శాకంబరి అలంకరణలో శ్రీతిరుపతమ్మ | tirupatamma as sakambari | Sakshi
Sakshi News home page

శాకంబరి అలంకరణలో శ్రీతిరుపతమ్మ

Published Mon, Jul 18 2016 6:07 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM

విలేకరుల సమావేశంలో ఆలయ ఈఓ రఘునాథ్, చైర్మన్‌ వెంకటనారాయణ తదితరులు - Sakshi

విలేకరుల సమావేశంలో ఆలయ ఈఓ రఘునాథ్, చైర్మన్‌ వెంకటనారాయణ తదితరులు

శాకంబరీ ఉత్సవంలో భాగంగా అమ్మవారితో పాటు ఉపాలయాల్లోని సహదేవతలను, ఆలయ పరిసరాలను పలు రకాల శాకములు(కూరగాయాల)తో అలంకరిస్తామన్నారు.

పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీగోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ అమ్మవారు ¿శాకంబరీ అలంకరణలో ఈనెల 24న భక్తులకు దర్శనమివ్వనున్నారని ఆలయ ఈవో మంచనపల్లి రఘునాథ్, చైర్మన్‌ కర్ల వెంకటనారాయణలు తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ  శాకంబరీ ఉత్సవంలో భాగంగా అమ్మవారితో  పాటు ఉపాలయాల్లోని సహదేవతలను, ఆలయ పరిసరాలను  పలు రకాల  శాకములు(కూరగాయాల)తో అలంకరిస్తామన్నారు.

అదేరోజు చండీహోమం, రథంపై శాకంబరీ అలంకరణలో అమ్మవారి గ్రామోత్సవం ఉంటుందన్నారు.  అలంకరణకు కావాల్సిన కూరగాయలు, పండ్లు ఇవ్వదలచిన దాతలు 23వ తేదీన ఆలయంలో అందజేయాలని కోరారు. వివరాలకు ఆలయ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డీఈ రమ, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement