
మహిళ హత్య
కలహాల నేపథ్యంలో ఓ మహిళను ఉరేసి హతమార్చిన సంఘటన నర్సింగపేట గ్రామంలో బుధవారం అర్థరాత్రి జరిగింది.
వారు ఆమెను పరిశీలించగా మృతిచెందినట్టు గుర్తించారు. అ సమయంలో బాషా కూడా వారికి అక్కడ కనిపించలేదు. దాంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని చింతూరు సీఐ దుర్గారావు, ఎస్సై గజేంద్రకుమార్ పరిశీలించి వివరాలు సేకరించారు. మృతురాలి గొంతు నులిమిన ఆనవాళ్లు ఉండడంతో ఘర్షణ అనంతరం పోలమ్మను హతమార్చి ఇంట్లో ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు బాషా ప్రయత్నించి ఉండవచ్చని సీఐ అన్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం చింతూరు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు బాషా పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు.