యువకుడి ఆత్మహత్య | younger suicides | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Dec 3 2016 11:57 PM | Updated on Aug 1 2018 2:10 PM

మండలంలోని కోనాపురానికి చెందిన ధనుంజయ(23) శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్‌ఐ శ్రీరాములు, మృతుని బంధువులు తెలిపారు.

ఉరవకొండ : మండలంలోని కోనాపురానికి చెందిన ధనుంజయ(23) శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్‌ఐ శ్రీరాములు,
మృతుని బంధువులు తెలిపారు. వారి కథనం ప్రకారం... మహిళ విషయంగా గ్రామానికి చెందిన వెంకటేసులు, అతని బామ్మర్ది మందలించడంతో అవమానభారంతో మనస్థాపానికి గురయ్యాడు.

పెన్నహోబిళం సమీపంలోని తన సొంత పొలంలో శీతలపానీయంలో విషపు మందు కలుపుకొని తాగడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన కూలీలు కొందరు వెంటనే ధనుంజయ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement