‘చిచ్చుపెట్టి రాజకీయ లబ్దికి యత్నం’ | KCR play dirty politics, says damodara raja narasimha | Sakshi
Sakshi News home page

‘చిచ్చుపెట్టి రాజకీయ లబ్దికి యత్నం’

Apr 10 2014 8:42 PM | Updated on Sep 27 2018 8:33 PM

‘చిచ్చుపెట్టి రాజకీయ లబ్దికి యత్నం’ - Sakshi

‘చిచ్చుపెట్టి రాజకీయ లబ్దికి యత్నం’

టీఆర్‌ఎస్ పార్టీకి విలువుల లేవని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ విమర్శించారు.

అల్లాదుర్గం: టీఆర్‌ఎస్ పార్టీకి విలువుల లేవని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ విమర్శించారు. గురువారం మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చిల్వెర ఐబీ వద్ద ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధాంత భావజాలం లేని టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణను ఏం పాలిస్తుందని ప్రశ్నించారు.

కేసీఆర్ తన కొడుకుకు సిరిసిల్లా, కూతురుకు నిజామాబాద్, అల్లుడికి సిద్దిపేటలో టికెట్ ఇచ్చి కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. బాబుమోహన్, హన్మంత్‌రావ్, మాణిక్‌రెడ్డిలు ఎన్ని పార్టీలు మారారని, 24 గంటల్లో కండువా మార్చిన వారికి టికెట్‌లు కేటాయిస్తూ వలసలను పోత్సహిస్తున్నారని విమర్శించారు.

నాయకులు గ్రూపులు చేసుకొని పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇస్తే రాజకీయ వ్యభిచారం చేసినట్లు అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇతర పార్టీల్లో చిచ్చుపెట్టి తాను రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement