదనపు వాటా కోసం పట్టు.. గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా కృష్ణా బేసిన్కు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని కర్ణాటక డిమాండ్ చేసింది. కావేరి జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని కేరళ కోరింది. గోదావరి–కావేరి అనుసంధానాన్ని పూర్తి చేసి తమ రాష్ట్రంలో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించాలని తమిళనాడు విజ్ఞప్తి చేసింది. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకున్నాక గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని పంకజ్కుమార్ తెలిపారు. బేసిన్ పరిధిలోని రాష్ట్రాల అభిప్రాయాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఎన్డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్సింగ్ను ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఏపీ ఏం చెప్పిందంటే.. ► గోదావరిలో నీటి లభ్యతపై ఎన్డబ్ల్యూడీఏ, కేంద్ర జలసంఘం వేర్వేరుగా లెక్కలు చెబుతున్నాయి. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చూస్తే గోదావరి నికర జలాల్లో మిగులు లేదు. నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాలి. గోదావరి డెల్టాకు ఖరీఫ్కు నీళ్లు అవసరం. అందువల్ల జూన్లో కావేరికి గోదావరిని తరలించరాదు. ► ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకే 776 టీఎంసీలు అవసరం. దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడానికి గోదావరి–బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్(బీసీఆర్) అనుసంధానం చేపట్టాలని నిర్ణయించాం. ఈ ప్రతిపాదన మేరకు గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలి. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు గోదావరి జలాలు చేరేలా అనుసంధానం చేపట్టాలి. బొల్లాపల్లి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను నిర్మిస్తేనే అనుసంధానం ఫలవంతమవుతుంది. -
నదుల అనుసంధానం.. ఓ భగీరథయత్నం
సాక్షి, అమరావతి: నదుల అనుసంధానం అంటే.. ఎవరో కట్టిన కాలువలో నాలుగు చెంబుల నీళ్లు ఎత్తిపోయడమా.. ఆ కాలువలో వర్షపు నీటిని చూపించి రెండు నదులను అనుసంధానించేశామంటూ కోట్లు ఖర్చుపెట్టి ఈవెంట్లు చేయడమా... వేర్వేరు మార్గాలలో పయనించే రెండు నదులను అనుసంధానించడం ఓ భగీరథయత్నం.. ఇందుకు నిధులు మాత్రమే కాదు నిబద్ధత, దృఢ దీక్ష కూడా అవసరమే. పాలకులకు అవి ఉన్నప్పుడే అనుసంధాన యత్నాలు ఫలిస్తాయి. రెండు కాదు.. మూడు కాదు రాష్ట్రంలో మొత్తంగా ఆరు చోట్ల నదుల అనుసంధానం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రం పరిధిలోని నదుల అనుసంధానం పనులను వేగవంతం చేస్తూనే గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ వంటి అంతర్రాష్ట్ర నదుల అనుసంధానంపైనా కేంద్రంతో కలిసి కసరత్తు చేస్తోంది. నదుల అనుసంధానం అంటే ఇదీ.. నదుల అనుసంధానానికి కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) 2016లో మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం ఒక నదిపై బ్యారేజీ నిర్మించి.. అక్కడి నుంచి వరద జలాలను మరో నదిపై నిర్మించే బ్యారేజీలోకి తరలించినప్పుడే ఆ రెండు నదులు అనుసంధానం చేసినట్లు లెక్క. గోదావరి నదిపై ఎలాంటి బ్యారేజీ నిర్మించకుండా..దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేసిన పోలవరం కుడి కాలువ మీదుగా పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ప్రకాశం బ్యారేజీలోకి 2016లో గోదావరి జలాలను తరలించడం ద్వారా గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేసినట్లు నాటి సీఎం చంద్రబాబు ప్రకటించడాన్ని అప్పట్లో సీడబ్ల్యూసీ ఖండించడం గమనార్హం. రూ.145.34 కోట్లతో వంశధార–నాగావళి అనుసంధానం నాగావళి నదిలో వరద ఆలస్యంగా రావడం, నారాయణపురం ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఖరీఫ్లో ఆయకట్టుకు సకాలంలో నీళ్లందించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2లో హిరమండలం రిజర్వాయర్కు తరలించిన వంశధార నీటిని, ఆ రిజర్వాయర్ మట్టికట్ట 5.6 కి.మీ వద్ద నుంచి 33.583 కి.మీల పొడవున హెచ్చెల్సీ(హైలెవల్ కెనాల్)ను తవ్వి రోజుకు 600 క్యూసెక్కులను నారాయణపురం ఆనకట్టకు ఎగువన నాగావళి నదిలోకి పోయడం ద్వారా ఆ రెండు నదులను అనుసంధానం చేసి, ఆయకట్టును సస్యశ్యామలం చేసే పనులను రూ.145.34 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే 31.30 కి.మీ పొడవున హెచ్చెల్సీ తవ్వకం పనులను పూర్తి చేసింది. కేవలం 2.283 కి.మీల కాలువ తవ్వకం పనులు మాత్రమే మిగిలాయి. వాటిని ఖరీఫ్ నాటికి పూర్తి చేసి.. వంశధార–నాగావళి అనుసంధానాన్ని సాకారం చేయనున్నది. దీని వల్ల నారాయణపురం ఆనకట్ట కింద 39,179 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు హెచ్చెల్సీ కింద కొత్తగా ఐదు వేల ఎకరాలకు నీళ్లందించడం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం నుంచి గోదావరి–కృష్ణా, గోదావరి–ఏలేరు అనుసంధానం ► పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను గ్రావిటీపై ప్రకాశం బ్యారేజీలోకి తరలించడం ద్వారా గోదావరి–కృష్ణా అనుసంధానం చేసే పనులకు 2004లో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి.. 2022 నాటికి కుడి కాలువ ద్వారా గ్రావిటీపై గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఆ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. దీని వల్ల కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ► పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 57.85 కి.మీల వద్ద నుంచి గోదావరి జలాలను ఏలేరు రిజర్వాయర్లోకి ఎత్తిపోయడం ద్వారా గోదావరి–ఏలేరు నదులను అనుసంధానం చేసే పనులనూ 2022 నాటికి పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీని వల్ల ఏలేరు రిజర్వాయర్ కింద 53,017 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ► పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ నుంచి 80 టీఎంసీలను తరలించడం ద్వారా వంశధార, నాగావళి పరీవాహక ప్రాంతాల్లో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లందించే పనులను దశలవారీగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది. ► పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను గ్రావిటీపై ప్రకాశం బ్యారేజీలోకి తరలించడం ద్వారా గోదావరి–కృష్ణా అనుసంధానం చేసే పనులకు 2004లో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి.. 2022 నాటికి కుడి కాలువ ద్వారా గ్రావిటీపై గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఆ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. దీని వల్ల కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ► పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 57.85 కి.మీల వద్ద నుంచి గోదావరి జలాలను ఏలేరు రిజర్వాయర్లోకి ఎత్తిపోయడం ద్వారా గోదావరి–ఏలేరు నదులను అనుసంధానం చేసే పనులనూ 2022 నాటికి పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీని వల్ల ఏలేరు రిజర్వాయర్ కింద 53,017 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ► పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ నుంచి 80 టీఎంసీలను తరలించడం ద్వారా వంశధార, నాగావళి పరీవాహక ప్రాంతాల్లో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లందించే పనులను దశలవారీగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది. కృష్ణా–పెన్నా–స్వర్ణముఖి అనుసంధానం.. తెలుగుంగ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా(శ్రీశైలం రిజర్వాయర్)–పెన్నా (సోమశిల రిజర్వాయర్)ను ఇప్పటికే అనుసంధానం చేశారు. సోమశిల వరద కాలువ 12.52 కి.మీ నుంచి రోజుకు 2,500 క్యూసెక్కులను తరలించి.. చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి నదిలో పోయడం ద్వారా కృష్ణా–పెన్నా–స్వర్ణముఖి నదులను అనుసంధానం చేసే పనులను ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టింది. ఈ అనుసంధానం ద్వారా 1.23 లక్షల ఎకరాలకు నీళ్లందించనున్నారు. స్వర్ణముఖి నది పెన్నా ఉప నది. కృష్ణా–పెన్నా–పాపాఘ్ని అనుసంధానం.. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం కింద 2009 నాటికే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణా–పెన్నా నదులను అనుసంధానం చేశారు. పెన్నా ఉప నది అయిన పాపాఘ్ని పరీవాహక ప్రాంతం పూర్తిగా వర్షాభావ ప్రాంతంలో ఉంది. దీని వల్ల పాపాఘ్నిలో నీటి లభ్యత తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో గాలేరు–నగరి ద్వారా శ్రీశైలం నుంచి తరలించిన కృష్ణా నదీ వరద జలాలు.. గాలేరు–నగరి ప్రధాన కాలువ 56 కి.మీ వద్ద నుంచి జలాలను ఎత్తిపోసి.. పాపాఘ్ని నదిపై 4.56 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన వెలిగల్లు రిజర్వాయర్లోకి తరలించే పనులను చేపట్టారు. దీని ద్వారా 26 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. కృష్ణా–వేదవతి అనుసంధానం.. కృష్ణా ఉప నది అయిన వేదవతిపై అనంతపురం జిల్లాలో భైరవానితిప్ప ప్రాజెక్టును 1956లో నిర్మించారు. ఈ ప్రాజెక్టు కింద 12 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. టీడీపీ సర్కార్ హయాంలో కర్ణాటకలో వేదివతిపై చెక్ డ్యామ్లు నిర్మించడంతో బీటీపీలోకి చుక్క నీరు చేరడం లేదు. శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీ–నీవా ద్వారా తరలించే నీటిని జీడిపల్లి రిజర్వాయర్ నుంచి బీటీపీలోకి ఎత్తిపోయడం ద్వారా కృష్ణా–వేదవతి నదుల అనుసంధానం పనులను రూ.968 కోట్లతో చేపట్టింది. దీని ద్వారా బీటీపీ కింద 12 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు వర్షాభావ ప్రాంతంలోని కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో చెరువులను నింపడం ద్వారా మరో 10,323 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ అనుసంధానంపై కసరత్తు... గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ అనుసంధానంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. జానంపల్లి నుంచి గోదావరి–కృష్ణా(నాగార్జునసాగర్)–పెన్నా(సోమశిల)–కావేరీ(గ్రాండ్ ఆనకట్ట) అనుసంధానం చేసేలా ఎన్డబ్ల్యూడీఏ(జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) రూపొందించిన ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాలను చెబుతూ.. తక్కువ వ్యయంతో గరిష్టంగా వరద జలాలను ఒడిసి పట్టి.. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలనూ సిద్ధం చేయాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశాక.. వాటిని ఎన్డబ్ల్యూడీఏకు పంపి.. పనులు చేపట్టాలని నిర్ణయించారు. కేసీ కెనాల్తోనే నదుల అనుసంధానానికి నాంది.. తుంగభద్ర నదిపై కర్నూలు జిల్లాలో సుంకేశుల వద్ద ఆనకట్ట నిర్మించి, అక్కడి నుంచి వైఎస్సార్ జిల్లాలో పెన్నా నదిని అనుసంధానిస్తూ కేసీ కెనాల్ తవ్వకం పనులను 1863లో ప్రారంభించిన డచ్ సంస్థ 1870 నాటికి పూర్తి చేసింది. ఈ కాలువను నౌకా మార్గంగా వినియోగించుకుని వ్యాపారం చేసేది. వాణిజ్య కార్యకలాపాల కోసం ఈ కాలువను 1882లో ఈస్ట్ ఇండియా కంపెనీ డచ్ సంస్థ నుంచి రూ.3.02 కోట్లకు కొనుగోలు చేసింది. సర్ ఆర్ధర్ కాటన్ ప్రతిపాదన మేరకు కేసీ కెనాల్ను 1933లో సాగునీటి వనరుగా మార్చింది. ఈ కాలువ కింద ప్రస్తుతం 2.65 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. దేశంలో కేసీ కెనాల్ ద్వారానే నదుల అనుసంధానం చేయడం ప్రథమం కావడం గమనార్హం. కేసీ కెనాల్ స్ఫూర్తితోనే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టినట్లు ఎన్డబ్ల్యూడీఏ స్పష్టం చేసింది. తుంగభద్ర–పెన్నా–చిత్రావతి అనుసంధానం.. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా తుంగభద్రపై తుంగభద్ర డ్యామ్ను నిర్మించారు. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ద్వారా తుంగభద్ర జలాలను పెన్నాపై నిర్మించిన మధ్య పెన్నార్ ప్రాజెక్టులోకి.. అక్కడి నుంచి చిత్రావతిపై నిర్మించిన చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోకి తరలించేలా ప్రణాళిక రూపొందించి.. పనులు ప్రారంభించారు. ఈ పనులు 2009 నాటికి పూర్తయ్యాయి. దీని ద్వారా తద్వారా తుంగభద్ర–పెన్నా–చిత్రావతి అనుసంధానం పనులను 2009 నాటికి దివంగత సీఎం వైఎస్ పూర్తి చేశారు. దీని ద్వారా 1,90,035 ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. నదుల అనుసంధానానికి రాష్ట్రమే స్ఫూర్తి.. చెన్నైకి తాగునీటిని సరఫరా చేయడం కోసం కృష్ణా నది నుంచి తన కోటాలో నుంచి ఐదు టీఎంసీల చొప్పున కేటాయించేందుకు ఫిబ్రవరి 15,1976న మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలు అంగీకరించాయి. ఈ నీటిని శ్రీశైలం జలాశయం నుంచి తరలించేలా అక్టోబర్ 27, 1977న ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య ఒప్పందం కుదిరింది. చెన్నైకి తాగునీటిని అందించడంతోపాటు 29 టీఎంసీల కృష్ణా వరద జలాలు, 30 టీఎంసీల పెన్నా వరద జలాలను ఒడిసి పట్టి.. కర్నూల్, వైఎస్సార్ కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 5.75 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా తెలుగుగంగ ప్రాజెక్టును చేపట్టేందుకు 1978లో ప్రభుత్వం సర్వే పనులను చేపట్టింది. ఈ పనులను 2009 నాటికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. తెలుగుగంగలో భాగంగా కృష్ణా(శ్రీశైలం)–పెన్నా(సోమశిల)–పూండి రిజర్వాయర్(తమిళనాడు)ను అనుసంధానం చేశారు. దేశంలో అంతర్రాష్ట్ర నదుల అనుసంధానానికి ఈ పథకమే స్ఫూర్తి అని ఎన్డబ్ల్యూడీఏ పేర్కొంది. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యం సముద్రంలో కలుస్తున్న వరద జలాలను ఒడిసి పట్టి.. బీడు భూములకు మళ్లించి.. రాష్ట్రాన్ని సుభిక్షం చేయడమే లక్ష్యంగా నదులను అనుసంధానం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ మేరకు రాష్ట్రం పరిధిలోని ఆరు అనుసంధానాల పనులను చేపట్టాం. వంశధార–నాగావళి, గోదావరి–కృష్ణా, గోదావరి–ఏలేరు, కృష్ణా–పెన్నా–స్వర్ణముఖి, కృష్ణా–పెన్నా–పాపాఘ్ని, కృష్ణా–వేదవతి అనుసంధానం పనులను వేగవంతం చేశాం. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రానికి అత్యధిక ప్రయోజనం చేకూరేలా గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ అనుసంధానం చేయడంపై కసరత్తు చేస్తున్నాం. నదులను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జలవనరుల శాఖ -
విషాదం: పెన్నానదిలో నలుగురు గల్లంతు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పుష్పగిరి క్షేత్రం వద్ద పెన్నానదిలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి యువకులు ఈతకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. గల్లంతైనవారిలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం కాగా, మరో ఇద్దరు యువకుల కోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు కడపలోని బెల్లంమండి వాసులుగా గుర్తించారు. చదవండి: మాన్సాస్ భూముల వ్యవహారంపై విచారణ మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రి డైరెక్టర్ల మధ్య వివాదం -
Penna River: పెన్నాలో అన్ని నీళ్లా?
సాక్షి, అమరావతి: పెన్నా నదిలో నీటి లభ్యత అంచనాలపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజా లెక్కలు చూసి నీటిపారుదల రంగ నిపుణులు నివ్వెరపోతున్నారు. పెన్నా పరీవాహక ప్రాంతం (బేసిన్)లో కావాల్సినన్ని నీళ్లున్నాయని సీడబ్ల్యూసీ తేల్చడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వర్ష ఛాయ(రెయిన్ షాడో) ప్రాంతంలోని పెన్నా బేసిన్లో నీటి లభ్యత అవసరమైన మేరకు లేదని నీటిపారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే సీడబ్ల్యూసీ మాత్రం సమృద్ధిగా నీటి లభ్యత ఉందని తేల్చింది. 1993లో సీడబ్ల్యూసీ అధ్యయనంలో పెన్నాలో 223.19 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేయగా తాజాగా 389.16 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చింది. గతంతో పోల్చితే నీటి లభ్యత 165.97 టీఎంసీలు పెరిగిందని లెక్కగట్టింది. తాజా అధ్యయనంలో 75 శాతం లభ్యత ఆధారంగా 243.67 టీఎంసీల నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ లెక్కకట్టడంపై నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పెన్నా బేసిన్లో 30 ఏళ్లు కాకుండా 50 సంవత్సరాల వరద ప్రవాహాలను పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేస్తే కచ్చితమైన లెక్కలు తేలతాయని స్పష్టం చేస్తున్నారు. దేశంలో థార్ ఎడారి తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లా పెన్నా బేసిన్లోనే ఉన్న విషయం తెలిసిందే. అలాంటి బేసిన్లో పాతికేళ్ల తర్వాత ఈ నీటి సంవత్సరంలో పెన్నా వరద జలాలు సముద్రంలో కలవడాన్ని పరిగణనలోకి తీసుకున్నా సీడబ్ల్యూసీ తేల్చిన స్థాయిలో లభ్యత ఉండే అవకాశమే లేదని తేల్చి చెబుతున్నారు. ఇదీ పెన్నా బేసిన్.. రెండు రాష్ట్రాల్లో ప్రవహించే పెన్నా నది కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ జిల్లా నంది పర్వతాల్లో పుట్టి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాల్లో ప్రవహించి నెల్లూరు జిల్లా ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మొత్తం 597 కి.మీ. ప్రవహించే ఈ నదికి జయమంగళి, కుందేరు, సగిలేరు, చిత్రావతి, చెయ్యేరు, పాపాఘ్ని తదితర ఉప నదులున్నాయి. పెన్నా బేసిన్ 54,905 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 1.67 శాతం. ఈ బేసిన్లో సగటున కనిష్టంగా 400 నుంచి గరిష్టంగా 716 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదవుతుంది. వర్ష ఛాయ ప్రాంతంలో ఉన్న పెన్నా బేసిన్లో అనావృష్టి, అతివృష్టి పరిస్థితుల వల్ల ఏకరీతిగా వర్షం కురవదు. డ్రైస్పెల్స్ (వర్షపాత విరామాలు) కూడా అధికంగా నమోదవుతాయి. పెన్నా బేసిన్లో సీడబ్ల్యూసీ అధ్యయనంలో నీటి లభ్యత వివరాలు నీటి లభ్యత పెరిగిందా? పెన్నా బేసిన్లో 1985–2015 మధ్యన 30 ఏళ్లలో వరద ప్రవాహాలను పరిగణనలోకి తీసుకుని ఇటీవల సీడబ్ల్యూసీ నీటి లభ్యతపై అధ్యయనం చేసింది. బేసిన్లో వర్షపాతం వల్ల 1,412.56 టీఎంసీలు (40 బిలియన్ క్యూబిక్ మీటర్లు) నీరు వస్తుందని తేల్చింది. నదిలో 389.16 టీఎంసీల లభ్యత ఉందని లెక్కగట్టింది. 75 శాతం డిపెండబులిటీ పరంగా చూస్తే 243.67 టీఎంసీల నీటి లభ్యత ఉందని తేల్చింది. నిజానికి 1995లో పెన్నా బేసిన్లో గరిష్ట వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత ఈ ఏడాదే ఆ స్థాయిలో వర్షపాతం కురిసింది. 1995 తర్వాత ఈ ఏడాదే పెన్నా బ్యారేజీ నుంచి వరద జలాలు సముద్రంలో కలిశాయి. దీన్ని బట్టి చూస్తే పెన్నాలో సీడబ్ల్యూసీ తేల్చిన మేరకు నీటి లభ్యత ఉండే అవకాశమే లేదని నీటిపారుదల నిపుణులు తేల్చి చెబుతున్నారు. బేసిన్లో 75 ఏళ్లు లేదా కనీసం 50 ఏళ్లలో నమోదైన వరద ప్రవాహాలను పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేసి ఉంటే నీటి లభ్యతపై కచ్చితమైన లెక్కలు తేలే అవకాశం ఉండేదని స్పష్టం చేస్తున్నారు. -
పుట్టిన రోజున.. పుట్టెడు దు:ఖం
పుట్టిన రోజు వేడుక.. ఇంటిల్లిపాదీ ఆనందం.. స్నేహితులతో మరెంతో సంతోషం.. కొత్త దుస్తులు.. తోటి మిత్రులు.. పెన్నానదిలో వారితో భోజనం.. అంతా ఆనందమయం.. అంతలోనే అనుకోని ప్రమాదం.. నీటి సుడులలో పోయిన ప్రాణం.. క్షణాల్లో జరిగిపోయింది ఘోరం.. తమ గారాల బిడ్డ ఇక లేడని.. ఇంటికి రాడని తెలిసి.. ఆ తల్లిదండ్రుల కళ్లల్లో కన్నీళ్లు సుడులయ్యాయి. ఒక్కగానొక్క కొడుకుపై పెట్టుకున్న కోటి ఆశలు జలసమాధి అయ్యాయి.. శతమానం భవతి అని ఆశీర్వదించాల్సిన సమయాన.. జనాజా(పాడె) మోసే దుర్గతి పట్టినందుకు.. కన్నవారి హృదయంలో విషాదం ఉప్పెనైంది.. ప్రొద్దుటూరు : ‘బాబా..! మేర బర్త్డేకు నయా కపడే లావో.. చాక్లెట్స్బీ దిలానా.. స్కూల్ మే ఫ్రెండ్స్కు చాక్లెట్ దేతూ బాబా..’ రెండు రోజుల క్రితం మహమ్మద్ తండ్రితో అన్న మాటలు ఇవి. కుమారుడి కళ్లలో ఆనందం చూడాలని రెండు రోజులు ముందే తండ్రి కొత్త దుస్తులు తెచ్చాడు. పుట్టిన రోజు కావడంతో కొత్త దుస్తులు తొడిగి కుమారుడిని తల్లి అందంగా ముస్తాబు చేసింది. తల్లిదండ్రులకు బై చెప్పిన ఆ పిల్లాడు పాఠశాలకు వెళ్లాడు. పుట్టిన రోజే తనకు చివరి రోజు అవుతుందని పాపం బాలుడికి తెలియదు. విద్యార్థులందరూ బర్త్డే బాయ్ మహమ్మద్కు శుభాకాంక్షలు తెలిపారు. అందరి విషెస్ అందుకున్న విద్యార్థి ఆనందంతో తబ్బిబ్బయ్యాడు. కొద్ది గంటల్లోనే మరో విద్యార్థితో కలిసి తిరిగిరాని లోకాలకు పయనమయ్యాడు. మంగళవారం జరిగిన ఈ సంఘటన రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దర్గాబజార్కు చెందిన షేక్ మహమ్మద్(13), కేహెచ్ఎం స్ట్రీట్కు చెందిన తాహిర్(13) కొత్తకొట్టాలలోని ఉర్దూ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నారు. ఎప్పటి లాగే ఇద్దరూ పాఠశాలకు వెళ్లారు. ఈ రోజు తన పుట్టిన రోజని మహమ్మద్ తోటి స్నేహితులకు చెప్పాడు. భోజన విరామంలో అందరూ కలసి బయటికి వెళ్లాలని మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే మహమ్మద్, తాహిర్తో పాటు మరో ఆరుగురు విద్యార్థులు వెంట తెచ్చుకున్న క్యారియర్లను తీసుకొని పాఠశాలలో చెప్పకుండా రామేశ్వరం సమీపంలోని పెన్నానదికి వెళ్లారు. పెన్నానదిలో సరదాగా గడపాలని.. పాఠశాల నుంచి పెన్నా నది సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. స్కూల్ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు నడుచుకుంటూ అక్కడికి వెళ్లారు. ముందుగా తమ వెంట తెచ్చుకున్న క్యారియర్లలోని భోజనాలను ఆరగించారు. రైల్వే వంతెనపై కొంత సేపు ఆడుకున్నారు. ఆ తర్వాత దిగువన ఉన్న పెన్నానదిలో నీరు తక్కువగా ఉండటంతో విద్యార్థులందరూ అక్కడ దిగి ఈతకొట్టసాగారు. ఈ క్రమంలోనే మహమ్మద్, తాహిర్ ఈదుకుంటూ నీరు ఎక్కువగా ఉన్న మడుగులోకి వెళ్లారు. అక్కడున్న రజకులు వెళ్లవద్దని వారించారు. అయినా వారు వినిపించుకోలేదు. లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరు పిల్లలు మునిగి పోయారు. నీళ్లలో కొట్టుమిట్టాడుతున్న తాహిర్ను చూసి సమీపంలో ఉన్న రజకులు అతన్ని బయటికి తీసుకొచ్చారు. అప్పటికే నీళ్లు తాగిన బాలుడు మృతి చెందాడు. మహమ్మద్ ఊబిలో ఇరుక్కొని పోయాడు. సుమారు నాలుగు గంటల పాటు అతని మృతదేహం బయట పడలేదు. అగ్నిమాపక శాఖ అధికారి రఘునాథ్ ఆధ్వర్యంలో రెస్క్యూ టీం నీళ్లలోకి దిగి బాలుడి శవాన్ని బయటికి తీశారు. రూరల్ ఎస్ఐ లక్ష్మినారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భయంతో పరుగెత్తిన విద్యార్థులు.. ఇద్దరు విద్యార్థులు నీళ్లలో మునిగిన సమయంలో మిగతా పిల్లలు పక్కనే ఉన్నారు. తోటి స్నేహితులు ఆపదలో ఉన్నా.. వారిని కాపాడాలనే అవగాహన, అంత వయసు గానీ వారికి లేదు. దీంతో అక్కడి నుంచి భయంతో ఆరుగురు విద్యార్థులు పరుగులు తీశారు. వారి ద్వారా పాఠశాలలోని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఇద్దరు విద్యార్థులు మృతి చెందారనే విషయం తెలిసింది. దీంతో పిల్లల కుటుంబ సభ్యులు, వీధిలోని ప్రజలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పుట్టిన రోజే.. పరలోకానికి షాహుస్సేన్వలి దర్గాబజారులో నివాసం ఉంటున్న మహబూబ్బాషాకు భార్య చాంద్బీతో పాటు షాబిరా అనే కుమార్తె, మహమ్మద్ అనే కుమారుడు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం కుమార్తెకు వివాహమైంది. మహబూబ్బాషా మసీదులో మౌజన్గా పని చేస్తున్నాడు. కుమారుడి పుట్టిన రోజు కావడంతో రెండు రోజుల క్రితమే అతను కొత్త దుస్తులు తెచ్చాడు. ఉదయాన్నే కొత్త దుస్తులు ధరించి కుమారుడు స్కూల్కు వెళ్లాడు. అలా వెళ్లిన కుమారుడిని శవంలా చూడాల్సి వస్తుందని అనుకోలేదని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. తాహిర్ కుటుంబంలో విషాదం షేక్షావలి కేహెచ్ఎం స్ట్రీట్లో నివాసం ఉంటున్నాడు. బొంగు బజార్లో మెకానిక్గా పని చేస్తున్నాడు. ఆయనకు గౌస్పీర్, తాహిర్ అనే ఇద్దరు కుమారులతో పాటు కుమార్తె ఉన్నారు. కుమారుడు మృతి చెందాడనే విషయం విద్యార్థుల ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు సొమ్మసిల్లి పడిపోయారు. చదవండి: నా కోరిక తీర్చు.. లేదంటే నీ కొడుకు, భర్తను అంతం చేస్తా -
చెట్టంత కొడుకులు.. శవాలై తేలితే..
ఇది పెన్నమ్మ మిగిల్చిన గర్భశోకం.. ఎన్నో ఆశలు.. మరెన్నో ఆకాంక్షలు.. బిడ్డలతో పాటు గల్లంతయ్యాయి.. కన్నబిడ్డలపై కన్నవారు పెట్టుకున్న కోటి కలలు నీటిపాలయ్యాయి. సరదాగా ఇంటి నుంచి వెళ్లిన తమ గారాల బిడ్డ.. ఇక లేడు.. ఇక రాడని తెలిసిన క్షణం.. ఆ ఇంట తీరని పెను విషాదం నింపింది.. ఉన్నత చదువులు చదివించాలని.. ఉన్నతంగా చూసుకోవాలని.. మురిసిపోయిన ఆ తల్లిదండ్రులకు మరచిపోలేని చేదు నిజంగా మిగిలింది.. చెట్టంత కొడుకు.. శవమై పడిఉంటే.. తల్లిదండ్రులూ జీవచ్ఛవాలై కూలిపోయారు.. దేవుడా.. ఎందుకు మాకీ శిక్ష.. అంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు.. దిక్కులేని వాళ్లమయ్యామంటూ.. గుండెలవిసేలా విలపించారు.. ఇది .. పెన్నమ్మ మిగిల్చిన గర్భశోకం.. సాక్షి, కడప: వారంతా ఒకేచోట కలిసి చదువుకున్నారు...మంచి స్నేహితులయ్యారు. తోటి మిత్రుడు శివకుమార్ తండ్రి రామచంద్రయ్య చనిపోతే వారంతా తల్లడిల్లిపోయారు... అందరూ కలిసి 150 కిలోమీరర్లు ప్రయాణించి ఆయన వర్ధంతి కార్యక్రమంలోనైనా పాల్గొందామని తిరుపతి వద్ద ఉన్న కొర్లగుంట నుంచి సిద్దవటం వచ్చారు. కొందరు ఇంట్లో వాళ్లకు చెప్పి రాగా, మరికొందరు చెప్పకుండానే వచ్చారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత సరదాగా పెన్నానదిలోకి దిగిన వారు ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. కలిసిమెలసి వచ్చిన ఏడుగురు స్నేహితులు మరణంలోనూ స్నేహాన్ని వీడలేదు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సంఘటన చోటుచేసుకోగా అదేరోజు సాయంత్రానికి సోమశేఖర్, రాజేష్ మృతదేహాలు లభించాయి. శుక్రవారం ఉదయం 7.30 గంటలకు యశ్వంత్(16), సతీష్(18)ల మృతదేహాలు బయటపడగా, మధ్యాహ్నానికి షణ్ముగ శ్రీనివాస్(19), తరుణ్(17) మృతదేహాలు లభ్యమయ్యాయి. మొత్తం ఆరుగురి మృతదేహాలు లభించాయి. జగదీశ్వర్రెడ్డి(19) ఆచూకీ లభ్యం కాలేదు. వెలుతురు లేని కారణంగా శుక్రవారం సాయంత్రానికి గాలింపు చర్యలు నిలిపివేశారు. చదవండి: (వివాహేతర సంబంధం: నడిరోడ్డుపై భార్యను చంపేశాడు) ఒకే కుటుంబంలో ముగ్గురు పెన్నానదిలో గల్లంతై చనిపోయిన వారిలో సోమశేఖర్, యశ్వంత్ అన్నదమ్ములు కాగా, మరో మృతుడు షణ్ముగ శ్రీనివాస్(18) వారి అత్త కుమారుడు కావడం విశేషం. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు మృత్యువాత పడటంతో వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. షణ్ముగ శ్రీనివాస్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. డిగ్రీలో చేరాల్సి ఉంది. ఇతని తల్లి జి. మునిపార్వతి టీటీడీలో పనిచేస్తుండగా, తండ్రి చెంగల్రాయుడు కూలి పనులుచేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. చదవండి: (నవ జంట ఆత్మహత్య.. మొదటి భర్త అండమాన్లో..) కుటుంబానికొక్కరు మృత్యువాత ►తిరుపతికి చెందిన పార్థసారధి, రుక్మిణి కుమారుడు చెన్నకోణం యశ్వంత్(16). మృతిచెందిన వారందరిలో చిన్నవాడు. సోమశేఖర్కు ఇతను తమ్ముడు. తిరుపతిలోని రాయలసీమ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన వీరిద్దరూ మృతిచెందడంతో వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ►మిగతా కుటుంబాల్లో ఇద్దరేసి కుమారులు ఉండగా వారిలో ఒకరు మృత్యువాత పడడం గమనార్హం. జి. మునిపార్వతి, చెంగల్రాయుడు దంపతులకు బాలాజీ, షణ్ముగ శ్రీనివాస్ ఇద్దరు కుమారులు కాగా వారిలో చిన్నవాడైన షణ్ముగ శ్రీనివాస్ మరణించాడు. ►తిరుపతి సమీపంలోని అశోక్నగర్కు చెందిన కర్ణ సుబ్రమణ్యం మురళీ, దేవనాయకి దంపతులకు శ్రీనివాస్, సతీష్ అనే ఇద్దరు కుమారులు. వీరిలో చిన్నకుమారుడైన తరుణ్ స్నేహితులతోపాటు వచ్చి మృత్యువాత పడ్డాడు. ►తిరుపతి ఆటోనగర్కు చెందిన శివకుమార్(ఆటోడ్రైవర్), సుహాసిని దంపతులకు సాయిశంకర్, తరుణ్ కుమారులు కాగా వారిలో చిన్నవాడైన తరుణ్ మృతిచెందిన వారిలో ఉన్నాడు. ►తిరుపతి సమీపంలోని కొర్లకుంటకు చెందిన బాలక్రిష్ణారెడ్డి(ఆటోడ్రైవర్), లక్ష్మిలకు కూడా ఇద్దరు కుమారులే. వీరిలో జగదీశ్వర్రెడ్డి (19) పెద్దవాడు. చిన్నవాడు వేణు దివ్యాంగుడు. జగదీశ్వర్రెడ్డి శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీయట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇతని ఆచూకీ లభించాల్సి ఉంది. ఓఎస్డీ దేప్రసాద్, రాజంపేట సీసీఎస్ డీఎస్పీ ఎంపీ రంగనాయకులు, ఆర్ఐ సోమశేఖర్నాయక్, ఒంటిమిట్ట సీఐ హనుమంత నాయక్, రాజంపేట రూరల్ సీఐ వై. నరేంద్రరెడ్డి, ఫైర్ ఆఫీసర్ హనుమంతరావు, సిద్దవటం ఎస్ఐ రమేష్బాబు మృతదేహాల వెలికితీత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వైఎస్ఆర్సీపీ సిద్దవటం ఇన్చార్జి మేడా మధుసూదన్రెడ్డి సంఘటనా స్థలికి చేరుకొని బాధితులను ఓదార్చారు. అగ్నిమాపక సిబ్బంది, స్పెషల్పార్టీ పోలీసులు, గజ ఈతగాళ్లు, జాలర్లు రెండు బోట్లు, రెండు పడవలు, ట్యూబ్లు, వలలతో ఆచూకీ కోసం గాలించారు. ఆశలపై నీళ్లు రాజంపేట టౌన్ : గల్లంతయిన బిడ్డలను ఆ భగవంతుడు ఏదో రూపంలో కాపాడతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. సిద్దవటం పెన్నానదిలో గురువారం ఏడుగురు యువకులు గల్లంతు కాగా వారిలో అదే రోజు సాయంత్రానికి ఇద్దరు విగతజీవులైన విషయం విధితమే. అయితే మిగిలిన ఐదురుగురి ప్రాణాలపై వారి తల్లిదండ్రులు అనేక ఆశలు పెట్టుకున్నారు. యువకులు గల్లంతైన విషయం తెలియగానే తల్లిదండ్రులు, బంధువులు కొంతమంది అదే రోజు రాత్రికి సిద్దవటం చేరుకున్నారు. పోలీసులు వారికి ఆశ్రయం కల్పించారు. గజ ఈతగాళ్లు దొరికిన మృతదేహాలను ఒక్కొక్కటిగా ఒడ్డుకు చేర్చిన సమయంలో తల్లిదండ్రులు పరుగు పరుగున బిడ్డల మృతదేహాలపై పడి గుండెలు బాదుకొని రోదించసాగారు. మృతులంతా విద్యార్థులే పెన్నానదిలో గల్లంతై మృతి చెందిన వారందరూ విద్యార్థులే. ఇందులో సోమశేఖర్, రాజేష్, సతీష్లు ఇటీవలే డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరారు. అలాగే తరుణ్, షణ్ముఖ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, యశ్వంత్ ఇంటర్మీడియట్లో చేరే ప్రయత్నంలో ఉన్నాడు. జగదీష్ డిగ్రీ చదువుతున్నాడు. అబద్ధంచెప్పి.. ఇంటి నుంచి వచ్చి మృతిచెందిన యువకులందరూ ఇళ్లలో తల్లిదండ్రులకు అబద్ధం చెప్పి శివకుమార్ తండ్రి రామచంద్ర వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. నిజం చెప్పివుంటే తల్లిదండ్రులు మృతులను సిద్దవటం వెళ్లకుండా మందలించేవారు. ఫలితంగా అందరూ మృత్యుఒడికి దూరమయ్యే వారని పెన్నానదికి చేరుకున్న మృతుల్లోని కొంతమంది బంధువులు వాపోయారు. ఎవరికీ ఈత రాదు.. మృతి చెందిన వారిలో ఏ ఒక్కరికి కూడా ఈతరాదు. నీళ్లు లోతుగా ఉన్న ప్రాంతం నుంచి విద్యార్థులు బయట పడలేక పోయారు. నీటి ప్రవాహం ఉధృతంగా లేనందున కొంత మాత్రం ఈత వచ్చి ఉన్నా ప్రాణాలతో బయటపడేవారు. అందరూ బెస్ట్ఫ్రెండ్స్ పెన్నా నదిలో గల్లంతై మృతి చెందిన వారందరు చిన్నప్పటి నుంచి ఒకరికొకరు బెస్ట్ఫ్రెండ్స్ అని కొర్లగుంట వాసులు తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడి బతికిన శివకుమార్తో పాటు మృతి చెందిన ఆరుగురితో పాటు గల్లంతయిన జగదీష్ ఒకే వీధికి చెందిన వారు. కొంతమందికి వయస్సు రీత్యా తేడా ఉన్నప్పటికి మంచి స్నేహితుల్లా మెలిగేవారని గ్రామస్తులు చెప్పారు. తరలి వచ్చిన కొర్లగుంట యువత పెన్నానదిలో గల్లంతై మృతి చెందిన వారి కోసం తిరుపతి సమీపంలోని కొర్లగుంటవీధికి చెందిన యువకులు గురువారం అర్ధరాత్రి పెద్ద ఎత్తున సిద్దవటం తరలి వచ్చారు. వీరందరూ మృతులకు స్నేహితులు కావడం విశేషం. ఘటన గురించి తెలియగానే మనసు మనసులో లేక రాత్రికి రాత్రే సిద్దవటం చేరుకున్నట్లు వారు తెలిపారు. మృతి చెందిన ఏడుగురు తమకు స్నేహితులని, వారి మృతి తీవ్రంగా కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన చేదుజ్ఞాపకంలా మిగిలిపోతుందని పలువురు కంటతడి పెట్టారు. -
తీవ్ర విషాదం: పెన్నాలో ఏడుగురు గల్లంతు
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ఏడుగురు యువకులు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. ఈ సంఘటన సిద్ధవటంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల ప్రాధమిక దర్యాప్తు మేరకు.. తిరుపతి కోరగుంటకు చెందిన సోమశేఖర్, యశ్, జగదీశ్, సతీష్, చెన్ను, రాజేష్, తరుణ్ సిద్ధవటం పెన్నానది వద్దకు విహారయాత్రకు వచ్చారు. సరదాగా ఈత కొడదామని నదిలో దిగారు. దీంతో వారు నీటి ప్రవాహంలో కొట్టుకుని పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మృతదేహాలను వెలికితీసినట్లు సమాచారం. -
‘అప్పర్ పెన్నార్’కు మంచి రోజులు
సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన జీడిపల్లి రిజర్వాయర్ నీటి ఆధారంగా దేవరకొండ, ముట్టాల, తోపుదుర్తి, సోమరవాండ్లపల్లి రిజర్వాయర్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రూ.592 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు బుధవారం అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం దేవరకొండ వద్ద వర్చువల్ విధానంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ పథకం వల్ల తీవ్ర దుర్భిక్ష ప్రాంతమైన రాప్తాడు నియోజకవర్గంలోని 25 వేల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం పేరూరు వద్ద పెన్నా నదిపై 1.81 టీఎంసీల సామర్థ్యంతో 1959లో అప్పర్ పెన్నార్ ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు కింద 10,052 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ఎగువన కర్ణాటకలో నాగలమడక వద్ద 1999లో ప్రాజెక్టును నిర్మించడంతో అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుకు పెన్నా జలాలు చేరడం లేదు. నాగలమడక ప్రాజెక్టు కాంట్రాక్టు పనులు చేసిన అప్పటి పెనుకొండ ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర.. అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుకు సమాధి కట్టారనే విమర్శలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుకు కృష్ణా జలాలను తరలించి.. కరవు ప్రాంతాన్ని సస్యశ్యామం చేస్తామని 2009 ఎన్నికల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఆయన హఠన్మరణంతో ఆ పనులు కార్యరూపం దాల్చలేదు. టీడీపీ బాగోతం బట్టబయలు ► సోమరవాండ్లపల్లి (1.5 టీఎంసీలు), పుట్టకనుమ (0.63 టీఎంసీ) రిజర్వాయర్లను నిర్మించి, అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుకు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను తరలించి, 25 వేల ఎకరాలకు నీళ్లందించే పనులకు ఎన్నికలకు ముందు 2018 జనవరి 24న టీడీపీ సర్కార్ రూ.803.96 కోట్లతో అనుమతి ఇచ్చింది. ► అంచనాలను పెంచేసి భారీ ఎత్తున దోచుకోవడానికి టీడీపీ సర్కార్ పెద్దలు వ్యూహం పన్నారు. ఆ పనులను రూ.592 కోట్లకు (భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కాకుండా) కాంట్రాక్టర్కు అప్పగించి, భారీగా దండుకోడానికి ప్లాన్ వేశారు. ► అయితే ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రాప్తాడులో ఎత్తిచూపారు. అధికారంకి రాగానే కేవలం రూ.1.19 కోట్లతో హంద్రీ–నీవాలో అంతర్భాగమైన మడకశిర బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలను అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుకు తరలించారు. గతేడాది 0.25 టీఎంసీలను తరలించారు. ఒక రిజర్వాయర్ స్థానంలో మూడు రిజర్వాయర్లు ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల పథకం పరిధిని విస్తరించింది. సోమరవాండ్లపల్లి(1.5 టీఎంసీలు)తో పాటు.. పుట్టకనుమ(0.63 టీఎంసీలు) రిజర్వాయర్ స్థానంలో కొత్తగా తోపుదుర్తి (0.95), ముట్టాల (2.02), దేవరకొండ (0.90 టీఎంసీల) రిజర్వాయర్లు నిర్మించనుంది. తద్వారా మొత్తం 3.87 టీఎంసీల నీరు అదనంగా అందుబాటులోకి వస్తుంది. ► ఈ పథకానికి టీడీపీ సర్కార్ నిర్ణయించిన అంచనా వ్యయం రూ.803.96 కోట్లనే నిర్ధారించారు. ఈ పనులను గత ప్రభుత్వం అప్పగించిన రూ.592 కోట్లకే చేసేలా అదే కాంట్రాక్టర్ ముందుకొచ్చారు. అదనంగా ఒక ప్రాజెక్టు స్థానంలో మూడు ప్రాజెక్టులు రావడం ద్వారా ఖజానాకు రూ.250 కోట్లకుపైగా ఆదా అయ్యాయని అంచనా వేస్తున్నారు. మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నాం అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుకు టీడీపీ సర్కార్ రూ.803.96 కోట్లతో కృష్ణా జలాలను తరలించాలని నిర్ణయిస్తే.. సీఎం వైఎస్ జగన్.. కేవలం రూ.1.19 కోట్లతోనే ఆ పని చేశారు. పుట్టకనుమ రిజర్వాయర్ స్థానంలో కొత్తగా 3.87 టీఎంసీల నిల్వ చేసే సామర్థ్యంతో మూడు రిజర్వాయర్లను నిర్మిస్తాం. ఈ పనులను పాత ధరకే చేయడానికి అదే కాంట్రాక్టర్ ముందుకొచ్చారు. దీన్ని బట్టి అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల్లో చంద్రబాబు, పరిటాల సునీత ఏ స్థాయిలో దోపిడీకి స్కెచ్ వేశారో విశదం చేసుకోవచ్చు. – తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, ఎమ్మెల్యే, రాప్తాడు. -
పెన్నమ్మ మహోగ్రరూపం
సాక్షి, అమరావతి/సోమశిల: నివర్ తుపాను ప్రభావం వల్ల వైఎస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పించా, చెయ్యేరు, స్వర్ణముఖి నదులు ఉప్పొంగుతున్నాయి. ఇవన్నీ పెన్నాలో కలవడంతో ఆ నది మహోగ్రరూపం దాల్చింది. శుక్రవారం సాయంత్రానికి సోమశిల ప్రాజెక్టులోకి 4.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో గేట్లను పూర్తిగా ఎత్తేసి 3.60 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం రాత్రికి సోమశిలలోకి వచ్చే వరద ప్రవాహం ఐదు లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 1995 తర్వాత పెన్నా నదికి వచ్చిన గరిష్ట వరద ఇదే. భారీ వరద వస్తున్న నేపథ్యంలో.. సోమశిల ప్రాజెక్టుకు దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని కుశస్థలి, గార్గేయ, బీమా, స్వర్ణముఖి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో చిత్తూరు జిల్లాలో కృష్ణాపురం, అరణియార్, మల్లెమడుగు తదితర చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు నిండిపోయాయి. వైఎస్సార్ జిల్లాలో ఇప్పటికే చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు నిండిపోవడంతో వచ్చిన వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. పెన్నా వరద ఉద్ధృతి పెరుగుతోంది. సోమశిల ప్రాజెక్టులోకి 78 టీఎంసీలకు గానూ 72.42 టీఎంసీలను నిల్వ చేస్తూ వరదను దిగువకు వదిలేస్తున్నారు. -
పెన్నా బ్యారేజ్ క్రస్ట్ గేట్ల పనులు ప్రారంభం
నెల్లూరు (స్టోన్హౌస్పేట): నెల్లూరు నగరంలో పెన్నా నదిపై నిర్మిస్తున్న బ్యారేజ్కు సంబంధించిన క్రస్ట్గేట్ల పనులను జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ ఆదివారం ప్రారంభించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా.. క్రస్ట్గేట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ.. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన బ్యారేజ్ పనులను వచ్చే జనవరికల్లా పూర్తి చేస్తామని చెప్పారు. జనవరి నెలాఖరులో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా బ్యారేజ్ను ప్రజలకు అంకితమిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ వల్ల జిల్లాలోని 99,525 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభిస్తుందన్నారు. అలాగే జిల్లాలో మరికొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్లకు కూడా ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారన్నారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో ముదివర్తి సబ్మెర్జిబుల్ కాజ్ వే నిర్మాణానికి రూ.94 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సర్వేపల్లి రిజర్వాయర్ ఆధునీకరణకు రూ.12 కోట్లు, కలిగిరి రిజర్వాయర్ ఆధునీకరణకు రూ.21 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. కండలేరు జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చక్రధర్బాబు, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, డీసీఎంఎస్ చైర్మన్ చలపతి, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కడలి వైపు కృష్ణ, పెన్న పరుగులు
సాక్షి, అమరావతి/ అమరావతి బ్యూరో/ శ్రీశైలం ప్రాజెక్ట్/ విజయపురిసౌత్ (మాచర్ల): పరీవాహక ప్రాంతంలో విస్తారంగా కురిసిన వర్షాల ప్రభావం వల్ల కృష్ణా, పెన్నా నదులు వరద ఉధృతిలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతూ సముద్రం వైపు పరుగులు తీస్తున్నాయి. ► ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని ప్రాజెక్టుల నుంచి, మహబూబ్నగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా నదిలోకి భారీగా వరద చేరుతోంది. అయితే, సోమవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్టు పది గేట్లను ఎత్తి, కుడి గట్టు విద్యుత్కేంద్రం ద్వారా 4,99,672 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్లోకి 6,03,345 క్యూసెక్కులు చేరుతుండగా.. 20 గేట్ల ద్వారా అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ► పులిచింతల ప్రాజెక్టు 15 గేట్లు, విద్యుత్కేంద్రం ద్వారా 5,77,420 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ► ప్రకాశం బ్యారేజీ గేట్లను పూర్తిగా ఎత్తేసి 6.46 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ► ప్రకాశం బ్యారేజీలోకి వరద పోటెత్తడంతో నదీ గర్భంలో నిర్మించిన 32 అక్రమ కట్టడాల యజమానులకు జలవనరుల శాఖ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేసి అప్రమత్తం చేశారు. ► పెన్నా, ఉప నదులు కుందూ, పాపాఘ్నిల్లో వరద ఉధృతి ఏమాత్రం తగ్గలేదు. సోమశిల ప్రాజెక్టు నుంచి కండలేరుకు విడుదల చేయగా మిగిలిన 1.08 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోంచి 3.18 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. -
సోమశిల వద్ద తాగుబోతుల వీరంగం
సాక్షి, నెల్లూరు: సోమశిల వరద నీటిలో తాగుబోతులు వీరంగం సృష్టించారు. పెన్నా నదికి వస్తున్న వరద ఉదృతితో సోమశిల రిజర్వాయర్ పది గేట్లు ఎత్తి లక్షా 50 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. దీంతో నీటి ప్రవాహం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సోమశిల రిజర్వాయర్ ముందు మందు బాబులు చిందులేశారు. ప్రవాహ వేగం తీవ్రంగా ఉన్న చోట ముగ్గురు తాగుబోతులు నీటి దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కాగా మరింత ముందుకు వెళ్ళివుంటే ప్రమాదం జరిగేదని స్థానికులు తెలిపారు. అయితే డ్యామ్ గేట్లు ఎత్తిన సమయంలో పోలీసులు మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడ్డారు. -
'మంచి నాయకుడి పాలనకు ఇదే నిదర్శనం'
సాక్షి, నెల్లూరు: నగరంలోని పెన్నానది పరివాహక ప్రాంతాల్లో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ' వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుసగా రెండోసారి సోమశిల జలాశయం పూర్తిగా నిండింది. మంచి నాయకుడి పాలనకు ఇదే నిదర్శనం. వర్షాలు బాగా కురుస్తున్నాయి. నెల్లూరులో పెన్నా బ్యారేజీ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తాం. (సచివాలయ పరీక్షలు: నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ) సోమశిల నుంచి నీటి విడుదల మరింత పెరుగుతుంది. నదీ తీరంలో నివాసం ఉన్న వారు వెంటనే సహాయక శిబిరాలకు వెళ్లాలి. సోమశిల నుంచి నీటి విడుదల పెరిగే అవకాశం ఉండటంతో ఈ ప్రాంతం అంతా మునిగిపోయే అవకాశం ఉంది. తీరంలో నివాసం ఉన్న ప్రజలకు పునరావసం కల్పిస్తాం. త్వరలోనే వీరికి స్థలాలు ఇచ్చి సొంత ఇళ్లు కట్టిస్తాం' అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. (శరవేగంగా నూతన రథం నిర్మాణ పనులు) -
పెన్నమ్మ గర్భంలో శివక్షేత్రం
నెల్లూరు, ఆత్మకూరు: పెన్నానది తీరాన ఇసుక మేటలో పూడిపోయిన శివాలయం తవ్వకాల్లో బయటపడింది. ఈ సంఘటన చేజర్ల మండలంలోని పెరుమాళ్లపాడు (పిరమనపాడు) గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని పెన్నా తీరాన నాగేశ్వరాలయం ఉండేది. ఇక్కడ విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్టించారని చెబుతుంటారు. 200 సంవత్సరాల క్రితం ఆలయాన్ని నిర్మించారని చెబుతున్నారు. నిత్యం పూజలు జరుగుతుండేవి. మహా శివరాత్రి, నాగుల పంచమి పర్వదినాల్లో ఉత్సవాలు, విశేష పూజలు నిర్వహించేవారని తమ పూర్వీకులు తెలిపినట్లు వృద్ధులు వెల్లడించారు. 70 ఏళ్ల క్రితం పెన్నానదికి వరదలు ఉధృతంగా రాగా ఇసుకమేటల కారణంగా క్రమేపీ ఆలయం భూమిలో పూడిపోయింది. ఇసుక కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామాన్ని నదికి రెండు కిలోమీటర్ల దూరంలో నిర్మించుకున్నారు. కాలక్రమేణా ఆలయం పూర్తిగా పూడుకుపోయి ఆనవాళ్లే కనిపించలేదు. ఇలా వెలుగులోకి.. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న స్థానిక యువకులు లాక్డౌన్ నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చారు. ఇటీవల ఓ రోజు రచ్చబండపై కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా వృద్ధులు ఆలయం గురించి చెప్పారు. నూతనంగా అనుమతులు లభించిన ఇసుక రీచ్కు సమీపంలో ఆలయం ఉండొచ్చని చెప్పగా యువకులు రీచ్ కాంట్రాక్టర్ శ్రీనివాసచౌదరి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన జేసీబీ, హిటాచీ యంత్రాలను ఇచ్చి సహకరించారు. దీంతో మంగళవారం ఉదయం యువకుల నేతృత్వంలో తవ్వకాలు మొదలుపెట్టారు. ఆలయం ఆనవాళ్లు బయటపడ్డాయి. శిఖరం, గర్భగుడి, ముఖ మండపాలు వెలుగులోకి వచ్చాయి. శిఖరంపై చెక్కిన అందమైన దేవతామూర్తుల ప్రతిమలు కొంతమేర దెబ్బతిన్నాయి. శివాలయం బయట పడడంతో గ్రామస్తులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని కొబ్బరికాయలు కొట్టారు. తహసీల్దార్ గీతావాణి, వైఎస్సార్సీపీ నాయకులు విజయభాస్కర్రెడ్డి, సుధాకర్రెడ్డి, పార్థసారథి, గణేష్ తదితరులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పురావస్తు శాఖ అనుమతులు తీసుకుని దాతల సహకారంతో ఆలయాన్ని పునః నిర్మించేందుకు ప్రయత్నాలు చేయనున్నట్లు తెలిపారు. పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి మా గ్రామంలోని పెద్దలు పెన్నానది ఒడ్డున శివాలయం ఉండేదని చెప్పేవారు. ఇటీవల గ్రామానికి చేరిన యువకులు పలువురి సహకారంతో తవ్వకాలు చేశారు. ఆలయాన్ని పునః నిర్మించేందుకు మంత్రి గౌతమ్రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం. పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తా.– కె.శ్రీధర్, పెరుమాళ్లపాడు ఉత్సవాలు బాగా చేసేవారు మా తాత విశ్వనాథం సీతారామయ్య పిరమనపాడు (పెరుమాళ్లపాడు)లోని నాగేశ్వరాలయంలో పూజారిగా ఉండేవారు. నా చిన్నతనంలో ఆయనతో కలిసి ఆత్మకూరు నుంచి ఆలయానికి వెళుతుండేదాన్ని. పెన్నా నదికి వరదలు వచ్చిన సమయంలో గ్రామంలోనే ఉండిపోయేవారు. వర్షాకాలంలో వరదల ఉధృతికి ఆలయంలో బురద సైతం చేరేది. అది పెద్ద ఆలయం. ఉత్సవాలు బాగా చేసేవారు.– విశ్వనాథం సుశీలమ్మ -
రబీకి 2 బ్యారేజీలు
సాక్షి, అమరావతి: పెన్నా నదిపై నిర్మాణంలో ఉన్న నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ పనులను శరవేగంగా పూర్తి చేసి ఈ ఏడాదే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నెల్లూరు బ్యారేజీ కింద 99,525 ఎకరాలు, సంగం బ్యారేజీ కింద 3.85 లక్షల ఎకరాలు వెరసి 4,84,525 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని నిర్దేశించుకుంది. ఆర్థిక ఇబ్బందులతో పనులు చేయలేనని, నెల్లూరు బ్యారేజీ కాంట్రాక్టు ఒప్పందం నుంచి వైదొలగేందుకు అనుమతించాలంటూ కాంట్రాక్టర్ చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. మిగిలిన రూ.113.36 కోట్ల విలువైన పనులను కొత్త కాంట్రాక్టర్కు అప్పగించి అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా జలవనరుల శాఖ కసరత్తు చేస్తోంది. సంగం బ్యారేజీ పనులను సెప్టెంబరులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది. ప్రాధాన్యతగా నెల్లూరు బ్యారేజీ.. ► నెల్లూరు కొత్త బ్యారేజీ పనుల్లో 8 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు, 8.36 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు మిగిలాయి. ► బ్యారేజీకి 57 గేట్లను బిగించాల్సి ఉండగా తయారీ పనులు 75% పూర్తయ్యాయి. మిగిలిన రూ. 113.36 కోట్ల పనులను ప్రాధాన్యతగా పరిగణించి కొత్త కాంట్రాక్టర్కు అప్పగించి అక్టోబర్ నాటికి బ్యారేజీని జాతికి అంకితం చేయనున్నారు. శరవేగంగా సంగం బ్యారేజీ ► కొత్తగా నిర్మిస్తున్న సంగం బ్యారేజీలో మిగిలిపోయిన పది వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. మిగిలిన 2.16 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు పురోగతిలో ఉన్నాయి. ► బ్యారేజీకి గేట్ల తయారీ పనులు కొలిక్కి వచ్చాయి. ఇందుకోసం రూ.145.51 కోట్లను విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. ► సంగం బ్యారేజీని సెప్టెంబరు నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చేతులెత్తేసిన చంద్రబాబు.. ► వందేళ్ల క్రితం నిర్మించిన నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీలు శిథిలావస్థకు చేరడంతో ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. వీటి స్థానంలో కొత్త బ్యారేజీల నిర్మాణాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2004లో చేపట్టారు. 2009 నాటికి సింహభాగం పనులు పూర్తయినా తర్వాత గ్రహణం పట్టుకుంది. ► 2018 ఖరీఫ్ నాటికి రెండు బ్యారేజీలను పూర్తి చేస్తామని నాడు అధికారంలో ఉండగా శాసనసభ సాక్షిగా పలు సందర్భాల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు చేతులెత్తేశారు. -
జల'ఆశయం'
దశాబ్దకాలంగా అడుగు ముందుకు పడని పెన్నా, సంగం బ్యారేజీల పనులకు మోక్షం లభించింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు కాక ప్రాజెక్ట్ల పనులకు బ్రేక్లు పడ్డాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో సాగునీటి రంగానికి ఎనలేని ప్రాధాన్యమిచ్చింది. ఏళ్లుగా పనులు జరగక పడకేసిన ఈ బ్యారేజీల నిర్మాణాలను పూర్తి చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. నీటిపారుదల శాఖ మంత్రి అనిల్కుమార్యాదవ్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ప్రత్యేక చొరవతో ప్రాజెక్ట్లను పూర్తి చేసి అన్నదాతల కళ్లలో ఆనందం చూసేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. టీడీపీ ఐదేళ్ల కాలంలో ఈ రెండు బ్యారేజీల నిర్మాణాలు అడుగు ముందుకు పడలేదు. చేసిన పనులకు బిల్లులు కూడా ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు నిర్మాణ పనులను నిలిపేశారు. ఇప్పుడు రాత్రి పగలు అనే తేడా లేకుండా పనులు వేగవంతమయ్యాయి. రానున్న కొద్ది నెలల్లో రెండు ప్రాజెక్ట్లను పూర్తి చేసి సింహపురి అన్నదాతలకు అంకితం చేయనున్నారు. సాక్షి, నెల్లూరు : సోమశిల జలాశయం నుంచి వచ్చే వృథా జలాలు సముద్రం పాలవకుండా సంగం వద్ద, నెల్లూరులో పెన్నానదిపై బ్యారేజీల నిర్మాణానికి దివంగత సీఎం వైఎస్సార్ 2008లో సంకల్పించారు. జలయజ్ఞం ద్వారా రెండు ప్రాజెక్ట్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఆయా ప్రాజెక్ట్లకు రూ.300 కోట్లను కేటాయించారు. 2014లోపు దాదాపు 50 శాతం మేర పనులు పూర్తి చేశారు. అయితే గత టీడీపీ హయాంలో అడుగు ముందుకు పడలేదు. అప్పటి మంత్రులతో పాటు చంద్రబాబు తరచూ ఆ ప్రాజెక్ట్లను సందర్శించి అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ అన్నదాతలను మభ్యపెట్టారు. గత ఐదేళ్ల కాలంలో ఆ ప్రాజెక్ట్ల నిర్మాణాలు పడకేశాయి. కొంత మేర చేసిన పనులకు బిల్లులను అప్పటి టీడీపీ ప్రభుత్వం నిలిపేయడంతో కాంట్రాక్టర్లు పనులను ఆపేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, జిల్లాకు చెందిన అనిల్కుమార్యాదవ్ నీటిపారుదల శాఖ మంత్రి కావడంతో ఆ ప్రాజెక్ట్లకు మోక్షం కలిగింది. మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని అధికారులను ఆదేశించడంతో పాటు దాదాపు రూ.32 కోట్ల పెండింగ్ బిల్లులను మంత్రి మంజూరు చేయడంతో సంగం, పెన్నాబ్యారేజీల నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇదీ పనుల తీరు.. ♦ పెన్నా బ్యారేజీ 54 శ్లాబులను పూర్తి చేశారు. త్వరలో గేట్లను అమర్చనున్నారు. రూ.150 కోట్లకు గానూ రూ.129.16 కోట్ల విలువైన పనులను పూర్తి చేశారు. ఈ ఏడాది మార్చిలోపు నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు కృషి చేస్తున్నారు. ♦ సంగం బ్యారేజీ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే గేట్లను కూడా అమర్చనున్నారు. రూ.156 కోట్ల వ్యయమైన పనులకు ఇప్పటి వరకు రూ.119.48 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. దాదాపు 76.42 శాతం పనులు పూర్తయ్యాయి. మరో ఆర్నెల్లో నిర్మాణాలను పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు సంగం, పెన్నా బ్యారేజీల నిర్మాణాలు పూర్తయితే దాదాపు 4.5 లక్షల ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరందే అవకాశం ఉంది. సంగం బ్యారేజీ ద్వారా కనుపూరు, కావలి, దువ్వూరు, ఎన్టీఎస్ కాలువలకు సాగునీరందుతుంది. ఆయా కాలువ ద్వారా దాదాపు 3.5 లక్షల ఎకరాలకు పూర్తిస్థాయిలో నీరందుతుంది. దీంతో చివరి ఆయకట్టుకు నీరందే అవకాశం ఉండడంతో రెండు పంటలు సమృద్ధిగా పండుతాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెన్నా బ్యారేజీ ద్వారా సర్వేపల్లి కెనాల్, జాఫర్సాహెబ్ కెనాల్, కృష్ణపట్నం కెనాల్ ద్వారా దాదాపు లక్ష ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీరు పుష్కలంగా అందుతుంది. ఆర్నెలల్లో ప్రాజెక్ట్ల పూర్తి సంగం, పెన్నా బ్యారేజీల నిర్మాణాలను ఆర్నెల్లో పూర్తి చేస్తాం. గతంలో చేసిన పనులకు బిల్లులు పెండింగ్ ఉండటంతో నిలిపేశారు. పెండింగ్ ప్రాజెక్ట్లను వెంటనే పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి అనిల్కుమార్ యాదవ్ ఆదేశించడంతో పనులను వేగవంతం చేశాం. పెండింగ్ బిల్లులు మంత్రి ఆదేశాలతో మంజూరయ్యాయి. – హరినారాయణరెడ్డి, తెలుగుగంగ ప్రాజెక్ట్ ఈఈ నెల్లూరు సకాలంలో వరిపైరు సాగు చేశాం ఈ ఏడాది సంగం ఆనకట్టకు పూర్తిగా సాగునీరు చేరడంతో సకాలంలో వరిపైరు సాగు చేశాం. గత ఐదేళ్లలో ఎన్నడూ సంగం ఆనకట్టలో ఈ ఏడాది వచ్చినంత సాగునీరు రాలేదు. నారుమడులు వేసే సమయానికి సంగం ఆనకట్టకు పూర్తిగా నీరు రావడంతో సకాలంలో వరిపైరు నాటుకున్నాం. – నెల్లూరు కోటారెడ్డి, రైతు, తరుణవాయి కాలువల కింద సాగు చేస్తున్నాం సంగం ఆనకట్టకు ఈ ఏడాది సాగునీరు సకాలంలో చేరడంతో పంట కాలువల కింద వరిపైరు సాగు చేస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా బీడు పెట్టుకున్న మా పొలాలకు ఈ ఏడాది సకాలంలో సాగునీరు వచ్చింది. దీంతో పూర్తిస్థాయిలో రైతులందరూ వరిపైరు సాగు చేస్తున్నారు. సకాలంలో వరిపైరు సాగు చేయడం వల్ల ప్రస్తుతం పంట కూడా బాగుంది. – రేబాల సురేంద్రరెడ్డి, రైతు, దువ్వూరు -
వచ్చింది ఐదుగురు... వెళుతోంది ఇద్దరే.!
కడప అర్బన్: ‘యా.. అల్లాహ్..’.‘ఎంతపని జరిగింది దేవుడా...’! అంటూ మృతుల కుటుంబాల రోదనలు రిమ్స్ మార్చూరీ ఆవరణలో మిన్నంటాయి.. గురువారం సాయంత్రం సిద్దవటం మండలంలోని పెన్నా తీరంలో జరిగిన దారుణ ఘటనతో ముగ్గురు బిడ్డలను పోగొట్టు కున్న గౌస్పీర్, ముంతాజ్ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.. అటు భర్త చనిపోవడంతో అన్వర్బాషా భార్య , కుమార్తె అనాథలుగా మిగిలారు. శుక్రవారం రిమ్స్ ఆవరణలో మృతదేహాల పోస్టుమార్టం సందర్భంగా రిమ్స్ ఆవరణలో శుక్రవారం విషాదఛాయలు అలముకున్నాయి. ముగ్గురు చిన్నారుల శవాలు.. పక్కనే మేనమామ మృతదేహాన్ని చూస్తూ.. ‘ఏం పాపం చేశారని ఈ శిక్ష వేశావు దేవుడా.. ఎందుకింత అన్యాయం చేశావు..’ అంటూ బంధువులు గుండెలు బాదుకుంటుంటే.. అది చూసిన ప్రతి ఒక్కరూ కంట నీరు కార్చారు. అక్కడికొచ్చిన బంధుమిత్రులెవరిని కదిలించినా కన్నీరే సమాధానమైంది. ప్రాణం మీదకు తెస్తున్నఈత సరదా.. పెన్నా పరీవాహక ప్రాంతంతో పాటు జిల్లాలోని పలు నదీపరీవాహక ప్రాంతాలు ప్రమాదకరంగా మారాయి. పండుగ వస్తేనే.. సెలవులుంటేనో ఈత కోసం సరదాగా వెళ్లడం, ఈత రాక మడుగుల్లో చిక్కుకునిపోయి ప్రాణాలనుకోల్పోతున్న ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఘటనతో పాటు.. ఈనెల 2వ తేదీ సాయంత్రం సిద్దవటం మండల పరిధిలోని వంతెన సమీపంలో జరిగిన దుర్ఘటన ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. కాగా పెన్నానది నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో పోలీసు ఉన్నతాధికారులు అక్కడ కూడా కొంతమంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నారు. అయితే ఉధృతి తగ్గిన తర్వాత వెళుతున్న ప్రజలు తమకు ఈత రాకపోయినా సరదాగా నీటిలో ఆడుకుంటూ కాలక్షేపం చేసి వస్తుంటారు. ఈ క్రమంలోనే తమకు తెలియకుండానే నీటిలో పడి, మునిగిపోయి తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచైనా నష్టపరిహారం వచ్చేలా చూస్తాం... వైఎస్ఆర్సిపి కడప పార్లమెంటరీ అధ్యక్షుడు, మాజీ మేయర్ కె. సురేష్బాబు ఈ సంఘటనను గురించి తెలుసుకున్న వైఎస్ఆర్ సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షుడు కె. సురేష్బాబు శుక్రవారం కడప రిమ్స్ మార్చురీకి చేరుకున్నారు. అక్కడ మృతదేహాలను పరిశీలించిన ఆయన సంఘటన జరిగిన తీరును బంధువులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం తీరని విషాదమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్వర్బాష భార్య, కుమార్తెకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చేలా చూస్తామని, లేకపోయినా సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి నష్టపరిహారం వచ్చేలా చూస్తామన్నారు. పెన్నానదిలోకి వెళ్లేవారికి తగిన జాగ్రత్తలను సూచిస్తూ, ప్రమాద హెచ్చరికల సూచికలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనీ, ఎప్పటికపుడు అప్రమత్తతగా వుంచేటా చూడాలనిఒంటిమిట్ట సిఐ హనుమంతనాయక్ను, సురేష్బాబు కోరారు. పెన్నాలో పడి మృతిచెందిన నలుగురు మృతదేహాలకు రిమ్స్లో వైద్యులు, వైద్యసిబ్బంది పోస్టుమార్టం నిర్వహించారు. మధ్యాహ్నం బంధువులకు మృతదేహాలను అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హనుమంతనాయక్ వెల్లడించారు. ఆ రెండు కుటుంబాల్లో... కర్ణాటక రాష్ట్రం రాయచూర్కు చెందిన గౌస్పీర్, ముంతాజ్లకు కుమారుడు జునైద్, కుమార్తెలు జోహా, ముదీహా, పదీహా సంతానం. ముంతాజ్, తన నలుగురు పిల్లలతో కలిసి గత నెల 28న తన సోదరుల ఇంటికొచ్చింది. తిరిగి వీరు ఈనెల 3న రాయచూరుకు వెళ్లాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఈ దారుణ ఘటన జరిగింది. నలుగురు పిల్లలతో వచ్చిన ముంతాజ్ ముగ్గురిని పోగొట్టుకుని ఒక్క కుమారుడితో వెళ్లాల్సి వస్తోంది. మరోవైపు ఎలక్ట్రికలæ పనిచేసుకు టూ జీవన సాగిస్తున్న సోదరుడు అన్వర్బాషా కుటుంబంలోనూ ఈ ఘటన తీరని విషాదాన్నే నింపింది. అన్వర్ 17 సంవత్పరాల క్రితం సునీతను ఆదర్శ వివాహ చేసుకున్నాడు. వీరికి 15 సంవత్సరాల కుమార్తె ఉంది. ఈ దుర్ఘటనలో అన్వర్ బాషా ప్రాణాలను కోల్పోవోవడంతో భార్య, కుమార్తె అనాథలుగా మిగిలారు. నదిలోకి రాకుండారోడ్డుకు ఇరువైపుల కంచె సిద్దవటం: సిద్దవటం గ్రామ సమీపంలోని పెన్నానదిలోకి ఎవ్వరు దిగకుండా పాత వంతెన ఇరువైపుల కంపతో కంచె వేశామని ఎస్ఐ రమేష్బాబు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గురువారం సాయంత్రం పెన్నానదిలో నలుగురు నీట మునిగి మృతి చెందిన సంఘటన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామన్నారు. నదిపై నిర్మించిన పాత వంతెన వద్ద మడుగు ఉండటంతో ఎవ్వరినీ దిగకుండా హైలెవల్ వంతెన స్తంభాలకు హెచ్చరిక సూచనను ఏర్పాటు చేశారు. ఆ ప్రదేశంలో ఎర్ర జండాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. -
వైఎస్ చొరవతో సీమకు కృష్ణా జలాలు
సాక్షి, కడప : రాయలసీమ ప్రాంతానికి కృష్ణజలాలు వస్తున్నాయంటే ఆది కేవలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కృషేనని ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్రెడ్డిలు పేర్కొన్నారు. బుధవారం మైలవరం జలాశయం నుంచి రెండు గేట్ల ద్వార 1000 క్యూసెక్కుల నీటిని పెన్నానదిలోనికి విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ నేడు రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయని సంతోషం వ్యక్తంచేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో వ్యవహరించి శ్రీశైలంతో గండికోటకు కృష్ణజలాలు తరలించే ఏర్పాటు చేశారన్నారు. పెన్నానదిలోనికి నీరు వదలడం ద్వారా కుందూ పెన్నా నదులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు ఉన్న పరివాహక ప్రాంతాలకు తాగునీటి సమస్య ఉత్పన్నం కాదన్నారు. రాయలసీమలో వర్షాలు పడకపోయినా కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రలలో వర్షాలు విస్తారంగా వర్షాలు పడటంతో అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండుకుండాలా మారిపోయి అదనంగా పైనుంచి ఇంకా వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోనికి వదులుతున్నారన్నారు. దీని ద్వారా రైతుల పంటలసాగుకు నీరు అందే అవకాశం ఉందన్నారు. 2005లో దివంగతనేత వైఎస్ రాజశేఖర్రెడ్డి హాయంలో అన్నిపార్టీల సమావేశాన్ని నిర్వహించారని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కుల నీటిని ఒక్కసారిగా తీసుకుని వెళ్లేవిధంగా చర్యలు చేపడితే అప్పట్లో మాజీ మంత్రి దేవినేని ఉమ ఇలా తీసుకుని పోవడం వల్ల నాగార్జున సాగర్కు నీరు వచ్చే అవకాశంలేదంటూ అడ్డుకోవడం జరిగిందన్నారు. నాడు వైఎస్ రాజశేఖర్రెడ్డి రాయలసీమ వాసులు తాగు,సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మొండిగా హెడ్రెగ్యులేటర్ స్థాయిని పెంచి గాలేరు–నగరి సుజలస్రవంతి ద్వార గండికోట ప్రాజెక్టుకు నీటిని రప్పించే ప్రయత్నం చేశారన్నారు. రాష్ట్రంలోరాజన్నరాజ్యం ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పాలనలో రాజన్నరాజ్యం ఆవిష్కృతమవుతోందన్నారు. గతంలో టీడీపీ హాయంలో ఒక్కసారి మాత్రమే ఎన్నికల ముందు కృష్ణజలాలను గండికోటకు నీటిని రప్పించారన్నారు. జగన్ పాలనలో మూడు నెలల కాలంలోనే గండికోట, మైలవరం, పైడిపాలెం, సర్వారాయసాగర్, వామికొండ ప్రాజెక్టులలో సైతం నీటిని నింప డం జరుగుతుందన్నారు. ఇది చదవండి : వైఎస్ హయాంలో రైతే రాజు జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం ప్రాం తాల ప్రజలకు తాగునీటికి ఇబ్బందిలేకుండా చేస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో కరు వు కాటకాలతో ప్రజలు అల్లాడిపోయారన్నారు. నేడు జగన్ పాలనలో ప్రాజెక్టులన్ని నీటితో కళకళలాడుతున్నాయన్నారు. మరో రెండునెలల కాలంలో వర్షాలు పడే అవకాశం ఉందని తిరిగి శ్రీశైలం నిండిపోయి మరోసారి గండికోట, మైలవరం జలాశయాలలోనీటిని నింపుతామన్నారు. -
నేడు పెన్నాకు నీరు విడుదల
సాక్షి, జమ్మలమడుగు(కడప) : మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోకి రెండు టీఎంసీల నీరు విడుదల చేయడం కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రెండున్నర టీఎంసీల పైన నీరు ఉండగా, మంగళవారం రాత్రికి మూడు టీఎంసీలకు చేరుకుంటుంది. ముందుగా గండికోట జలాశయం నుంచి మైలవరంలోకి ఇరిగేషన్ అధికారులు కేవలం 500 క్యూసెక్కుల నీటిని వదిలారు. తర్వాత 1500 క్యూసెక్కులు విడుదల చేశారు. ఎమ్మెల్యే సుధీర్రెడ్డి సెప్టెంబర్ 1 నుంచి మైలవరం గేట్లు ఎత్తి పెన్నానదిలోకి నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే అధికారులు ఆ స్థాయిలో గండికోట నుంచి మైలవరం జలాశయంలోకి నీరు విడుదల చేయలేదు. ఇరిగేషన్ అధికారులు తమపై పక్షపాతం చూపుతున్నారని రెండు రోజుల్లో మైలవరం నుంచి పెన్నానదిలోకి విడుదల చేయకపోతే ఇరిగేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. దీంతో అధికారులు రోజుకు 1500 క్యూసెక్కుల వచ్చే నీటిని 5000 క్యూసెక్కులకు పెంచేశారు. నాలుగు రోజుల నుంచి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతుంది. రెండు గేట్ల ద్వారా.. మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోకి రెండు టీఎంసీల నీటిని విడుదల చేయబోతున్నారు. రెండు గేట్ల ద్వారా ప్రతిరోజు 1000 క్యూసెక్కుల నీటిని పెన్నానదిలో నీటిని విడుదల చేసి భూగర్భజలాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీ ప్రజలకు తాగునీటి సమస్య తీరుతుంది. అంతే కాకుండా జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లోని గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగి తాగునీటితో పాటు రైతుల బోర్లకు నీరు అందే అవకాశం ఉంది. 6.5 టీఎంసీల నిల్వకు ప్రయత్నాలు.. మైలవరం రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టు రైతులకు, తాగునీరు, ఆర్టీపీపీలకు నీరు అందించే విధంగా జలాశయంలో దాదాపు 6.5 టీఎంసీల నీటిని నిల్వ ఉంచే విధంగా అధికారులు సిద్ధమవుతున్నారు. మైలవరం జలాశయం మొత్తం సామర్థ్యం 9.5 టీఎంసీలు అయితే ప్రస్తుతం 6.5 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నీటిని విడుదల చేయనున్న ఎంపీ, ఎమ్మెల్యేలు.. మైలవరం జలాశయం నుంచి బుధవారం ఉద యం పది గంటలకు నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులు ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రమే విడుదల చేయాల్సి ఉన్నా పూర్తి స్థాయిలో నీరు వచ్చి చేరకపోవడంతో కార్యక్రమాన్ని బుధవారం ఉదయానికి వాయిదా వేశా రు. నీటి విడుదలకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, రాచమల్లు ప్రసాద్రెడ్డి, రవీంద్రనాథ్రెడ్డి హాజరవుతున్నట్లు సమాచారం. ఇబ్బందులు లేకుండా చర్యలు.. మైలవరం జలాశయం నుంచి రెండు టీఎంసీల నీటిని పెన్నానదిలోకి వదలి భూగర్భజలాలు పెరిగి భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా బుధవారం ఉదయం మైలవరం జలాశయం గేట్లను ఎత్తి పెన్నానదిలోకి విడుదల చేయబోతున్నాం. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు వస్తున్నారు. – గౌతమ్రెడ్డి, మైలవరం ఇరిగేషన్ ఏఈ -
విహారంలో విషాదం..
సాక్షి, మలాపురం: విహారంలో విషాదం చోటు చేసుకుంది.నీటిలో కొట్టుకుపోయి ఒక వ్యక్తి మృతి చెందారు. ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు.బక్రీద్ పండుగ ఉత్సాహంగా జరుపుకున్నారు. సంతోషంగా విహారం చేద్దామని ఇంటినుంచి బయలుదేరిన 2 గంటల్లోనే ఈ విషాదం చోటుకుంది.ఈ సంఘటనలో షేక్ జాఫర్ హుసేన్ (42) మృతి చెందగా, ఇర్ఫాన్(12), జాకీర్(12), షాహిద్(10) గల్లంతయ్యారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.కమలాపురం పట్టణంలోని దర్గా వీధికి చెందిన జాఫర్ హుసేన్, సాదకున్ దంపతులు, అదే వీధికి చెందిన హసీన తన ముగ్గురు పిల్లలతో సమీపంలోని పెన్నా నది వద్దకు వన భోజనానికి వెళ్లారు. ఇంటి పక్కనే ఉన్న మరో ఇద్దరు చిన్నారులు జాకీర్, షాహిద్ వస్తామంటే వారిని కూడా పిలుచుకుని పోయారు. బక్రీద్ పండుగ జరిగిన నేపథ్యంలో వారు వనభోజనానికి వెళ్లారు. భోజనం అనంతరం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జాఫర్ హుసేన్ ఈత కొట్టేందుకు నదిలో దిగారు. చిన్నారులు కూడా ఏటి గడ్డన ఉన్న తక్కువ నీటిలో ఆడుకుంటున్నారు. అరగంట తర్వాత జాఫర్ హుసేన్ ఏటీ మధ్యలోకి వెళ్లడంతో నీటి ప్రవాహానికి కొట్టుకొని పోయారు. ఈ సంఘటన చూసిన చిన్నారులు మామా.. మామా.. అంటూ కేకలు వేస్తూ నది నీటి ప్రవాహం గురించి తెలియక జాఫర్ వైపునకు వెళ్లారు. వారు కూడా జాఫర్ లాగే నీటిలో కొట్టుకొని పోయారు. అయితే జాఫర్ లుంగీ తగులుకొని కంపచెట్లకు ఆనుకున్నారు. ఈ విషయం చూసిన అక్కడ ఉన్న వారు జాఫర్ను ఒడ్డుకు తీసుకొచ్చారు. అయితే అతను అప్పటికే మృతి చెందారు. ముగ్గురు చిన్నారుల ఆచూకీ లభ్యం కాలేదు. కాగా మృతుడి భార్య జాఫర్ మృతదేహంపై పడి భోరున విలపించింది. మృతునికి ఇద్దరు కుమారులున్నారు. ఈ సంఘటన దావానంలా వ్యాపించడంతో కమలాపురం పట్టణంతో పాటు సమీప ప్రాంతాల ప్రజలు నదిలోకి చేరుకున్నారు. చిన్నారుల జాడ కోసం వెతికారు. కానీ ప్రయోజనం లేక పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎర్రగుంట్ల రూరల్ సీఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలిగింది. గల్లంతైన చిన్నారులందరూ రెండో సంతానమే: గల్లంతైన ముగ్గురు చిన్నారులు వారి తల్లిదండ్రులకు రెండో సంతానమే. మాబుఖాన్, హుసేన్ బీల కు ఒక కుమార్తె, ఒక కుమారుడు. జాకీర్ రెండో సంతానం. ఉన్న ఒక్క కుమారుడు గల్లంతు కావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. హసీనా, హైదర్లకు ఒక అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలు కాగా, ఇర్ఫాన్ రెండో సంతానం. ఖాదరు, సాబీరున్లకు ఒక అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలు ఉండగా షాహిద్ కూడా రెండో సంతానమే. ఎమ్మెల్యే పరామర్శ పెన్నా నదిలో ప్రవాహానికి కొట్టుకొని పోయి మృతి చెందిన జాఫర్ హుసేన్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పరామర్శించారు. ఇలా జరగడం దారుణం అన్నారు. చిన్నారుల గాలింపు చర్యల కోసం పోలీస్ శాఖ, రెవెన్యూ, ఫైర్ శాఖల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. చిన్నారుల ఆచూకీ త్వరలోనే లభిస్తుందన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కళ్ల ముందే కొట్టుకొని పోయాడు నా కొడుకు ఇర్ఫాన్ కళ్ల ముందే కొట్టుకొని పోయాడు. అది చూసి ముగ్గురు పిల్లలు ఆ వైపే వెళ్లారు. వెళ్ల వద్దు.. అని మొత్తుకున్నా వినలేదు.. ఎక్కడున్నారో.. ఎలా ఉన్నారో.. –హసీనా, ఇర్ఫాన్ తల్లి. గారాభంగా పెంచుకున్నాం అమ్మాయి తర్వాత అబ్బాయి పుట్టడంతో గారాభంగా పెంచుకున్నా. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. నదివద్దకు వెళ్లకున్నా బాగుండేదని విలపించారు. –మాబుఖాన్, జాకీర్ తండ్రి నా కొడుకు వస్తాడు: నా తమ్ముడు జాఫర్ చనిపోయాడని తెలిస్తే నదివద్దకు వెళ్లాను. అక్కడికి పోయాక తెలిసింది తన కుమారుడు షాహిద్ కూడా గల్లంతైన వారిలో ఉన్నాడని. నా కొడుకు వస్తాడు అనే నమ్మకం ఉంది. –ఖాదరు, షాహిద్ తండ్రి అనవసరంగా వెళ్లాం అనవసరంగా వన భోజనానికి వెళ్లాం. అలా వెళ్లక పోయి ఉంటే బాగుందేది. నా కళ్ల ముందే నా భర్త నీళ్లలో కొట్టుకొని పోయారు. క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. –సాదకున్, జాఫర్ హుసేన్ భార్యఉదయం 6 గంటలకే గాలింపు చేపడతాం: దాదాపు మూడు గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టాం. చీకటి పడటంతో ఆటంకం కలిగింది. ఫైర్ సిబ్బందికి తెప్పలు వచ్చాయి. ఉదయం 6గంటలకే గాలింపు చర్యలు ప్రారంభిస్తాం. గజ ఈత గాళ్లును సిద్ధం చేశాం. చిన్నారుల ఆచూకీ లభ్యం అయ్యే వరకు గాలింపు చర్యలు చేపడతాం. –టీవీ కొండారెడ్డి సీఐ. -
పెన్నాలో నలుగురు గల్లంతు.. ఒకరు మృతి..!
సాక్షి, వైఎస్సార్ కడప : జిల్లాలోని కమలాపురంలో విషాదం చోటుచేసుకుంది.పెన్నా నదిలో ఈతకు వెళ్లిన నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ ఘటన కుందూ పెన్నా సంగమం వద్ద చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ఒకరు మృత్యువాత పడి ఒడ్డుకు కొట్టుకురాగా.. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుడు కమలాపురం వాసి జాఫర్ హుస్సేన్గా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యే పరామర్శ.. పెన్నా నదిలో కుందూ పెన్నా సంగమం వద్ద గల్లంతై మృతి చెందిన హుస్సేన్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ కమలాపురం ఎమ్మెల్యే పోచమరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి పరామర్శించారు. హుస్సేన్ మృతదేహానికి నివాళులు అర్పించి అతని కుటుంబాన్ని ఓదార్చారు. గల్లంతైన మిగతా ముగ్గురు పిల్లల్ని బయటకు తెచ్చేందుకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. -
పెన్నమ్మే అమ్మ
సాక్షి, ఆత్మకూరు: ప్రపంచం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందినా గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండలం పుట్టుపల్లి గ్రామ సమీపంలోని పెన్నానది గట్టున ఓ ఇసుక తిన్నెపై తాటాకులతో వేసుకున్న పూరిపాకలో గిరిజన దంపతులు ఈగా శీనయ్య, కృష్ణవేణి నివాసం ఉంటున్నారు. పెన్నానదిలో చేపలు పట్టి వాటిని అమ్ముకుని కడుపునింపుకుంటున్నారు. గతంలో కలువాయి మండలం తెలుగురాయపురం సమీపంలోని పెన్నాతీరంలో ఉంటున్న వీరు కొన్ని నెలల క్రితం పుట్టుపల్లి వద్దకు వచ్చారు. పెన్నలో చిన్న పాక ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. చేపల వేట వీరి జీవనాధారం. నాలుగేళ్లుగా పెన్నానదికి వరదలు లేక, వర్షాలు కురవకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. లేకుంటే వారు నివాసం ఉంటున్న ప్రాంతం ఓ మోస్తారు వర్షానికే మునిగిపోయి ఉండేది. ఆధార్ లేదు.. రేషన్ రాదు బతుకుదెరువు కోసం పుట్టుపల్లిలోని పెన్నాతీరానికి వచ్చిన వీరికి ప్రభుత్వపరంగా ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కాలేదు. కారణం ఆధార్, రేషన్కార్డు లాంటివి ఈ దంపతులకు లేవు. ఈ క్రమంలో కృష్ణవేణి గర్భం దాల్చింది. 10 రోజుల క్రితం ఆత్మకూరులోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కవల పిల్లలకు జన్మినిచ్చింది. సాధారణ కాన్పు కావడంతో ప్రసవించిన నాలుగు రోజులకే మళ్లీ తాముంటున్న పుట్టుపల్లిలోని పెన్నాతీరానికి చేరుకున్నారు. సాధారణంగా పురిటి బిడ్డలను ఎండ, వాన సోకకుండా ఇళ్లలోనే కాపాడుకుంటారు. కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న ఈ గిరిజనులకు పెన్మమ్మే(పెన్నానదే) ఆవాసమైంది. పసిబిడ్డలకు పెన్నాతీరంలోనే స్నానం చేయిస్తూ ఆలనాపాలనా చూస్తున్నారు. వీరికి ఆధార్, రేషన్కార్డు లేకపోవడంతో తల్లీబిడ్డ సంక్షేమం ద్వారా అందే ప్రభుత్వపరమైన సౌకర్యాలు అందలేదు. వీరికి రేషన్ సరుకులు రావు. పక్కా ఇల్లు లేదు. గ్రామంలోని రైతులు పెన్నానది ఒడ్డుకు వచ్చే క్రమంలో వీరి దుస్థితిని చూసి పసిబిడ్డల కోసం దుస్తులు, ఆహార పదార్థాలు సాయమందిస్తున్నారు. దీని గురించి అధికారులకు సమాచారం లేదు. ఐక్య ఫౌండేషన్ సాయం గిరిజన కుటుంబం దుస్థితిని తెలుసుకున్న ఆత్మకూరు మండలం అప్పారావుపాళేనికి చెందిన ఐక్య ఫౌండేషన్ నిర్వాహకులు పుట్టుపల్లి అంగన్వాడీ కేంద్రానికి చేరుకుని వారికి నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, బియ్యం అందజేశారు. గిరిజన దంపతులకు పౌష్టికాహారం, మందులు అందజేస్తున్న ఏఎన్ఎంలు, అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు, రెవెన్యూ సిబ్బంది స్పందించిన మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఆదివారం సోషల్ మీడియాలో ఈ గిరిజన దంపతుల గురించి ఒక్కసారిగా విషయం వెలుగులోకి వచ్చింది. ఇది చూసి స్పందిం చిన ఆత్మకూరు ఎమ్మెల్యే, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అప్పటికప్పుడే ఆ పేద గిరిజన కుటుంబానికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. దీంతో చేజర్ల మండల తహసీల్దార్ ఎంవీకే సుధాకర్రావు, స్థానిక అంగన్వాడీ కార్యకర్త, ఏఎన్ఎంలు ఆ గిరిజనులకు పౌష్టికాహారం, మందులు అందజేసేందుకు వీఆర్ఓ, ఆర్ఐలతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఆ గిరిజన దంపతులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకుని పుట్టుపల్లి గ్రామంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వారిని తరలించారు. వారికి కలువాయిలోనూ రేషన్, ఆధార్కార్డు లేదన్న విషయం తెలుసుకుని వెంటనే ఆ కార్డులు అందించేలా ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అప్పటివరకు వారికి నిత్యావసర వస్తువులు, రేషన్ సరుకులు అందించాలని సిబ్బందికి తెలిపారు. గిరిజన కుటుంబం దుస్థితిని తెలుసుకుని వెంటనే స్పందించిన మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు. -
అనుసంధానం.. అంతామాయ!
సాక్షి, అమరావతి: పది వేల ఎకరాల్లో వరి సాగుకు ఒక టీఎంసీ నీళ్లు అవసరం. ఆరుతడి పంటలైతే ఒక టీఎంసీ నీటితో 15 వేల ఎకరాల్లో సాగు చేయవచ్చు. కానీ, 58 టీఎంసీలతో 15.01 లక్షల ఎకరాలకు ఒకేసారి నీటిని అందించడం సాధ్యమేనా? 5.80 లక్షల ఎకరాలకు మించి ఒక్క ఎకరాకైనా అదనంగా నీళ్లందించడం సాధ్యం కాదని సాగునీటి రంగ నిపుణులు తేల్చిచెప్పేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం దీన్ని పెడచెవిన పెట్టారు. అధికారాంతమున కమీషన్లు వసూలు చేసుకోవడానికి, సాగునీరు ఇస్తామంటూ రైతుల చెవ్వుల్లో పువ్వులు పెట్టి ఓట్లు కొల్లగొట్టడానికి చింతలపూడి ఎత్తిపోతల పథకానికి అనుబంధంగా రూ.6,719 కోట్లతో గోదావరి–పెన్నా అనుసంధానం తొలిదశ, కోటపాడు– చానుబండ–విస్సన్నపేట ఎత్తిపోతల పథకాలను చేపట్టారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు హైడ్రలాజికల్, పర్యావరణ, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) తదితర అనుమతులు తీసుకోలేదు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ గోదావరి–పెన్నా నదుల అనుసంధానం తొలి దశ పనులను నిలిపివేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) శుక్రవారం ఇచ్చిన తీర్పు చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలికి అద్దం పట్టిందని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంచనా వ్యయం భారీగా పెంపు గోదావరి నదికి వరద వచ్చే 90 రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లా రౌతులగూడెం వద్ద నుంచి రోజుకు 56 క్యూమెక్కుల(1977.64 క్యూసెక్కులు) చొప్పున 15.50 టీఎంసీలను ఎత్తిపోసి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 2.1 లక్షల ఎకరాలకు సాగునీరు, 6.65 లక్షల మందికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో రూ.1,701 కోట్ల వ్యయంతో 2008 అక్టోబర్ 24న చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని విస్తరించి.. గోదావరి నుంచి రోజుకు అదనంగా 138.52 క్యూమెక్కులు(4,897 క్యూసెక్కులు) చొప్పున 90 రోజుల్లో 38 టీఎంసీలు తరలించి, నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద 2.1 లక్షల ఎకరాలు, ఎర్రకాల్వ కింద 27 వేలు, కొవ్వాడ కాలువ కింద 17 వేలు, తమ్మిలేరు ప్రాజెక్టు కింద 24 వేల ఎకరాలు.. వెరసి 2.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం అంచనా వ్యయాన్ని 2016 సెప్టెంబరు 3న రూ.4,909.80 కోట్లకు పెంచేసి కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ పనులను 2019 ఖరీఫ్ నాటికి పూర్తి చేసి 4.9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తామని అప్పట్లో చంద్రబాబు పలుమార్లు హామీ ఇచ్చారు. బాబు ఎత్తులు చిత్తు గోదావరి–పెన్నా నదుల అనుసంధానం తొలిదశలో చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కడాన్ని ఎన్జీటీ మరోసారి బహిర్గతం చేసింది. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ‘వ్యాప్కోస్’ నివేదిక ఆధారంగా గోదావరి–పెన్నా నదుల అనుసంధానానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించి.. సీడబ్ల్యూసీ, పర్యావరణ, హైడ్రలాజికల్, సైట్ క్లియరెన్స్లు తీసుకుని పనులు చేపట్టే వారని సాగునీటి రంగ నిపుణులు అంటున్నారు. కమీషన్ల కక్కుర్తితో ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యాప్కోస్ నివేదికను వక్రీకరించి.. గోదావరి–పెన్నా అనుసంధానం చేపట్టి లబ్ధి పొందడానికి చంద్రబాబు ఎత్తుగడ వేశారు. ఆ ఎత్తును ఎన్నికల్లో రైతులు చిత్తు చేశారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రణాళికా లోపానికి పరాకాష్ట - నాగార్జున సాగర్ కుడి కాలువకు 152 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. 2014కు ముందు నాగార్జునసాగర్లో నీటి మట్టం 545 అడుగులు ఉన్నప్పుడు కూడా కుడి కాలువ కింద వరి సాగుకు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. కానీ, 2014 నుంచి 2018 ఖరీఫ్ వరకూ చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క ఏడాది కూడా కుడి కాలువ ఆయకట్టులో వరి సాగుకు నీటిని విడుదల చేయలేదు. దాంతో టీడీపీ సర్కార్ తీరుపై గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని చంద్రబాబు గుర్తించారు. ప్రజాగ్రహాన్ని చల్లార్చడం, కమీషన్లు మింగేయడమే లక్ష్యంగా ‘వ్యాప్కోస్’ నివేదికను వక్రీకరించి, రూ.6,020.15 కోట్లతో గోదావరి–పెన్నా నదుల అనుసంధానం తొలిదశకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. - పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా పోలవరం కుడి కాలువలోకి ఇప్పటికే 8,500 క్యూసెక్కులను ఎత్తిపోస్తున్నారు. గోదావరి–పెన్నా అనుసంధానం తొలిదశలో భాగంగా.. చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా ఏడు వేల క్యూసెక్కులను పోలవరం కుడి కాలువలోకి ఎత్తిపోసి, పట్టిసీమ జలాలతో కలిపి తరలిస్తే ప్రవాహ నష్టాలు, మార్గమధ్యంలో వినియోగం పోనూ ప్రకాశం బ్యారేజీకి 14 వేల క్యూసెక్కులు చేరుతాయని.. వాటిలో ఏడు వేల క్యూసెక్కులు కృష్ణా డెల్టాకు విడుదల చేసి, మిగతా ఏడు వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ జల విస్తరణ ప్రాంతంలో హరిశ్చంద్రాపురం నుంచి ఐదు దశల్లో నీటిని ఎత్తిపోసి నాగార్జున సాగర్ కుడి కాలువలో పోసి, 9.61 లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. చంద్రబాబు ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి, ఎన్నికలకు ఆరు నెలల ముందు కోటరీ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు దండుకున్నారు. - ఎన్నికలకు మూడు నెలల ముందు అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాతనిధ్యం వహిస్తున్న కృష్ణా జిల్లాలో, అదీ మైలవరం, నూజివీడు, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో టీడీపీపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుండటాన్ని గుర్తించిన చంద్రబాబు.. రైతులను ఆకట్టుకోవడానికి రూ.699 కోట్లతో కోటపాడు–చానుబండ–విస్సన్నపేట ఎత్తిపోతలను మంజూరు చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను మళ్లించి, కోటపాడు–చానుబండ–విస్సన్నపేట ఎత్తిపోతల ద్వారా 50 వేల ఎకరాలకు సాగు నీరందిస్తామని ప్రకటించారు. ఆ పనులను కోటరీ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు జేబులో వేసుకున్నారు. ఈ ఆయకట్టుకూ 2019 ఖరీఫ్ నాటికే నీళ్లందిస్తామని చెప్పారు. -
వాటాల్లోనే అనుసంధానం
గోదావరి, పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియలో అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్లకు సుమారు రూ.750 కోట్ల మొబలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసింది. కనీసం భూ సేకరణ ప్రక్రియ ప్రారంభం కాకుండానే ఎత్తిపోతలకు సంబంధించి మోటార్లు, పంపులు, పైపుల కొనుగోలు పేరిట ఇచ్చిన మొబలైజేషన్ అడ్వాన్సుల్లో ప్రభుత్వ పెద్దలు, అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య వాటాల పంపిణీకి తెరలేపారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, అమరావతి బ్యూరో: ‘గోదావరి–పెన్నా నదుల అనుసంధానం మొదటి దశ పనులను మే నాటికి పూర్తిచేస్తాం.. గ్రావిటీ ద్వారానే ఖరీఫ్లోనే నాగార్జున సాగర్ కుడి కాలువకు సాగునీటిని విడుదల చేస్తాం..’ అంటూ సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనలు నీటి మూటలుగా మారాయి. అనుసంధానం పనులకు సంబంధించి ఇప్పటి వరకూ భూసేకరణే ప్రారంభం కాలేదు. గోదావరి–పెన్నా నదుల అనుసంధానం మొదటి దశ పనులకు గత ఏడాది నవంబర్ 26వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నకరికల్లు వద్దశంకుస్థాపన చేశారు. మే నెలాఖరుకు నకరికల్లు ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసి ఎన్ఎస్పీ కాలువలకు నీరు ఇస్తామని చెప్పించి, మెగా, ఆర్వీఆర్ కాంట్రాక్టు ప్రతినిధులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి సన్మానాలు చేసి ప్రజలను మభ్యపెట్టారు, కాంట్రాక్టర్లు పనులు చేయకుండానే మొబలైజేషన్ అడ్వాన్సులు దండుకొన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు సైతం తమవాటాలను తీసుకొని కాంట్రాక్టర్లలకు, ప్రభుత్వానికి వంత పాడారు. ఐదు ఎత్తిపోతల పథకాల ద్వారా... గోదావరి–పెన్నా మొదటి దశ పనుల్లో భాగంగా నకరికల్లు వద్ద నాగార్జున సాగర్ కుడికాలువలోకి 7వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే విధంగా ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. రూ.6020.15 కోట్లతో ఐదు దశల్లో గోదావరి జలాలను ఎత్తి పోసేలా టెండర్లు ఖరారు చేశారు. హరిశ్చంద్రపురం, లింగాపురం, ఉయ్యందన, గంగిరెడ్డిపాలెం, నకరికల్లులో ఎత్తిపోతల పథకాలు నిర్మించాలని నిర్ణయించారు. తుళ్లూరు మం డలం హరిశ్చంద్రపురం నుంచి నకరికల్లు సమీపంలోని నాగార్జున సాగర్ కుడికాలువ 80 కిలోమీటర్ వద్దకు నీటిని పంపింగ్ చేయాలి. 148.68 మీటర్ల ఎత్తుకు నీటిని ఐదు ఎత్తిపోతల పథకాల ద్వారా లిఫ్ట్ చేయనున్నారు. ఇందులో 10.25 కిలోమీటర్ల మేర పైపులైను, 56.35 కిలోమీటర్ల మేర కాలువ పనులు పూర్తి చేయాల్సింది. 20 పంపులతో నీటిని ఎత్తిపోసేందుకు 577 మెగావాట్ల విద్యుత్ అవసరంని అంచనా వేశారు. గోదావరి–పెన్నా నదుల అనుసంధానం ద్వారా జిల్లాలో 5.12 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేయాలన్నది లక్ష్యం. భూ సేకరణ ప్రా రంభంకాకుండానే కాంట్రాక్టర్లకు పది శాతం మొబలైజేషన్ అడ్వాన్సు కింద సుమారు రూ.750 కోట్లు మంజూరు చేశారు. ఎత్తిపోతల కథకానికి అవసరమైన పంపులు, మోటార్లు, పైపులు కొనుగోలు పేరిట వాటాలు దండుకోవడానికే ఈ నిధులు విడుదల చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విడుదలవని భూసేకరణ నోటిఫికేషన్ మే నెలాఖరుకు పనులు పూర్తి చేసి, ఖరీఫ్కు నీరు ఇస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆ దిశగా పనులు సాగటం లేదు. కనీసం ఇప్పటి వరకు భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 3,541 ఎకరాల భూమిని సేకరించాల్సింది. దీనిని మూడు నెలలోనే పూర్తి చేస్తామని ప్రాజెక్టు పనుల శంకుస్థాపన సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. తాడికొండ, పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లోని ఏడు మండలాల పరిధిలో ఉన్న 30 గ్రామాల్లో భూసేకరణ చేయాల్సింది. అయితే తుళ్లూరు, నకరికల్లు, రాజుపాలెం, క్రోసూరు మండలాల్లోని రైతులు భూసేకరణను వ్యతిరేకించారు. పలు ప్రాంతాల్లో రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేశారు. భూములు ఇచ్చేది లేదని పలు చోట్ల భూ సేకరణ సర్వే పనులను అడ్డుకొన్నారు. గుంటూరు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్కు వెళ్లి ఆందోళన చేశారు. కాంట్రాక్టు పనులను అడ్డుకున్నారు. అధికారులు రూపొందించిన భూసేకరణ ప్రణాళికపై భూ యజమానుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో భూసేకరణకు సంబంధించిన ప్రక్రియను అధికారులు ప్రారంభించలేదు. తొలుత రెవెన్యూ అధికారులు గ్రామ సభలు నిర్వహించాలి. సామాజిక అధ్యయనం చేయాలి. ఆ దిశగా ప్రభుత్వం ఇంత వరకు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో గోదావరి–పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా నాగార్జున సాగర్ కుడి కాలువకు ఖరీఫ్లో నీరు ఎలా వస్తుందని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది కూడా నాగార్జున సాగర్ ఆయకట్టులో ఖరీఫ్ సాగుకు గండం తప్పదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
మరో రెండు మృత దేహాలు లభ్యం
సిద్దవటం : పెన్నానదిలో ఆదివారం గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయని ఒంటిమిట్ట సీఐ రవికుమార్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల నుంచి నదిలో అన్వేషించిన ఈతగాళ్లు ఏడు గంటలపాటు శ్రమించి రెండు మృతదేహాలను వెలికితీశారన్నారు. పెన్నానదిలో సరదాగా ఈత కోసం స్నేహితులతో కలిసి వచ్చిన కడప మృత్యుంజయకుంటకు చెందిన ముగ్గురు యువకులు గల్లంతైన విషయం విదితమే. వీరిలో డేరంగుల లోకేష్(22) మృతదేహం ఆదివారం సాయంత్రమే వెలికితీయగా, మిగిలిన ఇద్దరు యువకులు బత్తల రవి(27) షేక్ ఫైరోజ్(18)మృతదేహాలను చీకటి పడటంతో వెలికితీయ లేకపోయామన్నారు. సోమవారం పోలీసులు ఆధ్వర్యంలో ఈతగాళ్లు వలలు వేసి వెదుకులాట ప్రారంభించారన్నారు. మొదట బత్తల రవి మృతదేహం లభ్యంకాగా, తర్వాత చాలా సేపటికి గానీ షేక్ ఫైరోజ్ మృతదేహం ఆచూకీ లభించలేదు. ఊబిలో కూరుకుపోయి ఉండటం వల్లే అతని మృతదేహం జాడ తెలియడానికి చాలా సమయం పట్టిందన్నారు. ఎట్టకేలకు ఫైరోజ్ మృతదేహాన్ని 11.30 గంటల ప్రాంతంలో వెలికితీశారని చెప్పారు. విలపించిన కుటుంబ సభ్యులు తొలుత బత్తల రవి మృతదేహం బయట పడగానే ఆయన భార్య మౌనిక, కుటుంబీకులు బోరున విలపించారు. అది చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. మెడికల్ రెప్రజెంటేటివ్గా పనిచేస్తున్న రవికి రెండు సంవత్సరాల క్రితమే వివాహమైంది, వారికి 14 నెలల బాబు ఉన్నాడు. ఫైరోజ్ తల్లిదండ్రులు పెన్నానది వద్దనే చాలా సేపటి వరకూ మృత దేహం కోసం పడిగాపులు కాశారు. టైలరింగ్ పనిచేసే షేక్ దాదాపీర్, ఆఫ్తాబ్ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా షేక్ ఫైరోజ్ చిన్నవాడు. ఇతను ఆర్ట్స్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్ చదువుతున్నాడు. ఫైరోజ్ మృతదేహం బయటపడగానే అతని తల్లిదండ్రులు, బంధువులు కంటతడి పెట్టారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
సెలవులకు వచ్చాడు..శవమైపోయాడు
కడప, జమ్మలమడుగు రూరల్: వేసవి సెలవులను పినతండ్రి, తాతల వద్ద గడపాలని ఆ బాలుడు(14) ప్రకాశం జిల్లా కంభం నుంచి మండల పరిధిలోని గూడెం చెరువుకు వచ్చాడు. పెన్నా నదిలో సరదాగా ఈతకు వెళ్లి శవమై పోయాడు. సుబ్రమణ్యం, మహాలక్ష్మీల ఏకైన సంతానమైన కిశోర్ బుధవారం తాత, పినతండ్రి శివలతో కలిసి పెన్నానదిలో ఈతకోసం వెళ్లాడు. అయితే ఈత రాని కిశోర్ నీటిలో ఈత కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈత కాని కారణంగా బాలుడు నీటిలో మునిగిపోతుండటంతో పినతండ్రి శివ రక్షించే ప్రయత్నం చేశాడు. కానీ అతనికి కూడా ఈత రాకపోవడంతో కళ్ల ముందే మునిగిపోతున్నా ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. సెలవుల కోసం వచ్చిన తమ కుమారుడు ఇలా నీట మునిగి మరణించడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. పార్నపల్లెలో ఇంటర్ విద్యార్థి లింగాల : మండలపరిధిలోని పార్నపల్లె గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకుని సెలవుల్లో ఇంటికి వచ్చి బుధవారం మధ్యాహ్నం ఈతకు వెళ్లిన మోదుపల్లె అజిత్ అనే విద్యార్థి సంప్లో ఈత కొడుతూ మృతి చెందాడు. గ్రామానికి చెందిన ప్రభాకరనాయుడు, మంజుల దంపతులకు అజిత్ ఏకైక కుమారుడు. వీరికి లాస్య అనే కుమార్తె ఉంది. ఒక్కగానొక్క కుమారుడు ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. తండ్రి ప్రభాకర్ నాయుడు కుమారుడు ఈత కొడుతున్న సంప్ వద్ద ఉండగానే ఈ సంఘటన జరిగింది. వెంటనే నీటిలో నుంచి వెలికితీసి చికిత్స కోసం పులివెందుల ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అజిత్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
పెన్నా నదిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
-
పెన్నా గర్భశోకం
►పామిడిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా ►పోలీసుల అండతో రెచ్చిపోతున్న ఇసుకాసురులు ►గుంతలమయమైన పెన్నాతీరం ►కన్నెత్తి చూడని రెవెన్యూ, మైనింగ్ అధికారులు అక్రమార్కులు పెన్నానదిని తోడేస్తున్నారు. అనుమతులు లేకండానే ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పామిడిలో ఈ ఇసుకదందా తీవ్రం కావడంతో ఈ ప్రాంతంలోని పెన్నాతీరం గుంతలమయమై కనిపిస్తోంది. ఆక్రమణలు కూడా ఎక్కువ కావడంతో నది కుంచించుకుపోతోంది. ఇంత జరుగుతున్నా ఇటు మైనింగ్ అధికారులు గానీ, ఇటు పోలీసులు గాని కన్నెత్తి చూడడం లేదు. - పామిడి: మూడు దశాబ్దాల క్రితం పెన్నానదిలో ఎక్కడ చూసినా ఇసుక దిబ్బలు కనిపించేవి. అప్పట్లో 15 అడుగుల లోతులోనే నీరు పుష్కలంగా లభించేది. రాను రాను అక్రమ ఇసుక రవాణా ఊపందుకోవడంతో ఇసుక తిన్నెలు కనుమరుగయ్యాయి. ప్రస్తుతం పామిడిలో 150 అడుగుల్లో కూడా నీరు లభ్యంకాని పరిస్థితి. దీంతో పట్టణంలో ఎన్నడూలేని విధంగా నీటిఎద్దడి తీవ్రతరమైంది. మరోవైపు పామిడి సమీపంలో పెన్నానదిలో ఆక్రమణలు ఎక్కువ కావడంతో మైదానాన్ని తలపిస్తోంది. కొందరు ఏకంగా నదిలోనే తోటలు సాగు చేస్తున్నారు. రోజుకు రూ.4 లక్షలు విలువ గల ఇసుక తరలింపు గతంలో శింగనమల మండలంలో ఉల్లికల్లు, పెద్దవడుగూరు మండలంలో ఈరన్నపల్లి గ్రామాల వద్ద ఇసుకరీచ్లు ఉండేవి. గతంలో అక్కడి నుంచి మాత్రమే ఇనుక తరలించేలా నిబంధనలు ఉండేవి. ఏడాది క్రితం ఇసుక రీచ్లు ఎత్తివేశారు. దీంతో అధికారపార్టీ నేతలు ఇసుక అక్రమ రవాణా దందాకు పామిడిని కేంద్రంగా చేసుకున్నారు. పామిడి సమీపంలోని పెన్నానది నుంచి రోజుకు రూ.4 లక్షలు విలువ చేసే ఇసుకను అక్రమంగా రవాణ చేస్తూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్లు, ట్రిప్పర్లు, లారీల్లో రోజుకు వంద ట్రిప్పులు చొప్పున ఇసుకను బెంగుళూరు, అనంతపురం, గుంతకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్య పట్టణాల్లో అపార్ట్మెంట్ల నిర్మాణానికి, గుంతకల్లు పరిధిలోని రైల్వే డబ్లింగ్ పనులకు ఈ అక్రమ ఇసుకను తరలిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి ధర గుంతకల్లు, వజ్రకరూరు ప్రాంతాలకు ఒక ట్రాక్టర్ ధర రూ.3 వేలు పలుకుతోంది. అదే అనంతపురానికి అయితే రూ.4 వేలు. ట్రిప్పర్ ఇసుక అయితే రూ.18 వేలు పలుకుతోంది. బెంగుళూరు వంటి ముఖ్య పట్టణాలకు టెన్వీలర్ లారీ ఇసుక రూ.1.30 లక్షలు పలుకుతుండడంతో ఇసుకాసురుల అక్రమార్జన మూడు పువ్వులు... ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఈక్రమంలోనే అక్రమ రవాణాను అఽడ్డు రాకుండా పోలీసులకు మామూళ్లు సమర్పిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే జిల్లా ఎస్పీగా అశోక్కుమార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పోలీసులు అడపా...దడపా...దాడులు నిర్వహిస్తున్నా...పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతున్నారు. ఈ అక్రమ ఇసుక రవాణాను అరికట్టకపోతే పెన్నాతీరం మైదానంలా మారిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైదానంగా మారింది నదిలోని ఇసుక యథేచ్ఛగా తరలించడంతో దిన్నెలు కరిగిపోయాయి. నది మైదాన ప్రాంతంగా మారింది. ఇసుక అక్రమ రవాణాతో భూగర్భజలాలు అడుగంటాయి. దీంతో పట్టణంలో నీటిఎద్దడి నెలకొంది. –ఎస్ రఘునాథ్ దత్తు, పామిడి. కంపచెట్లమయం పెన్నానదిలో కంపచెట్లు దట్టంగా పెరిగాయి. ఆక్రమణలు, తోటలు, అక్రమ కట్టడాలతో నది కుచించుకుపోతోంది. దీంతో భవిష్యత్లో నది మాయమయ్యే పరిస్థితి నెలకొంది. –ఎం రంగనాయకులు, పామిడి కొండాపురం. అక్రమ రవాణను అడ్డుకుంటాం పెన్నానది నుంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టి సహజసంపదను కాపాడతాం. ఇసుకను రవాణా చేసే వారెవరైనా, ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. పోలీసులకు మామూళ్లు అందుతున్నాయన్న మాటల్లో వాస్తవం లేదు. ఒకటిన్నర నెల వ్యవధిలో 13 ట్రాక్టర్లు, 2 ట్రిప్పర్లు సీజ్ చేసి, రూ.3.15 లక్షల జరిమానా వసూలు చేశాం. పోలీసుల పనితీరుకు ఇదే నిదర్శనం. - రవిశంకర్రెడ్డి, ఎస్ఐ, పామిడి -
దోచుకున్నవారికి దోచుకున్నంత!
► ఇష్టారాజ్యంగా పెన్నాలో ఆక్రమణలు ► పొక్లెయిన్లు పెట్టి నదిలో గనుల తవ్వకాలు ► పట్టించుకోని మైనింగ్ శాఖ అధికారులు జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్: అక్రమార్కుల కన్ను పెన్నా నదిపై పడింది. నదిని ఇష్టారాజ్యంగా అక్రమించుకుని దొరికిన కాడికి దోచేస్తున్నారు. అందులోని సహజసంపదే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు. ఆక్రమణదారులు పెన్నానదిలో సరిహద్దులను ఏర్పాటు చేసుకొని పూర్తిగా అమ్మేసుకుంటున్నారు. ఇలా కొనుగోలు చేసుకున్న వారు నదిలో గనులను తవ్వడం కోసం యథేచ్ఛగా పొక్లెయిన్లు, ట్రాక్టర్లు వినియోగిస్తున్నారు. మట్టిని తోడి రాళ్లను బయటికి తీస్తున్నారు. దీంతో పెన్నానదిలో ఎక్కడపడితే అక్కడ నాపరాళ్ల గనులు ఏర్పడ్డాయి. భారీ గుంతలతో నది స్వరూపమే మారుతున్న అధికారుల్లో మాత్రం కదలిక లేదు. పట్టించుకునేవారు లేకపోవడంతో అక్రమార్కులకు తమ వ్యాపారాలను జోరుగా కొనసాగిస్తున్నారు. పెద్దల ఆస్తి అంటూ అమ్మేస్తున్నారు ప్రకృతి సిద్ధంగా ఉన్న పెన్నా నదిని కొంతమంది అక్రమార్కులు తమ పెద్దల ఆస్తి అని చెబుతూ సరిహద్దులు పెట్టి సెంటు భూమిని రూ.లక్షలకు విక్రయిస్తున్నారు. కొనుగోలు చేసినవారు ఆ భూమిని నాపనాళ్ల గనుల కోసం ఇతరులకు లీజుకు ఇచ్చేస్తున్నారు. ఇలా జమ్మలమడుగు, మోరగుడి, దొమ్మరనంద్యాల, వేపరాల, పొన్నతోట ప్రాంతాల్లో దాదాపు 60 గనులను పెన్నానదిలో ఏర్పాటు చేశారు. నిత్యం భారీగా నాపరాళ్లను భూగర్భంలో నుంచి తీసుకుని అమ్ముకుంటున్నారు. రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. ఇలా అక్రమ వ్యవహారం బహిరంగంగానే జరుగుతున్న పట్టించుకునే అధికారులు కరువయ్యారు. అక్రమార్కుల కారణంగా పెన్నానది పూర్తిగా గుంతలమయం అయిపోయింది. ఇదే అదనుగా మరికొంతమంది పెన్నా నడిబొడ్డులో చదును చేసి వ్యవసాయ భూములుగా మార్చుకున్నారు. ఇంత జరుగుతున్నా సరే మైనింగ్ అధికారులు ఏడాదికి ఒక్కసారైన దాడులు చేసిన దాఖలాలు లేవు. ఒకవేళ వచ్చిన పెన్నానదిలో మైనింగ్ చేసుకునే అక్రమార్కులతో సంబంధాలు ఉన్నాయని, దాడులకు వచ్చేముందు సమాచారం ఇచ్చి వస్తారని స్థానికంగా ప్రచారం ఉంది. తమ దృష్టికి వచ్చింది: పెన్నానదిలో అక్రమార్కులు గనులు చేసుకుంటున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చింది. దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నదిలో జరుగుతున్న అక్రమ గునులను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. –బి.చంద్రశేఖర్రెడ్డి,తహసీల్దార్, జమ్మలమడుగు -
ఈతకు వెళ్లి యువకుడి మృతి
నెల్లూరు రూరల్ : సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు మృతిచెందిన ఘటన పెన్నానది వారధి వద్ద చోటుచేసుకుంది. రూరల్ పోలీసుల కథనం మేరకు.. కోవూరు మండలంలోని మోడెగుంటకు చెందిన చిన్నయ్య కుమారుడు భీమతాటి శివకిషోర్(26)బీటెక్ పూర్తిచేశాడు. మరో 20రోజుల్లో సింగపూర్లో ఉద్యోగ నిమిత్తం వెళ్లాల్సి ఉంది. బుధవారం మధ్యాహ్నం పెన్నానదికి ఈతకొట్టేందుకు వెళ్లాడు. అక్కడ నుంచి అతని స్నేహితుడు దిలీప్కు ఫోన్ చేసి ఈతకు రావాల్సిందిగా కోరాడు. అయితే తను రావడం ఆలస్యమవుతుందని అతను సమాధానం ఇచ్చాడు. దీంతో శివకిషోర్ తన దుస్తులను, బైక్ను, పర్స్ను పక్కన పెట్టి ఒక్కడే ఈతకు వెళ్లాడు. కొంత సేపటికి అతని స్నేహితుడు దిలీప్ వచ్చి చూడగా శివకుమార్ ఆచూకి కనిపించలేదు. పెన్నానదిలో గల్లంతై ఉంటాడని అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. గజ ఈతగాళ్లతో పోలీసులు గురువారం మృతదేహన్ని వెలికితీశారు. ఘటన స్థలాన్ని రూరల్ ఎస్ఐ రామ్మూర్తి పరిశీలించారు. మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం నెల్లూరులోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేశారు. -
తొలికాంతి.. సంక్రాంతి
ఆరుబయట చలిమంటలు.. వాకిళ్లలో ముగ్గులు.. వాటిపై గొబ్బెమ్మలతో ఆడపిల్లల ఆనందం.. ఆకాశంలో పతంగులతో అబ్బాయిల ఉత్సాహం.. గంగిరెద్దుల ఆటలను చూసి పిల్లల కేకలు.. ఈ సంబరాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు.. మరోవైపు వంటింట్లోంచి నోరూరించే వంటల ఘుమఘుమలు.. బోగిపండ్లు.. బొమ్మలు కొలువులు! మొత్తంగా ఇవి సంక్రాంతి తెచ్చే ఆనందాల కాంతులు. నెల్లూరు(సెంట్రల్): తెలుగు వారి పెద్దపండుగైన సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. కొత్త అల్లుళ్ల రాకలు, బంధువుల సందడితో వాతావరణం పేరుకు తగ్గట్లే పెద్ద గానే ఉంటుంది.పల్లెల్లో అయితే చెప్పనక్కర్లే దు. పండుగకు వారం రోజుల ముందే పిండివంటల తయారీ మొదలెట్టి పూర్తిచేశారు. పట్టణాల బాట పట్టినవారు సైతం సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చేస్తున్నారు. గంగిరెద్దులవారు, బుడబుడకల సందడి..యువత ఆటలు, కేరింతల సవ్వడి.. పల్లె, పట్నం తేడా లేకుండా కనిపిస్తోంది. అపార్ట్మెంట్ వాసులందరూ కలిసి కులమతాలకు అతీతంగా పండుగను జరుపుకుంటున్నారు. ఇక నెల్లూరు పట్టణంలోని పెన్నా నదిలో గత కొన్ని సంవత్సరాలుగా ఏటి పండుగను నిర్వహిస్తున్నారు. గాలి పటాల పండుగను కూడా చేసుకుంటారు. సంక్రాంతి రోజు జిల్లాలోని అన్ని ప్రముఖ దేవాలయాల లోని దేవతామూర్తుల విగ్రహాలను పెన్నా నది ఒడ్డుకు తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడకు వచ్చిన వారికి తీర్థప్రసాదాలు అందచేస్తారు. ఈ వేడుకను చూడటానికి నగరం చట్టుపక్కల వారు కూడా వస్తుంటారు. ఇక పోతే సూళ్ళూరుపేట, నాయుడుపేటలలో మాత్రం కాళంగి నది, స్వర్ణముఖి నదిలో ఏటి పండుగను ప్రజలు జరుపుకుంటారు. కోవూరులో గత 25 సంవత్సరాలుగా వస్తున్న ఎడ్ల పందాలు ప్రత్యేకం. మన జిల్లా నుంచే కాకుండా పక్కనే ఉన్న ప్రకాశం జిల్లా నుంచి కూడా ఈ పందేలు చూడటానికి వస్తుంటారు. అందుకే తెలుగు లోగిళ్లకు తొలికాంతి అయిన సంబరాల సంక్రాంతిని అందరూ ఆనందంగా జరుపుకుంటారు. సంక్రాంతి అంటే.. సంక్రాంతి అంటే పురాణాల సాక్షిగా సంక్రమణం. అంటే మార్పు చెందడం. సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. ఎందుచేతనంటే సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశిస్తాడు. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో మకర సంక్రాంతి రోజున, సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. అందుకే ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతన్నల కళ్ళల్లో విరిసే కోటి కాంతు లతో, అనందాల కోలాహలంతో, ఈ పండుగను మూడు రోజులు చేసుకోవడం ఆచారం. అందుకే దీనిని పెద్ద పండుగ అని కూడా పిలుస్తారు. భోగిభాగ్యాలు మూడు రోజుల పండగలో మొదటిగా భోగ భాగ్యాలను ఇచ్చే భోగి. ఈరోజు అందరూ భోగి మంటలతో ఉల్లాసంగా గడుపుతారు. అందరూ ఉదయాన్నే లేచి ఎముకలు కొరికే చలిని తరిమేయడానికి పాతవస్తువులు అన్నీ సమకూర్చి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా వాటిని భోగి మంటల్లో మంట పెడుతూ చల్లని ఆ చలిలో వెచ్చదనాన్ని ఆస్వాదిస్తారు. ఇక సాయంత్రం వేళ, బొమ్మల కొలువులతో, చాలా ఇళ్ళలో చిన్నపిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శిస్తూ ఆనందంగా, ఉల్లాసంగా అడుతూపాడుతూ గడుపుతారు. ఇక భోగిపళ్ళ పేరంటాలైతే అందరూ సమావేశమై రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణేలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. సంప్రదాయానికి ప్రతీక మకర సంక్రాంతి రెండవ రోజు. ఈరోజు తెల్లవారగానే పాలు పొంగించి, కొత్త బట్టలు వేసుకుని, రుచికరమైన పిండి వంటలు తింటూ, సంతోషంగా గడుపుతూ ఈ పండుగను ఆస్వాదిస్తారు, మరో ప్రత్యేకత ఏమిటంటే సంక్రాంతి రోజులలో మనం చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనం ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు. మరో ఆనందమైన, అలరించే విషయం ఏమిటంటే ఈ రోజున ‘హరిలో రంగ హరీ’ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు తొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమై సందడి చేస్తాడు. పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తూ సరదాగా గడుపుతారు. రథం ముగ్గు, రంగ వల్లులతో ఇంటి ముంగిళ్ళు కళకళలాడతాయి. అయితే ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. అన్నదాతకు కొత్తకళ సంక్రాంతి పండుగ మూడవ రోజు చివరిదైన కనుమ రోజు. ఇళ్ళన్నీ అందమైన ముగ్గులతో శోభిస్తూ, అందరికి ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలని అందరూ కోరుకుంటారు, ఈరోజు ఆడపిల్లలకు ప్రత్యేకమైన రోజు. ఈరోజు ఆడ పిల్లలందరు గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మ అంటే గోపిబొమ్మ. అంటే కృష్ణుని భక్తురాళ్ళు అని అర్థం. వీటి చుట్టూ తిరుగుతూ పాటలుపాడుతూ నృత్యం చేస్తూ కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తుంటారు. -
విహారం... విషాదం
• పెన్నాలో ఇద్దరు గల్లంతు • మరో ఇద్దరిని కాపాడిన ఓ యువకుడు విహారం విషాదాన్ని నింపింది... సరదా కోసం ఈతకెళ్లిన వారు తిరిగిరాని లోకానికి వెళ్లారు... జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పెన్నాలో ఇద్దరు గల్లంతయ్యారు... చెన్నూరు పరిధిలోని నదిలో మొదట ముగ్గురు మునిగిపోగా, ఇద్దరిని ఓ యువకుడు కాపాడారు.. ఒకరు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు... సిద్దవటం వద్ద నదిలో ఓ యువకుడు ఈత కొడుతూ మునిగిపోయాడు. కర్నూలు నుంచి వలస వచ్చి... చెన్నూరు: పొట్టకూటి కోసం వలస వచ్చి బేల్దారి పని చేసుకుంటూ జీవించే వారికి విహారం, విందు.. వేదన మిగిలించాయి. పెన్నా నదిలో అందరూ చూస్తుండగానే ముగ్గురు మునిగిపోగా.. ఇద్దరిని ఓ యువకుడు కాపాడగా, ఒకరు గల్లంతైన సంఘటన ఆదివారం చెన్నూరు సమీపంలోని కొండపేట వంతెన వద్ద చోటు చేసుకుంది. వారి బంధువులు, ఎస్ఐ వినోద్కుమార్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నారుు. కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచగరి గ్రామానికి చెందిన వడ్డె రామయ్య కుమారుడు రాముడు అలియాస్ బజారి(25) బేల్దారి పని చేస్తూ జీవించే వాడు. అతని కుటుంబంతోపాటు అదే మండలానికి చెందిన కొందరు యువకులు కడప రవీంద్రనగర్లో ఇల్లు అద్దెకు తీసుకొని బేల్దారి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో చెన్నూరులోని ఏటిగడ్డ వీధిలో మస్తాన్ ఇంటి నిర్మాణాన్ని అదే మండలానికి చెందిన 12 మంది యువకులు ఇటీవల పూర్తి చేశారు. వారికి ఆదివారం మధ్యాహ్నం మస్తాన్ విందు ఏర్పాటు చేశాడు. విందు అయ్యాక అందరూ కలిసి సరదాగా పెన్నానదిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. వారిలో రాముడుతోపాటు రంగేష్, సురేష్ అనే యువకులు నది లోపలికి వెళ్లడంతో కొట్టుకుపోతుండగా.. అక్కడే ఉన్న సురేష్కుమార్ ఇద్దరిని కాపాడాడు. రాముడును కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ.. వేగంగా వస్తున్న జల ప్రవాహానికి మునిగిపోరుు గల్లంతయ్యాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు, బందువులు సంఘటనా స్థలానికి చేరుకుకున్నారు. వారు తెలపడంతో పోలీసులు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో ఇప్పుడు సాధ్యం కాదని, సోమవారం జాలర్లను పిలిపించి గాలింపు చర్యలు తిరిగి చేపడతామని ఎస్ఐ వినోద్కుమార్ తెలిపారు. రోదిస్తున్న బంధువులు, స్నేహితులు గల్లంతైన రాముడుకి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోగా భార్య జానకి(22) ప్రస్తుతం గర్భవతి. ‘కూలి పనులు చేసుకునేందుకు ఇక్కడికి వచ్చి మృత్యువాత పడ్డావా నాయనా’ అంటూ తల్లిదండ్రులు, అక్క, బంధువులు, స్నేహితులు నది వద్ద రోదించడం అందరిని కలిచి వేసింది. కడప నుంచి వచ్చి.. సిద్దవటం: సిద్దవటం వద్ద ప్రవహిస్తున్న పెన్నాలో ఓ యువకుడు గల్లంతయ్యాడని ఎస్ఐ అరుణ్రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నారుు. కడప నగరంలోని ఇందిరా నగర్కు చెందిన వై.రామాంజనేయులు (22) ఆదివారం స్నేహితులతో కలిసి వచ్చి నదిలో ఈత కొట్టాడు. లోతుగా వున్న ప్రాంతంలోకి వెళ్లడంతో నీటిలో కొట్టుకు పోయాడు. ఈ సమాచారం తెలియడంతో పోలీసు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. రామాంజనేయులు ఎక్కడా కన్పించలేదని ఎస్ఐ అన్నారు. -
కొనసాగుతున్నగాలింపు చర్యలు
సిద్దవటం : సిద్దవటం పెన్నానదిలో కొట్టుకుపోయి యువకుని కోసం పోలీసులు, ఈతగా ళ్లు సోమవారం గాలింపు చర్యలు చేపట్టారు. కడప నగరం ఇందిరానగర్కు చెందిన ఎనమ ల రామాంజనేయులు (22) అనే యువకుడు ఆదివారం మçధ్యాహ్నం సిద్దవటంలోని లోలెవెల్ కాజ్వే వద్దకు వచ్చి నీటిలో ఈత కొ డుతూ పెన్నాలో గల్లంతైన విషయం తెలిసిం దే. ఆదివారం రాత్రి, సోమవారం పెన్నానీటిలో ఇరువైపులా గాలింపు చర్యలు చేపడు తూ వెలుగుపల్లె గ్రామం దాటుకుని పెన్నానదిలో వెతికామని ఎస్ఐ అరుణ్రెడ్డి తెలిపారు. తర్వాత ఎక్కడైనా ఇరుక్కుని ఉంటాడనే ఉద్దేశంతో బోటులో వెళ్లి కూడా గాలింపు చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. -
విచార వదనం
చెన్నూరు : పెన్నానదిలో గల్లంతైన వడ్డె రాముడు(25) కోసం సోమవారం గాలింపు చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లా ఆ దోని మండలం బైచగరికి చెందిన రాముడు కొండపేట వంతెన వద్ద ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. విష యం తెలుసుకొన్న ఆయన బంధువులు, గ్రామస్తులు సోమవారం పెద్ద ఎత్తున వంతెన వద్దకు వచ్చారు. యువకులు నది వెంట గాలింపు చర్యలు చేపట్టారు. వంతెన వద్దే తిండి తిప్పలు లేక విచార వదనంతో ఉన్న వారికి కొండపేటకు చెందిన దా త భోజనం ఏర్పాటు చేశారు. నది వెంట ఎంతగా గాలించినా ఫలితం లేదని బాధితులు వాపోయారు. పోలీసులు గాలింపు చర్యలకు సహకరించలేదని, తాము స్టేషన్ వద్దకు వెళ్లినా పట్టించుకోలేదంటూ వా రు వాపోయారు. సోమవారం రాత్రి 8 గంటల వరకు బాధిత కుటుంబం, బం ధువులు వారి పిల్లలు, మహిళలు రోదిస్తూ వంతెనపైనే ఉన్నారు. ఈ విషయంపై ఎస్ఐ వినోద్కుమార్ మాట్లాడుతూ తాము జాలర్లను పిలిపించి, వెతికించామని రాత్రి 7 గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి 10 మందిని జాలర్లతో వెతికిస్తామని చెప్పారు. -
పెన్నాలో మునిగిన యువకుడు
రక్షించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నెల్లూరు(క్రైమ్) : బహిర్భూమికి వెళ్లిన ఓ యువకుడు మంగళవారం పెన్నానదిలో మునిగిపోయాడు. ఈవిషయంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతికష్టంపై సదరు యువకుడిని రక్షించారు. వివరాలు.. బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన బొల్లేపల్లి శ్రీనివాసులు నెల్లూరు ఆటోనగర్లో మెకానిక్గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం అతను పెన్నానది వద్ద బహిర్భూమికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవడంతో స్థానికులు గమనించి మూడోనగర పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మూడోనగర ఎస్ఐ రామకృష్ణ, నెల్లూరు అగ్నిమాపక కార్యాలయ అధికారి పి.శ్రీనివాసరావు తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన పెన్నానదికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది రోప్ల సహాయంతో నీటిలో దిగి నీటమునిగిన శ్రీనివాసులను అతికష్టంపై రక్షించారు. అప్పటికే అతను నీరు తాగివేయడంతో అతనికి ప్రథమచికిత్స చేశారు. శ్రీనివాసులను రక్షించిన మూడోనగర ఎస్ఐ, అగ్నిమాపక అధికారి, అగ్నిమాపక సిబ్బంది రియాజ్, జె.వెంకటేశ్వర్లు, పి.మధు, రాజేష్లను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. -
పెన్నానదిలో గుర్తుతెలియని మృతదేహం
నెల్లూరు (క్రైమ్): రంగనాయకులపేట పొర్లుకట్ట పినాకిని పార్కు సమీపంలోని పెన్నానదిలో బుధవారం గుర్తుతెలియని(30) మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వీఆర్వో కాకి భాస్కర్కు సమాచారం అందించారు. ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని మూడో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెడ్కానిస్టేబుల్ బీవీ నరసయ్య స్థానికుల సహాయంతో మృతదేహాన్ని నదిలో నుంచి వెలికితీయించారు. మృతుడు బులుగు రంగు జీన్స్ ఫ్యాంటు, గోధుమ రంగు చొక్కా ధరించి ఉన్నాడు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉబ్బిపోయి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెన్నాలో పడి వృద్ధుడి మృతి
నజీర్భేగ్పల్లె(చెన్నూరు) : గుర్రంపాడు పంచాయతీకి చెందిన వీరబోయిన వెంకటసుబ్బయ్య(80) పెన్నా నదిలో పడి మృతి చెందినట్లు హెడ్కానిస్టేబుల్ శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు. ఆ వృద్ధుడికి మతి స్థిమితం లేదని, 10 రోజులుగా కనిపించకపోవడంతో పరిసరాల్లో గాలించినా ఫలితం లేకపోయిందని కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారని ఆయన పేర్కొన్నారు. శనివారం నజీర్భేగ్పల్లె దళితవాడ ప్రజలు పెన్నా సమీపంలోకి వెళ్లగా.. నదిలోని కంప చెట్ల మధ్యన మృతదేహం ఉండటంతో బయటకు తీసుకొచ్చి ఖననం చేశారని వివరించారు. -
నిమజ్జనంలో అపశృతి... బాలికమృతి
సిద్దవటం: సిద్దవటంలోని పెన్నానదిలో బుధవారం రాత్రి వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. చంద్రిక(6) అనే బాలిక పెన్నా నీటిలో మునిగిపోయి మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. కడపలోని కొండాయపల్లెలో ఏర్పాటు చేసిన వినాయకుడిని బుధవారం సాయంత్రం నిమజ్జనం చేసేందుకు పెన్నానదికి వెళ్లారు. గ్రామానికి చెందిన ఆకుల కిశోర్బాబు, చంద్రకళ అనే దంపతులు తమ పిల్లలు చంద్రిక, గీతా అన్వితా లను వెంట తీసుకెళ్లారు. విగ్రహాన్ని పెన్నాలో నిమజ్జనం చేసిన తరువాత గ్రామస్తులందరూ పెన్నానీటిలో స్నానానికి వెళ్లారు. కిశోర్బాబు దంపతులు కూడా తమ ఇద్దరి పిల్లలను నది ఒడ్డున ఉంచి స్నానానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి పెద్దకుమార్తె చంద్రిక కనిపించలేదు. దీంతో నది పరిసర ప్రాంతాలలో, సిద్దవటం గ్రామంలో గాలించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా గాలించారు. ఎక్కడా కనిపించలేదు. గురువారం ఉదయం పెన్నానది కొత్తబ్రిడ్జికి తూర్పువైపు బాలిక చనిపోయి ఉందని ఎస్ఐ లింగప్పకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఆయన తమ సిబ్బందితో వెళ్లి మృత దేహాన్ని పరిశీలించి తల్లిదండ్రలకు సమాచారం ఇచ్చారు. దీంతో మృతిచెందిన చంద్రికను చూసి కుటుంబీకులు, బంధువులు బోరున విలపించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్కు తరలించి కేసు నమోదుద చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు అన్నారు. -
దేవుడా..
సాక్షి, కడప/చెన్నూరు : గంట కాదు....అరగంట కాదు....ఏకంగా ఆరు గంటలు...ద్వీపంలా చుట్టుముట్టిన నీరు....కదలడానికి లేదు...తినడానికి లేదు...పశువులు, గొర్రెలు, మేకలతో కలిసి 13 మంది కాపరులు పడిన వేదన అంతా ఇంతా కాదు....ఇక బ్రతుకుతామన్న ఆశ ఎంతమాత్రం లేదు....గంట గంటకు పెరుగుతున్న నీటితో గుండెలోతుల్లో తెలియని అలజడి....చుట్టుముట్టుతున్న నీటితో అనుక్షణం ఊపిరి బిగపట్టుకుని....ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వారు చేస్తున్న ఆర్తనాదాలు...హాహాకారాలు అందరినీ కదిలిస్తున్నా అధికారులను కదిలించలేదు...... జనాలకు, నదిలో ఉన్న బాధితులకు సుమారు అర కిలో మీటరు మేర ఎడబాటు ఉన్నా ఎట్టకేలకు సాయంత్రానికి తెప్పల ద్వారా బయటికి రావడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నూరు మండలం కొక్కరాయపల్లెకు చెందిన సుమారు 13 మంది గొర్రెలు, మేకలను, పశువులను కాసేందుకు వాటిని తోలుకుని నదిలోకి వెళ్లారు. అయితే ఉదయం 120 క్యూసెక్కుల నీటి ప్రవాహం మాత్రమే ఉండడంతో ప్రభావం ఎంతమాత్రం లేదు. దీంతో మధ్యాహ్నం వరకు మేపుకుంటున్న కాపరులకు ఒక్కసారిగా ఎగువ నుంచి వస్తున్న నీటితో అలజడి మొదలైంది. మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో నీటి ప్రవాహాన్ని అంచనా వేసిన కాపరులంతా బయటికి వెళ్లాలని నిర్ణయించుకుని స్పీడుగా నడక ప్రారంభించారు. అయితే నది మధ్యలోకి రాగానే గొంతు వరకు నీరు వచ్చి చేరడంతో బెదిరిపోయారు. అడుగు ముందుకేస్తు కొట్టుకుపోయే ప్రమాదం ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గడ్డమీదికి చేరారు. ఐదారు గంటలపాటు నది మధ్యలో... మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నది మధ్యలో కాపరులు భయాందోళనల మధ్య కాలం వెళ్లదీశారు. ముందుకు వెళ్లలేక, వెనక్కి అడుగు వేయలేక....ధైర్యం చేసి పశువుల తోకలు పట్టుకుని కొంత ప్రయత్నం చేసినా పెద్ద ఎత్తున వస్తున్న వరద నీరు కొట్టుకుపోయే అంతటి ఉధతి ఉండడంతో వెనక్కి తగ్గారు. ఒంటి గంట ప్రాంతం నుంచి సుమారు సాయంత్రం 5.30 గంటల వరకు నది మధ్యలోనే బ్రతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీశారు. మహిళలు, పురుషులతో కలిపి 11 మంది ఒక ప్రక్క, చెన్నూరు బ్రిడ్జికి మరోప్రక్క ఇద్దరు కలుపుకుని మొత్తం 13 మంది నరకం అనుభవించారు. కాపాడటానికి జనాలు విశ్వప్రయత్నాలు చేసినా నది మధ్య కావడంతో ధైర్యం చేయడానికి ఎవరూ ముందడుగు వేయలేదు. దాదాపు ఐదారు గంటలపాటు నదిలోనే వారు ప్రాణభయంతో గడిపారు. వెంటనే స్పదించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ ఒకప్రక్క ఖాజీపేట మండలంలో సుమారు ఎనిమిది మందిని పెన్నానది నుంచి కాపాడటమే కాకుండా మరోప్రక్క చెన్నూరు బ్రిడ్జి సమీపంలో నది మధ్యలో ఇరుక్కుపోయిన 13 మందిని కాపాడటంలో జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణతోపాటు ఎస్పీ పీహెచ్డీ రామకష్ణ ప్రత్యేక కషి చేశారు. విషయం తెలియగానే తన సిబ్బందిని పంపి సహాయక చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా తెప్పలు తెప్పించి బాధితులను బయటికి రప్పించడంతోపాటు గొర్రెలు, మేకలు, లేగదూడలను కూడా పడవ ద్వారా బయటికి తీసుకొచ్చారు. ఎస్పీ రామకష్ణ చెన్నూరు బ్రిడ్జి వద్దనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. బ్రిడ్జి వద్ద డీఎస్పీ ఈజీ అశోక్కుమార్, ఆర్డీఓ చిన్నరాముడు, సీఐ సదాశివయ్యతోపాటు ఎస్ఐ హుసేన్లు అక్కడికక్కడే ప్రత్యేక చర్యలు చేపట్టడంతోపాటు బ్రిడ్జిపై ట్రాఫిక్ స్తంభింవకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. సంఘటనా స్థలంలో ఎమ్మెల్యే రవిరెడ్డి నది ప్రవాహంలో సుమారు 13 మంది బాధితులు చిక్కుకున్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి నేరుగా చెన్నూరులోని బ్రిడ్జి వద్దకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రత్యేకంగా అంతకుముందే జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ, ఎస్పీ పీహెచ్డీ రామకష్ణలతో రవిరెడ్డి చర్చించారు. సహాయక చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను కోరారు. నది మధ్యలో ఉన్న బాధితులతో కూడా సెల్ఫోన్లో మాట్లాడి ధైర్యంగా ఉండాలని....బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారికి ధైర్యం చెప్పారు. బ్రిడ్జి వద్దనే చాలాసేపు ఎమ్మెల్యే గడిపారు. అలాగే సంఘటన ప్రాంతానికి టీడీపీ నాయకులు పుత్తా నరసింహారెడ్డి, రెడ్యం వెంకట సుబ్బారెడ్డిలు కూడా చేరుకున్నారు. బయట పడతామనుకోలేదు అసలు ఊహించలేదు....నది ప్రవాహం చూసి బయటికి వద్దామనుకుని పరిగెత్తాం....గస వస్తున్నా ఆపుకుని అడుగులు వేసినా వరద చుట్టుముట్టింది. గుండె దాటి గొంతు వద్దకు వస్తూనే ఇక తట్టుకోలేం...ప్రవాహంలో కొట్టుకుపోతామని వెనుకడుగు వేశాం....ప్రాణాల మీద అయితే ఆశలేదుగానీ కాకపోతే గట్టుమీద ఉంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయకపోతారా అని ఆశగా ఎదురుచూస్తూ దేవుడిని మొక్కుకున్నాం. మా మొక్కు దేవుడు విన్నాడో...ఏమో తెలియదుగానీ సాయంత్రానికి పడవల్లో బయటికి చేర్చడంతో పునర్జన్మ లభించినట్లుంది. ఊహించని విధంగా బయటపడ్డాం. ఒక విధంగా చెప్పాలంటే చచ్చిబ్రతికామంటూ బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. వరద నీరు ముంచెత్తుంటే.... మంగళవారం ఉదయం నుంచి 120 క్యూసెక్కుల చొప్పున నదిలో కనిపించిన నీరు మధ్యాహ్నానికి అమాంతం పెరిగిపోయింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత సుమారు ఏడు వేల క్యూసెక్కులకు పైగా పారుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రవాహం గంటగంటకు వేల క్యూసెక్కులకు పెరుగుతూ రావడంతో ప్రమాదం ఏర్పడింది. సాయంత్రం 3–4 గంటలకల్లా సుమారు 30 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహానికి చేరుకోవడంతో చుట్టూ వరద పోటెత్తింది. అయితే ఆపైన నీటి ప్రవాహం పెరగకపోవడంతోనే బాధితులు ప్రాణాలతో బయటపడగలిగారు. అదే ప్రవాహం సాఫీగా సాగడంతో గడ్డమీదికి నీరు చేరలేదు. కనీసం కొన్ని క్యూసెక్కులు పెరిగినా....వరుణుడు ఆగ్రహించినా....చివరికి చెరువులు తెగినా కూడా ఇబ్బందికర పరిస్థితి తలెత్తేదని పలువురు అధికారులు స్పష్టం చేశారు. నది మధ్యలోనే పశువులు నది మధ్యలో ప్రవాహం ఉధతంగా ఉండడంతో గట్టుమీదనే పశువులు ఉండిపోయాయి. సుమారు 18 మేకలు, గొర్రెలు ఉండగా, వాటిని సాయంత్రం పోలీసులు ప్రత్యేక పడవలో ఎలాగోలా తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు. కొన్ని దూడలను కూడా తీసుకొచ్చారు. అయితే సుమారు 20కి పైగా పశువులు..వాటి లేగ దూడలను రక్షించడానికి ప్రయత్నించగా కష్టం కావడంతో ప్రస్తుతం నది మధ్యలోనే పశువులు ఉండిపోయాయి. అయితే ప్రస్తుతానికి నీటిమట్టం తగ్గుతోందని, తద్వారా ఉదయానికి పశువులు బయటికి వచ్చే అవకాశం ఉందని కడప అర్బన్ సీఐ సదాశివయ్య ‘సాక్షి’కి తెలియజేశారు. అయితే చెన్నూరులోని గాంధీనగర్కు చెందిన దేవరాజు పశువులు మాత్రం నదిలో కొట్టుకపోయాయి. భారీగా తరలివచ్చిన జనం ఊహించని రీతిలో కర్నూలుజిల్లాలో కురిసిన వర్షాలకు ఒక్కసారిగా పెన్నానదికి వరద నీరు పోటెత్తింది. దీంతో ఊహించని పరిస్థితి ఏర్పడి నది మధ్యలో బాధితులు ఇరుక్కుపోవడంతో సంబంధిత గ్రామాల ప్రజలతోపాటు ప్రయాణీకులు ఉత్కంఠతో ఎదురుచూశారు. సెల్ఫోన్లతో ఫోటోలు తీస్తూ....నీటి ప్రవాహం పెరుగుతున్న నేపధ్యంలో ఆందోళన చెందుతూ కనిపించారు. చెన్నూరు బ్రిడ్జి వెంబడి ఇటువైపు నుంచి అటువైపు వరకు మొత్తం జనాలతో రద్దీ ఏర్పడింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకప్రక్క వాహనాలు వెళ్లడానికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. 21 మందిని రక్షించాం : ఎస్పీ రామకృష్ణ జిల్లాలోని ఖాజీపేట మండలం కొమ్మలూరు వద్ద సుమారు 9 మంది, చెన్నూరు వద్ద కొక్కరాయపల్లెకు చెందిన 13 మందిని నది నుంచి రక్షించినట్లు జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకష్ణ స్పష్టం చేశారు. రెవెన్యూ, అగ్నిమాపక, మత్స్యశాఖతోపాటు పోలీసుశాఖ సంయుక్త సహకారంతో వారందరినీ సురక్షితంగా బయటికి చేర్చామని తెలియజేశారు. అంతేకాకుండా పెద్ద స్పీడు పడవలు పనిచేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తెప్పల సాయంతో అందరినీ బయటికి తీసుకొచ్చామని తెలియజేశారు. ప్రత్యేకంగా మత్స్యకారులు, కొంతమంది పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సంరక్షించినందుకుగాను పోలీసుశాఖ తరుపున రివార్డు ఇస్తూనే ప్రభుత్వం తరుపున కూడా రివార్డులు అందించేందుకు కషి చేస్తామన్నారు. మనుషులనే కాకుండా పశువులు, గొర్రెలను కూడా రక్షించేందుకు కషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అధికారులను అప్రమత్తం చేశా : ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి నది మధ్యలో బాధితులు ఉన్నారన్న విషయం తెలియగానే వెంటనే సంబంధిత అ«ధికారులతో మాట్లాడి సహాయక చర్యలకు కషి చేశానని ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి స్పష్టం చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఒక్కసారిగా నీరు రావడంతోనే ప్రమాదం ఏర్పడిందని ఆయన తెలియజేశారు. నది మధ్యలో ఉన్న బాధితులను రక్షించేందుకు అధికారులతో మాట్లాడానని, అంతేకాకుండా బాధితులకు కూడా ఫోన్ చేసి ధైర్యం చెప్పినట్లు రవీంద్రనాథ్రెడ్డి తెలియజేశారు. అంతేకాకుండా ఎస్పీ, కలెక్టర్తో చర్చించి యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కోరినట్లు ఆయన తెలియజేశారు. -
ఉప్పొంగిన పెన్నానది.. చిక్కుకున్న 13 మంది..
వైఎస్ఆర్ జిల్లా: వైఎస్ఆర్ జిల్లాలో పలుచోట్ల కురిసిన భారీ వర్షాలకు పెన్నానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కురిసిన వర్షాల కారణంగా భారీగా వరదనీరు వచ్చి పెన్నానదిలో చేరుతోంది. దాంతో పలు ప్రాంతాల్లోని లోతట్టు గ్రామాల్లో వరదనీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. కాజీపేట మండలం కొమ్మలూరు పెన్నానదిలో నది పరివాహిక ప్రాంత వాసులు 8 మంది చిక్కుకపోగా, చెన్నూరు మండలం కొక్కిరాయిపల్లి పెన్నానదిలో మరో ఐదుగురు చిక్కుకపోయినట్టు తెలుస్తోంది. వరదనీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే కొమ్మలూరు పెన్నానదిలో చిక్కుకపోయిన ఎనిమిది సురక్షితంగా బయటపడ్డారు. కానీ, కొక్కిరాయిపల్లి పెన్నానదిలో చిక్కుకున్న ఐదుగురిలో ఇద్దరిని జాలర్లు కాపాడారు. మిగతా వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
పెన్నాకు పుష్కర శోభ
వల్లూరు: పెన్నా నదికి పుష్కర శోభ వచ్చింది. శ్రీ శైలం నుండి వచ్చిన కృష్ణా నది నీరే మన జిల్లాలోని కుందూ, పెన్నా నదుల్లో ప్రవహిస్తున్న వైనంపై సాక్షిలో వచ్చిన కథనంతో ప్రజల్లో చైతన్యం వచ్చింది. అంతదూరం వ్యయ ప్రయాసలకోర్చి ఇబ్బందులు పడడం కంటే మనకు అందుబాటులో పావన పినాకినీ తీరంలో వున్న పుష్పగిరిని సందర్శించి పెన్నమ్మలో స్నానం చేస్తే ఫలితం వుంటుందని గుర్తించారు. శుక్రవారం ఒక మోస్తారుగా వచ్చిన భక్తులు శనివారం భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వేలాది మంది పుష్పగిరి వద్ద నదిలో స్నానాలు ఆచరించారు. జిల్లాలోని నలుమూలల నుండే కాక అనంతపురం జిల్లా నుండి కూడా తరలి వచ్చారు. కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి, శ్రీ సంతాన మల్లేశ్వర స్వామి ఆలయాల్లో, గ్రామంలోని శ్రీ వైద్యనాథ స్వామి, శ్రీ చక్ర సహిత కామాక్షీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు నది ఒడ్డున ఇసుకతో ∙సైకత లింగాలను చేసి దీపాలను వెలిగించి నదీమ తల్లికి పూజలు నిర్వహించారు. కొందరు తమ పూర్వీకులకు పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆనందంలో భక్తులు: పంచ నదీ సంగమమైన పుష్పగిరి వద్ద గల పినాకినీ నదిలో కృష్ణానది నీరు రావడం భక్తులకు ఆనందదాయకంగా వుంది. కార్తీక, శ్రావణ, మాఘ మాసాలలో, బ్రహ్మోత్సవాల్లో ∙ఇక్కడి నదిలో స్నానాలు ఆచరించి శివ కేశవులను దర్శించుకోవడం వలన సకల పాపాలు నశిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. కృష్ణా పుష్కర నేపథ్యంలో కృష్ణా నది నీరు ఇక్కడ ప్రవహించడం వలన ఈ నీటిలో స్నానాలు మరింత పుణ్య ఫలితాన్ని చేకూరుస్తాయి. –అఖిల్ దీక్షితులు , పుష్పగిరి ఆలయ ప్రధాన పూజారి చాలా సంతోషంగా వుంది: పుష్కర వేళ దక్షిణ కాశీగా పేరు పొందిన పుష్పగిరి వద్ద పెన్నా నదిలో కృష్ణమ్మ నీటిలో స్నానాలు ఆచరించడం చాలా సంతోషంగా వుంది. కుంటుంబంతో కలిసి వచ్చాను. –జయలక్ష్మి, ధర్మవరం, అనంతపురం జిల్లా పుణ్య క్షేత్రాల్లో పుష్కర స్నానం మంచిది: పుణ్య క్షేత్రాల్లో ఆధ్యాత్మిక భావనతో పుష్కర స్నానం చేయడం చాలా మంచిది. మన సాంప్రదాయాలను పాటిస్తూ వాటిని సంరక్షించుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం వుంది. అంత దూరం వెళ్లలేని వారికి పెన్నా నదిలో కృష్ణా జలాల్లో పుష్కర స్నాన అవకాశం లభించడం ఎంతో సంతోషాన్నిస్తోంది. –రవి శంకర్, డీఎఫ్వో , ప్రొద్దుటూరు. -
పెన్నా నదికి హారతి
-
పెన్నా నదిలో ఈతకెళ్లి ముగ్గురు బాలురు దుర్మరణం
సిద్దవటం : వైఎస్సార్ జిల్లా సిద్దవటం మండలం మాచుపల్లె సమీపంలోని పెన్నా నదిలో ఆదివారం ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. కడప నగరం బెల్లంమండి వీధికి చెందిన షేక్ సోహేల్ (11), రామాంజనేయపురం గ్రామంలోని దండోరా కాలనీకి చెందిన రాయపాటి లక్ష్మికాశీ(9), రాయపాటి కిరణ్(10)తో పాటు మరో ముగ్గురు బాలురు వారి పెద్దలతో కలిసి ఆదివారం మాచుపల్లె దర్గా వద్దకు చేరుకుని మధ్యాహ్నం అక్కడే భోజనం చేశారు. అనంతరం సరదాగా ఈత కొట్టేందుకు సమీపంలో ఉన్న పెన్నానది వద్దకు వెళ్లారు. నీటిలోకి దిగి ఈత కొడుతుండగా గతంలో ఇసుక కోసం తీసిన గోతులు ఉన్న విషయం తెలియక ఆ ప్రాంతానికి వెళ్లిన ఆరుగురు బాలురు మునిగిపోయారు. దీన్ని గమనించిన స్థానికులు, కుటుంబీకులు వెంటనే నీళ్లలోకి దిగి ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరో ముగ్గురు బాలురను కూడా ఒడ్డుకు తీసుకురాగా వారు అప్పటికే మృతి చెంది ఉన్నారు. వెంటనే మృతదేహాలను కడప రిమ్స్కు తరలించారు. పోలీసులను రిమ్స్కు పంపి సమాచారం తెలుసుకున్నట్లు ఒంటిమిట్ట సీఐ శ్రీరాములు, సిద్దవటం ఎస్ఐ లింగప్ప తెలిపారు. కళ్లముందు ఆనందంగా కనిపించిన కొద్ది క్షణాల్లోనే విగతజీవులుగా మారడంతో వారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. -
పెన్నానదిలో ఈతకెళ్లి ముగ్గురి మృతి
-
పెన్నానదిలో ఈతకెళ్లి ముగ్గురి మృతి
సిద్ధవటం మండలం మాచుపల్లె వద్ద పెన్నానదిలో ఈతకెళ్లి ముగ్గురు మృతిచెందారు. వివరాలు..ఇటీవల కురిసిన వర్షాలకు పెన్నానదిలో నీటి ప్రవాహం పెరగడంతో సరదాగా ఐదుగురు స్నేహితులు పెన్నానదిలో ఈతకు వెళ్లారు. ఈ ఐదుగురు నీటిలోకి దిగిన అనంతరం నీటి ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయారు. ఈ దశలో వీరి అరుపులు విన్న సమీప పొలాల్లోని రైతులు ఇద్దరు యువకులను కాపాడగలిగారు. ముగ్గురు మాత్రం నీటిలో మునిగిచనిపోయారు. మృతులు కడప నగరానికి చెందిన వారిగా భావిస్తున్నారు. మృతిచెందిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇసుక రవాణాపై కన్నెర్ర చేసిన రైతులు
-పావగడ, పెనుకొండ ప్రధాన రహదారిపై 2 గంటలు ధర్నా రొద్దం (అనంతపురం) పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి ఇసుక అక్రమంగా తలిస్తే తాము ఊరుకోమని పలువురు రైతులు ఇసుక రవాణాపై అన్నెర్ర చేశారు.కర్నాటక,ఇతర ప్రాంతాలకు భారీ తరులుతున్న అక్రమ ఇసుక రవాణ అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం మండల కేంద్రంలోని పెద్దాంజనేయస్వామి దేవాలయం వద్ద పావగడ-పెనుకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ప్రధాన రహదారిపై రెండు గంటల పాటు ఆందోళన జరగడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ సునీత్కుమార్ రోడ్డుపై ధర్నా చేయడం వల్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని రైతులు వేంటనే రోడ్డుపై విరమించాలని కోరారు. ట్రాక్టర్లు ఇసుక తరలిస్తున్నయని చెప్పినప్పుడు స్పందించరా అంటూ ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. రైతులు వీరాంజినేయులు,లక్ష్మినారాయణరెడ్డి,సనావుల్లా,సీపీఐ నాయకులు బాబా,సీపీఎం నాయకులు ముత్యాలప్ప మాట్లాడుతూ ఇసుక రవాణా దారులపై చర్యలు తీసుకుంటనే ధర్నా విరమిస్తామని బీస్మించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై తప్పక చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.ధర్నా చేస్తున్న రైతులను ఓక్రమంలో బలవంతగాంగా తరలించడానికి పోలీసులు ప్రయత్నించారు. డీఎస్పీ సుబ్బారావు,సీఐ వెంకటేశ్వర్లు రొద్దంకు చేరుకుని ఇక్కడ జరిగిన విషయాలపై ఎస్ఐతో ఆరాతీశారు. -
పెన్నానదిలో ముగ్గురి గల్లంతు
పెన్నా నదిలో ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు గల్లంతయ్యారు. వారిలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. నెల్లూరు పట్టణంలోని పెన్నా నదిలో కొవ్వూరుకు చెందిన నలుగురు స్నేహితులు ఈత కొట్టడానికి దిగారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. ముగ్గురు గల్లంతయ్యారు. అందులో పి. వర్షిత్(14) అనే బాలుడి మృతదేహం లభించగా.. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
ఆర్టీపీపీకి ఆగిన నీటి సరఫరా
రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీటి సరఫరా ఆగి పోయింది. విద్యుదుత్పత్తికి బ్రహ్మంసాగర్ నుంచి నీరు సరఫరా చేసే పైపులైన్ ఊహించని రీతిలో దెబ్బతింది. వివరాలివీ.. ఆర్టీపీపీకి బ్రహ్మంసాగర్ నుంచి 68 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మించారు. చాపాడు మండలంలోని కుందూ, ప్రొద్దుటూరు పరిధిలోని పెన్నా నదులపై ఈ పైపులైన్ వస్తోంది. దీని ద్వారా ఆర్టీపీపీకి రోజు 38 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోంది. ఆర్టీపీపీలో 1050 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. గురువారం సాయంత్రం పెన్నానదిలోని పైపులైన్కు సంబంధించి ఎక్స్పాన్షన్ జాయింట్ ఊడిపోయింది. తీవ్ర ఒత్తిడి ప్రభావం కారణంగా ఈ జాయింట్ ఊడిపోయి నీరు పెన్నానదిలోకి చేరింది. దీనిపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. మూడు నాలుగు రోజుల పాటు రాత్రింబవళ్లు పనిచేస్తే తప్ప పైపులైన్ నిర్మాణం యధాస్థితికి రాదని తెలుస్తోంది. -
నది కాదు.. గని!
♦ ఆక్రమణలతో రూపు కోల్పోయిన పెన్నా ♦ రెండున్నర వేల ఎకరాలు కబ్జా ♦ భారీగా గనులు వెలిసినా చోద్యం చూస్తున్న అధికారులు ప్రొద్దుటూరు టౌన్ : ఒకప్పుడు కనుచూపు మేర నీటితో కళకళలాడిన పెన్నా నది ఇపుడు ఆక్రమణలకు గురై రూపు కోల్పోయింది. అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి గండికోట మీదుగా మన జిల్లాలోకి ప్రవేశించే ఈ నది జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, చెన్నూరు మీదుగా సోమశిలలో కలుస్తుంది. కొద్ది సంవత్సరాలుగా భారీ వర్షాలు లేక నీటి పారకం మందగించింది. ఇదే అవకాశంగా ఎక్కడికక్కడ అక్రమార్కులు నదికి ఇరువైపుల నుంచి చొచ్చుకు వస్తూ దర్జాగా ఆక్రమించుకుంటున్నారు. ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే 2653 ఎకరాల ఏటి పోరంబోకు భూమి ఆక్రమణకు గురైంది. పెన్నానదిలో ఎవరు పడితే వారు చదును చేసి వివిధ రకాల పరిశ్రమలు పెడుతున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చి రద్దు చేసిన ఏక్సాల్ పట్టాలను పెట్టుకుని లక్షల రూపాయలకు విక్రయించి మరికొందరు సొమ్ము చేసుకున్నారు. ఏటి పోరంబోకు భూమి వివరాలు ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని చౌడూరు గ్రామానికి సంబంధించి ఏటి పోరం బోకు భూమి 316 ఎకరాలు, పెద్దశెట్టిపల్లె గ్రామంలో 253, దొరసానిపల్లె గ్రామ పరిధిలో 89, రామేశ్వరం పరిధిలో 848, నంగనూరుపల్లెలో 468, కల్లూరులో 679 ఎకరాలు.. మొత్తం 2653 ఎకరాలు ఉంది. ఎర్రగుంట్ల మండల పరిధిలోని పోట్లదుర్తి పరిధిలో 127 ఎకరాలు ఏటి భూమి ఉంది. పెన్నానదిలో నిర్మించిన కళ్యాణ మండపాలు, ఆశ్రమాలు, ఇతర భారీ భవంతుల నిర్మాణాలను అడ్డుకోలేకపోయిన 36 మంది రెవెన్యూ అధికారులకు నోటీసులిచ్చారే కానీ ఆపై ఎలాంటి చర్యలూ లేవు. దీంతో అక్రమార్కులు అధికారులను లోబరుచుకుని యథేచ్ఛగా అనుకున్నట్లు చేసుకుపోతున్నారు. సిమెంట్ బ్రిక్స్ పరిశ్రమలు, నీటి ప్లాంట్లు పెన్నా ఏటి భూముల్లో ఎక్కువగా ఉన్నాయి. బ్రిక్స్ పరిశ్రమలకు పెన్నా నదిలోని ఇసుకనే వినియోగిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తుండగా, ప్లాంట్లు నీటిని తోడేస్తూ భూగర్భ జలాలను మరింత అడుక్కి నెట్టుతున్నాయి. మరి కొందరు ఆక్రమణ దారులు మున్సిపల్ సిబ్బందితో పట్టణంలోని చెత్తను పెన్నానది గని గుంతల్లో పడేయిస్తూ దానిపై మట్టిని తోలి చదును చేస్తున్నారు. పెన్నా నది మధ్య, థర్మల్ రహదారి పక్కనే పెద్ద ఎత్తున మట్టిని వేసి దాదాపు 4 ఎకరాలు చదును చేసినా ఎవ్వరు పట్టించుకోలేదు. ఇదే అదునుగా అక్రమార్కులు కొన్ని చోట్ల ఏకంగా వారు ఆక్రమించిన చోట క ంచె సైతం వేశారు. రాళ్ల గనుల్లోకి రోడ్డు పెన్నానదిలో అక్రమంగా 50 అడుగుల లోతు వరకు రాళ్ల గనులు తవ్వారు. నదిలోకి థర్మల్ రోడ్డు గుండా వెళ్లేందుకు రహదారిని సైతం ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రోజు 50-70కిపైగా ట్రాక్టర్లు రాళ్లను తీసుకెళుతున్నా కూడా అధికారుల్లో చలనం లేదు. ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల పరిధిలో ఉన్న ఏటి భూమి ఆక్రమణలపై ఇటీవల రెవిన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. ఎవరెవరు ఎంతెంత భూములు ఆక్రమించుకున్నారో తెలుసుకున్నారే కానీ వారిపై చర్యలకు ఉపక్రమించడానికి సందేహిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ప్రొద్దుటూరు ఆర్ఐ రామకృష్ణారెడ్డిని వివరణ కోరగా, పెన్నా నది ఆక్రమణలపై సర్వే చేసి ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చే సూచనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. -
ఎండిపోయిన పెన్నా
లింగంపల్లిలో 16 అడుగులకు పడిపోయిన భూగర్భ జల మట్టం కడప నగరంలో తీవ్రతరం కానున్న నీటి ఎద్దడి ఎండిపోయిన పెన్నా కడప కార్పొరేషన్: పెన్నా నది ఎండి పోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో కడప నగరానికి తాగునీటి ఎద్దడి పొంచి ఉంది. అధికమవుతున్న ఎండలకు, వడగాల్పులకు తేమ ఆవిరైపోతోంది. దీంతో నెలకు ముందే మంచి నీటి గండం కడపను పలకరిస్తోంది. కడప నగరానికి ప్రధాన తాగునీటి వనరు అయిన పెన్నానది పూర్తిగా ఎండిపోయింది. ఓ వైపు వర్షాలు కురవక పోవడం, మరోవైపు ఇసుకాసురుల విజృంభిస్తుండటం వల్ల భూగర్భ జలాలు కూడా అదే రీతిలో అడుగంటిపోతున్నాయి. దీంతో నగరంలో పలు ప్రాంతాలు తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. 164 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన కడప నగరంలో 3.40 లక్షల జనాభా ఉంది. తాగునీటి పైపులైన్లు సుమారు 490 కీ.మీల మేర విస్తరించి ఉన్నాయి. 30,600 కొళాయి కనెక్షన్లు ఉన్నాయి. ప్రజలకు తగిన మోతాదులో నీరు సరఫరా చేయాలంటే ప్రతిరోజూ 56.84 ఎంఎల్డీ(మిలియన్ లీటర్స్ పర్ డే) నీరు అవసరం. కాగా పెన్నాలో నీరు సమృద్ధిగా ఉన్నప్పుడే 51 ఎంఎల్డీలు లభ్యమయ్యేవి. ప్రస్తుతం గండి, లింగంపల్లిలో భూగర్భ జలాలు 16 అడుగులకు పడిపపోయాయి. దీంతో కేవలం 46 ఎంఎల్డీల నీరే సరఫరా అవుతోంది. గంజికుంట కాలనీ, ప్రకాష్నగర్, నకాష్, ఖలీల్నగర్, ఎన్టీఆర్ నగర్, సరోజినీ నగర్, శివానందపురం, ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఊటుకూరు, సాయిప్రతాప్ నగర్లతోపాటు నగర శివారు ప్రాంతాలలో నీటి ఎద్దడి తీవ్రమవుతోంది. ప్రస్తుతానికైతే అధికారులు నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో 11 ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇలాగే కొనసాగితే బోర్లు ఫెయిల్ అయ్యే అవకాశం లేకపోలేదు. వెలిగల్లు నుంచి నీటిని తెచ్చేందుకు ప్రయత్నాలు వేసవిలో నీటిఎద్దడి తలెత్తిన ప్పుడల్లా వెలుగోడు నుంచిగానీ, అలగనూరు రిజర్వాయర్ నుంచిగానీ పెన్నాకు నీటిని విడుదల చేయించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం అలగనూరు రిజర్వాయర్లో 1.6 టీఎంసీల నీరే ఉంది. ఇక్కడి నుంచి నీటిని విడుదల చేసినా దూరం ఎక్కువగా ఉండటం వల్ల నీరు పెన్నాలోకి చేరే సరికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో అధికారులు వెలిగల్లు నుంచి నీటిని విడుదల చేయించేందుకు కలెక్టర్ ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టారు. వెలిగల్లులో ప్రస్తుతం 3 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆ నీటిని చక్రాయపేట, గండి, కమలాపురం, పాపాఘ్ని ద్వారా 70 కి.మీ తీసుకురావచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా, వెలుగోడు రిజర్వాయర్ నుంచి పెన్నాకు స్వల్ప పరిమాణంలో నీరు వదిలారు. ఆ నీరు గండి, లింగంపల్లి వాటర్ వర్క్స్కు చేరేసరికి కనీసం 15 రోజులు పట్టే అవకాశం ఉంది. మధ్యమధ్యలో రైతులు వేసే అడ్డుకట్టలను తొలగిస్తూ కడపకు నీటిని తీసుకురావలసి ఉంది. నీరు సకాలంలో గండి, లింగంపల్లికి చేరితే మళ్లీ బోర్లు రీచార్జి అయ్యే అవకాశం ఉంది. -
పెన్నానదిలో ఈతకెళ్లి ఇద్దరి గల్లంతు
కోవూరు: నెల్లూరు జిల్లాలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. కోవూరు మండలం వేగూరు కండ్రిగ గ్రామం సమీపంలో ఉన్న పెన్నానదిలో ఈతకెళ్లి చక్రపాణి(21), జైపాల్(21) అనే ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. యువకుల మృతితో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. -
భారీ వర్షాలతో పెన్నానదికి జలకళ
-
తిక్కన సాక్షిగా పయనిస్తూనే ఉన్నా...
గమనం నదుల స్వగత కథనం పుట్టినప్పట్నుంచీ ప్రయాణిస్తూనే ఉన్నా, నిత్య చైతన్యంలా. అలుపెరగని బాటసారిలా. నందగిరి కొండల్లో పుట్టాను. నేనెక్కడున్నాను అని ఒకసారి వెనక్కి చూసుకుంటే... ‘పశ్చిమ కనుమలకు దగ్గరగా ఉన్నాను’ అనుకునే లోపే తూర్పుగా పయనిస్తున్నా... నా గమనం నా చేతిలో లేదు... పల్లానికి జారిపోతూనే ఉన్నా. నా ఒడ్డున బాటసారులు సేద దీరుతున్నారు. నేనూ బాటసారినే కదా! వాళ్లు నా తోటి ప్రయాణికులేమోనని పలకరిద్దాం, స్నేహం చేద్దామనుకుంటే... స్నేహంగా నన్ను స్పృశించి... దాహం తీర్చుకుని వెళ్లిపోతున్నారు. అంతే తప్ప నేను అక్కడ ఘడియ సేపైనా ఉండడానికి ఏ ప్రయత్నమూ చేయడం లేదు నా హితులు. ఇంకా ముందుకు వచ్చే కొద్దీ కొత్త స్నేహితులు పరిచయమవుతున్నారు. నా గమనంలో నేనెక్కడికి వెళ్లినా అక్కడ నాకు తోటి ప్రయాణికులు ఎదురవుతూనే ఉన్నారు. కోలారులో పుట్టి నెల్లూరులో సాగరంలో సంగమించే వరకు నా ప్రయాణం అలా సాగుతూనే ఉంది. ఎండ, వాన, చలి... అన్నింటినీ తట్టుకుంటూ ముందుకు పోతూనే ఉన్నా. వర్షాకాలం పరవళ్లు తొక్కిన నా గమనం చలికి ఒళ్లంతా బిగుసుకుని, ఎండలకు అలసిపోయి కాస్త వేగం తగ్గిందంటే చాలు... సముద్రపు ఉప్పు నీటితో నా కంఠం బిగుసుకు పోతుంది. అదే నాకు హెచ్చరిక. మళ్లీ వేగం పుంజుకుని బంగాళాఖాతంతో పోటీ పడి నాదే పై చెయ్యి చేసుకుంటాను. విల్లులా వంపు తిరిగి... నేను ధనుస్సులా వంపు తిరిగానని పినాకిని అన్నారు. నా ప్రవాహ మార్గంలో వచ్చే ఊళ్లన్నింట్లో పెద్దదాన్ని కాబట్టి పెన్నేరు అన్నారు. జయమంగళ, పాపఘ్ని, చిత్రావతి, కుందూ (కుముద్వతి), చెయ్యేరు, బొగ్గేరు, బీరాపేరు... ఇవన్నీ చిన్నవి కావడంతో ఇక్కడ నేనే పెద్ద ఏరుని. నేను పేరుకి పెద్ద దాన్నే అయినా చిన్న చిన్న మిత్రుల తోడు లేకుండా ఇంతదూరం ప్రయాణించగల శక్తి నాలో ఏ కోశానా లేదు. నన్ను నమ్ముకుని పంటలేసుకున్న రైతన్నల గోడు, జీవనశైలిని ‘పెన్నేటిపాట’లో విద్వాన్ విశ్వం, ‘పెన్నేటి కథల’తో కట్టమంచి రామలింగా రెడ్డి కళ్లకు కట్టినట్లు చూపించారు. నా బలం, బలహీనత రెండూ ఈ రచనల్లో కనిపిస్తాయి. నేను పడమర నుంచి తూర్పుగా సాగిపోతుంటే ఉత్తరం నుంచి దక్షిణంనుంచి చిన్న నదులు ఒక్కొక్కటిగా వచ్చి నాకు తోడవుతూ నాకు బలాన్నిస్తాయి. కొంత దూరం అలా కలిసి స్నేహితుల్లా ప్రయాణం సాగిస్తామో లేదో నా మిత్రులు నాలో మమేకమై పోతారు. ఎంతగా అంటే ఆనవాలుకి కూడా తమ ఉనికి దొరకనంతగా. ఒకటి మాయమయ్యాక మరొకటి... ఇలా నేను సాగరంలో కలిసే దాకా ఏదో ఒక నది నాతో చెయ్యి కలుపుతూనే ఉంది, నాలో జవసత్వాలు జారిపోనీయకుండా అవి నన్ను శక్తిమంతం చేస్తూనే ఉన్నాయి. ఏమిచ్చి వాటి రుణం తీర్చుకోను? సాగరాన్ని చేరుతున్నాను - అనుకునే లోపుగా తిక్కన భారతం రాసిన ప్రదేశం కనిపించి మనసు పరవశిస్తుంది. ఆ మహాకవి భారతం రాయడానికి నా ఒడ్డును ఎంచుకున్నందుకు 15వ శతాబ్దంలో గిలిగింతలు పెట్టినట్లు ఎంతగా ఉక్కిరిబిక్కిరయ్యానో ఇప్పటికీ గుర్తే. ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా అంతే ఆనందం కలుగుతుంది. తిక్కన జ్ఞాపకాలను గర్వంగా గుర్తు చేసుకోకుండా ఇక్కడివాళ్లకు ఎందుకో ఇంతటి ఉదాసీనత? ఆలనాపాలనా లేకుండా ఉన్న ప్రదేశాన్ని చూసినప్పుడు ఉసూరుమనిపిస్తుంటుంది. జీవితమంటే సంతోషాలే కాదు సర్దుకుపోవడాలూ తప్పనిసరని సరిపెట్టుకున్నా కూడా ఎందుకో ఒక్కోసారి మనసు మౌనంగా రోదిస్తుంది. ఆ మహాకవిని తరతరాలు గుర్తు చేసుకోవడానికి ఈ ప్రదేశాన్ని అందంగా తీర్చిదిద్దే ఓ మనీషీ! ఎక్కడున్నావు? అనుకుంటూ ముందుకు పోవడమే నేను చేయగలిగింది. నాకు నింగి - నేల తప్ప మరే హద్దులూ తెలియవు. నోటిమాటతోనే పరిధుల గోడలు కట్టుకున్న వాళ్లు మాత్రం నన్ను కన్నడ రాష్ట్రంలో పుట్టానన్నారు, ఎవరూ పిలవకుండానే అనంతపురం (మడకశిర) మీదుగా ఆంధ్రలో అడుగుపెట్టాను. అక్కడ నుంచి కడపకు వచ్చి అలవోకగా గండికోటను చుట్టి నెల్లూరును సస్యశ్యామలం చేస్తున్నా. పుట్టిన చోటి నుంచి ఏకబిగిన పరుగెట్టకుండా కాస్త నిదానిస్తూ పక్కనున్న ప్రకృతి రమణీయతను చూసి పరవశిస్తూ అలవోకగా అడుగులు వేయాలని ఉంది కానీ, దిగువకు వచ్చేదాకా ఎక్కడా గట్టి ఆనకట్ట లేకపోవడంతో పరుగెత్తక తప్పడం లేదు. కాలంతోపాటు నేను కూడా పరుగులు తీయకపోతే నా ఉనికి ఏమవుతుందోనన్న భయం. ఆధారం వెతుక్కుంటూ పరుగులు తీయడం నా నైజం. మబ్బు విడిన వానచినుకు ఏ తీరాన నేలకు తాకుతుందోనన్నట్లు... ఎక్కడో కురిసిన వాన చినుకులు ఒక్కటొక్కటిగా నాలో కలిసిపోయి అంతెత్తు నుంచి ప్రయాణం మొదలెడతాయి. వాటికి తరతమ భేదాలు ఉండవు. ఎక్కడ, ఎవరు చెయ్యార చేరదీస్తే వాళ్ల దప్పిక తీర్చడమే తెలుసు. దారి పొడవునా పంటల్ని పచ్చగా కళకళలాడించి మురిసిపోవడమే తెలుసు. నా నీటితో పచ్చగా ఉన్న పొలాలను చూసుకుని మురిసిపోయే రైతును చూసినప్పుడు నా గుండె ఉప్పొంగుతుంది. నా ప్రయాణం సార్థకమైందని మనసు ఆనందంతో పులకించి పోతుంటుంది. అదే మనుషులు... ఆగకుండా సాగుతున్న నా గమనాన్ని, ఎండుతున్న పంటను చూస్తూ నిస్సహాయంగా మిగిలిన రైతును చూసి ఎగతాళి చేసినప్పుడు నా గుండె కలుక్కుమంటుంటుంది. నేను ఎగువన క్షణం కూడా ఆగకుండా పరుగెత్తినందుకు సిగ్గుగా అనిపిస్తుంది. అక్కడ నేను ఆగడానికి చిన్న ఆధారం దొరికినా చాలని ఎన్నిసార్లో అనుకుంటాను. నాకు నేనుగా ఏమీ చేసుకోలేక ఇలా పరుగెడుతూనే ఉన్నా. చిన్న ఆధారం ఉంటే ఒకింత విశ్రాంతిగా ప్రయాణం సాగిస్తాను. నా దారినంతటినీ పచ్చగా మార్చుకుంటాను. ప్రెజెంటేషన్: వాకా మంజులారెడ్డి email: manjula.features@sakshi.com పెన్నా నది జన్మస్థానం: కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా నందగిరి కొండలు సాగరసంగమం: నెల్లూరు జిల్లా ఊటుకూరు, సంగం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ ప్రదేశానికి సంగం అనే పేరు నది సంగమంతోనే వచ్చింది. నదీగమనం: 560 కి.మీ -
రూ. 200 కోట్లు ఇస్తా.. పెన్నాకు నీరిస్తారా?
తాడిపత్రి: ‘ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ. 100 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పడం బాగుంది. అయితే నేను రూ. 200 కోట్లు ఇస్తాను.. పెన్నానదికి నీరు ఇస్తారా.. నీళ్లను డబ్బుతో కొనుక్కోగలమా... ఇసుక రీచ్ల నిర్వహణ సరిగా లేదు. ఆదాయం కోసం నదుల్లో ఇసుకను తవ్వడం ద్వారా భవిష్యత్తులో తీవ్ర సమస్యలు వస్తాయని తెలియదా’ అంటూ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఇసుక రీచ్ల నిర్వహణ ఇష్టా రాజ్యంగా జరుగుతోందని విమర్శించారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పదించాలని, లేదంటే జిల్లాలోని ఇసుక తవ్వకాలను అడ్డుకుంటానని చెప్పారు. పెన్నానదిలో ఇసుక తవ్వకాల వల్ల పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయన్నారు. చాగల్లు ప్రాజెక్టుకు 1.5 టీఎంసీల నీరు త్వరలో వస్తుందని, ఈ నీరు వచ్చేందుకు పెన్నానదిలో కాలువ తీయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వారం రోజులుగా 12 పొక్లెరుున్ల ద్వారా పెద్దవడుగూరు మండలం చిట్టూరు నుంచి కాలువ తీయాల్సి వస్తోందని చెప్పారు. ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకపోయినా తానే స్వయంగా లక్షలు ఖర్చుచేసి నదిలో నీరు పారేందుకు కాలువలు తవ్విస్తున్నానని చెప్పారు. ఇష్టారాజ్యంగా సాగుతున్న ఇసుక తవ్వకాలు ఆపకపోతే ఈ నెల 5న తాను అడ్డుకుంటానని చెప్పారు. -
పెన్నాపై కబ్జా పంజా
నెల్లూరు(బృందావనం): నగరవాసుల దాహార్తిని తీరుస్తూ, డెల్టా రైతులకు సాగునీటిని అందిస్తూ వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న పెన్నానది పైనా కబ్జాకోరుల కళ్లుపడ్డాయి. అక్రమార్కులు ఎవరికి తోచిన విధంగా వారు ఆక్రమణలకు పాల్పడుతూ పెన్నమ్మ ఒడిలో కాసుల పంట పండించుకుంటున్నారు. దీంతో నగరం పరిధిలో పెన్నమ్మ రూపురేఖలు మారిపోతున్నాయి. ఏటి పొరంబోకులో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరుగుతున్నప్పటికీ సాగునీటి పారుదల శాఖ గాని మున్సిపల్ కార్పొరేషన్ గాని పట్టించుకోవడంలేదు. అంతేకాకుండా ఆక్రమణలకు పరోక్షంగా అండదండలు అందిస్తున్నారనే అపవాదును కూడా అధికారులు మూటగట్టుకుంటున్నారు. నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలోనే జరుగుతున్న ఆక్రమణలు అధికారులకు తెలియవనుకుంటే పొరబాటే. ఆక్రమణల ఫలితంగా పెన్నాకు వరదలు వచ్చిన సమయంలో పలు ప్రాంతాలు జలమయమైన సందర్భాలు ఉన్నాయి. ఈ ఆక్రమణల పర్వం ఏటికేటికి విస్తరిస్తూనే ఉంది. దీంతో ఎప్పుడు వరదలు వచ్చినా నగరవాసులకు ముప్పు తప్పదనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పెన్నమ్మ ఆక్రమణలపై దృష్టిసారించకపోతే ప్రమాద ఘంటికలు మోగిన ట్టేనని అంటున్నారు. ఏటి పోరంబోకులో సవకతోటలు, కంపచెట్ల పెంపకం, ఇసుక అక్రమ తరలింపు, రియల్ఎస్టేట్ వ్యాపారం, తాగునీటి ప్లాంట్ల ఏర్పాటు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు పెన్నానదిని దోచుకుంటున్నారు. దీంతో పెన్నా నదీపరివాహక ప్రాంతం రూపురేఖలు కోల్పోతోంది. పాత నగరపాలక సంస్థ కార్యాలయానికి ఉత్తర,పడమటి వైపున ఉన్న పెన్నానది తీరం వెంట ఉన్న నీటిపారుదలశాఖ ‘ఏటి పోరంబోకు’ను రియల్టర్లు దర్జాగా ఆక్రమించేస్తున్నారు. నదీపరివాహకప్రాంతంలో నగరపాలక సంస్థ యంత్రాంగం వ్యర్థపదార్ధాలతో నింపేస్తూ రియల్టర్లుకు మరింత సహకారం అందిస్తోంది. వ్యర్థపదార్థాలను యంత్రాలతో చదునుచేసి పెన్నమ్మ ఆనవాలు లేకుండా చేసేస్తున్నారు. రియల్ ఎస్టేట్ తరహా ప్లాట్లుగా మలిచారు. లోపాయకారిగా నగరపాలకసంస్థయంత్రాంగం రియల్టర్లుకు సహకరిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాత నగరపాలక సంస్థ కార్యాలయం వెనుకభాగాన వరహాలరావుతోట, నాగేంద్రస్వామిపుట్టకి ఉత్తరంవైపున ఏటిపోరంబోకు స్థలం ఇప్పటికే కబ్జాఅయ్యింది.. ఇక్కడ అంకణం *30 నుంచి *50 వేలుకు ఓ రియల్టర్ అమ్మకం సాగిస్తున్నారు. నాగేంద్రస్వామి పుట్టకు ఎదురుగా ఏటిపోరంబోకులో ఓ మల్లెతోటను కబ్జాదారులు కొంత కాలం సాగుచేశారు. ఆ స్థలాన్ని వేరేవారికి విక్రయించేశారు. కొనుగోలుచేసిన వారు ఆ తోటను చదనుచేసి ఇళ్లప్లాట్లుగా మార్చారు. స్ధానికులు ఏటి పోరంబోకు కబ్జాను అప్పటి కలెక్టర్ శ్రీధర్, కమిషనర్ టీఎస్ఆర్ ఆంజనేయులు దృష్టికి తీసుకెళ్లడంతో ప్లాట్లలో వేసిన రాళ్లను తొలగించారు. తదుపరి ఆ స్థలం చేతులు మారి నేడు బాణసంచా తయారీదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే పెన్నాపోరంబోకు స్థలంలో ఒక పార్టీ నాయకుడు గతంలో సవకచెట్లు పెంచి, సొమ్ముచేసుకునేవారు. ఇతని వ్యవహారశైలిపై విమర్శలురావడంతో, నీటిపారుదలశాఖ అధికారులు చేసిన హెచ్చరికలతో గత రెండేళ్ల క్రితం సవకచెట్లును తొలగించారు. గత రెండేళ్ల నుంచి సవకచెట్లస్థానంలో కర్రతుమ్మచెట్లును పెంచుతూ వీటి ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఎవరైనా ఈ ప్రాంతానికి వస్తే ఆయన తన పార్టీ పేరుచెబుతూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఉయ్యాల కాలువ మురుగునీటిని పెన్నానదిలోకి కలపడంతో దాదాపు తాగునీరు కలుషితైమై పోతోంది. దీంతోసమీపప్రాంత ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందకుండాపోయింది. దీనిని అదునుగా తీసుకున్న ప్రైవేట్ వ్యక్తి ఒకరు వాటర్ప్లాంట్ ఏర్పాటు చేసుకుని దర్జాగా వ్యాపారాన్ని సాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇదిలాఉంటే దర్జాగా ఏర్పాటు చేసుకున్న అక్రమ రహదారులలో పట్టపగలు ఎడ్లబండ్ల, రాత్రి వేళల్లో ట్రాక్టర్లతో టన్నులకొద్ది ఇసుక తరలిపోతోంది. ఒక మాజీ కౌన్సిలర్ అన్నీ తామై పరిస్థితిని చక్కబెడుతుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. అంగబలం,అర్థబలం ఉన్న వీరిని నియంత్రించేందుకు స్థానికులు జంకుతుండడంతో వీరి దందాకు అడ్డూఅదుపు లేకుండా ఉంది. ఏటి పోరంబోకు ఆక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం- -వి.కోటేశ్వరరావు, సూపరింటెండెంట్ ఇంజనీరు, నీటిపారుదలశాఖ ఏటిపోరంబోకును ఆక్రమించడం చట్టపరంగా నేరం. పెన్నానది పరివాహక ప్రాంతంలో ఎటువంటి అక్రమకట్టడాలు నిర్మించరాదు. అక్రమలేఅవుట్లు తొలగిస్తాం. ఇసుక అక్రమరవాణాపై చర్యలు తీసుకుంటాం. నగరపాలక సంస్థకుచెందిన వ్యర్థపదార్ధాలతో పెన్నానది కలుషితమౌతున్న విషయమై ఇంజినీరింగ్ అధికారులతో పరిశీలనచేస్తాం. -
కడపకు ఎక్కిళ్లు
ఓ వైపు జాడలేని వాన చినుకులు.. మరోవైపు ఆగని ఇసుకాసురుల ఆగడాలు.. వెరసి భూగర్భ జలం అడుగంటింది. చుక్కనీరు లేక పెన్నానది బోసి పోయింది. ఇంకేముంది కడప నగరానికి నీటి గండం పొంచి ఉంది. సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో తలెత్తే నీటి ఎద్దడి సమస్య ఆగస్టులోనే ఎదురుకావడంతో ప్ర‘జల’కు కలవరం మొదలైంది. ఇప్పటికే పలు ప్రాంతాలకు నీటి సరఫరా కానీ దుస్థితి తలెత్తింది. కడప కార్పొరేషన్: కడప నగరానికి ప్రధాన తాగునీటి వనరయిన పెన్నానది పూర్తిగా ఎండిపోయింది. దీంతో నగరంలో పలు ప్రాంతాలకు వారం రోజులుగా నీరు సరఫరా ఆగిపోయింది. నీరు రాక ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు బోర్లు ఫెయిల్.. పెన్నాలో నీరు సమృద్ధిగా ఉన్నప్పుడే 51 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స పర్ డే) లు సరఫరా చేసేవారు. వారం క్రితం వరకూ 47.60 ఎంఎల్డీల నీరు సరఫరా చేసేవారు. ప్రస్తుతం పెన్నాలో చుక్కనీరు కూడా లేకపోవడం.. లింగంపల్లె,గండి వాటర్ వర్క్స్లో ఒక నిమిషానికి 4వేల లీటర్ల నీటిని పంప్ చేయగలిగిన రెండు 60 హెచ్పీ బోర్లు ఫెయిల్ కావడంతో 36 ఎంఎల్డీలకు పడిపోయింది. ఫలితంగా నగరంలో 25 శాతం ప్రాంతాలకు తాగునీరు అందించలేని దుస్థితి ఏర్పడింది. గంజికుంట కాలనీ, ప్రకాష్నగర్, నకాష్, ఖలీల్నగర్, ఎన్టీఆర్ నగర్లతోపాటు నగర శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రమవుతోంది. ప్రస్తుతానికి అధికారులు నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. మరో వా రం రోజులపాటు ఇలాగే కొనసాగితే మిగిలిన బోర్లు కూడా పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. అధికారులతో మాట్లాడుతున్నాం: పెన్నా పూర్తి గా ఎండిపోయిన విషయమై ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతున్నాం. నిన్న రాజోలి ఆనకట్టనుంచి 2 వేల క్యూసెక్కులు వదిలామని చెబుతున్నారు. రెండు రోజుల్లో ఆ నీరు గండి, లింగంపల్లెలకు చేరే అవకాశముంది. సోమవారం మేయర్తో కలిసి ఆదినిమ్మాయపల్లె వద్దకు వెళ్లి చూసి తదుపరి చర్యలు తీసుకుంటాం. -ఓబులేసు, కమిషనర్, కడప