
నేడు ఒంటిమిట్టకు వైఎస్ జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి బుధవారం తెలిపారు.
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి బుధవారం తెలిపారు. గురువారం ఉదయం 7 గంటలకు వైఎస్ జగన్ హెలికాప్టర్లో కడపకు చేరుకుంటారని ఆయన పేర్కొన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఒంటిమిట్టకు వెళ్లి కోదండరాముని రథోత్సవంలో పాల్గొంటారని వెల్లడించారు. అనంతరం కడప ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో బళ్లారికి వెళతారని తెలిపారు.