గుర్రంపోడు-దేవరకొండ రహదారిలో కాలువపల్లి వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
నల్గొండ జిల్లా గుర్రంపోడు-దేవరకొండ రహదారిలో కాలువపల్లి వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ముందు వెళుతున్న ఆటోను వెనుక వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.