16న విజయమ్మ పర్యటన | ys vijayamma Eluru tour on 16th | Sakshi
Sakshi News home page

16న విజయమ్మ పర్యటన

Published Tue, Apr 15 2014 12:36 AM | Last Updated on Mon, May 28 2018 1:21 PM

16న విజయమ్మ పర్యటన - Sakshi

16న విజయమ్మ పర్యటన

సాక్షి ప్రతినిధి, ఏలూరు :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఈనెల 16న జిల్లాకు రానున్నారు. చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల్లో ‘వైఎస్సార్ జనభేరి’ పేరిట ఎన్నికల సమర శంఖారావం పూరిస్తారు. బుధవారం ఉదయం 10గంటలకు చింతలపూడిలో జరిగే బహిరంగ సభలో ఆమె పాల్గొంటారు. అనంతరం జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం వెళతారు. అక్కడ రోడ్ షో నిర్వహించి, గోపాలపురం నియోజకవర్గంలో ప్రవేశిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు గోపాలపురంలో రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు కొవ్వూరు నియోజకవర్గం పరిధిలోని తాళ్లపూడి వెళతారు. అక్కడ నిర్వహించే సభలో విజయమ్మ ప్రసంగిస్తారు. విజయమ్మ పర్యటనకు మూడు నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విసృ్తత ఏర్పాట్లు చేస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement