పోలీసు శాఖ కమ్యూనికేషన్ విభాగంలో కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు.
నేడు కమ్యూనికేషన్ కానిస్టేబుళ్లకు వైద్య పరీక్షలు
Published Tue, Apr 25 2017 11:11 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
కర్నూలు: పోలీసు శాఖ కమ్యూనికేషన్ విభాగంలో కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో బుధవారం ఉదయం 8 గంటలకు అభ్యర్థులు హాజరు కావాలని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఎస్పీ తెలిపారు. ఇటీవల కమ్యూనికేషన్ కానిస్టేబుళ్లుగా ఎంపికైన 56 మంది ఆస్పత్రి చార్జీల నిమిత్తం రూ.1500 నగదు, 6 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాల్సిందిగా ఎస్పీ సూచించారు.
Advertisement
Advertisement