పళ్లు జివ్వుమంటున్నాయా? | health tips | Sakshi
Sakshi News home page

పళ్లు జివ్వుమంటున్నాయా?

Sep 18 2017 12:11 AM | Updated on Sep 19 2017 4:41 PM

పళ్లు జివ్వుమంటున్నాయా?

పళ్లు జివ్వుమంటున్నాయా?

అర టీ స్పూన్‌ నల్ల మిరియాల పొడి, కొద్దిగా లవంగ నూనెలను తీసుకుని మిశ్రమంగా తయారు చేయాలి.

హెల్త్‌టిప్స్‌

అర టీ స్పూన్‌ నల్ల మిరియాల పొడి, కొద్దిగా లవంగ నూనెలను తీసుకుని మిశ్రమంగా తయారు చేయాలి. దాన్ని నొప్పి పెడుతున్న పన్నుపై అప్లై చేయాలి. రోజూ ఇలా చేస్తుంటే పంటినొప్పి తగ్గడంతోపాటు పళ్లు దృఢంగా తయారవుతాయి.  గొంతునొప్పి, మంట, దగ్గులకు... టేబుల్‌ స్పూన్‌ తాజా నిమ్మరసం, అర స్పూన్‌ నల్ల మిరియాల పొడి, టీస్పూన్‌ ఉప్పును ఒక గ్లాస్‌ వేడినీటిలో కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. దీన్ని నోటిలో పోసుకుని పుక్కిలిస్తూ ఉంటే గొంతునొప్పి, మంట, దగ్గు తగ్గుతాయి. తలనొప్పి నివారణకు యాస్ప్రిన్‌ వేసుకోవడం అందరూ చేసే పనే.

అలా కాకుండా దాల్చిన చెక్కను నీటితో తడిపి అరగదీసి కణతలకు పూస్తూ ఉంటే తలనొప్పి ముఖ్యంగా జలుబు వల్ల వచ్చే తలనొప్పి సులువుగా తగ్గిపోతుంది. అజీర్తి, పులితేన్పులు వస్తుంటే రెండు చిటికలు దాల్చిన చెక్కపొ, రెండు చిటికలు శొంఠిపొడి, నాలుగు చిటికలు యాలకుల పొడీ కలిపి రోజూ భోజనానికి ముందు సేవిస్తూ ఉంటే  అజీర్ణం, తేన్పులు రాకుండా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement