సోషల్ మీడియాలో ఇంటర్ ప్రశ్నాపత్రాలు? | mass copying in intermediate exams in suryapet | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియాలో ఇంటర్ ప్రశ్నాపత్రాలు?

Published Wed, Mar 9 2016 12:31 PM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో జోరుగా మాస్‌కాపియింగ్ జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.

సూర్యాపేట : రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో జోరుగా మాస్‌కాపియింగ్ జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.  బుధవారం జరుగుతున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం మాథ్య్-ఏ పేపర్ పరీక్ష జరుగుతుండగా ఈ విషయం బయటపడింది. నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని కొన్ని ప్రైవేటు కళాశాలలకు చెందిన అధ్యాపక బృందమే ఈ పని చేసినట్లు తెలుస్తోంది. పరీక్ష జరుగుతున్న సమయంలోనే ప్రశ్నపత్రాన్ని బయటకు తీసుకెళ్లి.. వాటికి సరైన సమాధానాలు రాసి...  తీసుకొచ్చి... విద్యార్థులకు పంచుతున్నట్లు అధికారులకు సమాచారం.  

 
మరో వైపు ఏపీలోని నెల్లూరుజిల్లాలో కూడా కాపీయింగ్ జోరుగా జరగుతోంది. జిల్లాలోని రాపూర్ లోని ఓ ఎగ్గామ్ సెంటర్ లో మాస్ కాపీయింగ్ జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. సెకండియన్ మ్యాథ్స్ , సివిక్స్ ప్రశ్నా ప్రతాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నట్టు సమాచారం. ఈరోజు ఉదయం 8 గంటలకే ప్రశ్నాప్రత్రాలు లీక్ అయ్యాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికి పోలీసులకు సమాచారం ఫిర్యాదు చేశారు. ఘటనకు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement