winners
-
ఆర్థిక మోసాలకు చెక్ పెట్టేలా పరిష్కారాలు
ఆర్థిక సేవల్లో మరింత భద్రతను పెంచడం, దివ్యాంగులు సులువుగా ఆర్థిక లావాదేవీలను వినియోగించేలా విభిన్న పరిష్కారాలు అందించిన కంపెనీలను భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) మూడో హ్యాకథాన్ విజేతలుగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ హ్యాకథాన్(Hackathon)లో పాల్గొనేందుకు మొత్తం 534 ప్రతిపాదనలు వచ్చాయని ఆర్బీఐ తెలిపింది.‘జీరో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్’, ‘బీయింగ్ దివ్యాంగ్ ఫ్రెండ్లీ’ థీమ్లతో గ్లోబల్ హ్యాకథాన్ మూడో ఎడిషన్ను ఆర్బీఐ ఇటీవల నిర్వహించింది. ఈ హ్యాక్థాన్కు వచ్చిన మొత్తం ప్రతిపాదనల్లో యునైటెడ్ స్టేట్స్(USA), యూకే, హాంకాంగ్, సింగపూర్, బ్రెజిల్, మొరాకోతో సహా దేశంలోని చాలా కంపెనీలు ప్రతిపాదనలు పంపించాయి. వీటిలో 28 సంస్థలను షార్ట్లిస్ట్ చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. వాటిని ఫైనల్ లిస్ట్ కోసం స్వతంత్ర జ్యూరీకి పంపించినట్లు పేర్కొంది. అందులో కింది కంపెనీలను విజేతలుగా నిలిచినట్లు ఆర్బీఐ ప్రకటించింది.ఎఫ్పీఎల్ టెక్నాలజీస్క్సాల్స్ టెక్నాలజీస్ఎపిఫై టెక్నాలజీస్న్యాప్ఐటీ సైబర్సెక్హెచ్విజన్ ఇండియారూప్య దర్శినివిస్ఆస్ట్ఇదీ చదవండి: రత్నాభరణాలపై జీఎస్టీ తగ్గింపు?అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఆర్థిక మోసాలను కట్టడి చేయడంతోపాటు, దివ్యాంగులు సులభంగా వీటిని వినియోగించేలా ఈ కంపెనీలు పరిష్కారాలు అందించినట్లు ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుత నిబంధనలకు లోబడి ఈ కంపెనీల టెక్నాలజీలు పటిష్ఠ భద్రతతో, సులువుగా ఆర్థిక సేవలను అందుబాటులో ఉంచేందుకు దోహదం చేస్తాయని తెలిపింది. -
‘‘అందమైన లోకమని.. రంగు రంగులుంటాయని...’’ (ఫొటోలు)
-
‘సైమా’ 2024 అవార్డుల విజేతలు వీళ్లే! (ఫోటోలు)
-
జాతీయ అవార్డుల విజేతలు వీరే (ఫోటోలు)
-
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ చాంపియన్స్ అల్కరాజ్, స్వియాటెక్
ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోరీ్నలో పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) టైటిల్ నిలబెట్టుకోగా... మహిళల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) రెండోసారి విజేతగా నిలిచింది. కాలిఫోరి్నయాలో జరిగిన ఫైనల్స్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ 7–6 (7/5), 6–1తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించగా... స్వియాటెక్ 6–4, 6–0తో మరియా సాకరి (గ్రీస్)పై గెలిచింది. 2016లో జొకోవిచ్ తర్వాత ఇండియన్ వెల్స్ టోర్నీని వరుసగా రెండేళ్లు సాధించిన ప్లేయర్గా అల్కరాజ్ నిలిచాడు. అల్కరాజ్ కెరీర్లో ఇది ఐదో మాస్టర్స్ సిరీస్ టైటిల్. విజేతలుగా నిలిచిన అల్కరాజ్కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... స్వియాటెక్కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
విజేత రష్మిక – వైదేహి జోడి
ఇండోర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) వరల్డ్ టూర్ – డబ్ల్యూ35 టోర్నీ డబుల్స్ విభాగంలో భారత జోడి శ్రీవల్లి రష్మిక భమిడిపాటి – వైదేహి చౌదరి విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో రష్మిక – వైదేహి జంట 6–3, 7–5 స్కోరుతో నాలుగో సీడ్ య సువాన్ లీ (చైనీస్ తైపీ) – సొహ్యున్ పార్క్ (కొరియా)ని ఓడించింది. మరో వైపు సింగిల్స్ విభాగంలో కూడా రష్మిక ఫైనల్కు చేరుకుంది. సెమీ ఫైనల్లో రష్మిక 6–3, 6–4తో ఏడో సీడ్ పొలినా లాట్సెంకో (రష్యా)పై గెలుపొందింది. ఫైనల్లో రెండో సీడ్ దలిలా జకుపొవిక్ (స్లొవేకియా)తో రష్మిక తలపడుతుంది. -
పద్మ పురస్కార గ్రహీతలకు తెలంగాణ సర్కార్ సన్మానం
సాక్షి, హైదరాబాద్: పద్మ పురస్కార గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. శిల్ప కళావేదికలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. పద్మా అవార్డు గ్రహీతల్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవితో పాటు మరో ఆరుగురిని ప్రభుత్వం సత్కరించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ, మొదటి సినిమాలో ఎలాంటి తపన ఉందో 46 ఏళ్ల తరువాత కూడా చిరంజీవిలో అదే తపన ఉందన్నారు. పద్మ అవార్డు గ్రహీతలకు సన్మాన కార్యక్రమం జరపడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేస్తోందన్నారు. ప్రతీ ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 25 లక్షల క్యాష్ రివార్డ్ ప్రభుత్వం ఇస్తోందన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ప్రతీ నెలా 25 వేల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. -
Bigg Boss 7 Contestants Pics: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ విన్నెర్స్ ఫోటోలు
-
ఎన్విరాన్మెంటల్ ఫోటోగ్రాఫర్లు.. ఈ ఏడాది విజేతలు వీళ్లే
పర్యావరణ కాలుష్యం. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఇది ఒకటి. ప్రపంచానికి పెద్ద విపత్తుగా మారిన పర్యావరణ కాలుష్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడమే పర్యావరణ ఫోటోగ్రఫీ. పర్యావరణం ఎదుర్కొంటున్న సమస్యల్ని హైలైట్ చేయడమే కాకుండా, తమ కెమెరా పనితీరుతో పర్యావరణ సంరక్షణ గురించి అనుక్షణం గుర్తు చేస్తారు. అలా ఈ ఏడాది కూడా అంతర్జాతీయ పర్యావరణ ఫోటోగ్రాఫర్ ఆప్ ది ఇయర్ విజేతలను ప్రకటించారు. చార్టర్డ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వాటర్ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ (CIWEM) ఆద్వర్యంలో గత 16 ఏళ్లుగా ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 159 దేశాల నుంచి ప్రతిభావంతులైన ఫోటోగ్రాఫర్లు ఇందులో పాల్గొన్నారు. వారిలో ఆరుగురిని విజేతలుగా ప్రకటించారు. వాళ్లు తీసిన ఫోటోలు ఏంటి అన్నది తెలియాలంటే ఫోటోగ్యాలరీని క్లిక్ చేయండి. (ఫోటోగ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆటకు అందలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘ఆడుదాం–ఆంధ్ర’ క్రీడా పోటీల విజేతలకు ప్రభుత్వం భారీగా నగదు బహుమతులు ప్రకటించింది. గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి ఐదు దశల్లో పోటీలను నిర్వహించనుంది. ప్రతి దశలోనూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంతో పాటుగా విజేతలను సర్టిఫికెట్స్, మెమెంటోలు, నగదు పురస్కారాలతో సత్కరించనుంది. క్రీడా చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో 15ఏళ్లు పైబడిన వయస్కులు (మెన్, ఉమెన్) అందరూ పోటీల్లో భాగస్వాములయ్యేలా ‘ఓపెన్ మీట్’ను చేపడుతున్నది. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఐదు క్రీడా విభాగాలైన.. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ డబుల్స్లో విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనుంది. మరోవైపు ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ సాంప్రదాయ యోగా, టెన్నీకాయిట్, మారథాన్ పోటీలను ఏర్పాటు చేస్తోంది. 2.99లక్షల మ్యాచ్లు.. 52.31లక్షల క్రీడాకారులు తొలి దశలో భాగంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో మొత్తం 1.50లక్షల మ్యాచ్లు జరుగనున్నాయి. ఇక్కడి విజేతలు అనంతరం మండల స్థాయిలో పోటీపడతారు. అంటే 680 మండలాల్లో మొత్తం 1.42లక్షల మ్యాచ్లు ఉంటాయి. ఈ దశలో గెలుపొందిన జట్లను నియోజవకర్గ పోటీలకు పంపిస్తారు. 175 నియోజకవర్గాల్లో 5,250 మ్యాచ్లలో పోటీలు నిర్వహిస్తారు. వీటిల్లో సత్తా చాటిన వారు జిల్లా స్థాయికి ఆడాల్సి ఉండగా.. 26 జిల్లాల్లో 312 మ్యాచ్లు నిర్వహిస్తారు. జిల్లా స్థాయి విజేతలతో రాష్ట్ర స్థాయిలో 250 మ్యాచ్ల్లో పోటీపడేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో 34.20లక్షల మంది, మండల స్థాయిలో 17.10లక్షల మంది, నియోజకవర్గ పోటీల్లో 77,520 మంది, జిల్లా స్థాయిలో 19,950 మంది, రాష్ట్ర స్థాయిలో 2,964 మంది ‘ఆడుదాం–ఆంధ్ర’ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. వివిధ దశల్లో కలిపి మొత్తం 52.31లక్షల మంది ఒకే వేదికపై 50 రోజుల పాటు క్రీడా మహోత్సవంలో సందడి చేయనున్నారు. నేటి నుంచి రిజిస్ట్రేషన్ రాష్ట్రంలో ‘ఆడుదాం–ఆంధ్ర’ క్రీడా పోటీల రిజిస్ట్రేషన్ సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్టు శాప్ ఎండీ ధ్యాన్చంద్ర ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబరు 13 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. 15 ఏళ్లకు పైబడిన క్రీడాకారులు (మెన్, ఉమెన్) సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయంలో, వాలంటీర్ల ద్వారా, ఆన్లైన్లో aadudamandhra.ap.gov. in వెబ్సైట్ ద్వారా, 1902కి ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఐదు క్రీడాంశాల్లో గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహిస్తామన్నారు. 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 3 వరకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ డబుల్స్, కబడ్డీ, ఖోఖోతో పాటు సంప్రదాయ యోగ, టెన్నీకాయిట్, మారథాన్ అంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ఇప్పటికే క్రీడా సామగ్రిని జిల్లాలకు తరలించామన్నారు. పోటీల్లో విజేతలకు సర్టీఫికెట్లు, ట్రోఫీలు, పతకాలు అందజేస్తామని చెప్పారు. నియోజవకర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి విజేతలకు ప్రత్యేక నగదు బహుమతులు అందజేస్తామన్నారు. ఫైనల్స్ను విశాఖలో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. -
జాతీయ అవార్డ్ విన్నర్స్కు మైత్రి మూవీ మేకర్స్ పార్టీ.. పాల్గొన్న అల్లు అర్జున్ (ఫొటోలు)
-
Asian Games Medal Winners Pics: ప్రధాని మోదీతో ఏషియన్ గేమ్స్లో మెడల్స్ విన్నర్స్ (ఫొటోలు)
-
ప్రతిష్టాత్మక 'ఐఏఏ' అవార్డు విజేతలు వీరే..
ఇండియా చాప్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (IAA) తన ప్రతిష్టాత్మకమైన IndAA అవార్డుల ఎనిమిదవ ఎడిషన్ కార్యక్రమాన్ని 2023 సెప్టెంబర్ 1న ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ నిర్వహించింది. ఈ ఈవెంట్కు ఏబీపీ నెట్వర్క్ అండ్ సోనీ పిక్చర్స్ నెట్వర్క్ కో-పార్ట్నర్గా ఉండగా.. నెట్వర్క్18 & జియో సినిమా అసోసియేట్ పార్ట్నర్గా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో 15 క్రియేటివ్ ఏజెన్సీలు 18 ప్రోడక్ట్ అండ్ సర్వీస్ కేటగిరీలు.. ఒక ప్రత్యేక కేటగిరీలో అవార్డులు పొందాయి. అవార్డులలో 102 క్యాంపెయిన్స్ షార్ట్లిస్ట్ చేయగా.. వీటిలో డిజైన్ ప్రకారం, ప్రతి విభాగంలో ఒకటి మాత్రమే ఇవ్వడం జరిగింది. క్లోజ్ కాంటెస్ట్ విషయంలో మాత్రం జ్యూరీ చాలా చర్చల తర్వాత ఉమ్మడి విజేతలను ప్రకటించింది. క్రియేటివ్ ఏజెన్సీలలో లియో బర్నెట్, ముల్లెన్లోవ్ లింటాస్ గ్రూప్, ఒగిల్వీ ఆ కేటగిరీలో ఒక్కొక్కటి మూడు IndIAA అవార్డులను గెలుచుకున్నారు. కాగా బీబీడీవో, డీడీబీ ముద్ర అండ్ టీబీడబ్ల్యుఏ రెండు అవార్డులను గెలుచుకున్నాయి. గ్రే గ్రూప్, కెహత్ కబీరా పిక్చర్స్, మెక్కాన్ వరల్డ్గ్రూప్, పబ్లిసిస్ వరల్డ్వైడ్, రీడిఫ్యూజన్, ఎస్జీ మీడియా, టాలెంటెడ్, ది స్క్రిప్ట్ రూమ్, ది వోంబ్, టిల్ట్ బ్రాండ్ సొల్యూషన్స్ వంటి ఇతర క్రియేటీవ్ ఏజెన్సీలు & క్రియేటర్లు IndAA అవార్డును గెలుచుకున్నాయి. ఇక ఫుడ్ అండ్ బెవెరగె (పానీయాలు) & పర్సనల్ కేర్ కేటగిరి HUL బ్రాండ్లు విజేతలుగా నిలిచాయి. HDFC లైఫ్ ఇన్సూరెన్స్లో గెలుపొందగా, HDFC మ్యూచువల్ ఫండ్ బ్యాంకింగ్ & ఫైనాన్స్లో గెలిచింది. ఈ సందర్భంగా జ్యూరీ ఛైర్మన్ అండ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, నెస్లే ఇండియా 'సురేష్ నారాయణ్' మాడ్లాడుతూ.. జ్యూరీ ఛైర్మన్గా నా ఐదవ సంవత్సరంలో ఇక్కడ సన్నిహితంగా పరిచయం చేసుకున్నాను. దేశంలోని గొప్ప క్రియేటివ్ మైండ్స్ కలిగిన కొందరిలో ఒకడిగా ఉన్నందుకు చాలా గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా 'జ్యూరీ చైర్ కా శంబోధన్' అనే పేరుతో ఒక చిన్న కవితతో అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో IAA ప్రెసిడెంట్ అవినాష్ పాండే, IAA ఇండియా అవార్డ్స్ ఛైర్మన్ అభిషేక్ కర్నాని కూడా మాట్లాడారు. బాలీవుడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానాను ఏఐఐ సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'లక్ష్మీదేవి కంటే ముందు సరస్వతీ దేవి వచ్చిందని తన తండ్రి చెప్పినట్లు వెల్లడించాడు. -
రాజస్థాన్ రాయల్స్ పై రాయల్ ఛాలెంజర్స్ విజయం
-
ఆస్కార్ విజేతలకు తెలంగాణ ప్రభుత్వం ఘన సన్మానం
-
Womens World Boxing Championship 2023:‘డబుల్’ గోల్డెన్ పంచ్
ప్రపంచ మహిళల బాక్సింగ్లో భారత జెండా మరోసారి సగర్వంగా ఎగిరింది. భారత్నుంచి మరో ఇద్దరు కొత్త ప్రపంచ చాంపియన్లు రావడంతో ఆ ఘనత సాధించిన బాక్సర్ల సంఖ్య ఏడుకు చేరింది. హరియాణాకే చెందిన నీతూ ఘంఘాస్, స్వీటీ బూరా విశ్వవేదికపై విజేతలుగా నిలిచారు. గతంలో యూత్ వరల్డ్ చాంపియన్షిప్లో రెండు సార్లు విజేతగా నిలిచిన నీతూకు సీనియర్ విభాగంలో ఇది తొలి టైటిల్ కాగా... తొమ్మిది సంవత్సరాల క్రితం సీనియర్ వరల్డ్ చాంపియన్షిప్లోనే రజతంతో సరిపెట్టుకొని ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు స్వర్ణం అందుకోవడం స్వీటీ బూరా సాధించిన ఘనత. న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు చేరాయి. 48 కేజీల విభాగంలో నీతూ ఘంఘాస్, 81 కేజీల కేటగిరీలో స్వీటీ బూరా విశ్వ విజేతలుగా నిలిచారు. శనివారం జరిగిన ఫైనల్ పోరులో నీతూ తన ప్రత్యర్థిపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించి అగ్రస్థానంలో నిలవగా...హోరాహోరీ సమరంలో స్వీటీ పైచేయి సాధించింది. వీరిద్దరు తొలి సారి ప్రపంచ చాంపియన్షిప్లో టైటిల్ సాధించడం విశేషం. ఫైనల్లో నీతూ 5–0తో లుట్సైఖన్ అల్టాన్సెట్సెగ్ (మంగోలియా)ను చిత్తు చేయగా, స్వీటీ 4–3తో వాంగ్ లినా (చైనా)ను ఓడించింది. ఈ చాంపియన్షిప్లో భారత్నుంచి నలుగురు బాక్సర్లు ఫైనల్ చేరగా, శనివారం ఇద్దరు చాంపియన్లుగా నిలిచారు. నేడు జరిగే ఫైనల్లో భారత్ మరో రెండు స్వర్ణాలను ఆశిస్తోంది. 50 కేజీల కేటగిరీలో నిఖత్ జరీన్, 75 కేజీల విభాగంలో లవ్లీనా బొర్గొహైన్ ఫైనల్ బరిలోకి దిగుతారు. ఏకపక్షంగా... భివానికి చెందిన నీతూ భారీ ప్రేక్షకసమూహం మధ్య తొలి రౌండ్లో ప్రత్యర్థిపై వరుస పంచ్లతో విరుచుకుపడింది. లుట్సైఖన్ వద్ద జవాబు లేకపోవడంతో 5–0తో ఆధిక్యం లభించింది. రెండో రౌండ్ మాత్రం సమంగా సాగింది. అటాక్, కౌంటర్ అటాక్తో సమరం పోటాపోటీగా నడిచింది. ఈ క్రమంలో నీతూకు రిఫరీలు ఒక పాయింట్ పెనాల్టీ కూడా విధించారు. దాంతో రెండో రౌండ్ 3–2తో ముగిసింది. చివరి మూడు నిమిషాల్లో నీతూకు ఎదురు లేకుండా పోయింది. ఒత్తిడికి గురైన మంగోలియా బాక్సర్ కోలుకోలేకపోయింది. గత ప్రపంచ చాంపియన్షిప్లో తనను ఓడించిన లుట్సైఖన్పై ఈ రీతిలో నీతూ ప్రతీకారం తీర్చుకుంది. ప్రేక్షకుల మధ్య ఉన్న నీతూ మెంటార్, ఒలింపిక్ కాంస్యపతక విజేత విజేందర్ సింగ్ ఆమెను ప్రోత్సహిస్తూ కనిపించాడు. అటాక్...డిఫెన్స్... గతంలో ప్రపంచ చాంపియన్షిప్లో రెండు పతకాలు గెలిచిన వాంగ్ లినాతో స్వీటీ పోరు హోరాహోరీగా సాగింది. ఆరంభంలో స్వీటీ పంచ్లు ప్రభావం చూపలేదు. వాంగ్ సమర్థంగా వాటినుంచి తప్పించుకోగలిగింది. అయితే ఆ తర్వాత నేరుగా స్వీటీ విసిరిన పంచ్లు సరిగ్గా వాంగ్ను తాకాయి. దాంతో తొలి రెండు రౌండ్లను ఆమె 3–2 ఆధిక్యంతో ముగించింది. మూడో రౌండ్లో స్వీటీ అటు అటాక్, ఇటు డిఫెన్స్ కలగలిపి జాగ్రత్తగా ఆడింది. వాంగ్ పంచ్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎదుర్కోగలిగింది. దాంతో చివరి రౌండ్లో స్కోరు 4–1గా తేలింది. అయితే ఈ బౌట్పై వాంగ్ రివ్యూ కోరినా అంతిమ విజయం స్వీటీదే అయింది. విజేతలుగా నిలిచిన నీతూ, స్వీటీలకు చెరో లక్ష డాలర్లు (సుమారు రూ. 82.7 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. భారత్ నుంచి గతంలో ఐదుగురు ప్రపంచ చాంపియన్షిప్లో విజేతలుగా నిలిచారు. మేరీకోమ్ (ఆరు సార్లు – 2002, 2005, 2006, 2008, 2010, 2018), సరితా దేవి (2006), ఆర్ఎల్ జెన్నీ (2006), కేసీ లేఖ (2006), నిఖత్ జరీన్ (2022) ఈ ఘనత సాధించగా, ఇప్పుడు ఈ జాబితాలో నీతూ, స్వీటీ చేరారు. 22 ఏళ్ల నీతూ అతి వేగంగా బాక్సింగ్ తెరపైకి దూసుకొచ్చింది. తన ఎడమ చేతి వాటం శైలితో ‘మరో మేరీకోమ్’గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె 2016లో యూత్ నేషనల్స్లో తొలిసారి విజేతగా నిలిచి అందరి దృష్టిలో పడింది. కేవలం ఏడేళ్ల వ్యవధిలోనే ఆమె ప్రపంచ చాంపియన్గా నిలవడం విశేషం. గత ఏడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించడం ఇప్పటి వరకు నీతూ అత్యుత్తమ ప్రదర్శన. 30 ఏళ్ల స్వీటీ ఆరంభంలో కబడ్డీ క్రీడాకారిణి. కబడ్డీలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత తండ్రి ప్రోత్సాహంతో బాక్సింగ్ వైపు మారింది. మూడు ఆసియా చాంపియన్షిప్ పతకాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 2014లో వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లో ఫైనల్ చేరింది. అయితే ఆ తర్వాత వేర్వేరు కారణాలతో కొంత కాలం ఆటకు దూరమైనా ఇప్పుడు తిరిగొచ్చి సత్తా చాటింది. భారత కబడ్డీ జట్టు కెప్టెన్ దీపక్ నివాస్ హుడా ఆమె భర్త. -
సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు
-
సస్పెన్స్కు తెరపడింది.. బిగ్బాస్6 విన్నర్ అతడే!
బిగ్బాస్ సీజన్-6కి మరికాసేపట్లో శుభం కార్డు పడనుంది. ఇప్పటికే సత్య ఎలిమినేట్ అవగా చివరగా ఐదుగురు సభ్యులు ఫినాలేకు చేరుకున్నారు. ఈ క్రమంలో బిగ్బాస్ విన్నర్ ఎవరన్న దానిపై నెట్టింట బాగా చర్చ నడుస్తుంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ అన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఇదిలా ఉంటే ఎన్నడూ లేనంతగా ఈ సీజన్కు పొలిటికల్ రంగు కూడా పులుముకుంది. టాప్-2లో ఉండాల్సిన ఇనయాను కావాలనే ఎలిమినేట్ చేయడం, మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి ఫినాలేకు ఒకరోజు ముందు సత్యను ఎలిమినేట్ చేయడంపై ఇప్పటికే ఆడియెన్స్ ఫైర్ అవుతున్నారు. దీనికి తోడు పొలిటికల్ పవర్తో రేవంత్ను విన్నర్ కాకుండా చేసేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు జరిగాయంటూ నెట్టింట వార్తలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో అసలు బిగ్బాస్ సీజన్-6 విజేత ఎవరన్నదానిపై హౌస్మేట్స్ ఫ్యామిలీతో పాటు ఆడియెన్స్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిన్న(శుక్రవారం)అర్థరాత్రే ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. సోషల్ మీడియాలో అందుతున్న ఓటింగ్ ప్రకారం చివరగా రోహిత్ నిలిచినట్లు తెలుస్తుంది. ఇక టాప్-4 ప్లేస్ను కీర్తి దక్కించుకుంది. టాప్-3లో ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్లు ఉన్నారు. వీరిలో అత్యదికంగా ఓట్లు సంపాదించుకొని సింగర్ రేవంత్ సీజన్-6 విజేతగా నిలవగా, శ్రీహాన్ రన్నరన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి టాప్-3తో సరిపెట్టుకున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతనిజం ఉందన్నది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. -
భీమ జ్యువెల్స్ మెగా బంపర్ డ్రా: గిప్ట్గా సిట్రోయెన్ కార్లు
హైదరాబాద్: భీమ జ్యువెల్స్ 98వ వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించిన బంపర్ లక్కీ డ్రా విజేతలకు బహుమతులు అందజేసింది. సోమాజీగూడకు చెందిన రామ సుబ్బమ్మ, విపుల్ సిట్రోయెన్ కార్లను గెలుచుకున్నారు. భీమ సూపర్ సర్ప్రైజ్లో భాగంగా కస్టమర్లకు బంగారం, వెండి, వజ్రాల కొనుగోలుపై భారీ తగ్గింపు ఇచ్చింది. బంగారం, వెండి నాణేలతో పాటు ఇతర బహుమతులు కూడా అందజేసింది. ప్రతి దుకాణానికి సిట్రోయెన్ కారు ఇచ్చింది. ఈవెంట్లో లక్కీ విజేతలను ప్రకటించడం మరపురాని అనుభవమని కంపెనీ రీజినల్ బిజినెస్ హెడ్ రఘురామ్ రావు తెలిపారు. వ్యాపారవేత్త షేక్ అబ్దుల్ వాజీద్, బిల్డర్ కనకరాజు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. భీమ జ్యువెల్స్ ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి నవంబర్ 13 వరకు నెలరోజుల పాటు ఘనంగా వార్షికోత్సవాలను నిర్వహించింది. -
గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నీ విజేత మను గండాస్
తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2022 గోల్ఫ్ టోర్నీలో న్యూఢిల్లీకి చెందిన మను గండాస్ విజేతగా నిలిచాడు. నాలుగు రోజుల పాటు హైదరాబాద్లో జరిగిన ఈ టోర్నీలో 126 మంది గోల్ఫర్లు పాల్గొన్నారు. విజేతకు రూ.6 లక్షల ప్రైజ్మనీ దక్కింది. హైదరాబాద్కు చెందిన మిలింద్ సోనికి ‘బెస్ట్ అమెచ్యూర్’ అవార్డు దక్కింది. తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ బహుమతులు అందజేశారు. చారిత్రక గోల్కొండ కోటకు అనుబంధంగా ఉన్న హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ను అత్యుత్తమంగా తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరించిందని, భవిష్యత్తులో గోల్ఫ్ క్రీడకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామని మంత్రి వ్యాఖ్యానించారు. -
ప్రపోజల్స్పై ‘జీ సరిగమప’ విన్నర్ శ్రుతిక ఆసక్తిర వ్యాఖ్యలు
జీ సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్ షో తన గాత్రంతో ఎంతోమందిని ఆకట్టుకుని విజేతగా నిలిచింది శ్రుతిక సముద్రాల. ఆరేళ్లకే సంగీతంలో అడుగు పెట్టిన శ్రుతిక సముద్రాల 'జీ సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్' ఫినాలే కార్యక్రమంలో 'ఏమాయె నా కవిత', 'మెరిసేటి పువ్వా', 'సంకురాత్రి కోడి', 'కొంచెం నీరు', 'ఆనతినీయరా' వంటి పాటలతో అదరగొట్టింది. అంతేకాకుండా విన్నర్ కాకముందే పలు బహుమతులను కూడా గెలుచుకుంది. ఫినాలేకు 8 మంది ఫైనలిస్ట్లు చేరగా, అందులో అత్యత్భుదమైన ప్రదర్శన కనబరిచి టైటిల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. చదవండి: Anasuya Bharadwaj: ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి: అనసూయ సంచలన వ్యాఖ్యలు జీ సరిగమప షో విజేతగా నిలిచిన శ్రుతిక ఇటీవల సాక్షితో ముచ్చటిందచింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తను చిన్నప్పటి నుంచి దివంగత లెజెండరి గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, సింగర్స్ చిత్ర, సుశీల గారిని ఫాలో అయ్యానని, అయితే తన ఫేవరేట్ సింగర్స్ మాత్రం చిత్రమ్మ, శ్రేయా ఘోషల్ అని చెప్పంది. ఇక చిత్రగారు పాడిన పాటల్లో ముంబైలోని ‘కన్నాను లే కళయికలు ఏడాడు ఆగవులే..’ అంటూ అచ్చం చిత్రగారిలా పాడి వినిపించింది. అనంతరం ఇక తనకు వచ్చిన మెసేజ్లో ప్రపోజల్స్ కూడా వస్తుంటాయి కదా.. అలా మీకు ఏమైన వచ్చాయా? అని యాంకర్ అడగ్గా.. శ్రుతిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: ది ఘోస్ట్లో నాగార్జున వాడిన ‘తమ హగనే’ అర్థమేంటో తెలుసా? ‘‘ఏంటో కానీ నాకు ఎక్కువగా అక్క అక్క అక్క అనే వస్తున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రపోజల్స్ రాలేదు. నేను చూసిన మెసేజ్లో అన్ని అక్క అనే ఉన్నాయి. ‘వీ సపోర్ట్ యూ అక్క’ అని మెసేజ్ పెడుతున్నారు. అవి చూసి నాకు షాకింగ్గా అనిపించింది. ఎందుకంటే అందరు నన్న అంత పెద్దదాన్ని అనుకుంటున్నారా? ఏంటి.. అంత పెద్దదానిలా కనిపిస్తున్నానా? అని అనిపిస్తోంది’ అంటూ శ్రుతిక చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన గురించి పంచుకున్న మరిన్ని విశేషాలను ఇక్కడ చూడండి. -
'జీ సరిగమప' విన్నర్ శృతిక సముద్రాల ఆసక్తికర వ్యాఖ్యలు
Zee Saregamapa Winner Shruthika Samudrala Interesting Comments: శృతిక సముద్రాల.. 20 ఏళ్లకే 'జీ సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్' విన్నర్ టైటిల్ పొందింది. ఆరేళ్లకే సంగీతంలో అడుగు పెట్టిన శ్రుతిక సముద్రాల 'జీ సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్' ఫినాలే కార్యక్రమంలో 'ఏమాయె నా కవిత', 'మెరిసేటి పువ్వా', 'సంకురాత్రి కోడి', 'కొంచెం నీరు', 'ఆనతినీయరా' వంటి పాటలతో అదరగొట్టింది. అంతేకాకుండా విన్నర్ కాకముందే పలు బహుమతులను కూడా గెలుచుకుంది. ఫినాలేకు 8 మంది ఫైనలిస్ట్లు చేరగా, అందులో అత్యత్భుదమైన ప్రదర్శన కనబరిచి టైటిల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే తను ఈ పోటీలో గెలవడానికి వాళ్ల అమ్మ ఎంతో సపోర్ట్ చేసిందని చెప్పుకొచ్చింది. శ్రుతిక వాళ్ల అమ్మ ఉద్యోగం వదిలేసి మరీ తనకు అండగా నిలిచిందని తెలిపింది. అలాగే తన అభిమానులు కవిత, పాట, ఆటో వంటి బహుమతులు ఇచ్చారని, తనకు లవ్ ప్రపోజల్స్ రావడం కంటే తనను అందరూ అక్క అని పిలుస్తున్నారని పేర్కొంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికర విషయాల కోసం ఈ కింది వీడియోను వీక్షించండి. చదవండి: 'జీ సరిగమప'లో శృతిక గెలుచుకున్న ఖరీదైన బహుమతులు ఇవే.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కట్టుకున్న ఈ చీర ధర ఎంతంటే? -
'జీ సరిగమప-ది సింగింగ్ సూపర్ స్టార్స్' విన్నర్గా శృతిక సముద్రాల
సుమారు 26 వారాలపాటు నాన్-స్టాప్ వినోదాన్ని పంచి, ఎంతోమంది అద్భుతమైన సింగర్స్ని ప్రేక్షకులకు పరిచయం చేసి వారి అభిమానాన్ని చూరగొన్న 'జీ సరిగమప - ది సింగింగ్ సూపర్ స్టార్స్' కార్యక్రమం ముగిసింది. ఫినాలేలో అదరగొట్టే ప్రదర్శనలతో హైదరాబాద్కి చెందిన శృతిక సముద్రాల (20) టైటిల్ విజేతగా నిలిచింది. అలాగే తనకు గట్టి పోటీ ఇచ్చి వెంకట సుధాన్షు రన్నరప్గా నిలిచాడు. ప్రెస్టీజియస్ 'జీ సరిగమప - ది సింగింగ్ సూపర్ స్టార్స్' ట్రోఫీతో పాటు, శృతిక రూ. లక్ష నగదు, మారుతి సుజుకి వాగన్-ఆర్ కారుని బహుమానంగా అందుకుంది. ఇక రన్నరప్గా నిలిచిన వెంకట సుధాన్షు రూ. 5 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. 'ఏమాయె నా కవిత', 'మెరిసేటి పువ్వా', 'సంకురాత్రి కోడి', 'కొంచెం నీరు', 'ఆనతినీయరా' వంటి పాటలతో ఫినాలే లో జడ్జెస్ ని మెప్పించి, టైటిల్ గెలుచుకున్న శృతిక, బీఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) లో డిగ్రీ పూర్తిచేసింది. 6 సంవత్సరాల వయస్సులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన శృతిక, కర్నాటిక్ సంగీతంలో శిక్షణ తీసుకుంది. ఈ సందర్భంగా, శృతిక మాట్లాడుతూ... "జీ సరిగమప - ది సింగింగ్ సూపర్ స్టార్స్ విన్నర్ గా నిలవడం ఒక డ్రీం-కం-ట్రూ మూమెంట్. ఇది నా లైఫ్ లోనే బెస్ట్ మూమెంట్, ఎప్పటికి మరిచిపోలేనిది. ఈ ట్రోఫీని నా కష్టానికి దక్కిన ప్రతిఫలంగా భావిస్తాను. నాతో పాటు, నా తోటి ఫైనలిస్ట్స్ కూడా అద్భుతంగా పాడారు. కాబట్టి వారికి కూడా సమానమైన గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. ఈ సరిగమప జర్నీలో వారు నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. అదేవిధంగా, ఈ జర్నీలో నాకు సహకరించిన జీ సరిగమప టీం, ముఖ్యంగా మెంటర్స్, జడ్జెస్, వాయిస్ ట్రైనర్లకి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే, నేను సింగర్ గా ఎదగడానికి ఎంతో సపోర్ట్ చేస్తూ వస్తున్న మా నాన్న శశికాంత్, అమ్మ రూప, అక్క శరణ్యకి, అలాగే సంగీతంలో ఓనమాలు నేర్పిన నా గురువులు శ్రీ రామాచారి కొమండూరి గారికి, శ్రీ నిహాల్ కొండూరి గారికి, వసుమతి మాధవన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు." అని తెలిపింది. ఆగష్టు 14 న ప్రసారమైన ఫినాలే ఎపిసోడ్లో లెజెండరీ సింగర్ పి. సుశీల, శృతి హాసన్, నితిన్, కృతి శెట్టి సమక్షంలో 8 మంది ఫైనలిస్ట్స్ అద్భుతమైన ప్రదర్శనలతో మైమరిపించారు. ఈ ఫినాలే స్టేజ్ వేదికగా పి. సుశీల తాను సంగీత ప్రపంచానికి చేసిన సేవలను గుర్తిస్తూ నిర్వహించిన సన్మానం ఎపిసోడ్ కే హైలైట్ గా నిలవగా, 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' వేడుకల్లో భాగంగా మాజీ సైనికులకు చేసిన సన్మానం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. -
మిస్ సౌత్ ఇండియాగా వైజాగ్ అమ్మాయి
ఏయూక్యాంపస్(విశాఖపట్నం): మిస్ సౌత్ ఇండియాగా విశాఖ అమ్మాయి, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ విభాగం విద్యార్థిని చరిష్మా కృష్ణ ఎంపికైంది. కేరళలో పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన ఈ పోటీల్లో ఆమె కిరీటం దక్కించుకుంది. ఈ పోటీల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన యువతులు పాల్గొన్నారు. వీరందరినీ వెనక్కి నెట్టి, తన ప్రతిభతో చరిష్మా విజేతగా నిలిచింది. చదవండి: లైగర్ను దొంగచాటుగా కలిసిన బ్యూటీ! ప్రముఖ మోడల్ భారతి బెర్రి ఆమెకు శిక్షణ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫెమీనా మిస్ ఇండియాకు సిద్ధమవుతోంది. చిన్నతనం అమెరికాలో గడిపిన చరిష్మా కృష్ణ భరతనాట్యం, కూచిపూడి నృత్యం తొమ్మిదేళ్లుగా నేర్చుకుంటోంది. స్విమ్మింగ్, కరాటే, గుర్రపుస్వారీ విద్యలను సైతం నేర్చుకుంది. చిన్నతనం నుంచి కళలపై ఆసక్తితో నృత్య కళాకారిణిగా, నటిగా రాణిస్తోంది. తండ్రి హరికృష్ణ ప్రభుత్వ ఉద్యోగి కాగా తల్లి గృహిణి. -
Chess Olympiad 2022: భారత్ 24–0
చెన్నై: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత్ జట్లకు ఎదురే లేకుండా పోయింది. తొలి రోజు బోర్డులో ఎత్తు వేసినవారంతా విజేతలుగానే నిలిచారు. ఓపెన్లో మూడు, మహిళల్లో మరో మూడు... ఈ ఆరు జట్ల తరఫున బరిలోకి దిగిన 24 మంది ఆటగాళ్లు విజయం సాధించారు. ఓపెన్ కేటగిరీలో ఇరిగైసి అర్జున్, విదిత్ సంతోష్ గుజరాతీ, నారాయణన్, శశికిరణ్ కృష్ణన్లతో కూడిన భారత ‘ఎ’ జట్టు 4–0తో జింబాబ్వేపై ఘనవిజయం సాధించింది. విదిత్ సంతోష్... మకొటో రాడ్వెల్పై గెలుపొందగా, రెండో బోర్డులో నల్లపావులతో ఆడిన తెలంగాణ కుర్రాడు అర్జున్, మనాంగో స్పెన్సర్ను ఓడించాడు. 32 ఎత్తుల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించాడు. మిగతా మ్యాచ్ల్లో ఎమరాల్డ్ ముషోర్పై ఎస్.ఎల్.నారాయణన్, జెంబా జెముసెపై శశికిరణ్ గెలుపొందారు. భారత ‘బి’ జట్టు 4–0తో యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ)పై నెగ్గింది. అల్ హొసానిపై గుకేశ్, ఇబ్రహీమ్పై శరీన్ నిహిల్, సయీద్పై ఆధిబన్, అబ్దుల్ రహమాన్పై రౌనక్ విజయం సాధించారు. భారత ‘సి’ జట్టు కూడా 4–0తో దక్షిణ సుడాన్పై నెగ్గింది. సైప్రియానోపై సేతురామన్, అజక్ మచ్ దువనీపై అభిజిత్ గుప్తా, గాంగ్ తోన్ గాంగ్పై మురళీ కార్తికేయన్, మజుర్ మన్యంగ్పై అభిమన్యు పీటర్ గెలుపొందారు. మహిళల విభాగంలో కూడా ఆతిథ్య జట్లు శుభారంభం చేశాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన అగ్ర శ్రేణి గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి, వైషాలి, తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణిలున్న భారత్ ‘ఎ’ 4–0తో తజికిస్తాన్పై ఘనవిజయం సాధించింది. నదెజ్దా అంటొనొవాపై హంపి 41 ఎత్తుల్లో అలవోక విజయం సాధించింది. సబ్రినాపై వైషాలీ, రుక్సోనా సైదొవాపై తానియా, ముత్రిబా హొతమిపై భక్తి గెలిచారు. భారత్ ‘సి’ అమ్మాయిల జట్టు 4–0తో హాంకాగ్పై నెగ్గింది. లామ్ క యాన్పై బొడ్డా ప్రత్యూష, సిగప్పి కన్నప్పన్పై ఇషా కరవాడే, డెంగ్ జింగ్ జిన్పై పీవీ నందిదా, లి జాయ్ చింగ్పై సాహితి వర్షిణి విజయం సాధించారు. ‘బి’ జట్టు కూడా 4–0తో వేల్స్పై గెలిచింది. స్మిత్ ఒలివియాపై వంతిక అగ్రావల్, చాంగ్ కింబెర్లీపై సౌమ్య స్వామినాథన్, 1–0తో హియా రేపై మేరి ఆన్ గోమ్స్, ఖుషీ బగ్గాపై దివ్య దేశ్ముఖ్ నెగ్గారు. -
చెస్ టోర్నీ విజేత అర్జున్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అండర్ –19 జూనియర్ చెస్ టోర్నమెంట్లో హైదరాబాద్ జిల్లాకు చెందిన ఆదిరెడ్డి అర్జున్ విజేతగా నిలిచాడు. ఆరు రౌండ్లపాటు నిర్వహించిన ఈ టోర్నీలో అర్జున్ 5.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించాడు. చివరిదైన ఆరో రౌండ్లో చల్లా సహర్షపై అర్జున్ గెలుపొందాడు. ఈ టోర్నీలో అర్జున్ ఐదు గేముల్లో గెలిచి, మరో గేమ్ను ‘డ్రా’ చేసుకున్నాడు. మొహమ్మద్ బాషిక్ ఇమ్రోజ్ (నల్లగొండ) రన్నరప్గా, సీహెచ్ కార్తీక్సాయి (రంగారెడ్డి) మూడో స్థానంలో, విహాన్ కార్తికేయ (రంగారెడ్డి) నాలుగో స్థానంలో నిలిచారు. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
సీఎం జగన్ను కలిసిన సివిల్ సర్వీసెస్ విజేతలు
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆంధ్రప్రదేశ్ నుంచి సివిల్ సర్వీసెస్–2021కి ఎంపికైన అభ్యర్థులు బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. సీఎం జగన్ వారితో ముచ్చటించి, అభినందనలు తెలిపారు. చదవండి: Cordelia Cruise Ship: మాములుగా లేదు మరి.. షిప్ లోపల ఓ లుక్కేయండి.. -
తానా తెలుగు తేజం పోటీలు విజేతల ప్రకటన
డాలాస్ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో నర్విమచిన తెలుగు తేజం భాషా పటిమ పోటీలకు సంబంధించిన విజేతలను ప్రకటించారు. ఈ పోటీలు తానా - తెలుగు పరివ్యాప్తి కమిటీఆధ్వర్యంలో 2022 జూన్ 4, 5 తేదీలలో జూమ్ లో నిర్వహించారు. ఈ పోటీలను (కిశోర, కౌమార, కౌశల) మూడు విభాగాలలో నిర్వహించగా ప్రవాసంలో వున్న వందలాది తెలుగు పిల్లలు ఉత్సాహంతో పాల్గొన్నారు. మెదడుకు మేత, పదవిన్యాసం, పురాణాలు, పదచదరంగం, తెలుగు జాతీయాలు, వేమన పద్యాలు, సుమతీ శతకాలు, మన తెలుగు కవులు, తెలుగులో మాట్లాడడం వంటి సంబందిత అంశాలు పోటీలు నిర్వహించారు. తానా - తెలుగు పరివ్యాప్తి కమిటీ చైర్మన్ చినసత్యం వీర్నపు పొటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ ప్రసాద్ తోటకూర మదిలోనుంచి పుట్టిన ఆలోచన వల్లే ఈ పోటీలు కార్యరూపం దాల్చాయన్నారు. ఈ పోటీల నిర్వాహణకు అన్నివిధాలా సహయ సహకారాలు అందించిన చొక్కాపు వెంకటరమణ, డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మనలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ.. ఈ పోటీలు నిర్వహించడానికి దాతలుగా వున్న ప్రసాద్ తోటకూర, చినసత్యం వీర్నపు, మురళి వెన్నం, రవి పొట్లూరి, వెంకట రాజా కసుకుర్తి, లోకేష్ నాయుడు కొణిదాల, శ్రీకాంత్ పోలవరపు, న్యాయ నిర్ణేతలుగా వున్న శ్రీమతి రాజేశ్వరి నల్లాని, గీతా మాధవి, రాధిక నోరి లకు ధన్యవాదలు తెలియజేశారు. విజేతల వివరాలు - కిశోర(5-10 సంవత్సరాలు) విభాగంలో – మొదటి బహుమతి శ్రీనిధి యలవర్తి, రెండవ బహుమతి చాణక్య సాయి లంక, మూడవ బహుమతి వేదాన్షి చందలు గెలుచుకున్నారు. కన్సోలేషన్ బహుమతులను శ్రీనిజ యలవర్తి, ఉదయ్ వొమరవెల్లిలకు దక్కాయి. - కౌమార (11-14 సంవత్సరాలు) విభాగంలో మొదటి బహుమతి రాధ శ్రీనిధి ఓరుగంటి, రెండవ బహుమతి ఇషిత మూలే, మూడవ బహుమతి సంజన వినీత దుగ్గిలు గెలుచుకున్నారు. కన్సోలేషన్ బహుమతులను ద్విజేష్ గోంట్ల, ఉదయ్ వొమరవెల్లిలను వరించాయి. - కౌశల (15-18 సంవత్సరాలు) విభాగంలో మొదటి బహుమతి శ్రీ ఆదిత్య కార్తీక్ , రెండవ బహుమతి శ్రీ షణ్ముఖ విహార్ దుగ్గి, మూడవ బహుమతి $116 ను శ్రీ యష్మిత్ మోటుపల్లిలకు వచ్చాయి. కాగా కన్సోలేషన్ బహుమతి శ్రీ గణేష్ నలజులకి దక్కింది. చదవండి: న్యూజిలాండ్లో తెలుగు సాహితీ సదస్సు -
సివిల్స్ విజేతలకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: సివిల్స్లో ర్యాంకులు సాధించిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. 15వ ర్యాంక్ సాధించిన యశ్వంత్ కుమార్రెడ్డితో సహా తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సీఎం అభినందనలు తెలిపారు. పి.సాహిత్య, శ్రుతి రాజ్యలక్ష్మి, రవికుమార్, కె.కిరణ్మయి, పాణి గ్రాహికార్తీక్, జి.సుధీర్ కుమార్రెడ్డి, శైలజ, శివానందం, ఏ.నరేష్లను సీఎం జగన్ అభినందించారు. చదవండి: జగనన్న మూడేళ్ల పాలన: పేదలకు ‘చేయూత’.. సంక్షేమ ‘బావుటా’ సివిల్స్ సర్వీసెస్-2021 ఫలితాలు ఇవాళ (సోమవారం) ఉదయం విడుదల అయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం యూపీఎస్సీ బోర్డు 685 మందిని ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన యశ్వంత్కుమార్ రెడ్డికి 15వ ర్యాంక్ దక్కింది. పూసపాటి సాహిత్యకు జాతీయ స్థాయిలో 24వ ర్యాంక్, శృతి రాజ్యలక్ష్మికి 25వ ర్యాంక్, రవికుమార్కు 38వ ర్యాంక్, కొప్పిశెట్టి కిర్మణయికి 56వ ర్యాంక్ దక్కింది. పాణిగ్రహి కార్తీక్కు 63వ ర్యాంక్, గడ్డం సుధీర్కుమార్కు 69వ ర్యాంక్, శైలజ 83వ ర్యాంక్, శివానందం 87వ ర్యాంక్, ఆకునూరి నరేష్కు 117వ ర్యాంక్, అరుగుల స్నేహకు 136వ ర్యాంక్, గడిగె వినయ్కుమార్ 151 ర్యాంక్, దివ్యాన్షు శుక్లాకు 153వ ర్యాంక్, కన్నెధార మనోజ్కుమార్కు 157వ ర్యాంక్, బొక్కా చైతన్య రెడ్డికి 161వ ర్యాంక్, దొంతుల జీనత్ చంద్రకు 201వ ర్యాంక్, అకవరం సాస్యరెడ్డికి సివిల్స్ జాతీయ స్థాయిలో 214వ ర్యాంక్ దక్కాయి. -
కెప్టెన్సీ అనుభవం లేదు.. అప్పటికే ఎత్తుపల్లాలు.. అయినా
‘విజయం అయితే మీది... ఓటమి ఎదురైతే అది నాది’... ఐపీఎల్లో తొలిసారి బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ టీమ్ జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా హార్దిక్ పాండ్యా తన సహచరులతో చెప్పిన మాట ఇది. హార్దిక్కు ఐపీఎల్ టైటిల్స్ కొత్త కాదు. ఆటగాడిగా ముంబై ఇండియన్స్ తరఫున అతని ముద్ర ఎంతో ప్రత్యేకం. కానీ నాయకుడిగా ఇదే మొదటి అవకాశం. టీమ్కు ఒక ముఖచిత్రంలా ‘తమవాడు’ కావాలని గుజరాత్ యాజమాన్యం హార్దిక్ను కెప్టెన్గా పెట్టుకుంది తప్ప... గతంలో ఏనాడూ ఏ స్థాయిలోనూ సారథ్యం చేసిన అనుభవం లేని హార్దిక్ ఐపీఎల్ టీమ్ను ఎలా నడిపించగలడని అప్పుడే వినిపించింది. పైగా గత రెండేళ్లుగా వరుస గాయాలతో బాధపడుతూ అతను చాలా కాలంగా ఆటకు దూరంగా ఉండటంతో పాటు భారత జట్టులోకి కూడా వస్తూ, పోతూ ఉన్నాడు. ఇలాంటి స్థితి నుంచి మొదలు పెట్టి సమర్థ నాయకత్వంతో టైటాన్స్కు వరుస విజయాలు అందించడమే కాదు ఏకంగా టైటిల్ను కూడా అందించిన పాండ్యాను ఎంత ప్రశంసించినా తక్కువే. ఎంతో మంది స్టార్లకు కూడా సాధ్యం కాని రీతిలో ఐపీఎల్ ట్రోఫీని గెలిపించి అతను తన స్థాయిని గొప్పగా ప్రదర్శించాడు. మొత్తం లీగ్లో బ్యాటింగ్లో 131.26 స్ట్రయిక్రేట్తో 487 పరుగులు చేయడంతో పాటు కీలక సమయాల్లో వికెట్లు (మొత్తం 8) పడగొట్టి ఆల్రౌండర్గా హార్దిక్ తనేంటో రుజువు చేశాడు. అయితే దానికి మించి అతని కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భారత్ తరఫున ఆడుతూ ధోని నాయకత్వంలో కెరీర్లో పురోగతి సాధించిన హార్దిక్ ఐపీఎల్లో ధోని శైలిని గుర్తుకు తెచ్చాడంటే అతిశయోక్తి కాదు. 16 మ్యాచ్లలో ఎక్కడా అతను ఒక్కసారి కూడా సంయమనం కోల్పోయినట్లు గానీ మైదానంలో కీలక క్షణాల్లో ఆగ్రహావేశాలు ప్రదర్శించడం గానీ కనిపించలేదు. సహచరులందరికీ తగిన బాధ్యతలు అప్పగించి ‘మిస్టర్ కూల్’లా ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోయాడు. వ్యూహరచనల్లో గానీ ఆటగాళ్లను సమర్థంగా వాడుకునే ప్రణాళికల్లో గానీ అతను వేసిన ప్రతీ అడుగు సత్ఫలితాలనిచ్చింది. తొలి మ్యాచ్ నుంచి చూస్తే టైటాన్స్ విజయంలో దాదాపు ప్రతీ ఒక్కరి పాత్ర ఉంది. ఎవరో ఒకరిపై ఆధారపడకుండా అందరినీ నమ్మడమే ఆ జట్టుకు సానుకూలాంశంగా మారింది. హార్దిక్, గిల్, సాహా, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మిల్లర్, షమీ...ఇలా ప్రధాన ఆటగాళ్లంతా టోర్నీలో ఏదో ఒక దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’లుగా నిలిచారంటే సమష్టి ప్రదర్శన ఎలాంటిదో అర్థమవుతుంది. గిల్ (483 పరుగులు), మిల్లర్ (481), సాహా (317) తమ బ్యాటింగ్తో కీలకంగా నిలిచారు. ఐపీఎల్ ఆల్టైమ్ గ్రేట్లలో ఒకడైన రషీద్ ఖాన్ బౌలింగ్ కూడా గుజరాత్కు ప్రత్యేక బలాన్నిచ్చింది. కేవలం 6.59 ఎకానమీతో అతను 19 వికెట్లు పడగొట్టగా... అనుభవజ్ఞుడైన షమీ (20 వికెట్లు) అండగా నిలిచాడు. తొలి సీజన్లో గుజరాత్ వేసిన తొలి బంతికి వికెట్తో శుభారంభం చేసిన షమీ... ఆ జట్టు తరఫున చివరి బంతికి వికెట్ తీసి ఘనంగా సీజన్ను ముగించాడు. ఫెర్గూసన్ తన వేగంతో ప్రత్యర్థి బ్యాటర్లపై ప్రభావం చూపించగలిగాడు. ఫ్రాంచైజీ అండగా నిలిచి ప్రోత్సహించిన యువ ఆటగాళ్లు సాయిసుదర్శన్, అభినవ్ మనోహర్, సాయికిషోర్ ఎక్కడా నిరాశపర్చకుండా తమకు ఇచ్చిన అవకాశాలను సమర్థంగా వాడుకొని జట్టుకు ఉపయోగపడ్డారు. గుజరాత్ చివరి ఓవర్లలో సాధించిన విజయాలో ఈ టోర్నీలో మరో ఎత్తు. ఎనిమిది సార్లు లక్ష్య ఛేదనకు దిగగా, ఏడుసార్లు చివరి ఓవర్లోనే జట్టు విజయం సాధించింది. 3 మ్యాచ్లలో ఆఖరి 4 ఓవర్లలో 50కి పైగానే పరుగులు చేయాల్సి వచ్చినా టైటాన్స్ తగ్గలేదు. ఈ ఏడు విజయాల్లో ఐదుసార్లు ఆఖరి ఓవర్లో పదికంటే ఎక్కువ పరుగులే చేయాల్సి రాగా, గుజరాత్ చేసి చూపించింది. పరుగులకంటే ఆ సమయంలో ఆటగాళ్లు చూపించిన ప్రశాంతత, ఒత్తిడికి లోనుకాకుండా ఆడిన తీరు ప్రశంసనీయం. -సాక్షి, క్రీడా విభాగం చదవండి: IPL 2022: గుజరాత్ గుబాళింపు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) .@gujarat_titans - The #TATAIPL 2022 Champions! 👏 👏 🏆 👍 The @hardikpandya7-led unit, in their maiden IPL season, clinch the title on their home ground - the Narendra Modi Stadium, Ahmedabad. 🙌🙌 @GCAMotera A round of applause for the spirited @rajasthanroyals! 👏 👏 #GTvRR pic.twitter.com/LfIpmP4m2f — IndianPremierLeague (@IPL) May 29, 2022 -
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఉగాది ఉత్తమ రచనల పోటీ
ఉగాది సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 27వ ఉగాది ఉత్తమ రచనల పోటీలో విజేతల పేర్లను నిర్వాహకులు ప్రకటించారు. . ఈ సారి పోటీకి అమెరికా, కెనడా, న్యూజీలాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్, దక్షిణ ఆఫ్రికా, అబు ధాభి. హాంగ్ కాంగ్, సింగపూర్, ఐర్లాండ్, భారత దేశాల నుంచి ఎంట్రీలు వచ్చాయి. విజేతలకు నిర్వాహాకులు అభినందలు తెలిపారు. విజేతల వివరాలు ఇలా ఉన్నాయి ఉత్తమ కథానిక విభాగం విజేతలు 1) “మరో కురుక్షేత్రం”- పాణిని జన్నాభట్ల (బోస్ట్న్, ఎంఏ, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 2) ‘‘ధారావాహిక హత్యలు” –నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్ (టాంపా, ఫ్లోరిడా, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 3) “భూలోక స్వర్గం” – డా. కె. గీత (మోర్గాన్హిల్, కాలిఫోర్నియా, ప్రశంసా పత్రం) 4) “ఆట – పోరు”- తాడికొండ కె. శివకుమార శర్మ, (గ్రేటర్ వాషింగ్టన్, డీసీ, ప్రశంసా పత్రం) ఉత్తమ కవిత విభాగం విజేతలు 1) “ఈ రాత్రికి సౌత్ ఆఫ్రికా” -గౌతమ్ లింగా (జోహెన్నస్బర్గ్, దక్షిణాఫ్రికా) ($116 నగదు పారితోషికం) 2) “ఏమంటేనేం?”- స్వాతి శ్రీపాద (డెట్రాయిట్, మిచిగాన్, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 3) “ఒంటరి సాయంత్రాలు”- రవి మంత్రిప్రగడ (డబ్లిన్, ఐర్లాండ్ ప్రశంసా పత్రం) 4) “పువ్వు” - సతీష్ గొల్లపూడి (ఆక్లాండ్, న్యూజీలాండ్, ప్రశంసా పత్రం) “నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు 1) “క్రైమ్ నెవెర్ పేస్” – వీకేవీ ప్రసాద్ (హైదరాబాద్, ఇండియా, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 2) “రెండు నిమిషాలు- అమృత వర్షిణి (లోన్ట్రీ, యూఎస్ఏ) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 3) “ఆడ పిల్ల”- షేక్ షబ్బర్ హుస్సేన్ (కడప, ఏపీ) ప్రశంసా పత్రం "నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు 1) “భూమిని హత్తుకునే క్షణాలకోసం”- అసిఫా గోపాల్ (నెల్లూరు, ఏపీ, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 2) “తను వెళ్ళిపోయింది”- రాజు గడ్డం (కడవిపల్లి గ్రామం, ఇండియా) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 3) “శిల-కల”- ఆవుల కార్తీక (హైదరాబాద్) ప్రశంసా పత్రం -
‘పై’ ఎలక్ట్రానిక్స్ లక్కీడ్రాలో బహుమతుల బొనాంజా
గత ఏడాది డిసెంబర్ 5న ప్రముఖ రిటైల్ దిగ్గజం పై ఇంటర్నేషన్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(Pai International Electronics Ltd) నిర్వహించిన మెగా ఫెస్టివల్ సేల్ లక్కీ డ్రాలో హైదరాబాద్కు చెందిన బాబీ అనే వ్యక్తి మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఏ కారును గెలుచుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను పై సంస్థ యూట్యూబ్లో ప్రసారం చేసింది. 2021 గాను దసరా, దీపావళి నేపథ్యంలో రూ. 2 వేలు కంటే ఎక్కువ విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేసే వారికి డిజిటల్ కూపన్లను పై ఇంటర్నేషనల్ అందించింది. ఈ సేల్లో బాబీ రూ. 8000 విలువైన సేల్ ఫోన్ను కొనుగోలు చేసి కారును గెల్చుకున్నాడు. కస్టమర్ల కోసం ప్రతియేడాది నాలుగు సార్లు, ప్రతి పండుగ సీజన్లో లక్కీ విజేతలకు నగదు బహుమతులను అందిస్తోంది. గత 20 సంవత్సరాలలో,..320 కార్లు, 320 బైక్లు, రూ. 22.5 కోట్ల విలువైన ఉచిత షాపింగ్, రూ. 7.3 కోట్ల గోల్డ్ రివార్డ్, రూ. 2.65 కోట్ల విలువైన నగదు బహుమతులు, అలాగే 64.56 కోట్ల విలువైన పై లాయల్టీ పాయింట్లను అందించింది. Pai International Electronics Ltd రిటైల్ సంస్థ మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫర్నీచర్ కోసం ప్రముఖ ప్లాట్ఫారమ్గా నిలుస్తోంది. కస్టమర్ల కోసం అనేక రకాల సేల్స్ను అందుబాటులోకి తెస్తోంది. అంతేకాకుండా కస్టమర్లకు అదనంగా లక్కీడ్రాలు, బహుమతులను ఉచితంగా అందిస్తోంది. పండుగ సీజన్ నేపథ్యంలో కస్టమర్లు విలువైన బహుమతులను ప్రకటించింది. వాటితో పాటుగా కస్టమర్లు 15 కోట్ల వరకు పైగా లాయల్టీ పాయింట్లను గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. హ్యుందాయ్ ఆరా వంటి కార్లు, అలాగే ఎల్ఈడీ స్మార్ట్ టీవీలను గెలుచుకునే అవకాశం కూడా ఉంది. కస్టమర్లకు అదనంగా గిఫ్ట్కార్డులను, రివార్డులను కూడా ప్రకటిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో పై ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ విస్తరించి ఉంది. ఇది సుమారు 87 లార్జ్ స్కేల్ మల్టీ బ్రాండ్ అవుట్లెట్లతో పాటుగా దాదాపు 121 మొబైల్ ఫోన్ అవుట్లెట్లతో, 15 ఫర్నిచర్ షాపులను కలిగి ఉంది. కోవిడ్-19 నేపథ్యంలో ఆన్లైన్ పోర్టల్ ద్వారా కస్టమర్లకు షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది. పై ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవలను కూడా చేస్తోంది పై ఇంటర్నేషనల్. పర్యావరణ పరిరక్షణ నుంచి నిరుపేద వృద్ధులకు, విద్యార్థులకు తన వంతు సహాకారాన్ని అందిస్తోంది. (అడ్వటోరియల్) -
తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్: అర్జున్ అదరహో...
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): మరో రౌండ్ మిగిలి ఉండగానే తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్ ఎరిగైసి అర్జున్ ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చాలెంజర్స్ చెస్ టోర్నమెంట్లో విజేతగా అవతరించాడు. థాయ్ దాయ్ వాన్ ఎన్గుయెన్ (చెక్ రిపబ్లిక్)తో శనివారం జరిగిన 12వ రౌండ్ గేమ్ను అర్జున్ కేవలం 15 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. పది గ్రాండ్మాస్టర్లతో సహా మొత్తం 14 మంది 13 రౌండ్లపాటు పోటీపడుతున్న ఈ టోర్నీలో 12వ రౌండ్ తర్వాత అర్జున్ 9.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతూ టైటిల్ను ఖరారు చేసుకున్నాడు. ఎన్గుయెన్, జొనాస్ బుల్ బెరీ (డెన్మార్క్) ఇద్దరూ 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఆదివారం చివరిదైన 13వ రౌండ్ గేమ్లో అర్జున్ ఓడిపోయి, ఎన్గుయెన్, జొనాస్ తమ గేముల్లో నెగ్గినా అర్జున్ స్కోరును దాటలేకపోతారు. వరంగల్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అర్జున్ చాలెంజర్స్ టోర్నీ విజేత హోదాలో వచ్చే ఏడాది జరిగే టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీకి అర్హత సాధించాడు. పెంటేల హరికృష్ణ, ఆధిబన్, విదిత్ తర్వాత టాటా స్టీల్ చాలెంజర్స్ టోర్నీ టైటిల్ గెలిచిన నాలుగో భారతీయ చెస్ ప్లేయర్గా అర్జున్ గుర్తింపు పొందాడు. ‘క్లాసికల్ ఫార్మాట్లో నా అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఆదివారం జరిగే చివరి రౌండ్ గేమ్లో నెగ్గి గెలుపు సంబరాలు చేసుకోవాలనుకుంటున్నా. ఇటీవల కాలంలో దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, శ్రీనాథ్ నారాయణన్ అందించిన సూచనలతో నా ఆట మరింత మెరుగైంది. ఈ టోర్నీ తొలి గేమ్లో ఓడిపోయే పరిస్థితి నుంచి తేరుకొని ‘డ్రా’ చేసుకోవడం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రెండో గేమ్లో విజయం సాధించాక అదే జోరును కొనసాగించా’ అని అర్జున్ వ్యాఖ్యానించాడు. -
భారత్దే ‘శాఫ్’ ఫుట్బాల్ టైటిల్
మాలీ: దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) చాంపియన్షిప్లో భారత జట్టు ఎనిమిదోసారి విజేతగా నిలిచింది. నేపాల్ జట్టుతో శనివారం జరిగిన ఫైనల్లో సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత్ 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున సునీల్ ఛెత్రి (49వ ని.లో), సురేశ్ సింగ్ (50వ ని.లో), అబ్దుల్ సమద్ (90వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఈ మ్యాచ్లో చేసిన గోల్తో సునీల్ ఛెత్రి ప్రస్తుతం అంతర్జాతీయ ఫుట్బాల్ ఆడుతున్న వారిలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో లయెనెల్ మెస్సీ (అర్జెంటీనా–80 గోల్స్)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానానికి చేరాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్–115 గోల్స్) టాప్ ర్యాంక్లో ఉన్నాడు. -
నా విజయం వెనుక చాలామంది కృషి ఉంది : సివిల్స్ 20 వ ర్యాంకర్
-
Italian Grand Prix: తొమ్మిదేళ్ల తర్వాత...
మోంజా (ఇటలీ): దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత ఫార్ములావన్ (ఎఫ్1) గ్రాండ్ప్రిలో మెక్లారెన్ జట్టు విజేతగా నిలిచింది. 2012లో జరిగిన బ్రెజిల్ గ్రాండ్ప్రిలో చివరిసారిగా విజేతగా నిలిచిన ఆ జట్టు ఇన్నేళ్లకు ఇటలీ గ్రాండ్ప్రిలో మెరిసింది. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్ప్రి ప్రధాన రేసులో మెక్లారెన్ డ్రైవర్ డానియెల్ రికియార్డో చాంపియన్గా నిలిచాడు. 53 ల్యాప్ల రేసును అతడు అందరికంటే ముందుగా గంటా 21 నిమిషాల 54.367 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 2018 మొనాకో తర్వాత మళ్లీ రికియార్డో ఒక ఎఫ్1 రేసులో గెలుపొందడం ఇదే తొలిసారి. రేసును రెండో స్థానం నుంచి ఆరంభించిన రికియార్డో... ట్రాక్ తొలి మలుపులోనే వెర్స్టాపెన్ను అధిగమించి ఆధిక్యంలోకి వచ్చాడు. అనంతరం తన లీడ్ను నిలబెట్టుకున్న అతడు విజేతగా నిలిచాడు. 1.747 సెకన్ల తేడాతో రేసును ముగించిన నోరిస్ (మెక్లారెన్) రెండో స్థానంలో నిలువగా... మూడో స్థానంలో బొటాస్ (మెర్సిడెస్) నిలిచాడు. హోమ్ గ్రాండ్ప్రిలో ఫెరారీ డ్రైవర్లు లెక్లెర్క్ నాలుగో స్థానంలో... సెయింజ్ ఆరో స్థానంలో నిలిచారు. -
పారాలింపిక్స్ విజేతలతో ప్రధాని మోదీ సమావేశం
-
టోక్యో ఒలింపిక్స్ విజేతలకు క్రీడాశాఖ సత్కారం
-
‘డ్రా’ అయితే సంయుక్త విజేతలే
దుబాయ్: తొలిసారి నిర్వహిస్తున్న వరల్డ్ టెస్టు చాంపియన్ (డబ్ల్యూటీసీ) విజేతను తేల్చే క్రమంలో ప్రత్యేక నిబంధనలు ఏమీ అవసరం లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భావించింది. కచ్చితంగా ఎవరో ఒకరు గెలవాలనేమీ లేదని, సాధారణ టెస్టుల తరహాలో మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే సంయుక్త విజేతలుగా ఇరు జట్లను ప్రకటించడమే సరైందని తేల్చింది. భారత్, న్యూజిలాండ్ మధ్య జూన్ 18 సౌతాంప్టన్లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ పోరుకు సంబంధించి నిబంధనలపై స్పష్టతనిచ్చింది. ప్రైజ్మనీ ఎంతనే దానిపై మాత్రం ఐసీసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ టెస్టు మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన విశేషాలు చూస్తే... మ్యాచ్ తేదీలు: జూన్ 18 నుంచి 22 వరకు వేదిక: సౌతాంప్టన్లోని ఏజియస్ బౌల్ మైదానం ఉపయోగించే బంతి: భారత్లో సాధారణంగా టెస్టు మ్యాచ్లను ఎస్జీ బంతులతో, న్యూజిలాండ్లో కూకాబుర్రా బంతులతో ఆడతారు. వేదిక మాత్రమే కాకుండా బంతులు ఉపయోగించడంలో కూడా ఎవరికీ ప్రత్యేక ప్రయోజనం ఉండరాదని ఐసీసీ భావించింది. అందుకే ఫైనల్ కోసం డ్యూక్స్ బంతులను ఎంపిక చేశారు. ఇంగ్లండ్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వాడే డ్యూక్స్ బంతులు సీమ్ ఎక్కువగా ఉండి బౌలింగ్కు అనుకూలిస్తాయి. మ్యాచ్ డ్రా అయితే విజేత ఎవరు: మ్యాచ్ ‘డ్రా’ లేదా ‘టై’గా ముగిస్తే భారత్, న్యూజిలాండ్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. డబ్ల్యూటీసీ ప్రకటించినప్పుడు ఈ నిబంధన ఉన్నా, ఇప్పుడు ఫైనల్కు ముందు ఐసీసీ దీనిని మళ్లీ పేర్కొంది. రిజర్వ్ డే ఉందా: ఉంది, జూన్ 23ను రిజర్వ్ డే ఉంచారు. అవసరమైతే ఆరో రోజూ ఆడిస్తాం అని ఐసీసీ ప్రకటించింది. ఐదు రోజుల్లో ఫలితం తేలకపోతే మ్యాచ్ను ఆరో రోజుకు పొడిగిస్తారా: ఈ విషయంలోనే ఐసీసీ ఇప్పుడు మరింత స్పష్టతనిచ్చింది. ‘రిజర్వ్ డే’ అనేది ప్రత్యామ్నాయ ఏర్పాటు మాత్రమే. అన్ని టెస్టుల్లాగే ఈ మ్యాచ్ కూడా ఐదు రోజులు పూర్తిగా జరిగి ఎవరో ఒకరు గెలవని పక్షంలో ఇరు జట్లనూ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు తప్ప ఆరో రోజుకు పొడిగించి ఫలితం కోసం ప్రయత్నించరు. కేవలం వర్షం తదితర వాతావరణ సమస్యల కారణంగా ఐదు రోజుల్లో సమయం వృథా అయితే మాత్రమే దానిని పూడ్చేందుకు రిజర్వ్ డేలో సమయాన్ని వాడుకుంటారు. రిజర్వ్ డే ఎలా ఉంటుంది: ఆరో రోజు అవసరం పడితే గరిష్టంగా ఐదున్నర గంటల (330 నిమిషాలు) లేదా 83 ఓవర్లు ఆడిస్తారు. దీనికి చివరి గంట అదనం. వర్షం కారణంగా కొంతసేపు అంతరాయం కలిగినా... అదే రోజు ఆటను పొడిగించి దానిని సరిచేస్తూ వస్తే ‘రిజర్వ్ డే’ను వాడరు. దాదాపు రోజంతా నష్టపోతే మాత్రమే ఆరో రోజు ఆడించే అంశంపై రిఫరీ నిర్ణయం తీసుకుంటారు. ఐదో రోజు చివరి గంటలో మాత్రం ఆరో రోజు ఆడించడం గురించి ప్రకటిస్తారు. అయితే ఇలాంటి అసాధారణ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఇరు జట్లనూ రిఫరీ సమాచారం అందిస్తూ ఉంటారు. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం ఆడిస్తారా: ఇటీవల ఐసీసీ కొన్ని కొత్త నిబంధనలను టెస్టుల్లోకి తెచ్చింది. ప్రస్తుతం సాగుతున్న శ్రీలంక, బంగ్లాదేశ్ సిరీస్లో కూడా వాటిని వాడారు. దీని ప్రకారం షార్ట్ రన్లను థర్డ్ అంపైర్ పర్యవేక్షిస్తారు. అంపైర్ ఎల్బీడబ్ల్యూ నిర్ణయంపై అప్పీల్కు వెళ్లే ముందు బ్యాట్స్మన్ షాట్కు ప్రయత్నించాడా అనే అంపైర్ను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఎల్బీల కోసం రివ్యూలో ఉపయోగించే ‘వికెట్ జోన్’ ఎత్తును కూడా పెంచారు. -
ఏపీ పంచాయతీ ఎన్నికలు: వీరికి లక్కుంది..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వీరికి లక్కుంది.. వారికి అదే దక్కింది.. అన్న చందంగా జిల్లాలో ఈ నెల 9న జరిగిన తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 9 మంది అదృష్టవంతులు అతి తక్కువ మెజారిటీలతో సర్పంచ్ పీఠాన్ని అధిరోహించారు. గెలిచిన అభ్యర్థులు తమ అదృష్టమంటూ ఆనందపడుతుంటే ఓడిన అభ్యర్థులు తమ ఖర్మంటూ తలలు పట్టుకుంటున్న పరిస్థితి. తొలిదశ పంచాయతీ ఎన్నికలు అనేక గ్రామ పంచాయతీల్లో నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. పోటీలో నిలిచిన అభ్యర్థులు ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లను సొంత ఖర్చులతో గ్రామాలకు పిలిపించి ఓట్లు వేయించినప్పటికీ ఉత్కంఠ పోరులో సింగిల్ డిజిట్ తేడాతో 9 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పీఠాన్ని దక్కించుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తక్కువ మెజారిటీతో చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో గెలుపొందిన సర్పంచ్ల వివరాలు ఇలా ఉన్నాయి. ►చీమకుర్తి మండలం నిప్పట్లపాడు పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ, టీడీపీల మధ్య ఉత్కంఠ పోరు సాగింది. గెలుపు నీదా నాదా అన్నట్లుగా మంగళవారం అర్ధరాత్రి వరకు సాగిన లెక్కింపు ప్రక్రియలో ఇరువురు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు ఇరువురు అభ్యర్థుల ఆమోదంతో టాస్ వేశారు. ఇందులో వైఎస్ఆర్ సీపీ మద్దతుతో పోటీ చేసిన రావులపల్లి కోటేశ్వరరావు విజయం సాధించి సర్పంచ్ పీఠాన్ని అధిరోహించారు. ►ఇంకొల్లు మండలం భీమవరం గ్రామంలో వైఎస్ఆర్ సీపీ, టీడీపీల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో వైఎస్ఆర్ సీపీ మద్దతుతో బరిలో ఉన్న చెన్నుపాటి రాజ్యలక్ష్మి ఒక్క ఓటు మెజారిటీతో సర్పంచ్గా ఎన్నికయ్యారు. ►పర్చూరు మండలం తూర్పుపెద్దివారిపాలెం పంచాయతీలో సైతం చివరి వరకు సాగిన ఉత్కంఠ పోరులో వైఎస్ఆర్సీపీ మద్దతుతో పోటీ చేసిన రావి సంధ్యారాణి ఒక్క ఓటు మెజారిటీతో సర్పంచ్గా ఎన్నికయ్యారు. ►ఒంగోలు మండలంలోని యర్రజర్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ మద్దతుతో పోటీలో ఉన్న తమ్మిశెట్టి రాములమ్మ ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఇరువర్గాలకు చెరి 5 వార్డులు సమానంగా గెలుపొందడం విశేషం. ►చీమకుర్తి మండలం జీఎల్ పురం గ్రామ పంచాయతీ ఎన్నికల లెక్కింపు చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. వైఎస్ఆర్సీపీ మద్దతుతో పోటీలో ఉన్న మన్నం వెంకటరావు చివరకు 4 ఓట్ల స్వల్ప మెజారిటీతో ప్రత్యర్థిపై విజయం సాధించి సర్పంచ్గా ఎన్నికయ్యారు. ►ఇంకొల్లు మండలం, సూదివారిపాలెం గ్రామంలో సైతం ఉత్కంఠభరితంగా పోటీ సాగింది. ఈ పోటీలో వైఎస్ఆర్సీపీ మద్దతుతో బరిలో నిలిచిన గోరంట్ల జయలక్ష్మి 4 ఓట్ల స్వల్ప తేడాతో సర్పంచ్గా విజయం సాధించారు. ►ఒంగోలు మండలం బొద్దులూరివారిపాలెం గ్రామంలో వైఎస్ఆర్ సీపీ, టీడీపీల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో వైఎస్ఆర్ సీపీ మద్దతుతో పోటీలో నిలిచిన కాట్రగడ్డ కవిత 7 ఓట్ల స్వల్ప తేడాతో విజయంఢంకా మోగించారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ గ్రామంలో మొట్టమొదటి సారి వైఎస్ఆర్ సీపీ పాగా వేసింది. ►ఒంగోలు మండలంలో టీడీపీకి బలమైన గ్రామంగా ఉన్న దేవరంపాడులో సైతం పంచాయతీ పోరు ఉత్కంఠ భరితంగా సాగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై టీడీపీ మద్దతుతో పోటీలో ఉన్న నన్నపనేని వెంకటేశ్వరరావు 9 ఓట్ల స్వల్ప మెజారిటీతో సర్పంచ్గా ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లాలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోరులో 9 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు 9 ఓట్ల లోపు మెజారిటీలతో గెలుపొంది అదృష్టవంతులు అనిపించుకోగా, వీరిపై పోటీ చేసి ఓడిపోయిన 9 మందికి దురదృష్టవశాత్తు ఓటమే దక్కిందని అంతా సానుభూతి చూపుతున్నారు. ఇంకొంచెం కష్టపడి ఒక్క ఓటు తెచ్చుకున్నా గెలిచేవాళ్లమంటూ వీరిలో కొందరు తమ దురదృష్టానికి తీవ్ర మనోవేదనకు గురవుతున్న పరిస్థితి. మొత్తానికి తొలిదశ ఎన్నికల్లో పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో తక్కువ మెజారిటీలతో గెలుపొందిన సర్పంచ్లకు బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నారు. -
బరిలో తోడల్లుళ్లు.. జూపల్లిదే గెలుపు
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూకట్పల్లిలో టీఆర్ఎస్ క్లీన్స్విప్ చేసింది. ఈ డివిజన్ నుంచి పోటీ చేసిన జూపల్లి సత్యనారాయణ విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు కూకట్పల్లికి చెందిన ‘మాధవరం’ ఇంటికి అల్లుళ్లు కావటం విశేషం. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులుగా మాధవరం కుటుంబానికి అల్లుళ్లు కావటంతో పోటీ రసవత్తరంగా మారింది. బంధువుల మధ్యనే పోటీ నెలకొనడంతో ఎవరికి ప్రచారం చేయాలో, ఓటు ఎవరికి వేయాలో తేల్చుకోలేకపోయారు. చదవండి: గ్రేటర్ ఫలితాలు : గెలిచిన అభ్యర్థులు వీరే.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాధవరం రామచంద్రరావు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మాధవరం కృష్ణారావు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. కూకట్పల్లి వెలమ సామాజిక వర్గంలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న మాధవరం కుటుంబ సభ్యులకు అల్లుళ్లుగా ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి సత్యనారాయణ, బీజేపీ అభ్యర్థి నాయినేని పవన్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి విశ్వ తేజేశ్వరరావులు కూకట్పల్లి వాస్తవ్యులే. అయినా ఓ విధంగా తోడల్లుళ్ల మధ్య పోరాటం సాగిందని చెప్పవచ్చు. చివరికి జూపల్లి సత్యనారాయణకే ఓటర్లు పట్టం కట్టారు. చదవండి: ఏఎస్రావు నగర్, ఉప్పల్లో కాంగ్రెస్ గెలుపు -
డగ్లస్ స్టువార్ట్కు బుకర్ ప్రైజ్
లండన్: న్యూయార్క్కు చెందిన స్కాటిష్ రచయత డగ్లస్ స్టువార్ట్ 2020 సంవత్సర బుకర్ప్రైజ్ను గెలుచుకున్నారు. ‘‘షుగ్గీబెయిన్’’ పేరిట రచించిన తన ఆత్మకథకు ఆయన 50వేల పౌండ్ల బుకర్ ప్రైజ్ను సాధించారు. 1980 ప్రాంతంలో గ్లాస్గో నగరంలో జరిగిన ఘటనల సమాహారంగా ఈ నవలను మలచారు. పోటీలో ఐదుగురు రచయితలను తోసిరాజని డగ్లస్ ఈ బహుమతి పొందారు. పోటీలో పాల్గొని ఓటమి పొందిన వారిలో భారతీయ మూలాలున్న రచయిత అవని దోషి (రచన: బర్న్ట్ షుగర్)కూడా ఉన్నారు. రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్లో గ్రాడ్యుయేషన్ అనంతరం డగ్లస్ న్యూయార్క్కు వచ్చారు. షుగ్గీ బెయిన్ పబ్లిష్ కావడానికి ముందు 30 మంది ఎడిటర్లు ఆ రచనను తిరస్కరించారు. (చదవండి: జార్జియా రీకౌంటింగ్లో బైడెన్ గెలుపు) -
సంయుక్త విజేతలుగా భారత్, రష్యా
చెన్నై: నాటకీయ పరిణామాల నడుమ వివాదాస్పద రీతిలో ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్ ముగిసింది. భారత్, రష్యా జట్లను సంయుక్త విజేతలుగా అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ప్రకటించింది. రెండు మ్యాచ్లతో కూడిన ఫైనల్లో తొలి మ్యాచ్లో ఆరు గేమ్లు ‘డ్రా’గా ముగిశాయి. దాంతో ఇరు జట్లూ 3–3తో సమంగా నిలిచాయి. ఫైనల్లోని రెండో మ్యాచ్ సందర్భంగా ఇద్దరు భారత క్రీడాకారులు నిహాల్ సరీన్, దివ్య దేశ్ముఖ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ పోవడం.... చివరకు సమయాభావం వల్ల వారు గేమ్లను వదులుకోవాల్సి జరిగింది. దాంతో రష్యా 4.5–1.5తో ఈ మ్యాచ్ను గెలిచింది. మ్యాచ్లో విజయానికి 2 పాయింట్లు, ‘డ్రా’ అయితే చెరో పాయింట్ ఇస్తారు. ఫలితంగా రష్యా ఓవరాల్గా 3–1తో విజయం సాధించినట్లయింది. అయితే విజయావకాశాలు ఉన్నదశలో ఇంటర్నెట్ కనెక్షన్ పోయిన కారణంగానే తాము గేమ్లు కోల్పోవాల్సి వచ్చిందని ‘ఫిడే’ అప్పీల్ కమిటీకి భారత్ అప్పీల్ చేసింది. అప్పీల్ను విచారించిన అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) అధ్యక్షడు అర్కాడీ ద్వోర్కోవిచ్ (రష్యా) అన్ని అంశాలను పరిశీలించి, భారత అప్పీల్ సరైనదేనని భావిస్తూ రెండో మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా రద్దు చేశారు. తొలి మ్యాచ్ సమంగా ముగియడంతో రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. స్వర్ణం గెలిచిన భారత బృందంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణ ఉన్నారు. టోర్నీ మొత్తంలో హంపి, హారిక నిలకడగా ఆడి భారత్కు స్వర్ణం దక్కడంలో కీలకపాత్ర పోషించారు. పోలాండ్తో జరిగిన సెమీఫైనల్లో హంపి టైబ్రేక్ గేమ్లో గెలిచి భారత్ను ఫైనల్కు చేర్చింది. ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, విదిత్ సంతోష్ గుజరాతి, నిహాల్ సరీన్, అరవింద్ చిదంబరం, ప్రజ్ఞానంద, దివ్య దేశ్ముఖ్, వైశాలి, భక్తి కులకర్ణి, వంతిక అగర్వాల్ మిగతా సభ్యులుగా ఉన్నారు. రష్యాతో జరిగిన ఫైనల్ తొలి మ్యాచ్లో విదిత్–నెపోమ్నియాచి (37 ఎత్తులు); హరికృష్ణ–అర్తెమీవ్ (54 ఎత్తులు); హంపి–కాటరీనా లాగ్నో (48 ఎత్తులు); హారిక–అలెగ్జాండ్రా కొస్టెనిక్ (48 ఎత్తులు); ప్రజ్ఞానంద–అలెక్సీ సరానా (56 ఎత్తులు); దివ్య–షువలోవా (51 ఎత్తులు) గేమ్లు ‘డ్రా’గా ముగిశాయి. రెండో మ్యాచ్లో విశ్వనాథన్ ఆనంద్–నెపోమ్నియాచి; విదిత్–దుబోవ్; హారిక–కొస్టెనిక్ గేమ్లు ‘డ్రా’గా ముగియగా... హంపి 88 ఎత్తుల్లో గోర్యాచిక్నా చేతిలో; దివ్య 25 ఎత్తుల్లో షువలోవా చేతిలో; నిహాల్ సరీన్ 25 ఎత్తుల్లో ఎసిపెంకో చేతిలో ఓడిపోయారు. దివ్య గెలిచే స్థితిలో, నిహాల్ ‘డ్రా’ చేసుకునే స్థితిలో ఉన్నపుడు ఇంటర్నెట్ కనెక్షన్ పోవడం, ఇంటర్నెట్ పునరుద్ధరణ జరిగేసరికి గేమ్ నిర్ణీత సమయం అయిపోవడంతో వారిద్దరు ఓడిపోయినట్లు ప్రకటించారు. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ముఖాముఖిగా ఈ ఏడాదే రష్యా రాజధాని మాస్కోలో ఆగస్టు 5 నుంచి 17 వరకు జరగాల్సిన చెస్ ఒలింపియాడ్ను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. దాని స్థానంలో ఆన్లైన్లో చెస్ ఒలింపియాడ్ను నిర్వహించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందన... తొలిసారి నిర్వహించిన ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్లో స్వర్ణ పతకం గెలిచిన భారత జట్టులో సభ్యులైన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్లో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. -
కోల్కతాకే ఐఎస్ఎల్ కిరీటం
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్ చరిత్రలో అట్లెటికో డి కోల్కతా జట్టు చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన ఆరో సీజన్ ఫైనల్లో కోల్కతా 3–1 గోల్స్ తేడాతో చెన్నైయిన్ ఎఫ్సీపై విజయం సాధించింది. దాంతో ఐఎస్ఎల్ టైటిల్ను అత్యధికంగా మూడుసార్లు గెలిచిన తొలి జట్టుగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకు ఆరు సీజన్లు జరగ్గా... అందులో కోల్కతా (2014, 2016, 2019–20), చెన్నైయిన్ రెండు సార్లు (2015, 2017–18), బెంగళూరు ఒకసారి (2018–19) విజేతలుగా నిలిచాయి. ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానంలో నిర్వహించిన ఫైనల్లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన కోల్కతా అందివచ్చిన ఏ అవకాశాన్ని వదల్లేదు. కోల్కతా ప్లేయర్ జావీ (10వ, 90+3వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... గార్సియా (48వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. చెన్నైయిన్ తరఫున వాల్స్కీస్ (69వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. రెండో అర్ధభాగంలో చెన్నైయిన్ ప్లేయర్లు గోల్ కోసం చేసిన ప్రయత్నాలను కోల్కతా గోల్ కీపర్ అరిందామ్ భట్టాచార్య సమర్థవంతంగా అడ్డుకున్నాడు. సీజన్ చాంపియన్ కోల్కతాకు రూ. 8 కోట్లు... రన్నరప్ చెన్నైయిన్ రూ. 4 కోట్లు ప్రైజ్మనీగా లభించాయి. 15 గోల్స్ సాధించిన చెన్నైయిన్ ఆటగాడు వాల్స్కీస్కు ‘గోల్డెన్ బూట్’ అవార్డు దక్కింది. గోల్డెన్ గ్లవ్ అవార్డును బెంగళూరు ఎఫ్సీ గోల్కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధు గెల్చుకున్నాడు. ఎమర్జింగ్ ప్లేయర్ సుమీత్ (కోల్కతా)... ‘హీరో ఆఫ్ ద లీగ్’గా హ్యూగో బౌమౌస్ (గోవా ఎఫ్సీ) నిలిచారు. -
సాక్షి ప్రీమియర్ లీగ్ విజేతలకు బహుమతి ప్రధానం
-
చాంపియన్స్ భవన్స్, సర్దార్ పటేల్ కాలేజీ
సాక్షి, హైదరాబాద్: సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) తెలంగాణ రీజియన్ క్రికెట్ టోర్నమెంట్ జూనియర్ విభాగంలో భవన్స్ శ్రీ అరబిందో జూనియర్ కాలేజీ (సైనిక్పురి), సీనియర్ విభాగంలో సర్దార్ పటేల్ (ఎస్పీ) డిగ్రీ కాలేజీ (సికింద్రాబాద్, పద్మారావునగర్) జట్లు విజేతలుగా నిలిచాయి. ‘సాక్షి’ మీడియా గ్రూప్, శ్రీ చైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నీ గురువారం ముగిసింది. దుండిగల్లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) మైదానంలో జరిగిన జూనియర్ విభాగం ఫైనల్లో భవన్స్ శ్రీ అరబిందో జూనియర్ కాలేజీ ఎనిమిది వికెట్ల తేడాతో ఎస్ఆర్ఆర్ జూనియర్ కాలేజీ (మంచిర్యాల) జట్టుపై ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్ఆర్ కాలేజీ జట్టు 20 ఓవర్లలో 74 పరుగులకు ఆలౌటైంది. సాయి (22), ఆసిఫ్ (15), వికాస్ (15) రాణించారు. భవన్స్ జట్టు బౌలర్లలో ఇలియాన్ 9 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా... మయాంక్, రాహుల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం భవన్స్ 8 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పో యి 78 పరుగులు చేసి గెలిచింది. భవన్స్ జట్టులో సాకేత్ (43; 7 ఫోర్లు), ఇలియాన్ (12) ఆకట్టుకున్నారు. ఎస్ఆర్ఆర్ బౌలర్ సాయి కృష్ణ రెండు వికెట్లు తీశాడు. ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన ఇలియాన్కు ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు లభించింది. సర్దార్ పటేల్ డిగ్రీ కాలేజీ జట్టు సీనియర్స్ విభాగం ఫైనల్లో సర్దార్ పటేల్ కాలేజీ 47 పరుగుల ఆధిక్యంతో ఆదర్శ్ డిగ్రీ, పీజీ కాలేజీ జట్టును ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. తొలుత సర్దార్ పటేల్ కాలేజీ జట్టు 20 ఓవర్లలో మూడు వికెట్లకు 162 పరుగులు సాధించింది. షేక్ సోహైల్ (55), రాకేశ్ (43) రాణించారు. అనంతరం ఆదర్శ్ కాలేజీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులు చేసి ఓడిపోయింది. షేక్ సోహైల్కు ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్’ పురస్కారం దక్కింది. జూనియర్, సీనియర్ విభాగంలో విజేతగా నిలిచిన భవన్స్, సర్దార్ పటేల్ కాలేజీ జట్లకు రూ. 50 వేలు చొప్పున... రన్నరప్ ఎస్ఆర్ఆర్, ఆదర్శ్ డిగ్రీ కాలేజీ జట్లకు రూ. 25 వేలు చొప్పున ప్రైజ్మనీ అందజేశారు. ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన సాకేత్ (భవన్స్ శ్రీ అరబిందో), రాకేశ్ (సర్దార్ పటేల్ కాలేజీ)లకు రూ. 15 వేలు చొప్పున... ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్స్’గా నిలిచిన ఇలియాన్ (భవన్స్), షేక్ సోహైల్ (సర్దార్ పటేల్)లకు రూ. 10 వేలు చొప్పున ప్రైజ్మనీ లభించింది. సైనిక్పురిలోని భవన్స్ శ్రీ అరబిందో జూనియర్ కాలేజీలో జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్లు రాణి రెడ్డి (కార్పొరేట్ ఎఫైర్స్), ఏఎల్ఎన్ రెడ్డి (బిజినెస్ కంట్రోల్), భవన్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ కమోడోర్ (రిటైర్డ్) జేఎల్ఎన్ శాస్త్రి, శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఏజీఎం డి.వెంకటేశ్వర్లు డీన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు ట్రోఫీలు, చెక్లు అందజేశారు. -
సాక్షి ప్రీమియార్ లీగ్ విజేతలకు బహుమతి ప్రదానోత్సవం
-
ఏ పంట వేయాలో చెప్పేస్తుంది...
వారంతా రైతు బిడ్డలు. చిన్నప్పట్నుంచీ తాము తిరిగిన ఊరు, పంట పొలాలు, అక్కడ మట్టి పరిమళాలు గురించి మాత్రమే తెలుసు. అయితేనేం కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వినియోగించుకోవడంలో తమకు ఎవరూ సాటి పోటీ లేదని నిరూపించుకున్నారు. చిన్నప్పట్నుంచీ భూమినే నమ్ముకున్న బతుకులైనా దానికి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం జోడించారు. వాన రాకడల్ని, వాతావరణంలో మార్పుల్ని, పంటలపై వాటి ప్రభావాన్ని తెలుసుకోవడం కోసం ఒక యాప్ని రూపొందించారు. ఈ యాప్ ద్వారా మట్టిలో నాణ్యత ఎంత?, అది ఏ పంటలకు అనుకూలం? వంటివన్నీ ఆ యాప్ కచ్చితమైన అంచనాలతో చెప్పేస్తుంది. భారత్లోని వివిధ రాష్ట్రాల్లో అత్యంత మారుమూల గ్రామాలకు చెందిన వీరంతా ఒక బృందంగా ఏర్పడి ఈ యాప్ను రూపొందించింది. పుణేకి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ ఐసెర్టిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసే సరికొత్త ఆవిష్కరణలకు ఇచ్చే ప్రైజ్ వీరి యాప్కు లభించింది. సాఫ్ట్వేర్ కార్యక్రమాలకు సంబంధించిన హాక్థాన్ అనే వేదికలో వీరంతా చేరి తమ మేధకు పదునుపెట్టారు. హాక్థాన్ విసిరే సవాళ్లలో టీమ్ వర్క్, ఏఐ వినియోగం, బ్లాక్చైన్ టెక్నాలజీ వంటివన్నీ విస్తృతంగా అధ్యయనం చేస్తారు. మొత్తం 12 మంది రైతు బిడ్డలంతా కలిసి ఈ యాప్ని రూపొందించి ప్రైజు కొట్టేశారు. -
చాంప్స్ మెద్వెదేవ్, కీస్
సిన్సినాటి (అమెరికా): ప్రతిష్టాత్మక సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ విభాగంలో తొమ్మిదో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా), మహిళల సింగిల్స్ విభాగంలో 16వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) విజేతలుగా నిలిచారు. ఫైనల్స్లో మెద్వెదేవ్ 7–6 (7/3), 6–4తో 16వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై విజయం సాధించగా... మాడిసన్ కీస్ 7–5, 7–6 (7/5)తో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా)ను ఓడించింది. మెద్వెదేవ్, కీస్ కెరీర్లో అత్యున్నత శ్రేణి టైటిల్స్ ఇవే కావడం విశేషం. చాంపియ్స్ మెద్వెదేవ్కు 11,14,225 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 7 కోట్ల 95 లక్షలు)... మాడిసన్ కీస్కు 5,44,500 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 3 కోట్ల 88 లక్షలు) లభించాయి. సెమీఫైనల్లో ప్రపంచ నంబర్వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)ను ఓడించిన మెద్వెదేవ్ ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించాడు. పది ఏస్లను సంధించిన అతను రెండుసార్లు గాఫిన్ సర్వీస్ను బ్రేక్ చేశాడు. గత రెండు వారాల్లో వాషింగ్టన్ ఓపెన్, మాంట్రియల్ మాస్టర్స్ టోర్నీల్లో ఫైనల్కు చేరి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న 23 ఏళ్ల మెద్వెదేవ్ మూడో ప్రయత్నంలో టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన ఐదో రష్యా ప్లేయర్గా గుర్తింపు పొందాడు. గతంలో రష్యా తరఫున సఫిన్, డెవిడెంకో, చెస్నోకోవ్, ఖచనోవ్ ఈ ఘనత సాధించారు. తాజా విజయంతో ఏటీపీ ర్యాంకింగ్స్లో మెద్వెదేవ్ ఐదో ర్యాంక్కు చేరుకున్నాడు. 2010లో డెవిడెంకో తర్వాత రష్యా ప్లేయర్ టాప్–5లోకి రావడం ఇదే ప్రథమం. కుజ్నెత్సోవాతో జరిగిన ఫైనల్లో కీస్ రెండు సెట్లలోనూ 3–5తో వెనుకబడి పుంజుకోవడం విశేషం. ఫైనల్ చేరే క్రమంలో ఇద్దరు ప్రపంచ మాజీ నంబర్వన్స్ హలెప్ (రొమేనియా), వీనస్ (అమెరికా)లను ఓడించిన కీస్ తుది పోరులోనూ పట్టుదలతో ఆడింది. గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో కీస్ 13 ఏస్లు సంధించింది. తాజా విజయంతో కీస్ ఏడాది తర్వాత టాప్–10ర్యాంకింగ్స్లోకి వచ్చింది. ఎనిమిది స్థానాలు ఎగబాకిన ఆమె ప్రస్తుతం పదో ర్యాంక్లో ఉంది. -
సిన్సినాటి చాంప్స్ మెద్వదేవ్, కీస్
సిన్సినాటి: సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో సరికొత్త చాంపియన్లు అవతరించారు. పురుషుల సింగిల్స్లో డేనియల్ మెద్వదేవ్(రష్యా), మహిళల సింగిల్స్లో మాడిసన్ కీస్(అమెరికా) ట్రోఫీలు ఎగరేసుకుపోయారు. సోమవారం జరిగిన తుదిపోరులో తొమ్మిదోసీడ్, వరల్డ్ నెం.5 మెద్వదేవ్ 7–6(7/3), 6–4తో 16వ సీడ్, 15వ ర్యాంకర్ డేవిడ్ గఫిన్(బెల్జియం)పై చెమటోడ్చి నెగ్గాడు. ఇది మెద్వదేవ్కు తొలి ఏటీపీ మాస్టర్స్ టైటిల్. కాగా, అద్భుత ఫామ్లో ఉన్న మెద్వదేవ్కు ఈ ఏడాది ఇది 43వ విజయం. అతని తర్వాతి స్థానంలో 41 విజయాలతో నాదల్(స్పెయిన్), 39 గెలుపులతో ఫెదరర్(స్విట్జర్లాండ్) ఉండడం విశేషం. మరోవైపు హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో స్థానిక క్రీడాకారిణి మాడిసన్ కీస్నే విజయం వరించింది. తుదిపోరులో ఆమె 7–5, 7–6(7/5)తో స్వెత్లానా కుజ్నెత్సోవా(రష్యా)పై చెమటోడ్చి నెగ్గింది. ఇది కీస్కు కెరీర్లో ఐదో టైటిల్ కాగా, ఈ సీజన్లో రెండోది. -
సంయుక్త విజేతలు భారత్, పాకిస్తాన్
మస్కట్ (ఒమన్): ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. డిఫెండింగ్ చాంపియన్ భారత్, మాజీ విజేత పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. స్థానిక కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 9 గంటల 10 నిమిషాలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 10.40 నుంచి) ప్రారంభం కావాల్సింది. అయితే మ్యాచ్ మొదలయ్యే సమయానికి ఉరుములతో కూడిన భారీ వర్షం మొదలైంది. గంటన్నరపాటు వేచి చూసినా... వర్షం తగ్గకపోవడంతో నిర్వాహకులు ఫైనల్ను రద్దు చేసి భారత్, పాకిస్తాన్ లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. -
విజేత వెటెల్
స్పా–ఫ్రాంకోర్చాంప్స్: ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ బెల్జియం గ్రాండ్ప్రిలో విజేతగా నిలిచాడు. ఆదివారం పోల్ పొజిషన్తో రేసును ప్రారంభించిన హామిల్టన్ను వెటెల్ తొలి ల్యాపులోనే అధిగమించాడు. అక్కడి నుంచి రేసు ముగిసేదాకా ఆధిక్యంలో కొనసాగిన వెటెల్ 44 ల్యాపుల ఈ రేసును గంటా 23 ని.34.476 సెకన్లలో పూర్తి చేశాడు. అతనికంటే 11.061 సెకన్లు ఆలస్యమైన హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్, ఓకాన్లు వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచారు. ప్రధాన రేసు మొదలైన కాసేపటికే రేసింగ్ కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదానికి కారణమైన హుల్కెన్బర్గ్పై ఫార్ములావన్ నిర్వాహకులు 10 స్థానాలు పెనాల్టీగా విధించారు. -
గెలుపు గుర్రం షిరహట్టి ...!
షిరహట్టి సీటును గెలుచుకున్న పార్టీనే కర్ణాటకలో సర్కార్ను ఏర్పాటు చేయడం ఒక సంప్రదాయంగా వస్తోంది. 1972 నుంచి కూడా ఇదే తీరు కొనసాగుతోంది. మొత్తం 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీలో ఈ స్థానానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. జనతాపార్టీ మొదలుకుని కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ వరకు గత 46 ఏళ్లుగా ఇక్కడి నుంచి గెలిచినవారు ఏ పార్టీలో ఉంటే అదే ప్రభుత్వం ఏర్పడుతూ వస్తోంది. ఒక్కో సందర్భంలో అధికారపార్టీకి చెందిన వారు ఓటమి పాలై ఇండిపెండెంట్ గెలిచినా, ఆ స్వతంత్ర ఎమ్మెల్యే చేరిన పార్టీనే అధికారానికి వస్తోంది. ఇదీ నియోజకవర్గం... ముంబై కర్ణాటకలోని గదగ్ జిల్లాలోని 65వ నంబర్ నియోజకవర్గం షిరహట్టి. దాదాపు 2 లక్షల ఓటర్లు. 2013లో 71.8 శాతం ఓటింగ్ నమోదైంది. 20–49 ఏళ్లలోపున్న ఓటర్లు దాదాపు 81 శాతం ఉన్నారు.. వీరిలో 20–29 ఏళ్లలోపున్నవారు 31 శాతం, 30–39 ఏళ్లలోపున్నవారు 32 శాతమున్నారు. మతసామరస్యానికి షిరిహట్టి ప్రతీకగా నిలుస్తోంది. 450 ఏళ్లకు పైగా హిందువులు,ముస్లింలకు ఆరాధ్యనీయమైన శ్రీజగద్గురు ఫకిరీశ్వర మఠం ఇక్కడే ఉంది. ఈ మఠం ప్రధాన పూజారి సూఫీ, భక్తి మార్గాలను బోధిస్తారు. ప్రధాన పూజారి మరణించాక హిందు, ఇస్లామ్ పద్ధతుల్లో అంతిమ సంస్కారాలు ఆచరిస్తారు. ఇదీ రికార్డ్... –1972లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి డబ్ల్యూవీ వదిరాజ్ఆచార్య గెలిచారు. అప్పుడు దేవరాజ్ అర్స్ నాయకత్వంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడింది.1983 వరకు ఈ సీటుపై పట్టును కాంగ్రెస్ కొనసాగించింది. –1983లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపనల్ గులప్ప ఫకీరప్ప స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి జనతాపార్టీకి మద్దతు ప్రకటించారు. అప్పుడు రామకృష్ణ హెగ్డే నేతృత్వంలో జనతా ప్రభుత్వం ఏర్పడింది. 1985లోనూ జనతాపార్టీనే ఆ సీటును నిలుపుకోగా మళ్లీ హెగ్డే సీఎంగా ప్రమాణం చేశారు. –1989లో మళ్లీ ఆ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. వీరేంద్రపాటిల్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ఆ రాష్ట్రంలో మతఘర్షణలు తలెత్తడంతో ఏఐసీసీ అధ్యక్షుడు రాజీవ్గాంధీ ఆయనను సీఎంగా తొలగించారు. ఆ తర్వాత ఇది కాంగ్రెస్ చేసిన అతిపెద్ద రాజకీయ తప్పిదంగా మిగిలిపోయింది. –1994లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఫకీరప్పను జనతాదళ్ టికెట్పై జీఎం మహంతషెట్టార్ ఓడించారు. దరిమిలా హేచ్డీ దేవెగౌడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. –1999లో కాంగ్రెస్ మళ్లీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎస్ఎం కృష్ణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. –2004 ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. షిరహట్టి నియోజకవర్గాన్ని కాంగ్రెస్ దక్కించుకున్నా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించలేకపోయింది. ఈ పరిస్థితుల్లో జేడీ ఎస్తో జతకట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే కొంత కాలానికి బీజేపీతో హేచ్డీ కుమారస్వామి చేతులు కలపడంతో ఈ సర్కార్ పతనమైంది. –2008లో బీజేపీ తొలిసారిగా షిరహట్టిపై పట్టుసాధించింది. దక్షిణ భారత్లోనే మొదటిసారిగా బీఎస్యడ్యూరప్ప నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. –2013లో కాంగ్రెస్ మళ్లీ ఈ స్థానాన్ని చేజిక్కించుకుంది. సిద్ధరామయ్య సీఎం అయ్యారు. –ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దొడ్డమని రామకృష్ణ షిడ్లింగప్పపై బీజేపీ అభ్యర్థి రామప్ప సోబెప్ప లామని పోటీ చేస్తున్నాడు. గత ఎన్నికల్లోనే ఈ రెండుపార్టీల తరఫునే వీరే బరిలో నిలిచారు. కేవలం 315 ఓట్ల అతి స్వల్ప మెజారిటీతో షిడ్లింగప్ప గెలుపొందారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సెల్పీ కొట్టు.. ఐఫోన్ పట్టు
న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్లు మరి ఇంతగా అభివృద్ధి చెందక ముందు ఫోటో దిగాలంటే...ఒకటి మన దగ్గరైనా కెమెరా ఉండాలి లేదంటే ఫోటో స్టూడియోకైనా వెళ్లాలి. మరి ఇప్పుడో...ఈ పరిస్థితి పూర్తిగా మారింది. స్మార్ట్ ఫోన్లలో ఫ్రంట్ కెమరా అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరు ఓ కెమెరామాన్ అయ్యారు. ఒక నివేదిక ప్రకారం ప్రతిరోజు కొన్నిలక్షల మంది సెల్ఫీల కోసం దాదాపు ఏడు నిమిషాల సమయం కేటాయిస్తున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఇలాంటి వారందరికి ఒక శుభవార్త... సెల్పీలు తీసుకోవడంలో మీకు మంచి ప్రావీణ్యం ఉన్నట్లయితే ఆపిల్ ఐ ఫోన్ను ఉచితంగా పొందవచ్చు. ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ ఈ ఐపీఎల్ సీజన్ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ‘టీ20ఆన్ఎయిర్టెల్4జీ’ పోటీని నిర్వహిస్తుంది. అయితే ఈ అవకాశం కేవలం ఎయిర్టెల్ సబ్స్ర్కైబర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా... 1. ఎయిర్టెల్ 4జీ సిమ్ను తీసుకోవాలి. 2. తర్వాత ఆ సిమ్కార్డ్ కనిపించేలా పట్టుకొని ఒక సెల్ఫీ దిగాలి. 3. అనంతరం ఆ సెల్ఫీని సోషల్ మీడియా చానల్స్ అయిన ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో టీ20ఆన్ఎయిర్టెల్4జీ హాష్టాగ్లో పోస్టు చేయాలి. 4. ఎయిర్టెల్ ఇండియాను, మరో ముగ్గురు స్నేహితులను కూడా టాగ్ చేసి వారిని కూడా ఇదే విధంగా చేయమని చెప్పండి. వచ్చిన ఎంట్రీలలో నుంచి కంపెనీ ఏడుగురు విజేతలను ఎంపిక చేస్తుంది. వారిలో రోజుకు ఒక విజేతకు ఆపిల్ ఐఫోన్ 8ను అందించనుంది. విజేతలకు సంబంధించిన వివరాలను ఎయిర్టెల్ తన అధికారిక వెబ్పేజీలో ప్రకటించనుంది. విజేతలను ప్రకటించిన అనంతరం వారు 24 గంటలలోపే స్పందించి, తమ వివరాలను అందించాలి. అలా చేయని పక్షంలో డ్రాలో ఎంపికైన తరువాతి వ్యక్తికి ఐ ఫోన్8ను గెలుచుకునే అవకాశం కల్పించనున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది. -
క్రికెట్ టోర్నమెంట్ విన్నర్ కాశీనగర్ జట్టు
పర్లాకిమిడి : గజపతి జిల్లాలోని కాశీనగర్ సమితి అల్లాడ గ్రామపంచాయతీలో నవీన్ సాము స్మారక క్రికెట్ టోర్నమెంట్ను మాజీఎమ్మెల్యే, బీజేడీ నాయకుడు కోడూరు నారాయణరావు మంగళవారం ప్రారంభిం చారు. ఈ టోర్నమెంట్లో కాశీనగర్, ఖండవ, అల్లాడ, గుణుపురం టీమ్లు పాల్గొన్నాయి. టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో కాశీనగర్ టీమ్ విన్నర్గా, గుణుపురం జట్టు రన్నర్గా నిలిచింది. విజేతలకు కాశీనగర్ సమితి చైర్మన్ సీహెచ్ సింహాద్రి, కె.నారాయణరావులు షీల్డులు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శొబొరొ, సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి ఇండియా స్పెల్బీ, మ్యాథ్బీ కేటగిరీ–4 విజేతలు వీరే
హైదరాబాద్ : ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాక్షి ఇండియా స్పెల్బీ, మ్యాథ్బీ–2017 (కేటగిరీ–4, తెలంగాణ రాష్ట్రం) విజేతలను ప్రకటించారు. వేలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలు ఎంతో ఉత్కంఠగా కొనసాగాయి. చివరగా నిర్వహించిన ఫైనల్స్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విజేతలు, వారి తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాషపై, మ్యాథ్స్ విషయంలో అంతర్గతంగా ఉన్న భయాలు పోగొట్టి, వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడంతో పాటు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఈ పోటీలు కలిగించాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. స్పెల్బీ ప్రథమ బహుమతి: హైదరాబాద్లోని నీరజ్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న ఎస్. ఉదయశ్రీ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిప్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్బీ ప్రథమ బహుమతి: హైదరాబాద్లోని వికాస్ ది కాన్సెప్ట్ స్కూల్ బాచుపల్లిలో చదువుతున్న సాయి శ్రీరామ్ కార్తీక్ బి కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిప్ట్ హాంపర్ అందజేశారు. స్పెల్బీ ద్వితీయ బహుమతి: హైదరాబాద్లోని గీతాంజలి దేవశాలలో చదువుతున్న మ్రినల్ కుటేరి కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిప్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్బీ ద్వితీయ బహుమతి: హైదరాబాద్లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న ఆశ్రిత్ రెడ్డి బిరదవోలు కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిప్ట్ హాంపర్ అందజేశారు. స్పెల్బీ తృతీయ బహుమతి: హైదరాబాద్లోని భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్, జూబ్లీహిల్స్లో చదువుతున్న వి. కృష్ణ సాయి గాయిత్రి కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్బీ తృతీయ బహుమతి: హైదరాబాద్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నాచారం బ్రాంచ్లో చదువుతున్న కావేరి ప్రియా పుట్టి కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. -
సాక్షి ఇండియా స్పెల్బీ, మ్యాథ్బీ విజేతలు వీరే
హైదరాబాద్ : ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాక్షి ఇండియా స్పెల్బీ, మ్యాథ్బీ–2017 (కేటగిరీ–3, తెలంగాణ రాష్ట్రం) విజేతలను ప్రకటించారు. వేలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలు ఎంతో ఉత్కంఠగా కొనసాగాయి. చివరగా నిర్వహించిన ఫైనల్స్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విజేతలు, వారి తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాషపై, మ్యాథ్స్ విషయంలో అంతర్గతంగా ఉన్న భయాలు పోగొట్టి, వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడంతో పాటు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఈ పోటీలు కలిగించాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. స్పెల్బీ ప్రథమ బహుమతి: హైదరాబాద్లో ది ఆగాఖాన్ అకాడమీలో చదువుతున్న వెగా దర్శి కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిప్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్బీ ప్రథమ బహుమతి: హైదరాబాద్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, గోల్కొండ బ్రాంచ్లో చదువుతున్న వి. సాయి అఖిల్ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. స్పెల్బీ ద్వితీయ బహుమతి : హైదరాబాద్లోని వికాస్ ది కాన్సెప్ట్ స్కూల్, బాచుపల్లిలో చదువుతున్న టి. సౌజన్య లక్ష్మి కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్బీ ద్వితీయ బహుమతి : హైదరాబాద్లోని చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న అరిట్రో రే కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. స్పెల్బీ తృతీయ బహుమతి : హైదరాబాద్లోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, బంజారాహిల్స్ బ్రాంచ్లో చదువుతున్న నిహారిక కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్బీ తృతీయ బహుమతి : హైదరాబాద్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నాచారం బ్రాంచ్లో చదువుతున్న హరి వైష్ణవి కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. -
ఎక్కడా తగ్గలేదు
కేప్టౌన్: దక్షిణాఫ్రికాతో రెండు పరిమిత ఓవర్ల సిరీస్లు గెలుచుకొని సగర్వంగా తిరిగి వెళుతుండటం పట్ల తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ చాలా సంబరంగా ఉన్నాడు. చివరి టి20లో కెప్టెన్గా వ్యవహరించిన రోహిత్, ఈ మ్యాచ్లో తమ వ్యూహాలన్నీ సఫలమయ్యాయని చెప్పాడు. ‘ఈ రెండు పరిమిత ఓవర్ల ట్రోఫీలను అందుకోవడం సంతోషంగా ఉంది. సిరీస్ మొత్తం మేం చాలా దూకుడుగా ఆడాం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా బృందం వెనకడుగు వేయలేదు. దాని వల్లే ఇవాళ విజేతలుగా ఇక్కడ నిలబడ్డాం’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. తొలి ఆరు ఓవర్లలో కచ్చితత్వంతో వికెట్లపైకి మాత్రమే బంతులు వేయాలనేది తమ వ్యూహమని, దీనిని సమర్థంగా అమలు చేసి బౌలర్లు మ్యాచ్ గెలిపించారని అతను అన్నాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే మేం మరో 15 పరుగులు తక్కువగా చేశాం. మాకు లభించిన ఆరంభాన్ని బట్టి చూస్తే చివర్లో కాస్త జోరు తగ్గింది. అయితే ఈ అనుభవంతో మున్ముందు మరిన్ని విషయాలు నేర్చుకుంటాం’ అని రోహిత్ అభిప్రాయ పడ్డాడు. ఏ జట్టుకూ సాధ్యం కాని రీతిలో గత రెండున్నర నెలలుగా అద్భుత ప్రదర్శన కనబర్చామన్న భువనేశ్వర్ కుమార్...ఈ పర్యటన తనకు మధురానుభూతిగా మిగిలిపోయిందని చెప్పాడు. -
జైట్లీ బడ్జెట్లో విన్నర్స్, లూజర్స్ వీరే!
న్యూఢిల్లీ : మోదీ ప్రభుత్వం 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు తన పూర్తి స్థాయి బడ్జెట్ 2018ను నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు, రైతులకు వరాల జల్లులు కురిపిస్తూ ఈ బడ్జెట్ను ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. ఉద్యోగాలు, ప్రైవేట్ పెట్టుబడుల వృద్ధికి కూడా జైట్లీ బడ్జెట్ పెద్ద పీట వేసింది. ఈ క్రమంలో జైట్లీ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో విన్నర్లు ఎవరు.. లూజర్లు ఎవరో తెలుసుకుందాం.. విన్నర్లు... వ్యవసాయదారులు : ఈ బడ్జెట్లో వ్యవసాయదారులే అతిపెద్ద విజేతలు. పంటలకు కనీస మద్దతు ధర, వ్యవసాయ మార్కెట్లపై భారీ మొత్తంలో పెట్టుబడులు, గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ నగదు, సోలార్ పంపుల ద్వారా రైతులు ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్ను రాష్ట్రాలు కొనుగోలు చేసేలా ఆదేశం వంటి వాటిని జైట్లీ ప్రవేశపెట్టారు. దీంతో వ్యవసాయ ఆధారిత కంపెనీలు శక్తి పంప్స్ ఇండియా లిమిటెడ్, జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్, కేఎస్బీ పంప్స్ లిమిటెడ్, కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్, అవంతి ఫీడ్స్ లిమిటెడ్, వాటర్బేస్ లిమిటెడ్, జేకే అగ్రి జెనెటిక్స్ లిమిటెడ్, పీఎల్ ఇండస్ట్రీస్ లకు లబ్ది చేకూరనున్నట్టు తెలుస్తోంది. ఆరోగ్య సంరక్షణదారులు... కేంద్రం కొత్తగా ప్రవేశపెడుతున్న నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షలు ఆరోగ్య బీమా కల్పిస్తామని జైట్లీ హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్, ఫోర్టిస్ హెల్త్కేర్ లిమిటెడ్ లాంటి కంపెనీలు ఎక్కువగా లబ్ది పొందనున్నాయి. ట్రాన్స్పోర్ట్ కంపెనీలు... రోడ్డు, రైల్వే మౌలిక సదుపాయాలకు ఎక్కువ మొత్తంలో వెచ్చించనున్నట్టు జైట్లీ ప్రామిస్ చేశారు. ఈ వాగ్దానంతో నిర్మాణ, ఇంజనీరింగ్ సంస్థలకు, రైల్వే వాగన్ ప్రొడ్యూసర్లకు ఎక్కువగా ప్రయోజనం చేకూరనుంది. కన్జ్యూమర్ కంపెనీలు... హిందూస్తాన్ యూనిలివర్ లిమిటెడ్, బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్, మారికో లిమిటెడ్ వంటి కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీల్లో ఇక రోజువారీ కూలీలకు ఉద్యోగం లభించనుంది. హీరో మోటార్కార్ప్ లిమిటెడ్, ఎం అండ్ ఎం లిమిటెడ్, లార్సెన్ అండ్ టుబ్రో లిమిటెడ్లకు లబ్ది చేకూరనుంది. జువెల్లర్స్, ఎయిర్పోర్టు నిర్మాణ సంస్థలు కూడా జైట్లీ బడ్జెట్లో విన్నర్లుగా ఉన్నాయి. లూజర్లు.. ఆపిల్, శాంసంగ్ : మొబైల్ ఫోన్లపై బడ్జెట్లో కూడా కస్టమ్స్ డ్యూటీని పెంచడంతో, దిగ్గజ కంపెనీలు ఆపిల్, శాంసంగ్లకు గట్టి షాక్ ఎదురైంది. ఆపిల్ ఇంక్కు, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తక్కువ రిటర్నులు పొందే అవకాశం కనిపిస్తోంది. ఫైనాన్స్ సెక్టార్ : ఈక్విటీ పెట్టుబడులపై ప్రభుత్వం ఎల్టీసీజీ పన్ను విధింపు నిర్ణయాన్ని ప్రకటించడంతో, ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీలు, లైఫ్ ఇన్సూరర్స్, మ్యూచువల్ ఫండ్స్ ఉత్పత్తుల ప్రొవైడర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. రక్షణ రంగం : రక్షణ రంగానికి అంత పెద్ద మొత్తంలో బూస్టింగ్ను ఏమీ జైట్లీ ప్రకటించలేదు. దీంతో భారత్ ఫోర్స్ లిమిటెడ్ లాంటి రక్షణ రంగ కంపెనీలకు ప్రతికూలమే అని తెలుస్తోంది. కన్జూమర్స్ : ఆరోగ్యానికి సంబంధించిన ప్లాన్లు, లక్ష మంది పేద భారతీయులకు లబ్ది చేకూరనుంది. ఈ ప్లాన్ల కోసం విధించే హెల్త్, ఎడ్యుకేషన్ లెవీని 3 శాతం నుంచి 4 శాతం పెంచారు. ఈ లెవీ అన్ని ఉత్పత్తులకు, సర్వీసులకు అమలు చేయనున్నారు. -
2018 బడ్జెట్ : పెరిగేవి, తగ్గేవి
సాక్షి, ముంబై: ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం కేంద్ర బడ్జెట్ 2018 ను ప్రవేశపెట్టారు. అంచనాలకనుగుణంగానే గ్రామీణ ఆర్థికవృద్ధి, వ్యవసాయానికి ప్రాధాన్యతను ఇస్తూ ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 15నుంచి 20శాతానికి పెంచగా, పేదప్రజలకు భారీ ఊరట కల్పించారు. అలాగే 10కోట్ల పేద కుటుంబాలకు రూ.5లక్షల ఆరోగ్య బీమా కల్పించిన సంగతి తెలిసిందే. దిగుమతి సుంకం పెంపుతో ఇక స్మార్ట్ఫోన్ల దిగుమతులకు అసాధ్యమనే స్థితికి చేరామని ఐసీఏ అధ్యక్షుడు పంకజ్ మహాంద్రో వ్యాఖ్యానించారు. టెలివిజన్ లేదా మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలంటే సామాన్య వినియోగదారుడి జేబుకు చిల్లు తప్పదు.. పార్లమెంటులో సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2018 లో నరేంద్ర మోదీ ప్రభుత్వం బడ్జెట్ తర్వాత ఎక్సైజు, కస్టమ్స్ సుంకాల్లో మార్పులను ప్రకటించింది. ఈ బడ్జెట్ ప్రకారం మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకం 15 నుంచి 20 శాతానికి పెరిగింది. విద్యా సెస్ 3శాతం నుండి 4శాతం వరకు పెరిగింది. ఈ నేపథ్యంలో ధరలు పెరిగేవి, తగ్గేవి ఒకసారి చూద్దాం. ధరలు పెరిగే ఉత్పత్తులు/ సేవల జాబితా * కార్లు, మోటార్ సైకిళ్ళు * మొబైల్ ఫోన్లు * వెండి * బంగారం * సన్ స్క్రీన్ * పాదరక్షలు * కూరగాయలు పండ్ల రసాలు * సన్ గ్లాసెస్ * సోయా ప్రోటీన్ కాని ఇతర ఆహార పదార్థాలు * పెర్ఫ్యూమ్స్ మరియు టాయిలెట్ వాటర్ * రంగు రత్నాలు * వజ్రాలు * ఇమిటేషన్ జ్యుయల్లరీ * స్మార్ట్ గడియారాలు / ధరించగలిగిన పరికరాలు *ఎల్సీడీ/ఎల్ఈడీ టీవీ ప్యానెల్లు * దంత ఉత్పత్తులు, * సిల్క్ ఫాబ్రిక్స్ * ఫర్నిచర్ * పరుపులు * లాంప్స్ * అన్ని రకాల గడియారాలు * ట్రైసైకిల్, స్కూటర్లు, పెడల్ కార్లు, చక్రాల బొమ్మలు, * వీడియో గేమ్ కన్సోల్లు * స్పోర్ట్స్ లేదా అవుట్డోర్ క్రీడలు, స్విమ్మింగ్ పూల్ సామగ్రి * సిగరెట్ , లైటర్లు, కొవ్వొత్తులు * కైట్స్ * వంట నూనెలు: ఆలివ్ నూనె, వేరుశనగ నూనె / ఇతర కూరగాయల నూనెలు ధర తగ్గే ఉత్పత్తులు / సేవల జాబితా * జీడిపప్పు * ముడి పదార్థాలు, కాంక్లియర్ ఇంప్లాంట్స్ తయారీలో ఉపయోగించే భాగాలు , ఉపకరణాలు * సోలార్ ప్యానెల్స్ / మాడ్యూల్స్ కోసం ఉపయోగించే సౌర స్వభావిత గాజు * కొన్ని క్యాపిటల్ గూడ్స్, ఎలక్ట్రానిక్ ఉత్పతులు, -
సాక్షి పండగ సంబరాలు విజేతలు
-
మిస్ తెలుగు ప్రిన్సెస్ అపర్ణ
కాకినాడ కల్చరల్: స్థానిక జీ కన్వెన్షన్ హాలులో శనివారం జరిగిన మిస్ తెలుగు ప్రిన్సెస్ అందాల పోటీలలో విన్నర్గా కాకినాడకు చెందిన టీఎన్ఎస్ అపర్ణ ఎంపికయ్యారు. ఫస్ట్ రన్నర్గా వి.సంజన,(కాకినాడ) సెకండ్ రన్నర్గా ఎం.శ్రేష్ట (కాకినాడ) ఎంపికయ్యారు. అందమైన భామలు సంప్రదాయ దుస్తులతో ర్యాంప్ వాక్, క్యాట్ వాక్ చేసి అలరించారు. వయ్యారాలు ఒలకపోస్తూ హంసనడకలతో చేసిన ప్రదర్శన ప్రేక్షకులను అలరిం చింది. ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా మిస్ వరల్డ్ అస్ట్రేలియా–2017 ఎస్మా వలోడర్ పాల్గొన్నారు. మహిళలు ఆత్మ«స్థైర్యంతో ముందుకు సాగాలన్నారు. అందం ఒక్కటే ప్రధానం కాదని సేవాభా వం కూడా పెంపొందించుకోవాలని పోటీలలో పాల్గొన్న యువతులకు సూ చించారు. న్యాయ నిర్ణేతలుగా సుధాజైన్, వైఏ జయలక్ష్మి, ఎం.సరిత, మరియాలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ డిజైనర్ సతీష్ శిఖా, సంస్థ సీఈఓ శిరిష, కోఆర్డినేటర్ నీరజ్, యాంకర్ రాఖీ, అర్జున్, శివ పాల్గొన్నారు. సేవే నిజమైన అందం ఈ పోటీలలో విన్నర్ కావడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం అదిత్య కళాశాలలో బీబీఏ కోర్సు చేస్తున్నాను. మా తల్లిదండ్రులు (టీఎస్ఎస్ ప్రసాద్, గీత) ప్రోత్సాహంతో ఈ పోటీలలో పాల్గొన్నాను. మహిళలు ఆత్మస్థైర్యంతో ఉండాలి. మఖ్యంగా సేవాభావం కలిగిఉండాలి. ఉండాలి. అదే నిజమైన అందంగా భావిస్తాను. –టీఎన్ఎస్ అపర్ణ, తెలుగు ప్రిన్సెస్ విన్నర్ -
ఇళయరాజా సాక్షి కాంటెస్ట్ విజేతలు
కిక్కెక్కించే ఇళయరాజా పాటలు లైవ్లో వినేందుకు సిద్ధమైపోయారా? నవంబర్ 5న ఆయనే హైద్రాబాద్లో నేరుగా ఓ షో ఇచ్చేస్తున్నారు. అదీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఫస్ట్టైమ్. ఈ షోలో పాల్గొనేందుకు సాక్షి పాఠకులకు ఒక ప్రత్యేక కాంటెస్ట్ పెట్టి రెండు వందల మందికి ఒక్కొక్కరికి రెండు చొప్పున నాలుగు వందల పాసులు ఇవ్వనున్నట్లు తెలిపాం. ఇప్పుడు ఈ కాంటెస్ట్లో విజేతలుగా నిలిచిన వారి వివరాలను ఇక్కడ తెలియజేస్తున్నాం. ఇంకేం మరి! మీ పేరు ఉందో లేదో చూస్కోండి. రాజా కాలింగ్ ఆజా!! ఈ క్విజ్లో విజేతలుగా నిలిచిన వాళ్లందరికీ ఎసెమ్మెస్ ద్వారా సమాచారం అందుతుంది. నవంబర్ 3, 4, 5వ తేదీల్లో విజేతలు హైద్రాబాద్లోని సాక్షి ఆఫీసులో తమ ఫోన్కు వచ్చిన మెసేజ్ చూపించి పాసులు పొందవచ్చు. ఆదివారం రోజు మాత్రం మధ్యాహ్నం 2గంటల వరకే ఈ అవకాశం ఉంటుంది. నవంబర్ 5న హైద్రాబాద్లోని గచ్చిబొలి స్టేడియంలో ఈ ఈవెంట్ జరుగుతుంది. NAME LOCATION KM SAVITRI HYDERABAD ALTHAF SHAIK HYDERABAD CH JAHNAVI HYDERABAD CHAVALA GOPALA KRISHNA HYDERABAD S.BHRAMARAMBA SHADNAGAR Y SRAVAN KUMAR HYDERABAD TONUGUR HANUMAN SINGH WARANGAL CH MOHAN KUMAR VISAKHAPATNAM K SRINIVAS HYDERABAD MAILA JYOTHY HYDERABAD KUSUMA NARESH WARANGAL P MARIYAMMA LENIN NAGAR B MYTHILI EAST GODAVARI B LALITHA DEVI VISAKHAPATNAM UNNAM VAJRAKIRAN GUNTUR KUSUMA KUMARI G KARIMNAGAR K PREETH KUMAR NRT U VARDINI WARANGAL S.SUDHEER KURNOOL A KIRAN KUMAR HYDERABAD D KRISHNA MOHAN KHAMMAM K.VENKATESHWARARAO GUDUR VVV.SATYANARAYANA RAJAHMUNDRY M SURESH BABU HYDERABAD M SAMBA SIVA REDDY KHAMMAM SARATH HYDERABAD INGURTHI LAXMI HYDERABAD R.KRISHNA KANTH HYDERABAD SK RABBANI SURYAPET GOGULA VENKATESHWARULU HYDERABAD B.ANIL KUMAR HYDERABAD Y VIJAY KUMAR REDDY HYDERABAD BHARANI TANAKU CH PRABHA HYDERABAD A TIRUPATHI HYDERABAD A KOTESHWARA RAO HYDERABAD C SIVA JYOTHI HYDERABAD G.RAJU KARIMNAGAR PALETI KIRAN KUMAR PRAKASAM DIST PJ SUNIL RAJAHMUNDRY D DINESH KUMAR HYDERABAD N ANIL KUMAR VISAKHAPATNAM B SRI VENKATA SAI MEDCHAL K.RAVINDRA HYDERABAD KALAVATHI ANANTAPUR A ANJANI NANDAN VIJAYAWADA IMTHIYAZ BASHA HYDERABAD MD MAHABOOB PASHA HYDERABAD GOTTE MUNISH HYDERABAD P VENKATESH HYDERABAD CHINTAKINDI GEETA HYDERABAD M MANJUNATH REDDY ANANTAPUR B DURGA PRADESH HYDERABAD G SREEMANN SURYAPET RAJA SATISH HYDERABAD GEETHA HYDERABAD CH RAJYA LAKSHMI HYDERABAD K SRINIVASA RAO VIJAYAWADA PURDHEESWARI HYDERABAD SASIKALA.P HYDERABAD DR B SRINIVASA RAO KAKINADA RAMESH V HYDERABAD V M NAIK GUNTUR M VINAY LATA HYDERABAD CH VIJAYA BHASKAR RAO WEST GODAVARI S MANASA NELLORE VINOD KG HYDERABAD K SATISH BABU KADAPA B SRINIVAS HYDERABAD K.PRASHANTH HYDERABAD CH PRASANNA KUMAR HYDERABAD M.PREM KUMAR NIRMAL BAS PRASAD WEST GODAWARI R.LAVAKUMAR REDDY HYDERABAD S PONNASWAMY NELLORE MANIMALA S MALLIREDDYPALLI AKKALA LAXMAN NARAYANPET M.ASWIN KUMAR SRIKAKULAM PRASHANTH HYDERABAD PATRA MANU KUMAR GUNTUR P SHABARI GIREESH PRAKASAM DIST VIDYA SAGAR HYDERABAD V VIJAYA SIMHA TIRUPATHI M ANNAREDDY HYDERABAD K KRISHNA MOHAN HYDERABAD SUNEETA PANGIDI HYDERABAD BHAVANI SIRISHA D HYDERABAD D NAGABHUSHANAM JAGITIAL P VENKATA DURGA HYDERABAD L.V.S VAMSHI MOHAN HYDERABAD N SOWJANYA HYDERABAD T SRIVARDHAN HYDERABAD S SREENIVASA RAO SURYAPET SHAIK ANWAR HYDERABAD SAI KRISHNA KOLLA HYDERABAD S.LALITHA SAI DURGA HYDERABAD G.PRAMOD VIJAYAWADA K.SUSHMITHA HYDERABAD MOHAN HYDERABAD RAMESH YELLANI HYDERABAD S UPPALAIAH WARANGAL D VISHNU VARDHAN REDDY HYDERABAD PULLURI USHA RANI KHAMMAM B SYAM KUMAR GUNTUR G SRINIVAS RAO HYDERABAD S.SURESH HYDERABAD SRINIVAS JETTI VIZAG G VAMSI KRISHNA ELURU T PHANEENDRA SAI HYDERABAD CH SRINIVASULU ANANTAPUR S RANGASWAMY KURNOOL M RAMAIAH HYDERABAD SHAH NAWAZ HYDERABAD V SRIKANTH HYDERABAD C PINKY DONAKONDA SHAIK AKBAR BASHA VIJAYAWADA YR RAMESH NANDYAL N RAMADEVI HYDERABAD KAKINADA LAKSHMI VIZIANAGARAM CH.VEENU HYDERABAD N S PRASAD HYDERABAD KVL KIREETI PRAKASAM DIST SHASHIKALA HYDERABAD MANSOOR ALI VIKARABAD SANTHOSH KASULA HYDERABAD P CHAND BASHA KADAPA R SWETHA MANCHERIAL K ANITHA HYDERABAD VENKATA KRISHNA HYDERABAD P SUMANASWINI WARANGAL SALI KEJEYA HYDERABAD A BHARATHI HYDERABAD KV MAHESWAR REDDY KADAPA KATTULA SATYA KUMARI EAST GODAVARI PRAVEEN JVL HYDERABAD D VENKATESWARA RAO BANGALORE B CHANDU NIZAMABAD P SURESH HYDERABAD M.RADHA HYDERABAD AJAY MADGULA TENALI T NAVEEN KUMAR HYDERABAD N SATYA PRASAD VIJAYAWADA C HARI KRISHNA HYDERABAD KN MOHAN HYDERABAD V SIRISHA REDDY HYDERABAD G RAMANA REDDY NIZAMABAD PRASHANTH B.SAI HYDERABAD A VINAYAK WARANGAL SINDHURI HYDERABAD B KARTHIK HYDERABAD VIJAY BHASKAR BHUPALPALLY CH PREMA CHAND PRAKASAM DIST I SUBHAS CHANDRA BOSE KURNOOL SHAIK SALEEM KAKINADA P KIRAN KUMAR KUKATPALLY J CHANDRA SEKHAR HYDERABAD P ASHOK REDDY HYDERABAD MD RASHEED PASHA SURYAPET RAMADEVI WANAPARTHY BV APPALA RAJU VISAKHAPATNAM M KRANTHI REDDY HYDERABAD SRAVANTHI HYDERABAD M.SWAMY KARIMNAGAR BL PRASAD HYDERABAD A SHANKAR VENKATAPUR GVJ SARMA KAKINADA E KISHAN WARANGAL A RAMESH GOUD NIZAMABAD A VIPANI HYDERABAD ARVIND GOUD M SHANKARPALLY B SAI PRASAD KARIMNAGAR P ANWAR BASHA PRAKASAM DIST RAMAKRISHNA ADURI HYDERABAD M RADHA HYDERABAD K SUNEETA HYDERABAD S K SHOWKATULLA KANDUKUR K JAGAN SRIKAKULUM D V SAI RAM TANGUTUR VARANASI MALLIKARJUNA SARMA KAKINADA RAJITA PATNAIK HYDERABAD V GANESH SAROOR NAGAR D RAJESH HYDERABAD K.KARUN HYDERABAD RAVINDER RYADA HYDERABAD G V SARMA NELLORE B JOHN PETER SAMALKOT DURGA PRASAD.B HYDERABAD P GOPICHAND HYDERABAD A SRINIVASA RAO JAGGAYYAPET M TIRUPATHI RAJANNA SIRICILLA PN RAGHAVENDRA REDDY ANANTAPUR BSV PHANI KUMAR HANMAKONDA C HARINI REDDY HYDERABAD H NAGARAJU KHAMMAM V RAVITEJA HYDERABAD SINGER MIMICRY SRINIVAS VIJAYAWADA VISWANADH HYDERABAD CH JAYARAJU NALGONDA B.CHINNA TIMAIAH MEDCHAL PALLE SRIKANTH HYDERABAD -
పంచుకున్నారు
-
ఆ పద, స్వరాలకు అవార్డులు
-యునెస్కో పోటీల్లో ‘రాధాకృష్ణ’ విద్యార్థినుల ప్రతిభ -నాట్య, సంగీత విభాగాల్లో బహుమతుల పంట రాజమహేంద్రవరం కల్చరల్ : జిల్లాలోని ధవళేశ్వరానికి చెందిన శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర విద్యార్థినులు హిమాచల్ప్రదేశ్లోని సిమ్లాలో జరిగిన దారోహర్ అంతర్జాతీయ సంగీత నృత్యపోటీలలో పలు అవార్డులను కైవసం చేసుకున్నారు. శుక్రవారం స్థానిక ప్రకాష్ నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ వ్యవస్థాపకుడు గోరుగంతు బదరీ నారాయణ అవార్డులను ప్రదర్శించి, వివరాలను వెల్లడించారు. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో రాధాకృష్ణ విద్యార్థినులు అన్ని విభాగాలలో బహుమతులను గెలుచుకున్నారు. అద్భుతమైన కొరియోగ్రఫీని అందించినందుకు రాధాకృష్ణ అధ్యాపకురాలు గోరుగంతు ఉమాజయశ్రీ ‘కళాకుంజ్’ అవార్డును, అన్ని విభాగాలలో ప్రధాన పాత్ర పోషించిన కళాక్షేత్ర విద్యార్థిని లక్ష్మీదీపిక ‘కళాప్రభ’ అవార్డును గెలుచుకున్నారు. మరో విద్యార్థిని మాధురి లలితసంగీతంలో తృతీయ బహుమతిని, లక్ష్మీదీపిక, సునంద కూచిపూడి విభాగంలో ప్రథమ బహుమతిని సాధించారు. జూనియర్స్ విభాగంలో వినాయక కౌతం బృందం కళాకారులు ప్రథమ బహుమతిని, వీణ ఫ్యూషన్లో ద్వితీయ బహుమతిని గెలుచుకున్నారు. గోదావరి హారతి, నవరాగమాలికా వర్ణాలకు ప్రథమ బహుమతి కూడా లభించింది. అన్ని విభాగాలలో శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర విద్యార్థినులు మొత్తం 15 బహుమతులను గెలుచుకుని, రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటారని నారాయణ చెప్పారు. ఏ వేదికపై ప్రదర్శనలు ఇచ్చినా సనాతన భారతీయ వైభవాన్ని ప్రచారం చేయడమే తమ లక్ష్యమన్నారు. విలేకరుల సమావేశంలో కళాక్షేత్ర అధ్యాపకురాలు ఉమాజయశ్రీ, పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ ఖాన్, సభ్యులు పి.సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన నాటక పోటీలు
పాలకొల్లు టౌ న్ : సమాజంలోని రుగ్మతలను పోగొట్టి ప్రజలను చైతన్య వంతులను చేసే శక్తి నాటక రంగానికి ఉందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం రాత్రి డాక్టర్ గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళాపరిషత్ జాతీయ స్థాయి నాటిక పోటీల విజేతలకు బహుమతి ప్రధానోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటక రంగం కనుమరుగవకుండా భావితరాలకు అందించడానికి కళాపరిషత్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆ నాటి కళాకారుడు, ప్రముఖ సినీ, నాటక దర్శకుడు పినిశెట్టి శ్రీరామమూర్తి దగ్గరి నుంచి నేటి తరం గజల్ శ్రీనివాస్ వరకు ఎందరో ప్రముఖ కళాకారులను అందించి కళలకు పుట్టినిల్లుగా పాలకొల్లు భాసిల్లుతోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కళాపరిషత్లు నిర్వహించడం సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్, విన్నకోట వేంకటేశ్వరరావు, డాక్టర్ కేఎస్పీఎ న్ వర్మ, మేడికొండ శ్రీనివాసచౌదరి, కేవీ కృష్ణవర్మ, మానాపురం సత్యనారాయణ, రంగ స్థల వృత్తి కళాకారుల సంఘ జిల్లా అధ్యక్షుడు బొడ్డేపల్లి అప్పారావు, గుండా రామకృష్ణ, రాయప్రోలు భగవాన్, బుద్దాల వెంకట రామారావు, జీవీబీఎస్ మూర్తి, జి.రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శనగా ‘చాలు.. ఇక చాలు’ ఈ పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా శ్రీ సాయి ఆర్ట్స్–కొలకలూరి వారి ‘చాలు..ఇక చాలు’ నాటిక మొదటి బహుమతిని గెలుచుకుంది. అభినందన ఆర్ట్స్–గుంటూరు వారి ‘కేవలం మనుషులం’, అరవింద ఆర్ట్స్–తాడేపల్లి వారి ‘స్వర్గానికి వంతెన’ నాటికలు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. జ్యూరీ ప్రదర్శనగా ‘నాన్నా.. నువ్వో సున్నా’ నిలిచింది. దిష్టిబొమ్మలు నాటక రచయిత తాళాబత్తుల వేంకటేశ్వరరావు ఉత్తమ రచయితగా, నాన్నా నువ్వో సున్నా నాటిక దర్శకుడు పి.బాలాజీనాయక్ ఉత్తమ దర్శకుడిగా అవార్డులు సొంతం చేసుకున్నారు. చాలు–ఇక చాలులో నీలకంఠం పాత్రధారి కేవీ సుబ్బారాయుడు ఉత్తమ నటుడిగా, దిష్టిబొమ్మలు నాటికలో జానకమ్మ పాత్రధారిణి ఎం.లక్ష్మీ తులసి ఉత్తమ నటిగా, గోవు మాలచ్చిమిలో గోవిందయ్య పాత్రధారి జానా రామయ్య ఉత్తమ ప్రతినాయకుడిగా, సందడే..సందడి నాటికలో దొంగ పాత్రధారి కె.జోగారావు ఉత్తమ హాస్య నటుడిగా, కేవలం మనుషులం నాటికలో మీర్జా ఆలీఖా న్ పాత్రధారి వీసీహెచ్కే ప్రసాద్ ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంపికయ్యారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా ప్రసాదరెడ్డి (హైదరాబాద్), కేకేఎల్ స్వామి (విజయనగరం), విన్నకోట వేంకటేశ్వరరావు (పాలకొల్లు) వ్యవహరించారు. -
తొలిసారిగా ఓ ముస్లిం నటుడికి ఆస్కార్
-
2017 ఆస్కార్ విజేతలు
లాస్ఏంజిల్స్: చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభమైంది. డాల్బీ థియెటర్లో జరుగుతున్న ఈ 89వ ఆస్కార్ అవార్డుల వేడుకకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాజరయ్యారు. ఉత్తమ సహాయనటుడు విభాగంలో పోటీపడిన దేవ్ పటేల్కు నిరాశ ఎదురైంది. ఈ విభాగంలో మూన్లైట్ చిత్రంలో నటించిన మహేర్షాలా అలీని అవార్డు వరించింది. ఆస్కార్ అవార్డు పొందిన మొదటి ముస్లిం నటుడు మహేర్షాలా అలీనే కావడం విశేషం. ఏడు ముస్లిం దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్ను విధించిన నేపథ్యంలో.. మహేర్షాలా ఆస్కార్ గెలవడంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. 2017 ఆస్కార్ విజేతలు వీరే ఉత్తమ చిత్రం: మూన్లైట్ ఉత్తమ నటుడు: కేసీ అఫ్లెక్(మాంచెస్టర్ బై ద సీ) ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్(లా లా లాండ్) ఉత్తమ దర్శకుడు: డామీన్ చాజెల్లె (లా లా లాండ్) ఉత్తమ సహాయ నటుడు: మహేర్షాల అలీ(మూన్లైట్) ఉత్తమ సహాయ నటి: వయోలా డేవిస్(ఫెన్సెస్) ఉత్తమ మేకప్ మరియు హెయిర్ స్టైల్: సూసైడ్ స్క్వాడ్ చిత్రం ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ చిత్రం: ఫెంటాస్టిక్ బీస్ట్స్ ఉత్తమ డాక్యుమెంటరీ: ఓ.జే.. మేడ్ ఇన్ అమెరికా ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: అరైవల్ ఉత్తమ సౌండ్ మిక్సింగ్ చిత్రం: హాక్సారిడ్జ్ ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: హాక్సారిడ్జ్ ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ద సెల్స్మ్యాన్(ఇరాన్) బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్: జూటోపియా బెస్ట్ యానిమేటెడ్ షార్ట్: పైపర్ ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ చిత్రం: లా లా ల్యాండ్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: ద జంగిల్ బుక్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్: ద వైట్ హెల్మెట్స్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: సింగ్ బెస్ట్ సినిమాటోగ్రఫి: లా లా ల్యాండ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్: లా లా లాండ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్: సిటీ ఆఫ్ స్టార్స్( లా లా లాండ్) బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ప్లే: మాంచెస్టర్ బై ద సీ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ప్లే: మూన్లైట్ మహేర్షాల అలీ -
జిల్లాస్థాయి చదరంగం విజేతలు వీరే
రాజమహేంద్రవరం సిటీ : జిల్లా స్థాయి చదరంగం పోటీల ఓపెన్, అండర్–15, 10 విభాగాల్లో 12 మంది విజేతలుగా నిలిచారని జిల్లా చదరంగం సంఘం కార్యదర్శి జి.వి.కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం కాకినాడ గాంధీ భవన్ లో జరిగిన పోటీల్లో 140 మంది క్రీడాకారులు పోటీ పడ్డారన్నారు. ఓపెన్ విభాగంలో ఎం.చైతన్య, ఆర్.నరసింహ రవీంద్ర, ఎస్.సాయి గృహికేష్, ఎస్.బాలాజీరెడ్డి, అండర్ -15 బాలుర విభాగంలో సాయిసుహాస్, గౌతమ్, బాలికల విభాగంలో మాధుర్య, అమూల్య, అండర్ -10 బాలుర విభాగంలో జ్ఞానసాయి సంతోష్, మృత్యుంజయ, బాలికల విభాగంలో శ్రీవిద్యశాంభవి, వేదలత విజయం సాధించారని తెలిపారు. విజేతలకు రాష్ట్ర చదరంగం సంఘం అధ్యక్షుడు వై.డి.రామారావు బహుమతులు అందజేశారన్నారు. అండర్ –9 విభాగంలో పోటీలను ఏప్రిల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. -
ముగిసిన జాతీయస్థాయి కబడ్డీ పోటీలు
నరసాపురం : జాతీయస్థాయి పురుషుల కబడ్డీ పోటీల విజేతగా విజయాబ్యాంక్ కర్ణాటక జట్టు, మహిళల విభాగంలో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జట్టు చాంపియన్లుగా నిలిచాయి. నరసాపురం రుస్తుంబాధలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలు బుధవారం రాత్రితో ముగిశాయి. ఫ్లడ్లైట్ల వెలుగులో నిర్వహించిన ఫైనల్ మ్యాచ్ల్లో పురుషుల విభాగంలో విజయాబ్యాంక్ కర్ణాటక జట్టు 28–16 స్కోర్ తేడాతో బాబా హరిదాస్ హర్యానా జట్టుపై విజయం సాధించింది. మహిళల విభాగంలో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జట్టు 27–25 పాయింట్ల తేడాతో గురుకుల్ హర్యానా(ఏ) జట్టుపై విజయకేతనం ఎగురవేసింది. తొలుత మూడు, నాలుగు స్థానాల కోసం కూడా పోటీ తీవ్రంగా సాగింది. పురుషుల విభాగంలో మూడు, నాలుగు స్థానాల కోసం ఆంధ్రా, పోస్టల్ కర్నాటక మధ్య పోటీ జరిగింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్లో 2 పాయింట్ల తేడాతో ఆంధ్రా జట్టు గెలిచి మూడోస్థానంలో నిలిచింది. పోస్టల్ కర్నాటక జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. మహిళల విభాగంలో మూడు, నాలుగు స్థానాల్లో హర్యానా(బి), దిండిగళ్ చెన్నై జట్లు నిలిచాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో హర్యానా(బి) జట్టు 8 ఫాయింట్ల తేడాతో దిండిగళ్ చెన్నై జట్టును ఓడించింది. అనంతరం నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ సభలో పురుషుల విజేత జట్టుకు రూ.1 లక్ష నగదు, రెండోస్థానంలో నిలిచిన జట్టుకు రూ.75 వేలు, మూడోస్థానంలో నిలిచిన జట్టుకు రూ.50 వేలు, నాలుగోస్థానంలో నిలిచిన జట్టుకు రూ.25 వేల నగదు, షీల్డులు అందించారు. మహిళా విభాగంలో గెలుపొందిన జట్లకు కూడా ఇదేరకంగా బహుమతులను కలెక్టర్ కాటంనేని భాస్కర్ చేతుల మీదుగా అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాల్సి ఉందన్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, పోటీల కన్వీనర్ కొత్తపల్లి జానకీరామ్, నరసాపురం సబ్ కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.వీర్లవెంకయ్య, జిల్లా కార్యదర్శి ఎం.రంగారావు పాల్గొన్నారు. -
బరువు మోసే రిలే పోటీల విజేత
అమృతలూరు : సంక్రాంతి సంబరాల్లో భాగంగా అమృతలూరులో గురువారం సాయంత్రం దావులూరి నాగేశ్వరరావు (చిన్న) స్మారక జిల్లాస్థాయి 50 కేజీల బరువు మోసే రిలే పోటీలను నిర్వహించారు. జిల్లాలోని పలు మండలాల నుంచి పోటీదారులు పాల్గొన్నారు. నిర్ణీత దూరాన్ని నలుగురు మోసే రిలే పోటీలలో అమృతలూరుకు చెందిన నవభారత్ (సీహెచ్ వినీల్) యూత్ 1 నిమిషం, 36 సెకన్లలో మోసి ప్రథమస్థానం, చెరుకుపల్లి మండలం పొన్నపల్లికి చెందిన కె. హనుమాన్ టీమ్ 1 నిమిషం, 46 సెకన్ల మోసి ద్వితీయస్థానం, అమృతలూరుకు చెందిన ప్రతాప్ యూత్ 1 నిమిషం, 53 సెకన్లలో మోసి తృతీయ స్థానం, అమృతలూరుకు చెందిన నవభారత్ (జి. విజయ్కుమార్) యూత్ 1 నిమిషం, 56 సెకన్లలో మోసి నాల్గో స్థానం సాధించాయి. ప్రథమ బహుమతి రూ. 3,200, ద్వితీయ బహుమతి రూ.2,400, తృతీయ బహుమతి రూ.1,600, నాల్గో బహుమతి రూ.1,000 విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి భాస్కరరావు, సర్పంచ్ కూచిపూడి సతీష్కుమార్, గొట్టిపాటి భానుగంగాధర్, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా రాపర్ల మల్లికార్జునరావు, దేవరకొండ నాగరాజు వ్యవహరించారు. -
ముగిసిన షటిల్ టోర్నమెంట్ పోటీలు
కవిటం (పోడూరు) : స్థానిక శ్రీ చైతన్య షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్రి వెంకటరెడ్డి ప్లే గ్రౌండ్లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి షటిల్ టోర్నమెంట్ పోటీలు శనివారం ముగిశాయి. ముగింపు సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకుడు గుంటూరి పెద్దిరాజు అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి చూపించాలని సూచించారు. తణుకుకు చెందిన ప్రముఖ వైద్యుడు కర్రి శ్రీనివాసుల రెడ్డితో కలిసి విజేతలకు నగదు బహుమతులు అందించారు. మాజీ ఉప సర్పంచ్ కర్రి శ్రీనివాసరెడ్డి, కర్రి సత్యనారాయణరెడ్డి బ్రదర్స్, పడాల సత్యనారాయణరెడ్డి, చైతన్య షటిల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. మెడలిస్ట్ డబుల్స్ విభాగంలో రాజమండ్రికి చెందిన అవినాష్, అప్పారావు జోడి విజేతగా నిలిచారు. మెడలిస్ట్ సింగిల్స్ విభాగంలో రాజమండ్రికి చెందిన అవినాష్ విజేతగా నిలిచాడు. నాన్ మెడలిస్ట్ డబుల్స్ విభాగంలో గుడివాడకు చెందిన రాము, ప్రతాప్ జోడి విజేతగా నిలిచారు. మెడలిస్ట్ సింగిల్స్ విభాగంలో వీరవాసరానికి చెందిన శ్రీరామ్ రన్నర్గా నిలిచాడు. బాలికల డబుల్స్ విభాగంలో కవిటంకు చెందిన సాయికుమారి, భావిక జోడి విజేతగా, ఆశా, మౌనిక జోడి రన్నర్గా నిలిచారు. ఉత్తమ ప్రతిభా పాటవ ఆటగాడిగా పాలకొల్లుకు చెందిన ఉదయకిరణ్ బహుమతి అందుకున్నాడు. -
ముగిసిన ఖేలో ఇండియా పోటీలు
కర్నూలు (టౌన్): ఖేలో ఇండియా జిల్లా స్థాయి పోటీలు మంగళవారం ముగిశాయి. ఆరురోజులుగా స్థానిక స్పోర్ట్స్ అథారిటీ ఔట్డోర్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. చివరి రోజు అథ్లెటిక్స్, తైక్వాండో, వాలీబాల్, లాంగ్జంప్, షాట్ఫుట్ క్రీడాంశాల్లో విద్యార్థినీ, విద్యార్థులు పోటీ పడ్డారు. వీటిలో గెలుపొందిన క్రీడాకారులకు డీఎస్డీఓ మలి్లకారు్జన మెడల్స్ అందజేశారు. విజేతల వివరాలు అథ్లెటిక్స్ అండర్–14 బాలుర వంద మీటర్ల పరుగులో ఆదోనికి చెందిన సాగర్, కోడుమూరుకు చెందిన అజిత్కుమార్, రాము, 400 మీటర్ల పరుగు పందెంలో ఎమ్మిగనూరుకు చెందిన ఫరూక్, ఆళ్లగడ్డకు చెందిన అబూసిద్ధిక్, పాణ్యంకు చెందిన వీరసాయి, లాంగ్జంప్లో మంత్రాలయానికి చెందిన నరసింహులు, కోడుమూరుకు చెందిన అజిత్కుమార్, మంత్రాలయానికి చెందిన టి.రాజు , షాట్ఫుట్ విభాగంలో ఆళ్లగడ్డకు చెందిన హేమంత్, పత్తికొండకు చెందిన రవి, ఎం.రాజు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. అథ్లెటిక్స్ అండర్–14 బాలికల వంద మీటర్ల పరుగులో డోన్కు చెందిన రామలక్ష్మి, పాణ్యంకు చెందిన జి.ప్రియాంక, ఆళ్లగడ్డకు చెందిన డి.బెల్లి, 400 మీటర్ల పరుగులో పాణ్యంకు చెందిన మెహరూన్బీ, డోన్కు చెందిన డి.రేఖ, పత్తికొండకు చెందిన సి.మనీష, లాంగ్జంప్లో పత్తికొండకు చెందిన కె.రామలక్ష్మి, నందికొట్కూరుకు చెందిన టి.విజయరాణి, కోడుమూరుకు చెందిన బి.శిరీష, షాట్ఫుట్ విభాగంలో ఆలూరుకు చెందిన జి.సుజాత, బి.ఇందు, కోడుమూరుకు చెందిన కె.శోభ వరుసగా ఆయా విభాగాల్లో మొదటి మూడు స్థానాలు సాధించారు. -
రాష్ట్రస్థాయి ఫ్లోర్బాల్ విజేతలకు అభినందన
అమరావతి: రాష్ట్ర స్థాయి ప్లోర్బాల్ జట్టుకు ఎంపికయిన శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్ విద్యార్థులను మంగళవారం పాఠశాల కరస్పాండెంట్ మల్లెల శ్రీనాధచౌదరి, పాలక వర్గసభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు. ఈసందర్భంగా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు అనూరాధ మాట్లాడుతూ ఈనెల 26వతేదీన కర్నూలు జరిగిన పోటీలలో అండర్ 17 ప్లోర్బాల్ బాలురవిభాగంలో చుండూరి వరప్రసాద్, బాలికల విభాగంలో చిలకా మనీషాలు రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని తెలిపారు. జనవరి మొదటి వారంలో ఉత్తరప్రదేశ్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అలాగే డిసెంబరు 3వతేదీన అమరావతి శ్రీరామకృష్ణహిందూ హైస్కూల్ గ్రౌండ్లో రాష్ట్రస్థాయి టెన్నిస్వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర జట్టులో స్థానం సాధించిన విద్యార్థులు జాతీయ స్థాయిలో కూడా పాఠశాల పేరు ప్రతిష్టలను ఇనుమడింపచేసి మరిన్ని విజయాలు సాదించాలన్నారు. సందర్భంగా పాలకవర్గ ఉపాధ్యక్షుడు పారేపల్లి వెంకటసత్యనారాయణరావు, ప్రధానోపాధ్యాయుడు కొల్లి లక్ష్మీనారాయణ, ప్రసాద్, గాంధీలతోపాటుగా పలువురు ఉపాధ్యాయులు విజేతలను అభినందించారు. -
పెద్దాపురం విద్యార్థులకు పతకాల పంట
జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన కరీం, మహేష్లు పెద్దాపురం : క్రీడారంగంలో పెద్దాపురం పట్టణాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లి వన్నె తెచ్చిన పెద్దాపురం విద్యార్థులు బంగారుపతకాలు సాధించి అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ నెల 11న మీరట్లో జరిగిన జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ షటిల్ బ్యాడ్మింట¯ŒS పోటీల్లో పట్టణానికి చెందిన తీగిరెడ్డి జ్ఞాన మహేష్, షేక్ కరీంముల్లా ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు. సుమారు 20 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్న బ్యాడ్మింట¯ŒS పోటీల్లో ప్రథమ స్థానం సాధించి పట్టణానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన విద్యార్థులిద్దరికీ మన పెద్దాపురం ఫేస్బుక్ టీం ఘన స్వాగతం పలికి స్థానిక మెయి¯ŒSరోడ్డులో కేక్ను కట్ చేసి క్రీడాకారులను అభినందించారు. నాన్న ప్రోత్సాహంతోనే.. వృత్తి రీత్యా నాన్న మెకానిక్. ఆయన ప్రోత్సాహంతోనే నేనింతగా ఆడగలుతున్నాను. క్రీడల పట్ల ఉన్న మక్కువ, ప్రజల్లో వచ్చిన స్పందన మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. ఎప్పటికైనా క్రీడారంగం నుంచే ఉద్యోగం సాధించాలినే నా ఆకాంక్ష. – జ్ఞాన మహేష్ అందరి సహకారంతో.. అమ్మ, నాన్న, గురువు, స్నేహితుడు అందరి సహకారంతోనే భవిష్యత్లో ఉన్నత శిఖరాలు అవరోధించాలనేది నా ఆకాంక్ష. ఇప్పటి వరకు తల్లిదండ్రులు, గురువర్యుల ప్రోత్సాహంతోనే ఈ విజయాన్ని సాధించాను. – కరీముల్లా -
ఉత్కంఠగా క్రికెట్ టోర్నమెంట్
గుంటూరు స్పోర్ట్స్: తాడికొండ మండలం లాం చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న ఏఎన్యూ అంతర కళాశాలల నార్త్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్కంఠభరింతంగా సాగుతోంది. శుక్రవారం ఉదయం జరిగిన మ్యాచ్లో నర్సరావుపేటకు చెందిన పీఎస్సీ అండ్ కెఆర్ జట్టు 8 వికెట్ల తేడాతో హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన హిందూ కాలేజ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన పీఎస్సీ జట్టు 2 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి విజయం సాధించింది. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో తాడికొండకు చెందిన బీఎస్ఎస్బీ జట్టు 3 పరుగుల తేడాతో నర్సరావుపేటకు చెందిన ఎంఏఎం ఫార్మసీ కళాశాల జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బీఎస్ఎస్బీ జట్టు 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఫార్మసీ కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లలో 7వికెట్లు 109 పరుగులు చేసి ఓటమి చెందింది. -
ఉత్కంఠభరితంగా ఫుట్బాల్ పోటీలు
తాడేపల్లిగూడెం : జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్, కోటగిరి విద్యాధరరావు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫా డిస్ట్రిక్ట్ కప్ –2016 పోటీలు రెండోరోజు శుక్రవారం స్థానిక డాక్టర్ తేతలి సత్యనారాయణమూర్తి జెడ్పీ హైస్కూల్లో ఉత్కంఠభరితంగా సాగాయి. అండర్ –16 బాలికల విభాగంలో పల్లంట్ల జట్టు విజేతగా నిలిచింది. బెస్టు ఉమెన్ ఆఫ్ ది టోర్నమెంటుగా మేడపూడి పూజిత(జంగారెడ్డిగూడెం), బెస్టు గోల్ కీపర్గా పి.పద్మజ(పల్లంట్ల), ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంటుగా జె.భూమిక (పల్లంట్ల) అవార్డులను, నగదును అందుకున్నారు. విజేతలకు టోర్నీ నిర్వాహకులు దాసరి భాస్కరరావు, ఉడిపి హోటల్ అధినేత అచ్చన్న బాబు బహుమతులు అందించారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో పోటీతత్వం
ఎమ్మెల్యే ముస్తఫా గుంటూరు స్పోర్ట్స్: క్రీడలతో పోటీతత్వం అలవడుతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా అన్నారు. నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన 3వ దొండపాటి శ్రీనివాసరావు మెమోరియల్ జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ టోర్నమెంట్ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజేత జట్లకు ట్రోఫీలు అందించారు. మహిళ విభాగంలో ఆచార్య నాగార్జున జట్టు విజేతగా నిలిచింది. గుంటూరు స్పోర్ట్స్ క్లబ్ జట్టు ద్వితీయస్థానం, నరసరావుపేట మునిసిపల్ హైస్కూల్ జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. -
అంతర్ కళాశాలల టెన్నిస్ విజేతలు వీరే
గుంటూరు స్పోర్ట్స్: హిందూ కళాశాల అధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ టెన్నిస్ కోర్టుల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల పురుషుల టెన్నిస్ పోటీలు జరిగాయి. పోటీల్లో ఆర్వీఆర్ అండ్ జేసీ, ఏఎన్యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్లు సంయుక్త విజేతలుగా నిలిచారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల రన్నరప్ టైటిల్ సాధించగా, ధనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్లు తృతీయ స్థానం సాధించాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి హిందూ కళాశాల ప్రిన్సిపాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఏఎన్యూ అబ్జర్వర్ డి.చంద్రారెడ్డి, ఎ.వి.రాఘవయ్య, శివరామకృష్ణ, పి.రాజ్యలక్ష్మి, ఎం.విజయలక్ష్మి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్ కళాశాలల టెన్నిస్ విజేతలు వీరే..
గుంటూరు స్పోర్ట్స్: హిందూ కళాశాల అధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ టెన్నిస్ కోర్టుల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల పురుషుల టెన్నిస్ పోటీలు జరిగాయి. పోటీల్లో ఆర్వీఆర్ అండ్ జేసీ, ఏఎన్యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్లు సంయుక్త విజేతలుగా నిలిచారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల రన్నరప్ టైటిల్ సాధించగా, ధనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్లు తృతీయ స్థానం సాధించాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవానికి హిందూ కళాశాల ప్రిన్సిపాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఏఎన్యూ అబ్జర్వర్ డి.చంద్రారెడ్డి, ఎ.వి.రాఘవయ్య, శివరామకృష్ణ, పి.రాజ్యలక్ష్మి, ఎం.విజయలక్ష్మి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.