Aug 16 2016 12:24 PM | Updated on Aug 30 2018 4:07 PM
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
తిరుమల ఘాట్ రోడ్డులోని 45వ మలుపు వద్ద మంగళవారం ప్రమాదం జరిగింది.
- మహిళ మృతి
తిరుమల: తిరుమల ఘాట్ రోడ్డులోని 45వ మలుపు వద్ద మంగళవారం ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్నిఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. బాధితులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.