ఉత్కంఠగా క్రికెట్‌ టోర్నమెంట్‌ | winners in cricket | Sakshi
Sakshi News home page

ఉత్కంఠగా క్రికెట్‌ టోర్నమెంట్‌

Nov 11 2016 8:36 PM | Updated on Sep 4 2017 7:50 PM

ఉత్కంఠగా క్రికెట్‌ టోర్నమెంట్‌

ఉత్కంఠగా క్రికెట్‌ టోర్నమెంట్‌

గుంటూరు స్పోర్ట్స్‌: తాడికొండ మండలం లాం చలపతి ఇంజినీరింగ్‌ కళాశాలలో జరుగుతున్న ఏఎన్‌యూ అంతర కళాశాలల నార్త్‌ జోన్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఉత్కంఠభరింతంగా సాగుతోంది.

 
గుంటూరు స్పోర్ట్స్‌: తాడికొండ మండలం లాం చలపతి ఇంజినీరింగ్‌ కళాశాలలో జరుగుతున్న ఏఎన్‌యూ అంతర కళాశాలల నార్త్‌ జోన్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఉత్కంఠభరింతంగా సాగుతోంది. శుక్రవారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో నర్సరావుపేటకు చెందిన పీఎస్‌సీ అండ్‌ కెఆర్‌ జట్టు 8 వికెట్ల తేడాతో హిందూ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన హిందూ కాలేజ్‌ జట్టు 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన పీఎస్‌సీ జట్టు 2 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి విజయం సాధించింది. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో తాడికొండకు చెందిన బీఎస్‌ఎస్‌బీ జట్టు 3 పరుగుల తేడాతో నర్సరావుపేటకు చెందిన ఎంఏఎం ఫార్మసీ కళాశాల జట్టుపై విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన బీఎస్‌ఎస్‌బీ జట్టు 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన ఫార్మసీ కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లలో  7వికెట్లు 109 పరుగులు చేసి ఓటమి చెందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement