వాచ్టవర్ల ఏర్పాటు
సీతానగరం (తాడేపల్లిరూరల్): మండలంలోని సీతానగరం పుష్కర ఘాట్ల సమీపంలో నిరంతర పర్యవేక్షణ కోసం మంగళవారం నిఘాకు టవర్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంగళగిరి రూరల్ సీఐ హరికృష్ణ మాట్లాడుతూ సీతానగరంలో 450 మీటర్ల పొడవు ఉన్న పుష్కర ‡ఘాట్లను బైనాక్యులర్ ద్వారా పర్యవేక్షించేందుకు అయ్యప్పస్వామి దేవాలయంపై భాగంలో, గాంధీ బొమ్మ వెనుక ఉన్న భవనంపై, పాత రైల్వే బ్రిడ్జి టవర్పై ఏర్పాటు చేసినట్లు తెలిపారు.