intermediate exams
-
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: రెగ్యులర్ ఇంటర్, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షల(Open School Society Inter exams)పై గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ విద్యా శాఖ అధికారులతో సమీక్షించారు. మార్చి, ఏప్రిల్ నెలలు పరీక్షల నెలలని, సజావుగా నిర్వహించేలా విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. రెగ్యులర్ ఇంటర్ పరీక్ష(Intermediate Exams)లకు 1,535 కేంద్రాలకు గాను 68 సెంటర్లను సున్నిత, 36 కేంద్రాలను అతి సున్నితమైనవిగా గుర్తించామన్నారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని వీటిలో పటిçష్ట ఏర్పాట్లు చేయాలని విజయానంద్ ఆదేశించారు.వేసవి దృష్ట్యా తాగునీరు, ప్రథమ చికిత్స, విద్యుత్తు, బెంచ్లు వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.పేపర్ లీకేజీ వంటి వదంతులు వ్యాపింపజేసేవారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు జారీ చేయాలని, జిరాక్స్ సెంటర్లు, ఇంటర్ నెట్ కేంద్రాలు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.విద్యాశాఖ కార్యదర్శి కె.శశిధర్ మాట్లాడుతూ విద్యార్థులు సకాలంలో చేరుకునేలా తగిన సంఖ్యలో బస్సులను నడపాలన్నారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబరు 18004251531 ఏర్పాటు చేశామని, జిల్లా కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్లు నెలకొల్పాలని కలెక్టర్లకు సూచించారు. వయోజన విద్యాశాఖ డైరెక్టర్ కృతికా శుక్లా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఏర్పాట్లను వివరించారు. కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులేవీ అనుమతించొద్దని స్పష్టం చేశారు. తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు గదుల్లో తగినంత వెలుతురు ఉండేలా, విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని నిర్దేశించారు.పరీక్ష కేంద్రాలను సీసీ కెమెరాలతో అనుసంధానించి చీఫ్ సూపరింటెండెంట్ లైవ్ స్ట్రీమింగ్లో పర్యవేక్షించాలని తెలిపారు. ప్రథమ చికిత్స కిట్లతో పాటు అత్యవసర సమయాల్లో 108 అంబులెన్స్ను కూడా అందుబాటులో ఉంచేలా చూడాలని తెలిపారు. రాష్ట్రంలో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రెగ్యులర్ ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. 1 నుంచి 19 వరకు ప్రథమ, 3 నుంచి 20 వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నారు. 26 జిల్లాల్లో 10,58,892 మంది హాజరుకానున్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలు మార్చి 3 నుంచి 15 వరకు జరగనుండగా 325 కేంద్రాల్లో 67,952 మంది హాజరుకానున్నారు. -
ఇంటర్ పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకత
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేట్, రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో అత్యాధునిక సీసీటీవీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ఇంటరీ్మడియట్ విద్యామండలి (టీజీబీఐఈ) ఓ విప్లవాత్మక అడుగు ముందుకేసింది.రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సిస్టంతో అనుసంధానించారు. టీజీబీఐఈ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ పనితీరును శుక్రవారం విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు, జ్యోత్స్నరెడ్డిలతో కలిసి పరిశీలించారు.తెలంగాణ విద్యావ్యవస్థలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన సాంకేతిక వ్యవస్థతో పరీక్ష కేంద్రాలను రియల్టైంలో పర్యవేక్షించడంతోపాటు న్యాయమైన పరీక్ష వాతావరణాన్ని ఏర్పాటు చేయొచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో ఏర్పాటు చేసిన 8,000 కంటే ఎక్కువ హైరిజల్యూషన్ కెమెరాలతో అనుసంధానం చేసిన కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పనితీరును బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య వివరించారు. ఈ నూతన వ్యవస్థతో పరీక్షల నిర్వహణను ఏకకాలంలో పర్యవేక్షించడానికి, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా చేయడంతోపాటు ఏవైనా అవకతవకలను నివారించడానికి వీలు ఉంటుందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడంపై అధికారులను మురళి ప్రశంసించారు. ఇది విద్యారంగంలో ఒక మైలురాయిగా, పరీక్ష సంస్కరణలకు కొత్త ప్రమాణంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ములుగు జిల్లాలోని ఒక ప్రభుత్వ కళాశాలను సీసీటీవీ ద్వారా పరిశీలించారు. రాష్ట్ర విద్యా వ్యవస్థపై నమ్మకం, విశ్వాసాన్ని ఈ వ్యవస్థ బలోపేతం చేస్తుందని, ఇది దేశవ్యాప్తంగా ఉన్న ఇతర విద్యా బోర్డులకు ఆదర్శప్రాయమైన నమూనాగా పనిచేస్తుందని చెప్పారు. -
AP: ఇంటర్ ఫీజు చెల్లింపునకు తత్కాల్ అవకాశం
సాక్షి, అమరావతి: మార్చి ఒకటో తేదీనుంచి జరిగే ఇంటర్మీడియట్ (Intermediate) పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు తత్కాల్ (Tatkal Scheme) కింద అవకాశం కల్పించారు. అభ్యర్థులు రూ.3 వేల ఆలస్య రుసుంతో మంగళవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంజనవరి నుంచి 1,48,923 మంది ఇంటర్ విద్యార్థులకు భోజనం పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం (Midday Meal) అందించేందుకు సమగ్ర శిక్ష విభాగం ఏర్పాట్లు చేసింది. మొత్తం 475 కాలేజీల్లో 398 కాలేజీలకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో భోజనం అందిస్తున్న ఏజెన్సీలకు అప్పగించారు. మరో 77 కాలేజీలకు ఎన్జీవోల ద్వారా భోజనం సరఫరా చేయనున్నారు.రాష్ట్ర వర్సిటీలు, ప్రభుత్వ కాలేజీలకు రూ.100 కోట్లుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ప్రధాన మంత్రి ఉచ్ఛతర్ శిక్షాభియాన్ (పీఎం–ఉష)లో భాగంగా దేశంలోని పలు విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించింది. వర్సిటీలకు అవసరమైన ల్యాబ్స్, మౌలిక సదుపాయాల కల్పన కోసం గత విద్యాసంవత్సరం (2023)లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఇప్పుడు నిధులు మంజూరుచేసింది. ఈ నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కేంద్రం త్వరలో మార్గదర్శకాలు ఇవ్వనుంది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (పేరెంట్స్ కమిటీ)లకు ఒక్కరోజు శిక్షణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొత్తం 45,124 పాఠశాలలకు సంబంధించి జిల్లా, మండల, పాఠశాల స్థాయిల్లో ఈ శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు జిల్లా స్థాయిలోనూ, 31 నుంచి జనవరి 2 వరకు మండల స్థాయిలోనూ, 3 నుంచి 6వ తేదీ వరకు పాఠశాల స్థాయిలోనూ శిక్షణ నిర్వహించాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు డీఈవోలను ఆదేశించారు. కాగా, జిల్లా స్థాయిలో 3,765 మందికి, మండల స్థాయిలో 93,643 మంది శిక్షణకు గానూ రూ.1,92,80,070 నిధులు మంజూరు చేశారు. నాన్ టీచింగ్ సిబ్బందికి జేఎల్ పదోన్నతులుప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 2024–25 విద్యా సంవత్సరం ప్యానల్ సంవత్సరానికి బోధనేతర సిబ్బందికి 10 శాతం కోటా కింద ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న జేఎల్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపించాలని ఇంటర్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా సోమవారం ఆర్జేడీలను ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అభ్యంతరాలను నమోదు చేయాలని సూచించారు. వీటిపై ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాను సిద్ధం చేసి తుది సీనియారిటీ జాబితాను పంపించాలన్నారు. కాగా, ఇదే కేటగిరీ కింద ఇటీవల 24 మంది నాన్ టీచింగ్ సిబ్బందికి ఒకేషనల్ జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించారు. -
TG: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను ఇంటర్మీడియేట్ బోర్డు సోమవారం(డిసెంబర్16) విడుదల చేసింది. మార్చి 5 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. మరుసటి రోజు మార్చి 6 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలవుతాయి. ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ ఇదీ..మార్చి 5న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1మార్చి 7న ఇంగ్లీష్ పేపర్ 1మార్చి 11న మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బోటని పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్1మార్చి 13న మ్యాథమెటిక్స్ పేపర్ 1 బి, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1మార్చి 17న ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1మార్చి 19న కెమిస్ట్రీ పేపర్ 1 కామర్స్ పేపర్ 1ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్ ఇదీ..మార్చి 6న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2మార్చి 10న ఇంగ్లీష్ పేపర్ 2మార్చి 12న మ్యాథమెటిక్స్ పేపర్ 2A, బోటని పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2మార్చి 15న మ్యాథమెటిక్స్ పేపర్ 2B, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2మార్చి 18న ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2మార్చి 20న కెమిస్ట్రీ పేపర్ 2 కామర్స్ పేపర్ 2 -
AP: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే 8.45 గంటల కల్లా విద్యార్థులు పరీక్ష హాల్లో ఉండాలి. శుక్రవారం మొదటి ఏడాది, శనివారం రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ విద్యా సంవత్సరం మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, వారిలో మొదటి సంవత్సరం 4,73,058 మంది, రెండో సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు. మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్లను సిద్ధం చేశారు. పరీక్షల పర్యవేక్షణకు 147 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 60 సిట్టింగ్ స్క్వాడ్స్ను బోర్డు నియమించింది. వీరితో పాటు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి జిల్లాకు ఇద్దరు అధికారులను పంపించారు. పరీక్షలు జరిగే ప్రతి గదిలోనూ సీసీ టీవీ కెమేరాలను ఏర్పాటు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల కెమేరాలతో నిఘా ఉంచారు. పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థి, పరిశీలకుల హాజరును ఆన్లైన్ ద్వారా తీసుకోనున్నారు. పరీక్షల సరళిని పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలోనూ ఓ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. పరీక్షలపై ఇంటర్ బోర్డు ‘డిజిటల్ నిఘా’ను ఏర్పాటు చేసింది. పరీక్ష పేపర్లకు మూడు స్థాయిల్లో ‘క్యూఆర్’ కోడ్ను జోడించారు. పేపర్ ఎక్కడ ఫొటో తీసినా, స్కాన్ చేసినా వెంటనే తెలిసిపోయేలా చర్యలు తీసుకున్నారు. దివ్యాంగ విద్యార్థులకు గ్రౌండ్ ఫ్లోర్లోనే సెంటర్లను కేటాయించడంతో పాటు వీరికి మరో గంట అదనపు సమయం, పరీక్ష రాసేందుకు సహాయకులను అందుబాటులో ఉంచినట్టు ఇంటర్ విద్య కమిషనర్ సౌరభ్ గౌర్ తెలిపారు. కాగా, పరీక్షలు ముగిసేంత వరకు తాడేపల్లిలోని ఇంటర్ విద్య కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదులు, గ్రీవెన్స్ల స్వీకరణకు 08645–277707, టోల్ఫ్రీ నంబర్ 18004251531కు రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కాల్ చేయొచ్చు. -
కలిసి మీరూ రాయండి
ఒకరోజు తేడాతో ఇంటర్మీడియెట్ పరీక్షలు రెండు రాష్ట్రాలలో మొదలయ్యాయి. పిల్లలు కొంత ఆందోళనగా, కొంత హైరానాగా ఉంటారు. ఈ సమయంలో పిల్లలు రాయాల్సిన వారుగా తాము రాయించే వారుగా తల్లిదండ్రులు ఉండరాదు. పిల్లల పరీక్షాకాలంలో తాము కూడా తోడుగా ఉన్న భావన కలిగించాలి. అలా కలిగించాలంటే వారిని వీలున్నంత సౌకర్యంగా ఉంచాలి. భయపెట్టని ప్రోత్సాహం అందించాలి. నిపుణుల సమగ్ర సూచనలు. తండ్రి ఆఫీసులోఎనిమిది గంటలు పని చేయగలడు. మధ్యలో విరామాలు ఎన్నో ఉంటాయి. అమ్మ ఇంట్లో మూడు పూట్లా పని చేస్తుంది. మధ్యలో ఆమెకూ విరామాలుంటాయి. కాని పరీక్షలు వచ్చినప్పుడు మాత్రం విరామం లేకుండా పిల్లలు చదువుతూనే ఉండాలంటారు తల్లిదండ్రులు. పిల్లలకు ధారణశక్తి డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి పిల్లవాడికీ అది మారుతుంది. కొందరు ఒక అంశాన్ని అలా కళ్లతో చూసి గుర్తు పెట్టుకోగలరు. కొందరు అరగంట సేపు చూసి నేర్చుకోగలరు. మరికొందరు గంట చదివితే తప్ప గ్రహించలేరు. వీరు ముగ్గురూ పుస్తకం పట్టుకుని మాత్రమే కనిపించాలని పరీక్షల సమయంలో తల్లిదండ్రులు ఆశిస్తే ‘చదివిందే ఎంతసేపు చదవాలి’ అని మొదటి రెండు రకాల పిల్లలు విసుక్కుంటారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల చేత పరీక్షలు రాయించడమంటే వారిని పూర్తిగా అర్థం చేసుకుంటూ వారికి సహకరిస్తూ, విరామాలిస్తూ, ప్రోత్సహిస్తూ చదివించడమే. వాళ్ల ప్లానింగ్ని వినాలి పిల్లలు పరీక్షల టైమ్ టేబుల్ రావడానికి ముందే వాళ్లదైన పద్ధతిలో ఎలా చదవాలో ప్లాన్ చేసుకుంటారు. అంటే వాళ్లు వీక్గా ఉన్న సబ్జెక్ట్ను ముందే చదువుకుంటారు. స్ట్రాంగ్గా ఉన్న సబ్జెక్ట్ను ఉపేక్షిస్తారు. మేథ్స్ పరీక్షకు ఒక్క రోజు మాత్రమే టైమ్టేబుల్లో విరామం వస్తే తెలుగు/సంస్కృతం పేపర్లో స్ట్రాంగ్గా ఉండే పిల్లలు మరో రెండు రోజుల్లో తెలుగు పేపర్ ఉందనగా కూడా మేథ్స్ చేసుకుంటూ కనిపించవచ్చు. వారిని బలవంతంగా తెలుగు చదివించాల్సిన పని లేదు. వారి ప్లానింగ్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. కొన్ని పేపర్లకు మూడు రోజుల గ్యాప్ రావచ్చు. ఆ మూడు రోజుల్లో మొదటి రోజును ఇంకో పేపర్ సిలబస్ కోసం కొందరు పిల్లలు కేటాయిస్తే కంగారు పడాల్సిన పని లేదు. ఆ రాయాల్సిన పరీక్షకు వారి ఉద్దేశంలో రెండు రోజులు చాలనే. ఇలాంటివి పిల్లలు చెప్పినప్పుడు మన మొండితనంతో ఇలాగే చదవాలని తల్లిదండ్రులు బలవంతం చేయకపోవడం మంచిది. బయటి తిండి వద్దు పరీక్షలు అయ్యేంత వరకూ తల్లిదండ్రులకు వీలున్నా లేకపోయినా బయటి ఆహారం అది బ్రేక్ఫాస్ట్ అయినా గాని ఇవ్వకపోవడం తప్పనిసరి. బయటి పదార్థాలు పొట్టని పాడు చేస్తే పరీక్ష రాయడం చాలా ఇబ్బంది అవుతుంది. పరిశుభ్రమైన ఇంటి తిండి పిల్లలకు అందించాలి. ఆకుకూరలు, కాయగూరలతో పాటు గుడ్డు తినే పిల్లలకు తినిపించాలి. బొప్పాయి, సపోటా మంచివి. పిల్లలు చదువుకునే డెస్క్ మీద, పరీక్ష హాలులో వాటర్ బాటిల్ ఉండేలా చూసుకోవాలి. పిల్లలు హైడ్రేట్గా ఉండేలా మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు ఇస్తుండాలి. తోడు వెళ్లండి పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఎవరో ఒకరు పరీక్షా కేంద్రానికి వెళితే పిల్లలకు ధైర్యంగా ఉంటుంది. పరీక్ష అయ్యే వరకూ బయటే ఉండి తీసుకొస్తాం అనంటే వారు లోపల ధైర్యంగా రాస్తారు. అలాగే పరీక్షలు అయ్యేంత వరకూ పిల్లలను ఒంటరిగా పనుల మీద బయటకు పంపరాదు. వెహికల్స్ నడపనివ్వరాదు. ఈ సమయంలో చిన్న ప్రమాదం కూడా పెద్ద నష్టానికి దారి తీస్తుంది. పరీక్షలు అయ్యేంత వరకూ పిల్లలు పెద్దల అజమాయిషీలోనే బయటకు వెళ్లాలి. వారితో వాక్ చేయండి పరీక్ష రాసి వచ్చాక, తర్వాతి పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు పిల్లలతో సాయంత్రాలు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అరగంట సేపు వాకింగ్కు వెళ్లండి. ఆ సమయంలో వారితో ఏవైనా కబుర్లు చెప్పండి. ఆ సమయంలో కూడా చదువు గురించి కాకుండా ఏవైనా సరదా విషయాలు మాట్లాడండి. వారికి బ్రేక్ ఇచ్చినట్టూ ఉంటుంది... వ్యాయామమూ జరిగినట్టుంటుంది. సిన్సియర్గా చదవమనండి: తమను తాము మోసం చేసుకోకుండా, తల్లిదండ్రులను మోసం చేయకుండా ఉన్న తెలివితేటలను బట్టి మేక్సిమమ్ ఎంత చదవగలరో అంతా సిన్సియర్గా చదివి పరీక్ష రాయమనండి. రాసిన దానిపై వాస్తవిక అంచనాతో ఉండమనండి. ఆ అంచనా ఎంతైనాగాని చెప్పమనండి. నిజాయితీగా రాయడమే తమ దృష్టిలో ముఖ్యమని, ఫలితాల సంగతి తర్వాత చూద్దామని చెప్పండి. వారు కొంత రిలీఫ్గా, మరింత శ్రద్ధగా పరీక్ష రాస్తారు. -
ఆదిలాబాద్ జిల్లాలో విషాదం..విద్యార్థి ఆత్మహత్య
-
Intermediate Exams : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం (ఫొటోలు)
-
ఆన్లైన్లో ఇంటర్ హాల్టికెట్లు
సాక్షి, అమరావతి: మార్చి ఒకటో తేదీ నుంచి ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల హాల్టికెట్లను ఇంటర్మీడియెట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో శుక్రవారం నుంచి అందుబాటులో ఉంచింది. పరీక్ష ఫీజు చెల్లించిన మొత్తం 10,52,221 మంది విద్యార్థుల హాల్టికెట్లను ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లాగిన్ ద్వారా, అదేవిధంగా ఇంటర్మీడియెట్ బోర్డు వెబ్సైట్ https://bieap.apcfss.in/ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. 2023–24 విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 4,73,058 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 5,79,163 మంది ఉన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు వెబ్సైట్లో తమ పుట్టిన తేదీని, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పుట్టిన తేదీ లేదా తమ మొదటి సంవత్సరం హాల్టికెట్ నంబర్ నమోదు చేసి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ హాల్టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని, నేరుగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకావొచ్చని ఇంటర్మీడియెట్ విద్యా మండలి కార్యదర్శి సౌరభ్గౌర్ ప్రకటించారు. ఎవరికైనా హాల్టికెట్పై ఫొటో ప్రింట్ కాకపోతే ఆ విద్యార్థులు పాస్పోర్ట్ సైజ్ ఫొటోతో సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ను సంప్రదిస్తే స్కాన్ చేసి ఫొటోతో కూడిన హాల్టికెట్ను ఇస్తారని వెల్లడించారు. మార్చి ఒకటి నుంచి మొదటి సంవత్సరం, రెండో తేదీ నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమై 20వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లను సిద్ధం చేశారు. పరీక్షలు జరిగే గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థి హాజరును ఆన్లైన్ ద్వారా తీసుకోనున్నారు. ప్రైవేటు యాజమాన్యాల వేధింపులకు చెక్ గతంలో ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులకు హాల్టికెట్లు ఇవ్వకుండా ఒత్తిడి చేసేవి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యేవారు. ఈ విషయంపై ఇంటర్ బోర్డుకు కూడా అనేక ఫిర్యాదులు అందేవి. ఇప్పుడు ఎటువంటి వేధింపులు లేకుండా విద్యార్థుల హాల్టికెట్లను ఇంటర్ బోర్డు పబ్లిక్ డొమైన్లోనే అందుబాటులో ఉంచింది. విద్యార్థులు ఎక్కడి నుంచి అయినా హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించింది. -
పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు చేయండి
సాక్షి, అమరావతి: మార్చి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పరీక్షలతోపాటు పదో తరగతి, ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షలను అధికారులంతా కలిసి సమర్థంగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. పది, ఇంటర్, ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షలు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, పోలీసు, వైద్య, రెవెన్యూ, విద్యుత్, తపాలా, ఆర్టీసీ శాఖల రాష్ట్ర అధికారులతో గురువారం విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ మార్చి నెల మొత్తం పరీక్షల కాలమని, దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు, అభ్యర్థులు వివిధ పరీక్షలకు హాజరవుతారని చెప్పారు. అధికారులంతా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను ముందుగానే పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకటి నుంచి ఇంటర్, 18 నుంచి పది పరీక్షలు ఈ ఏడాది ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,559 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 10,52,221 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 47,921 మంది అధికంగా పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి రెగ్యులర్ విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు, మొత్తం 6,23,092 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని, వీరికోసం 3,473 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్టు వివరించారు. వీరితోపాటు పరీక్షలకు రీ ఎన్రోల్ చేసుకున్న 1,02,058 మంది విద్యార్థులు కూడా ఉన్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 682 మందితో సిట్టింగ్ స్క్వాడ్స్, 156 మందితో ఫ్లయింగ్ స్క్వాడ్స్ సిద్ధం చేసినట్టు తెలిపారు. ఓపెన్ స్కూలుకు సంబంధించి పదో తరగతి, ఇంటర్ పరీక్షలు మార్చి 18 నుంచి 26 వరకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతాయని వివరించారు. ఓపెన్ టెన్త్లో 34,635 మంది విద్యార్థులు ఉండగా, 176 కేంద్రాలు, ఓపెన్ ఇంటర్ విద్యార్థులు 76,572 మంది ఉండగా, 327 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రంలోకి ఎవరూ సెల్ఫోన్లు తీసుకువెళ్లకూడదని స్పష్టంచేశారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. అదేవిధంగా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పరీక్షా కేంద్రాలకు అవసరమైన సౌకర్యాల కల్పనపై మంత్రి ఆరా తీశారు. 27 నుంచి ఏపీ టెట్ ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు జరిగే ఏపీ టెట్కు 2,79,685 మంది దరఖాస్తు చేసుకున్నారు. సీబీటీ విధానంలో జరిగే ఈ పరీక్ష కోసం అధికారులు 120 కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్తోపాటు హైదరాబాద్, బెంగళూరు, బరంపురం, చెన్నై, ఖమ్మం, కోదాడ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు డీఎస్సీ నిర్వహణ కోసం నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ ఎస్.సురేష్కుమార్, ఇంటర్మీడియెట్ విద్య కమిషనర్ సౌరభ్ గౌర్, పాఠశాల విద్య డైరెక్టర్ పార్వతి, సమగ్ర శిక్ష ఏఎస్పీడీ శ్రీనివాసులురెడ్డి, పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి, ఏపీ టెట్ జేడీ మేరీచంద్రిక, ఏపీ మోడల్ స్కూల్ డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి, ఓపెన్ స్కూల్ డైరెక్టర్ కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
గూగుల్ మ్యాప్స్ను నమ్ముకొని ఎగ్జామ్ రాయలేకపోయిన ఇంటర్ విద్యార్థి
సాక్షి, ఖమ్మం : గూగుల్ మ్యాప్స్ను నమ్ముకొని ఓ ఇంటర్ విద్యార్థి మోసపోయాడు. గూగుల్ మ్యాప్లో తాను వెళ్లాల్సిన ఎగ్జామ్ సెంటర్ కాకుండా వేరే లొకేషన్ చూపించడంతో తప్పుడు అడ్రస్కు వెళ్లాడు. గూగుల్ తప్పిదాన్ని గ్రహించిన విద్యార్థి.. మళ్లీ సరైన పరీక్షా కేంద్రానికి వచ్చినా.. అప్పటికే ఆలస్యం కావడంతో తొలిరోజు పరీక్ష రాయలేకపోయాడు. దీంతో చేసేదేం లేక బాధతో తిరిగి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో బుధవారం చోటుసుకుంది. ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామానికి చెందిన విద్యార్థి వినయ్ ఇంటర్ చదువుతున్నాడు. బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో ఎగ్జామ్ హాలుకు వెళ్లేందుకు గూగుల్ మ్యాప్స్ను నమ్ముకున్నాడు. అందులో చూపించిన డైరెక్షన్లో వెళ్లాడు. అయితే తాను వెళ్లాల్సిన లొకేషన్కు కాకుండా మరో ప్లేస్కు గూగుల్ మ్యాప్స్ తీసుకెళ్లింది. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత అది తాను పరీక్ష రాయాల్సిన సెంటర్ కాదని తెలిసింది. దీంతో హడావుడిగా వేరేవాళ్లను అడ్రస్ అడుక్కుంటూ పరీక్షా కేంద్రానికి వచ్చాడు. కానీ వినయ్ అప్పటికే 27 నిమిషాలు ఆలస్యంగా ఎగ్జామ్ సెంటర్కు చేరుకున్నాడు. నిమిషం నిబంధన కఠినంగా ఉండటంతో విద్యార్థినిపరీక్షా కేంద్రంలోకి అనుమతించేందుకు సిబ్బంది నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక బాధతో వినయ్ ఇంటికి చేరుకున్నాడు. -
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షల సందడి
-
సమస్యలుంటే కాల్ చేయండి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీ డియెట్ పరీక్షల నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక టోల్ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసినట్టు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. విద్యార్థులకు ఏ ఇబ్బంది తలెత్తినా 040– 24601010, 040– 24655027 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి మొదలయ్యే పరీక్షల ఏర్పాట్లపై మిత్తల్ మంగళవారం మీడియా సమావేశంలో వివరించారు. ఇంటర్ బోర్డ్ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పనిచేస్తాయని తెలిపారు. ఇవే కాకుండా ప్రతీ జిల్లాలోనూ ప్రత్యేక నంబర్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. కాలేజీలతో ప్రమేయం లేకుండా విద్యార్థులే ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ ద్వారా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించామన్నా రు. మంగళవారం మధ్యాహ్నం వరకూ 50 వేల మంది విద్యార్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. ఉదయం 9 దాటితే పరీక్ష హాలులోకి అనుమతించబోమని చెప్పారు. విద్యార్థులు ఎక్కడా నేలపై కూర్చొని పరీక్ష రాసే విధానం ఉండకూడదని అధికారుల ను ఆదేశించారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 9,47,699 మంది పరీక్షలు రాస్తున్నారని, వీరిలో 4,82,677 మంది ఫస్టియర్, 4,65,022 మంది సెకెండీయర్ ఉన్నట్టు చెప్పారు. 75 ఫ్లైయింగ్ స్వా్కడ్స్ పనిచేస్తాయన్నారు. డిజిటల్ మూల్యాంకనం ఈ ఏడాది 35 లక్షల ప్రశ్నాపత్రాలకు ఆన్లైన్లో మూల్యాంకన చేపట్టాలని నిర్ణయించామని మిత్తల్ తెలిపారు. ఇందుకు సంబంధించి రెండోసారి పిలిచిన టెండర్లకు రెండు కంపెనీలు ముందుకొచ్చాయని, వాటి అర్హతలను పరిశీలిస్తున్నామని తెలిపారు. టెన్త్ పరీక్షలు పూర్తయ్యేనాటికే ఇంటర్ కాలేజీల అఫ్లియేషన్ ప్రక్రియ ముగించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. అఫ్లియేషన్ లేకపోతే పరీక్షకు బోర్డ్ అనుమతించదనే విషయమై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఈసారి ముందే అంగీకారం తీసుకునే వీలుందన్నారు. ఇంటర్ ప్రవేశాలను ఆన్లైన్ ద్వారా చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. -
ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గ్రేటర్లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో సుమారు 4,17,740 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 2,19,790 మంది ప్రఽథమ, 1,97,950 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. సుమారు 548 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లోని పరీక్ష కేంద్రాలకు మాత్రం అదనపు డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. పర్యవేక్షణ కోసం ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు జిల్లా స్థాయి పరీక్షల కమిటీ(డీఈసీ)తో పాటు హైపవర్ కమిటీ సభ్యులు సైతం ఆకస్మికంగా కేంద్రాలను సందర్శించేలా చర్యలు చేపట్టారు. నిఘా నేత్రాల నడుమ పరీక్షల నిర్వహణ కొనసాగనుంది. పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగనున్నాయి. ఏర్పాట్లు పూర్తి ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్లు ప్రకటించారు. సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరీక్షల ఏర్పాట్లపై నిర్వహించిన వీడియో కాన్పరెన్స్లో వారు వెల్లడించారు. ఇప్పటికే సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద మంచి నీటి సౌకర్యం, మెడికల్ కిట్స్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వెబ్సైట్లో హాల్ టికెట్లు హాల్ టికెట్లను వెబ్ సైట్ www.tsbie. egg. gov. in ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్పై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదు. కాలేజీలో హాల్ టికెట్ ఇవ్వకుంటే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. అర గంట ముందే చేరుకోండి.. పరీక్ష సమయం కంటే ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని బోర్డు అధికారులు విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. చివరి నిమిషంలో టెన్షన్ పడకుండా.. అరగంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని.. దీనివల్ల ఒత్తిడి నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. ఆయా పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతాలకు.. ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ పరీక్షల నేపథ్యంలో రౌండ్ది క్లాక్ పని చేసే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 040– 24601010 లేదా 040– 24655027 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. జిల్లాల వారీగా మినీ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టెలీ మానస హెల్ప్లైన్ నంబర్ 14416ను ఏర్పాటు చేశారు. గ్రేటర్లో పరీక్షలు ఇలా.. జిల్లా పరీక్ష కేంద్రాలు - ప్రథమ -ద్వితీయ హైదరాబాద్ -233 84,223 -86,923 రంగారెడ్డి జిల్లా -182 71,773 -55,883 మేడ్చల్– మల్కాజిగిరి -133 63,794- 55,144 -
ఏపీ లో ఇంటర్ ఎగ్జామ్స్
-
స్కూల్ టీచర్లకూ ‘ఇంటర్’ విధులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల పకడ్బందీ నిర్వ హణకు కసరత్తు మొదలైంది. ప్రైవేట్ కాలేజీలతో మిలాఖత్ అయ్యేవారికి చెక్ పెట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే నెల 15 నుంచి మొదలయ్యే ఈ పరీక్షల విధుల్లోకి స్కూల్ టీచర్లను కూడా తీసుకోవాలని ఇంటర్ బోర్డ్ నిర్ణయించింది. ఇంటర్ కాలేజీ అధ్యాపకుల కొరత ఉన్నచోట టీచర్ల అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువుండే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్ టీచర్లను పరీక్షల విధులకు తీసుకోవాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఈ ఏడాది ఫస్టియర్ ఇంటర్కు 4,82,619 మంది, సెకండియర్కు 4,65,391 మంది హాజరవుతున్నట్టు పేర్కొంది. ప్రైవేటు కాలేజీలతో మిలాఖత్ అయినట్టు ఆరోపణలున్న పరీక్షాకేంద్రాలపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఆయా కాలేజీల్లో వీలైనంత వరకూ క్లీన్ రికార్డు ఉన్నవారికే ఇన్విజిలేషన్ బాధ్యతలు అప్పగించనున్నారు. భద్రత మరింత పెంపు కొత్తగా ప్రవేశపెడుతున్న ఆన్లైన్ మూల్యాంకన విధానాన్ని అభాసుపాలు చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారనే ఆందోళన అధికారుల్లో ఉంది. వారికి అనుకూలంగా ఉండే బోర్డ్ సిబ్బందితో కలిసి వ్యతిరేక కార్యకలాపాలు సాగించే వీలుందని ఉన్నతాధికారులకు సమాచారం అందింది. దీంతో ప్రతీ పరీక్షకేంద్రం సమీపంలో విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ పుటేజీని ఇంటర్బోర్డ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బయటవ్యక్తులతో సంబంధాలు పెట్టుకుంటున్న వారిపై ఇంటర్ బోర్డ్ నిఘా పెట్టింది. క్షేత్రస్థాయిలోనూ సమీక్షిస్తున్నాం ఎక్కడా ఆరోపణలకు తావివ్వకుండా ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. క్షేత్రస్థాయిలో వాస్తవపరిస్థితులు, తీసు కోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షిస్తున్నాం. విద్యార్థులకు అసౌకర్యం లేకుండా చేయడమే కాదు. పరీక్షకేంద్రాల్లో ఎలాంటి పక్షపాతానికి తావివ్వని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నాం. అన్నివర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. – జయప్రదాబాయి, ఇంటర్ పరీక్షల విభాగం కంట్రోలర్ ప్రతీ విద్యార్థి స్వేచ్ఛగా రాసేలా చర్యలు ఇంటర్ పరీక్షలను మంచి వాతావరణంలో ప్రతీ వి ద్యార్థి రాయాలని కోరు కుంటున్నాం. ఈసారి తొలి దశలో కొన్ని పేపర్ల కు ఆన్లైన్ మూల్యాంకనం చేపడుతున్నాం. దీ నిపై విమర్శలు చేసే శక్తుల ప్రమేయం పరీక్ష లపై ఉండరాదని అధికారులను ఆదేశించాం. – నవీన్ మిత్తల్, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి -
ఇంటర్ పరీక్షలకు వేళాయె
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్మీడియెట్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. మూడేళ్లుగా ఇంటర్ పరీక్షలు పలు కారణాలతో వాయిదా పడటం, అనుకున్న సమయానికి ప్రారంభం కాకపోవడం, కరోనా సమయంలో రద్దు చేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. అయితే ఈ ఏడాది షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వం పరీక్షలు నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం ఈనెల 15 నుంచి పరీక్షలు జరుగనున్నాయి. పూర్వ పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా ఏలూరులోని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షాణాధికారి ప్రత్యేక దృష్టి సారించారు. నైతికత, మానవ విలువలపై పరీక్షలు ఇంటర్ పరీక్షల్లో భాగంగా ముందుగా ఈనెల 15న నైతికత, మానవ విలువలు అనే సబ్జెక్టుపై పరీక్ష నిర్వహించనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా ఈ పరీక్ష ఉత్తీర్ణులు కావాల్సి ఉంది. అలాగే ఈనెల 17న పర్యావరణ విద్య అనే సబ్జెక్టుపై పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు పూర్వ పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని ఏలూరు జిల్లాలో 96 కేంద్రాల్లో 12,785 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 113 కేంద్రాల్లో 15,966 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 41 కేంద్రాల్లో 5,372 మంది మొత్తంగా 34,123 మంది హాజరుకానున్నారు. ప్రాక్టికల్స్కు సర్వం సిద్ధం పరీక్షల్లో భాగంగా ముందుగా ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈనెల 20 నుంచి వీరికి ప్రాక్టికల్స్ ప్రారంభమై వచ్చేనెల 7వ తేదీతో ముగుస్తాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు నాన్ జంబ్లింగ్ విధానంలో పరీక్షలు రాయవచ్చు. మొత్తంగా 8,417 మంది విద్యార్థులు హాజరయ్యే పరీక్షల కోసం 76 కేంద్రాలను సిద్ధం చేశారు. అలాగే జనరల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఈనెల 26న ప్రారంభం కానున్నాయి. 147 కేంద్రాల్లో 24,227 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వచ్చేనెల 15 నుంచి.. ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలు వచ్చేనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 73,521 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 106 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో.. పరీక్షలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసే సీసీ కెమెరాలన్నింటినీ ఆన్లైన్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. అలాగే ప్రతి కేంద్రాన్నీ సెల్ఫోన్రహిత జోన్గా ప్రకటించారు. ఎవరూ కేంద్రాలకు సెల్ఫోన్ తీసుకురాకూడదనే నిబంధన విధించారు. ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలా.. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకున్నాం. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి వారిని అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులయ్యేలా అధ్యాపకులకు సూచనలిచ్చాం. కళాశాలల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచడానికి ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నాం. విద్యార్థులు కళాశాలలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూడటం, వెనుకబడిన విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించడం వంటివి చేస్తున్నాం. – కె.చంద్రశేఖరబాబు, ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి, ఏలూరు -
అవే చివరి పలకరింపులు.. ఇంటర్ పరీక్షలు ముగించుకొని బైక్పై వెళ్తూ..
ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగియడంతో ఆ విద్యార్థిని తన స్నేహితురాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ.. ఆనందంగా గడిపింది. హాస్టల్లో తన వస్తువులు సిద్ధం చేసుకొని మరోసారి మిత్రులందరినీ పలకరించి నాన్నతో పాటు ఆనందంగా బైక్పై గ్రామానికి బయల్దేరింది. కానీ.. ఆ విద్యార్థిని ఆనందం కొన్ని నిమిషాల్లో ఆవిరైపోయింది. దారి మధ్యలోనే బస్సు రూపంలో వచ్చిన మృత్యువు తండ్రి, కూతురిని బలితీసుకుంది. ఇక సెలవంటూ స్నేహితురాళ్లకి.. ఇంటికి వస్తున్నానని తల్లికి ఫోన్లో విద్యార్థిని చెప్పిన ఆ పలకరింపులే.. చివరివయ్యాయి. సాక్షి, గద్వాల క్రైం: రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు దుర్మరణం చెందిన విషాదకర సంఘటన గద్వాల మండలం అనంతపురం శివారులో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు కథనం మేరకు వివరాలిలా.. ఇటిక్యాల మండలం మునగాలకి చెందిన నల్లన్న (42), పద్మమ్మకు ఇద్దరు సంతానం. కుమార్తె రాజేశ్వరి (18) గద్వాల మండలంలోని గొనుపాడు కేజీబీవీ కళాశాలలో ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతుంది. గురువారం ఇంటర్మీడియెట్ చివరి పరీక్ష సైతం పూర్తవడంతో విద్యార్థిని పరీక్ష కేంద్రం వద్ద, హాస్టల్లో తోటి విద్యార్థినులతో ఆనందంగా పలకరిస్తూ.. తిరిగి పైచదువులకు కలుద్దామని చెప్పింది. కూతురిని ఇంటికి తీసుకొచ్చేందుకు తండ్రి నల్లన్న బైక్పై మునగాల నుంచి గోనుపాడులోని కేజీబీవీ హాస్టల్కు చేరుకున్నాడు. స్నేహితులందరికీ మరోసారి పలకరించిన రాజేశ్వరి తండ్రితో పాటు బైక్పై స్వగ్రామానికి బయల్దేరింది. బస్సు రూపంలో కబళించిన మృత్యువు.. గురువారం మధ్యాహ్నం తండ్రీకూతురు ఇద్దరూ గద్వాల మీదుగా స్వగ్రామానికి వెళ్తుండగా.. ఎర్రవల్లి నుంచి గద్వాల వైపు వస్తున్న ఆర్టీసీ అద్దె బస్సుఎదురుగా వస్తున్న వీరి బైక్ను ఢీ కొట్టింది. దీంతో బైక్ పైనుంచి వారు ఎనిమిది మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. తీవ్రంగా గాయపడిన నల్లన్న, రాజేశ్వరి అక్కడిక్కడే మృతిచెందారు. ఇదిలా ఉండగా, బైక్ మామూలు వేగంతోనే వెళ్తుండగా.. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో బస్సు డ్రైవర్ ఎదురుగా వస్తున్న వీరి బైక్ను ప్రమాదవశాత్తు ఢీకొట్టాడు. చదవండి: దిశ కేసు: వారిని పోలీసులే వేధించి కాల్చి చంపారు గ్రామంలో విషాదం. రోడ్డు ప్రమాదంలో మునగాలకి చెందిన తండ్రీకూతురు మృతి చెందారనే విషయం తెలియగానే కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు కన్నీటి పర్యాంతమయ్యారు. రాజేశ్వరి చదువులో ఎంతో చురుకుగా ఉంటూ.. సెలవుల సమయంలో వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబ సభ్యులకు అండగా ఉండేదని గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వ్యవసాయ పనులపైనే ఆధారపడి బతుకీడుస్తున్న నల్లన్న కుటుంబంలో ఒక్కసారిగా ఇరువురు మృతిచెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు, బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు ఏఎస్ఐ వెంకట్రాములు తెలిపారు. -
గిట్లయితే ఎట్లా? చేతి రాతతో ప్రశ్నపత్రం.. అర్థంకాక తికమక
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మరోసారి గందరగోళం చోటుచేసుకుంది. ఇటీవల కోదాడలో ఫస్టియర్ ఇంగ్లిష్ పేపర్కు బదులు కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు రాగా, తాజాగా హిందీ మీడియం విద్యార్థులకు బోర్డ్ చుక్కలు చూపింది. బుధవారం ఫస్టియర్ పొలిటికల్ సైన్స్ పరీక్ష జరిగింది. కొంతమంది విద్యార్థులు హిందీ మీడియంలో పరీక్ష రాస్తున్నారు. అయితే, ఈ ప్రశ్నపత్రాన్ని బోర్డ్ హిందీ భాషలో ప్రింట్ చేయించకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. ఇంగ్లిష్ మాధ్యమంలో పరీక్ష కేంద్రానికి పంపే ప్రశ్నపత్రాన్నే హిందీలో తర్జుమా చేసి, విద్యార్థులకు ఇవ్వాలని బోర్డ్ ఆదేశించింది. అనువాదకులను పరీక్ష కేంద్రం వాళ్లే ఏర్పాటు చేసుకోవాలని హుకుం జారీ చేసింది. హైదరాబాద్లోని అంబేడ్కర్ కాలేజీ, నిజామాబాద్లోని మరో కేంద్రంలో హిందీ మీడియం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ప్రారంభానికి ముందు అనువాదకులను పిలిపించి వాళ్లతో ప్రశ్నపత్రం తర్జుమా చేయించి విద్యార్థులకు ఇచ్చారు. దీంతో పరీక్ష ఆలస్యమైంది. ఇదిలాఉంటే, అనువాదకుల చేతిరాత అర్థం కాక, విద్యార్థులు తిప్పలు పడ్డారు. ఆ రాతను అర్థం చేసుకోవడానికే చాలా సమయం పట్టిందని అంబేడ్కర్ కాలేజీలో పరీక్ష రాసిన విద్యార్థులు చెప్పారు. అర్థం కాని విషయాలను అడిగే అవకాశం కూడా చిక్కలేదన్నారు. ఈ కారణంగా పొలిటికల్ సైన్స్ పరీక్ష సరిగా రాయలేకపోయామని వాపోయారు. చేతితో రాసిన ప్రశ్నపత్రం ఎందుకీ పరిస్థితి? గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి ఎదురవ్వలేదని అధ్యాపక వర్గాలు అంటున్నాయి. బోర్డ్ పరిధిలో హిందీ అనువాదకులు లేరని, ఉన్నవాళ్లంతా రిటైరయ్యారని, అందుకే కాలేజీ వాళ్లనే ఏర్పాటు చేసుకోమన్నట్టు చెబుతున్నారు. అనువాదం కోసం బయట వ్యక్తులను పిలిస్తే, పేపర్ లీక్ చేసే ప్రమాదం ఉందనే ఈ నిర్ణయం తీసుకున్నామని సమర్థించుకుంటున్నారు. దీన్ని బోర్డ్లోని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కాలేజీల్లో హిందీ మీడియంలో బోధన సాగుతున్నప్పుడు అధ్యాపకులు ఎందుకు ఉండరని ప్రశ్నిస్తున్నారు. పరీక్ష ఉదయం 9 గంటలకు మొదలవుతుంది. 8.30 గంటలకు ప్రశ్నపత్రం బండిల్ విప్పుతారు. అంటే అరగంటలో అనువాదకుడు ఇంగ్లిష్ నుంచి హిందీలోకి తర్జుమా చేయాలి. నెలల తరబడి ప్రింట్ చేస్తున్న పేపర్లలోనే తప్పులు వస్తుంటే, అరగంటలో ట్రాన్స్లేట్ చేస్తే వచ్చే తప్పుల మాట ఏంటని వారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. హిందీ మాధ్యమంలో బోధించే అధ్యాపకులతో ముందే అనువాదం చేయించి ప్రశ్నపత్రం ప్రింట్ చేయించి ఉండాల్సిందని అంటున్నారు. వాస్తవ పరిస్థితులపై ఏమాత్రం అవగాహన లేకుండా బోర్డ్ వ్యవహరిస్తోందనే విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి. ఇంత నిర్లక్ష్యమా: మాచర్ల రామకృష్ణ గౌడ్ (తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి కన్వీనర్) హిందీ మాధ్యమంలో ప్రశ్నపత్రాలు ప్రింట్ చేయించకుండా, విద్యార్థులను గందరగోళంలో పడేయడం ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యానికి నిదర్శనం. పరీక్షల విభాగం కొంతమంది పైరవీకారుల చేతుల్లో ఇరుక్కుపోవడం వల్ల విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోంది. బోర్డ్ ప్రయత్నం చేస్తే హిందీ అనువాదకులు ఎందుకు దొరకరు. అప్పటికప్పుడు తర్జుమా చేయించడం వల్ల తప్పులు దొర్లితే దానికి ఎవరు బాధ్యత వహించాలి. లెక్చరర్లు లేకనే : ఇంటర్ బోర్డ్ లెక్చరర్లు అందుబాటులో లేకపోవడం వల్లే ఫస్టియర్ హిందీ మీడియం విద్యార్థులకు ప్రశ్నప్రతాలను ప్రింట్ చేయించడం సాధ్యం కాలేదని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ బుధవారం రాత్రి వివరణ ఇచ్చారు. గతంలో అనువాదం కోసం బోర్డ్ హిందీ మాధ్యమానికి చెందిన రిటైర్డ్ రెగ్యులర్ లెక్చరర్ల సేవలను పొందేదని, కోవిడ్ కారణంగా పాత లెక్చరర్లు అందుబాటులో లేరని, గోప్యమైన విషయం కాబట్టి ఈ పనిని వేరే వాళ్లకు అప్పగించలేమని చెప్పారు. హిందీ మాధ్యమంలో పరీక్ష రాసే విద్యార్థులు ఫస్టియర్లో 32 మంది, సెకండియర్లో 24 మందే ఉన్నారన్నారు. అందువల్లే అందుబాటులో ఉన్న అనువాదకుల సేవలు వినియోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్స్కు చెప్పినట్టు తెలిపారు. -
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం (ఫోటోలు)
-
హాల్టికెట్లను తప్పుగా ముద్రించినవారిపై ఫిర్యాదు
తాడేపల్లి రూరల్: ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పరీక్షల హాల్టికెట్లలో సమయం తప్పుగా ముద్రించిన ఏపీసీఎఫ్ఎస్ఎస్ నిర్వాహకులపై ఇంటర్ పరీక్షల విభాగం అధికారులు సోమవారం రాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అధికారులు మాట్లాడుతూ.. ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్టికెట్లపై సమయాన్ని ఉదయం 9 నుంచి 12 గంటల వరకు అని ముద్రించాల్సి ఉండగా.. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు అని ముద్రించారని తెలిపారు. ఏపీసీఎఫ్ఎస్ఎస్లో పనిచేస్తున్న శ్రీనివాసరావు, గోపి, ప్రతాప్ ఈ పని చేసినట్లు గుర్తించామని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందు కే ఇలా చేశారనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటివరకు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న విద్యార్థులను గుర్తించి.. ఆయా కళాశాలలకు సమాచారం ఇస్తామన్నారు. అలాగే పరీక్షల సమయం గురించి విస్తృతంగా ప్రచారం చేస్తామని తెలిపారు. -
రైళ్లకు సమ్మర్ రష్..!
సాక్షి, అమరావతి బ్యూరో: రైళ్లకు వేసవి తాకిడి మొదలైంది. మరికొద్ది రోజుల్లో స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు ఇస్తుండడంతో ఇప్పట్నుంచే రిజర్వేషన్లు చేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో రానున్న నెలన్నర వరకు విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లలో బెర్త్లు ఫుల్ అయ్యాయి. వేసవి సెలవుల్లో పలువురు కుటుంబ సభ్యులతో స్వస్థలాలకు, బంధువుల ఊళ్లకు, విహార యాత్రలు, తీర్థ యాత్రలకు వెళ్తుంటారు. ఇతర రవాణా వ్యవస్థలకంటే రైలు ప్రయాణం చౌక కావడం, దూర ప్రాంతాలకు వెళ్లడానికి సౌకర్యవంతంగా ఉండటంతో ప్రయాణికులు ఎక్కువగా వీటినే ఎంచుకుంటారు. దీంతో వీటిలో బెర్తులకు ముందుగానే రిజర్వు చేయించుకుంటున్నారు. విజయవాడ జంక్షన్ మీదుగా 296 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో డైలీ, వీక్లీ, బైవీక్లీ, ట్రైవీక్లీ రైళ్లు ఉన్నాయి. వీటితో పాటు విజయవాడ స్టేషన్ నుంచి 35 రైళ్లు వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఈ స్టేషన్ వరకు వచ్చి నిలిచిపోయే రైళ్లు మరో 23 ఉన్నాయి. వీటిలో దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లలో చాలావరకు బెర్తులు వెయిట్ లిస్టులే దర్శనమిస్తున్నాయి. వేసవి నుంచి ఉపశమనం పొందడం కోసం ఎగువ మధ్య తరగతి ప్రయాణికులు ఏసీ బెర్తులకే ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో స్లీపర్ క్లాస్కంటే ముందుగానే ఏసీ బెర్తులు ఫుల్ అవుతున్నాయి. ముఖ్యంగా థర్డ్ ఏసీకి డిమాండ్ అధికంగా ఉంది. విజయవాడ–విశాఖ రూట్కు డిమాండ్ విజయవాడ–హైదరాబాద్ రూటుకంటే విజయవాడ–విశాఖపట్నం వైపు ప్రయాణించే రైళ్లలో వెయిట్ లిస్టు సంఖ్య ఎక్కువగా ఉంది. విజయవాడ– సికింద్రాబాద్ మార్గంలో నడిచే కొన్ని రైళ్లలో రానున్న నెల, నెలన్నర వరకు బెర్తులు లభిస్తున్నా యి. విజయవాడ–విశాఖ మార్గంలో బెర్తులన్నీ అయిపోయి వెయిట్ లిస్టులు దర్శనమిస్తున్నాయి. మే 20వ తేదీకి విజయవాడ – విశాఖ మధ్య కోరమాండల్ స్లీపర్ వెయిట్ లిస్ట్ 17 కాగా థర్డ్ ఏసీ వెయిట్ లిస్ట్ 18 ఉంది. గోదావరి స్లీపర్ వెయిట్ లిస్ట్ 83కు చేరింది. మిగతా రైళ్లదీ ఇదే పరిస్థితి. వేసవికి ప్రత్యేక రైళ్లు వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ వేసవిలో విజయవాడ మీదుగా సుమారు 55 సమ్మర్ స్పెషల్ రైళ్లను అందుబాటులో ఉంచింది. ఇవి ప్రయాణికుల రద్దీని నియంత్రిస్తాయని అధికారులు చెబుతున్నారు. పరీక్షల అనంతరం.. ఈనెల 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు మేలో ఉన్నాయి. ఈ పరీక్షల అనంతరం వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పిల్లలకు సమ్మేటివ్ పరీక్షలు పూర్తి కాగానే వేసవి సెలవులు ఇస్తారు. అంటే మే మొదటి వారంలోనే వీరికి సెలవులు ప్రకటిస్తారు. ఇందుకు అనుగుణంగా తల్లిదండ్రులు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ముందస్తుగానే రైళ్లలో రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. దీంతో రైళ్లలో బెర్తులు దొరకడంలేదు. ఇంటర్ సిటీ, పాసింజర్ రైళ్లు మినహా దూరప్రాంత రైళ్లలో వెయిట్ లిస్టు కొండవీటి చాంతాడంత కనిపిస్తోంది. -
ఏపీలో మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ మొదటి, రెండో ఏడాది పరీక్షల తాజా షెడ్యూల్ను ఇంటర్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. జేఈఈ పరీక్షల షెడ్యూల్ మారడంతో ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ను బోర్డు మార్పు చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. మే 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని బోర్డు అధికారులు ప్రకటించారు. -
AP: ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు
అమరావతి: ఇంటర్ పరీక్షలకు కొత్త తేదీలను ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షల షెడ్యూలు ప్రభావం రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలపై పడటంతో తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు కొత్త పరీక్షల తేదీలను వెలువరించింది. ఏప్రిల్ 22 నుంచి పరీక్షలు మొదలై మే 12 వరకు జరుగుతాయి. ఇటీవల ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి ప్రారంభమై 28వ తేదీతో పూర్తవ్వాలి. కానీ జేఈఈ మెయిన్ ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం.. కొత్త షెడ్యూల్ను ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కొత్త తేదీలను ప్రకటించారు. -
ఇంటర్ పరీక్షల తేదీల మార్పు?
సాక్షి, అమరావతి: జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షల షెడ్యూలు ప్రభావం రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలపై పడింది. జేఈఈ తొలి దశ పరీక్షలు, ఇంటర్మీడియెట్ పరీక్షలు జరిగే తేదీల్లోనే జరగనున్నాయి. దీంతో ఇంటర్ పరీక్షల షెడ్యూల్పై ఇంటర్మీడియెట్ బోర్డు పునరాలోచనలో పడింది. షెడ్యూల్ మార్చడంపై కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం సచివాలయంలో దీనిపై సమీక్షించారు. పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్కుమార్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. వివిధ ప్రతిపాదనలపై చర్చించారు. ఆ 3 రోజుల పరీక్షలు వాయిదా వేస్తే... జేఈఈ తొలి దశ పరీక్షలు ఏప్రిల్ 16, 17, 18, 19, 20, 21 తేదీల్లో జరుగుతాయి. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియెట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 28వ తేదీవరకు జరుగుతాయి. వీటిలో ఇంటర్ సెకండియర్కు సంబంధించి 16న మేథమెటిక్స్ పేపర్–2ఏ, బోటనీ పేపర్–2, సివిక్స్ పేపర్–2, 19న మేథమెటిక్స్ పేపర్–2బీ, జువాలజీ పేపర్–2, హిస్టరీ పేపర్–2, 21న ఫిజిక్సు పేపర్–2, ఎకనమిక్స్ పేపర్–2 పరీక్షలు జరుగుతాయి. ఇవే తేదీల్లో జేఈఈ పరీక్షలు వచ్చాయి. ఈ మూడు రోజుల ఇంటర్ పరీక్షలను వేరే తేదీల్లో నిర్వహించడంపై సమీక్షలో చర్చించారు. దీనివల్ల పరీక్షల మధ్యలో అంతరాయం కలిగి విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇంటర్, జేఈఈ రెండింటినీ సమర్థంగా రాయలేరన్న అభిప్రాయం వ్యక్తమైంది. వాయిదా వేస్తే..! జేఈఈ పరీక్షలు ఏప్రిల్ 21తో ముగుస్తాయి. ఆ తరువాత ఏప్రిల్ 22 లేదా 23వ తేదీ నుంచి ప్రారంభమయ్యేలా ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలన్న ప్రతిపాదనపైనా చర్చించారు. పరీక్షలు వాయిదా వేస్తే మే 2 నుంచి 13 వరకు జరిగే టెన్త్ పరీక్షలపైనా ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ఇంటర్తోపాటు టెన్త్ పరీక్షలను కూడా వాయిదా వేసి ఏప్రిల్ 23 తరువాత వేర్వేరు తేదీల్లో రెండింటినీ నిర్వహించాలన్న ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నారు. ప్రీపోన్ చేయడంపైనా పరిశీలన జేఈఈ పరీక్షలు ప్రారంభమయ్యే లోపే ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిసేలా ప్రీపోన్ చేయాలన్న ప్రతిపాదనపైనా చర్చిస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ థియరీ పరీక్షలకు మొత్తం 16 రోజులు పడుతుంది. ఇందులో ప్రధానమైన పరీక్షలకు 12 రోజులు అవసరం. ఈనెల 7వ తేదీ నుంచి 31వరకు ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ జరుగుతాయి. వాటిని ముందుకు జరిపి, ఇంటర్ పరీక్షలను ప్రీపోన్ చేస్తే ఎలా ఉంటుందో పరిశీలిస్తున్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్కు జంబ్లింగ్ విధానంలో పరీక్ష కేంద్రాలను కేటాయిస్తూ ఇప్పటికే బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికిప్పుడు జంబ్లింగ్ విధానాన్ని మార్చడం సాధ్యమవుతుందా అన్న సంశయం ఏర్పడుతోంది. మరోవైపు మార్చి 18, ఏప్రిల్లో 2, 5, 10, 14, 15 తేదీలు ప్రభుత్వ సెలవు దినాలు. ఆ రోజుల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించగలిగితేనే ప్రీపోన్కు అవకాశం ఉంటుంది. ఇందుకు ప్రభుత్వం అనుమతించాలి. వీటిపై ఇంటర్మీడియెట్ బోర్డు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్న అనంతరం కొత్త షెడ్యూల్ను బోర్డు విడుదల చేస్తుంది. -
ఏప్రిల్ 8 నుంచి ఇంటర్.. మే 2 నుంచి టెన్త్ పరీక్షలు
కర్నూలు కల్చరల్: రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూళ్లు విడుదలయ్యాయి. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలను, మే 2 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ థియరీ పరీక్షల కోసం 1,456, పదో తరగతి పరీక్షల కోసం 4,200 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూళ్లను మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ గురువారం కర్నూలులో ప్రకటించారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను ప్రకటిస్తున్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చిత్రంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీలో విద్యా శాఖ మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రోజూ పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేసేలా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. థర్మల్ స్క్రీనింగ్ చేశాకే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. 3,30,376 మంది బాలురు, 3,09,429 మంది బాలికలు కలిపి మొత్తం 6,39,805 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారని వివరించారు. అలాగే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 5,05,052 (బాలికలు 2,53,406, బాలురు 2,51,646) మంది, ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 4,81,481 (బాలికలు 2,39,160, బాలురు 2,42,321) మంది హాజరవుతారని తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలను మార్చి 11 నుంచి 31 వరకు నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకోసం 1,757 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మార్చి 7న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, మార్చి 9న ఎన్విరాన్మెంట్ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. -
ఏప్రిల్ 20 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు సోమవారం విడుదల చేసింది. థియరీ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు.. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఉంటాయని తెలిపింది. ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారని, ఎత్నిక్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్మెంట్ సబ్జెక్టులు తీసుకున్న వారికి ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఈ పేపర్లకు పరీక్షలు ఉంటాయని బోర్డు వెల్లడించింది. ఒకేషనల్ సహా జనరల్ ఇంటర్ విద్యార్థుల పరీక్షల షెడ్యూల్ ఈ విధంగా ఉంది. -
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఆపలేం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. పరీక్షలు ఆపాలన్న పిటిషన్పై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈనెల 25 నుంచి పరీక్షలు ఉండగా చివరి నిమిషంలో పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దీంతో పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా.. కోర్టు అందుకు అనుమతించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఫస్టియర్ పరీక్షలు ఆపాలంటూ తెలంగాణ తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం శుక్రవారం మధ్యాహ్నం అత్యవసరంగా విచారించింది. కరోనా నేపథ్యంలో ద్వితీయ సంవత్సరానికి ఐదు నెలల క్రితం ప్రమోట్ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ద్వితీయ సంవత్సరం చదువుతున్న దాదాపు 4.58 లక్షల మంది విద్యార్థులకు 25వ తేదీ నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించిందని తెలిపారు. సెకండియర్ చదువుతున్న విద్యార్థులు మళ్లీ ప్రథమ సంవత్సరం పరీక్షల కోసం చదవాలంటే గందరగోళానికి, తీవ్ర ఒత్తిడికి గురవుతారన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులను పాస్ అయినట్లుగా ప్రకటించిన తరహాలోనే పాస్ చేయాలని కోరారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని ఇంటర్ బోర్డు తరఫున డీఎల్ పాండు వాదనలు వినిపించారు. ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేసే సమయంలోనే పరిస్థితులకు అనుగుణంగా ఫస్టియర్ పరీక్షలు నిర్వహిస్తామని ముందుగానే పేర్కొన్నామన్నారు. పదవ తరగతి పరీక్షలు కూడా ఈ విద్యార్థులు రాయలేదని, కరోనా నేపథ్యంలో వీరిని పాస్ చేశారని తెలిపారు. ఇప్పుడు ప్రథమ సంవత్సరం పరీక్షలు కూడా రాయకపోతే భవిçష్యత్తులో ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి వస్తే వీరి ప్రతిభను అంచనా వేయడం ఇబ్బందికరంగా మారుతుందని నివేదించారు. ఆ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పరీక్షల నిర్వహణకు రెండు రోజుల ముందు పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. దీంతో పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న వినతిమేరకు ధర్మాసనం అనుమతించింది. -
ఇంటర్ పరీక్షలు.. ఇక డొంక తిరుగుడు ప్రశ్నలుండవ్!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 25 నుంచి నిర్వహించే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు తేలికగానే ఉంటాయని, విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని ఇంటర్ బోర్డ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కరోనా నేపథ్యం, విద్యాబోధనలో ఇబ్బందులు, కొన్నిచోట్ల సిలబస్ పూర్తవ్వని పరిస్థితులను ప్రశ్నాపత్రం రూపకల్పనలో కీలకాంశాలుగా తీసుకున్నట్టు చెబుతున్నారు. బోర్డు విడుదల చేసిన స్టడీ మెటీరియల్ పరిధిలోనే ప్రశ్నలుండే వీలుందంటున్నారు. విద్యార్థులను తికమకపెట్టే డొంక తిరుగుడు ప్రశ్నలను సాధ్యమైనంత వరకూ రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు బోర్డు వర్గాలు వెల్లడిస్తున్నాయి. కొద్దిపాటి శ్రద్ధ తీసుకునే విద్యార్థి కూడా గట్టెక్కే రీతిలో పరీక్షలు ఉండబోతున్నాయనే భరోసాను అధికారులు కలి్పస్తున్నారు. అన్ని సబ్జెక్టుల్లోనూ చాయిస్ ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే బోర్డు ప్రకటించింది. కరోనా కారణంగా ఫస్టియర్ పరీక్షలు లేకుండా విద్యార్థులను ద్వితీయ సంవత్సరానికి అనుమతించిన విషయం తెలిసిందే. మునుపటికన్నా భిన్నంగా, రాయాల్సిన వాటికన్నా ప్రశ్నలు ఎక్కువ ఇవ్వనున్నారు. దీనివల్ల ఏదో ఒక ప్రశ్నకు విద్యార్థి సిద్ధమై ఉంటాడని, సులభంగా జవాబు రాసే వీలుందని బోర్డు వర్గాలు అంటున్నాయి. ప్రశ్నల తీరు ఇలా.... ►సబ్జెక్టుల్లో సగానికి సగం చాయిస్ ఇస్తున్నారు. ముఖ్యంగా గణితంలో ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలు సాధ్యమైనంత వరకూ ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. గణితంలో మూడు సెక్షన్లుంటాయి. ‘ఎ’సెక్షన్లో 2 మార్కులు, ‘బి’లో 4, ‘సీ’లో 7 మార్కుల ప్రశ్నలుంటాయి. ఏ సెక్షన్లోని 10 ప్రశ్నల కూ సమాధానం ఇవ్వాలి. ‘బీ’లో 10 ప్రశ్నలకుగాను 5, ‘సీ’లో 10 ప్రశ్నలకుగాను ఐదింటికి రాయాలి. ►భౌతికశాస్త్రంలో ఏ సెక్షన్లో 2, బీ సెక్షన్లో 4, సీ సెక్ష న్లో 8 మార్కుల ప్రశ్నలిస్తారు. సెక్షన్ ఏలో ఉన్న మొ త్తం పది ప్రశ్నలకు, ‘బీ’లో 12 ప్రశ్నల్లో ఆరింటికి, ‘సీ’ లో 4 ప్రశ్నలకుగాను రెండింటికి సమాధానాలివ్వాలి. ►రసాయనశాస్త్రంలో సెక్షన్ ఏలో ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు, సెక్షన్ బీలో 4, సెక్షన్ సీలో 8 మార్కుల ప్రశ్నలివ్వనున్నారు. ‘ఏ’లో ఉన్న మొత్తం 10 ప్రశ్నలకు, ‘బీ’లో 12 ప్రశ్నలకుగాను 6, ‘సీ’లో 4 ప్రశ్నలకుగాను రెండింటికి సమాధానాలు రాయాలి. ►బోటనీ సెక్షన్–ఏలో 2 మార్కులు, సెక్షన్–బీలో 4 మార్కులు, సెక్షన్–సీలో 8 మార్కుల ప్రశ్నలిస్తారు. సెక్షన్–ఏలో ఉన్న మొత్తం 10 ప్రశ్నలకు, ‘బీ’లో 12 ప్రశ్నలకు గాను ఆరింటికి, ‘సీ’లో 4 ప్రశ్నలకుగాను రెండింటికి జవాబులు రాయాలి. ►అర్థశాస్త్రం, రాజనీతిశాస్త్రం రెండింటిలో సెక్షన్–ఏలో 10, సెక్షన్–బీలో 5, సెక్షన్–సీలో 2 మార్కుల ప్రశ్నలిస్తారు. ఏ సెక్షన్లో 6 ప్రశ్నలకుగాను 3, ‘బీ’లో 16 ప్రశ్నలకుగాను ఎనిమిదింటికి, ‘సీ’లో 30 ప్రశ్నలకుగాను 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. వాళ్ల సంగతేంటి? ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు గతంలో ఫీజు కట్టిన వాళ్లకే అవకాశం ఇస్తున్నారు. అయితే, అప్పట్లో 10 వేల మంది ఫీజులు చెల్లించలేదు. ఈ సమయంలో పరీక్షలు లేకుండా అందరినీ రెండో ఏడాదిలోకి ప్రమోట్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఫీజు కట్టని వాళ్లకు ఇప్పుడు పరీక్ష రాసే అవకాశం లేకుండా పోయింది. వీళ్లంతా ద్వితీయ సంవత్సరం కొనసాగిస్తూ ఆ ఏడాదితో పాటే, ఫస్టియర్ పరీక్షలూ రాయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. -
పరీక్షకు పరేషానొద్దు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలను విద్యార్థులు ధైర్యంగా ఎదుర్కొని ఉత్తమ ఫలితాలు సాధించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు. విద్యార్థులు ఒత్తిడిని తట్టుకునేందుకు, వార్షిక పరీక్షను విజయవంతంగా రాసేందుకు ఉపయుక్తమైన ఫస్టియర్ స్టడీమెటీరియల్ను మంత్రి మంగళవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, గణితం, భౌతిక శాస్త్రం, చరిత్ర స్టడీ మెటీరియల్ను ‘టీఎస్బీఐఈ’వెబ్సైట్లో పొందొచ్చని తెలిపారు. కోవిడ్ కారణంగా ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతికి పంపిన విషయం తెలిసిందే. వారికి ద్వితీయ సంవత్సరం మధ్యలో గత వార్షిక పరీక్షలు నిర్వహించడంపై విమర్శలు వచ్చాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని పరీక్షల్లో 50%చాయస్ ఇస్తూ ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. -
Telangana: ఇంటర్ పస్టియర్ పరీక్షలు ఉన్నట్లా? లేనట్లా?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉంటాయో? లేదో? తెలియక లక్షలాది మంది విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. పరీక్షలు పెట్టి తీరుతామని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఆమె ఈ మాట చెప్పి నెల రోజులు దాటింది. కానీ, ఇంతవరకూ షెడ్యూల్డ్ మాత్రం రాలేదు. కోవిడ్ కారణం గా 4.75 లక్షల మంది ఇంటర్ మొదటి సంవత్సరం విద్యా ర్థులను ‘ద్వితీయ’లోకి ప్రమోట్ చేశారు. వాళ్లకు ఇప్పటికే ద్వితీయ సంవత్సరం పాఠ్య ప్రణాళిక సగానికి పైగా పూర్తయింది. వచ్చే ఏడాది నీట్, జేఈఈ, ఎంసెట్కు విద్యార్థులు తర్ఫీదు అవుతున్నారు. పోటీ పరీక్షలతో పాటు, రెండో ఏడాది పాఠ్య పుస్తకాలు చదవడమే కష్టంగా ఉందని విద్యార్థులు అంటున్నారు. వచ్చే మార్చిలో రెండో ఏడాది పరీక్షలూ నిర్వహించకపోతే విద్యార్థులకే ఇబ్బంది ఉంటుందని ప్రభుత్వం భావించింది. మొదటి ఏడాది పరీక్షలన్నా ఇప్పుడు నిర్వహిస్తే ఆ మార్కుల ఆధారంగా రెండో ఏడాదిలోనూ ప్రమోట్ చేయవచ్చని యోచించారు. ఈ తంతు జూలై, ఆగస్టులో పూర్తిచేసి ఉంటే బాగుండేదని.. ఇప్పుడు మొదటి ఏడాది పరీక్షలు పెడితే ఎలా అని తల్లిదండ్రులు అంటున్నారు. ఈ ఒత్తిడిల నేపథ్యంలో ఇంటర్ బోర్డు పునరాలోచనలో పడింది. -
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టెన్త్, ఇంటర్ పరీక్షలపై నిర్ణయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలపై సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలను తప్పక పాటిస్తూ నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఈ పరీక్షలపై మంగళవారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో పరీక్షల అవసరం, వాటి నిర్వహణ కోసం చేపట్టబోయే చర్యల గురించి తెలియచేశామన్నారు. ఈమేరకు మంత్రి ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. ‘çసుప్రీంకోర్టులో ఈరోజు కేరళ, ఆంధ్రప్రదేశ్లలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై విచారణ జరిగింది. సుప్రీంకోర్టు రాష్ట్రాల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అది నిజం కాదు. పరీక్షలు ఎందుకు నిర్వహించాలి? నిర్వహించాల్సిన అవసరమేముంది? అనే విషయాన్ని గౌరవ న్యాయస్థానం అడిగింది. దానికి సమాధానమిస్తూ పరీక్షలు ఎలా నిర్వహిస్తాం, అందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి సుప్రీంకోర్టుకు వివరించాం. ప్రధానంగా ఒక్కో రూములో 15కి మించి విద్యార్థులు లేకుండా, అలాగే ప్రతి విద్యార్థికీ అయిదడుగుల భౌతికదూరం ఉండేలా చూస్తూ, కోవిడ్–19 ప్రొటోకాల్ నియమ, నిబంధనలను పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని కోర్టుకు తెలియచేశాం. అంతేకాకుండా పరీక్షల ఆవశ్యకతను ముఖ్యంగా ఎంసెట్ పరీక్షలకు సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షల మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్న అంశాన్ని వివరించాం. పదో తరగతిలో కూడా మార్కులు కాకుండా గ్రేడ్లు మాత్రమే ఇస్తామని చెప్పాం. కోర్టు వాటన్నిటినీ అఫిడవిట్ ద్వారా తెలియచేయాలని రెండురోజుల గడువు ఇచ్చింది. కేసును గురువారానికి వాయిదా వేశారు. ప్రస్తుత పరిస్థితులన్నిటినీ అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టుకు వివరించనున్నాం. తదుపరి సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి నిర్ణయం తీసుకుంటాం. వారు ఏ నిర్ణయం చెప్పినా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది..’ అని మంత్రి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దు
సాక్షి, హైదారాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇంటర్ సెకండియర్కు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షల్లో విద్యార్థులందరికీ గరిష్ట మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులను ప్రకటిస్తారు. ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తే మళ్లీ కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: Telangana: లాక్డౌన్ను పొడిగిస్తూ, పలు సడలింపులు -
కేంద్ర మంత్రికి ఏపీ విద్యాశాఖ మంత్రి లేఖ
సాక్షి, అమరావతి: 12వ తరగతి పరీక్షల నిర్వహణపై తమ ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఏపీ విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్కు బుధవారం లేఖ రాశారు. ఆ లేఖలో.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. విద్యాశాఖకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ కేంద్రం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటర్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున ప్రత్యేక కోటాలో వ్యాక్సిన్ కేటాయించాలని, టీచర్లు, ఇన్విజిలేటర్లు, ప్రొఫెసర్లను ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ వేస్తే ఉపాధ్యాయులు, అధ్యాపకుల్లో మానసిక స్థైర్యం పెంపొందించగలుగుతామని, కేంద్రం వారిని పరిగణనలోకి తీసుకుని ప్రత్యేకంగా వ్యాక్సిన్ కోటా కేటాయించాలన్నారు. -
టెన్త్, ఇంటర్ పరీక్షలపై విమర్శలు సరికాదు: సీఎం జగన్
-
70% సిలబస్తోనే ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్, ఎంసెట్ పరీక్షల్లో పరిగణనలోకి తీసుకోవా ల్సిన సిలబస్ ఖరారైంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 70% సిలబస్ తోనే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెకండియర్ పరీక్షలు నిర్వహించే 70% సిలబస్ను ఎంసెట్కు పరిగణనలోకి తీసుకోనుంది. ఫస్టియర్కు సంబంధించి గత మార్చిలోనే విద్యార్థులు పరీక్షలు రాసినందున ప్రథమ సంవత్సరంలోని పూర్తి సిలబస్ను ఎంసెట్లో పరిగణనలోకి తీసుకోనున్నారు. విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, మండలి కార్యదర్శి శ్రీనివాస్రావు పాల్గొన్నారు. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులు, విద్యా బోధనకు ఏర్పడిన ఆటంకాలపై చర్చించారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్, ఎంసెట్కు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సిలబస్కు సంబంధించిన విధానం 2020–21 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు ప్రస్తుతం ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీని తొలగించేది లేదని, యథాతథంగా కొనసాగించాలని కమిటీ నిర్ణయించింది. ప్రశ్నల సంఖ్య పెంపు.. ఇంటర్మీడియట్లో ప్రశ్నల సంఖ్యను పెంచి, విద్యార్థులకు ఎక్కువ ఆప్షన్లు ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో ఇంటర్ వార్షిక పరీక్షల్లో ప్రశ్న పత్రాల్లో విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నల సంఖ్యను రెట్టింపు చేయడం ద్వారా విద్యార్థులకు ఎక్కువ చాయిస్ ఉండనుంది. కరోనా కారణంగా ప్రత్యక్ష బోధన లేకపోవడం, గత సెప్టెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు ఆన్లైన్/ డిజిటల్ బోధన మాత్రమే కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఆ పాఠాలు ఎంత మేరకు అర్థం అయ్యాయనే గందరగోళం ఉంది. అందుకే విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకు 30 శాతం సిలబస్ తగ్గింపుతో పాటు చాయిస్ ఎక్కువ ఉండేలా చర్యలు చేపట్టింది. ఎంసెట్లోనూ ఎక్కువ చాయిస్.. ఎంసెట్లోనూ విద్యార్థులకు ఎక్కువ చాయిస్ ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ప్రస్తుతం 160 ప్రశ్నలకు 160 మార్కుల విధానం ఉంది. అయితే ఈ సారి విద్యార్థులకు ఎక్కువ చాయిస్ ఉండేలా చర్యలు చేపట్టే ఆలోచనల్లో అధికారులు ఉన్నారు. 180 ప్రశ్నలు ఇచ్చి 160 ప్రశ్నలకు సమాధానాలు రాసే విధానం తీసుకొచ్చే అవకాశముంది. ప్రస్తుతం దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. వచ్చే 10 రోజుల్లో ఎంసెట్ కన్వీనర్ను ఉన్నత విద్యా మండలి నియమించనుంది. ఆ తర్వాత ప్రశ్నపత్రం, ఆప్షన్లు తదితర అంశాలపై ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీనే తుది నిర్ణయం తీసుకోనుంది. జూన్ 14 తర్వాత ఎంసెట్ ‘ఇంటర్ వార్షిక పరీక్షల్లో భాగంగా ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు మే 13తో పూర్తవుతాయి. కాబట్టి విద్యార్థులు ఎంసెట్కు సిద్ధం అయ్యేందుకు 4 వారాల గడువు ఇస్తాం. జూన్ 14 తర్వాత ఎంసెట్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉంటాం. అయితే ఆన్లైన్ పరీక్షలను నిర్వహించే సాంకేతిక సంస్థ అయిన టీసీఎస్ స్లాట్స్ను బట్టి పరీక్షల తేదీలు ఖరారు చేస్తాం.’ – ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి -
మూల్యాంకనం వాయిదాకు హైకోర్టు ‘నో’
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షల మూల్యాంకనాన్ని వాయిదా వేసేందుకు హైకోర్టు అంగీకరించలేదు. లాక్డౌన్ పూర్తిగా తొలగించే వరకూ ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించరాదనే అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇంటర్ పరీక్షల ఫలితాలకూ జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉన్నత విద్య ప్రవేశాలకు ముడిపడి ఉంటుందని, ఈ పరిస్థితుల్లో మూల్యాంకనం వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. (ఏది పడితే అది పండించొద్దు: సీఎం కేసీఆర్) లాక్డౌన్ పూర్తయ్యే ఈ నెల 29 వరకూ మూల్యాంకనం నిర్వహించరాదని కోరుతూ సిద్దిపేటకు చెందిన సామాజిక కార్యకర్త ఓంప్రకాష్ భోజన విరామ సమయంలో దాఖలు చేసిన అత్యవసర వ్యాజ్యాన్ని మంగళవారం ధర్మాసనం విచారించింది. రాష్ట్రంలోని 9.65 లక్షల మంది ఇంటర్ విద్యార్థుల పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేసుకోవచ్చునని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్ల ధర్మాసనం స్పష్టం చేసింది. -
11 నుండి ఇంటర్ వాల్యుయేషన్
సాక్షి, అమరావతి: ఈ నెల 11 నుండి రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సచివాలయం నాల్గవ బ్లాక్ మొదటి అంతస్థులోని మంత్రి తన ఛాంబర్లో ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించిన బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామిన్ వి. రమేష్ లతో కలిసి మంత్రి 13 జిల్లాల ఆర్ఐఓలు, ఆర్జేడీలు, డీవీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. (సీబీఎస్ఈ సిలబస్ కుదింపు!) లాక్ డౌన్ అనంతరం రెడ్ జోన్ జిల్లాల్లో.. ఆరెంజ్, గ్రీన్ జోన్ లలో మే 11 నుండి ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నట్లు మంత్రి సూచన ప్రాయంగా తెలిపారు. లాక్ డౌన్ ముగిసిన అనంతరం రెడ్ జోన్ లో మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు అనుసరించి, కోవిడ్-19 జాగ్రత్తలను పాటిస్తూనే మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే ఈసెట్, ఐసెట్, ఎంసెట్, పీజీఈసెట్,ఎడ్ సెట్, లా సెట్, పీఈసెట్ తదితర పోటీపరీక్షలకు సంబంధించిన తేదీలు ఖరారు కావడంతో త్వరితగతిన ఇంటర్మీడియట్ మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలను వెల్లడించాల్సి ఉందన్నారు. మూల్యాంకన ప్రక్రియ పాదర్శకంగా ఉండాలి.. రాష్ట్ర వ్యాప్తంగా మార్చిలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రథమ సంవత్సరంలో 5,46,162 మంది, ద్వితీయ సంవత్సరంలో 5,18,280 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. మొత్తంగా 10,64,442 మంది విద్యార్థినీ, విద్యార్థులు పరీక్షలకు హాజరయినట్లు పేర్కొన్నారు. వీరికి సంబంధించి సుమారు 60 లక్షల పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉందని మంత్రి వివరించారు. 13 జిల్లాల్లోనూ మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. ప్రత్యేకంగా గుర్తించిన రెండు, మూడు భవనాలను మూల్యాంకన కార్యకలాపాలకు వినియోగించనున్నామన్నారు. మూల్యాంకన ప్రక్రియ ముగిసేదాకా కేటాయించిన భవనాల్లో సిబ్బందికి కావలసిన భోజనం, వసతి ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూల్యాంకన ప్రక్రియ పాదర్శకంగా, నాణ్యంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. మార్గదర్శకాలు పాటించాలి.. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక షిప్టు, మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 6 గంటల వరకు మరో షిప్టులో మూల్యాంకన ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఉదయం 15, మధ్యాహ్నం 15 జవాబుపత్రాలు ప్రతిరోజూ మూల్యాంకనం చేయాల్సి ఉంటుందని అధికారులకు సూచించారు. లాక్ డౌన్ నేపథ్యంలో సంబంధింత అధికారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని భరోసానిచ్చారు. మూల్యాంకన ప్రక్రియలో పాల్గొనే అధికారులు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, శానిటైజర్ ను వినియోగించాల్సి ఉంటుందన్నారు. మూల్యాంకన ప్రక్రియలో 25 వేల మంది సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. తొలుత ఆరెంజ్, గ్రీన్ జోన్ లో సుమారు 15వేల మందితో ఈ మూల్యాంకన ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. రెడ్ జోన్ లో 8 నుండి 10 వేల మంది సిబ్బంది అవసరమవుతారని అంచనా వేశారు. వారికి మినహాయింపు ఇవ్వాలి.. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపల్ అసోసియేషన్ అధ్యక్షులు రాజారామ్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ కార్యదర్శి వి.రవి 55 ఏళ్లకు పైబడిన వారికి మూల్యాంకన ప్రక్రియలో మినహాయింపు ఇవ్వాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ నిబంధనల ప్రకారమే మినహాయింపు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. జూన్ చివరి నాటికి ఇంటర్మీడియట్ బోర్డు వెబ్ సైట్ లో విద్యార్థులకు ఆన్ లైన్ లో థియరీ క్లాసులు, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియో పాఠాలు, ప్రాక్టికల్స్ కు సంబంధించిన వీడియోలు పొందుపరుచనున్నామని తెలిపారు. దీనికి జోన్-4 కడప జిల్లా ఆర్జేడీ కె.చంద్రశేఖర్ ఇన్ చార్జిగా వ్యవహరించనున్నారని వెల్లడించారు. -
జూన్లో జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్!
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసిన పది లక్షల మందికి పైగా విద్యార్థులు ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలను జూన్లో నిర్వహించే అంశంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) దృష్టి సారించింది. పరీక్షలను వాయిదా వేసిన ఎంహెచ్ఆర్డీ తాజా షెడ్యూల్పై కసరత్తు చేస్తోంది. మే 3 వరకు లాక్డౌన్ ఉన్నందున, తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణ యం ప్రకటిస్తామని ఆయా సంస్థలు ముందుగా ప్రకటించాయి. మే నెలాఖరు నాటికల్లా పరిస్థితి అదుపులోకి వస్తుందని ఎంహెచ్ఆర్డీ భావిస్తోంది. జూన్లో జేఈఈ మెయిన్ను నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. రెండింటిపైనా కసరత్తు... దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యా సంస్థలైన ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థలైన జీఎఫ్టీఐల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ విద్యా ఏడాదిలో ప్రవేశాల కోసం గత జనవరిలో మెుదటి విడత జేఈఈ మెయిన్ను నిర్వహించింది. ఏప్రిల్ 5 నుంచి 11 వరకు నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్ను కేంద్రం ఆదేశాల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వాయిదా వేసింది. మే 17న నిర్వహించాల్సిన జేఈఈ అడ్వాన్స్డ్ను కూడా వాయిదా వేస్తూ ఐఐటీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పరీక్షల నిర్వహణపై కసరత్తు ప్రారంభించింది. జేఈఈ మెయిన్ నిర్వహిస్తేగానీ అడ్వాన్స్డ్ నిర్వహించే పరిస్థితి లేదు. జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మందిని ఎంపిక చేసి అడ్వాన్స్డ్కు అర్హులుగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే జేఈఈ మెయిన్ను జూన్ మెుదట్లోనే నిర్వహించి 10 –15 రోజుల్లో ఫలితాలు ఇవ్వాలన్న ఆలోచనల్లో ఉంది. తద్వారా అడ్వాన్స్డ్ పరీక్షను జూన్ నెలాఖరుకు నిర్వహించినా జూలైలో ఫలితాలను ఇచ్చి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ను ప్రారంభించాలని భావిస్తోంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం జూన్ 8కల్లా జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ప్రకటించి, 17వ తేదీ నుంచి ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ను (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ – జోసా) ప్రారంభించాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జూలై మెుదటి వారంకల్లా జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ప్రకటించి, రెండో వారంలో జోసా ప్రవేశాల కౌన్సెలింగ్ను ప్రారంభించేలా కసరత్తు చేస్తోంది. ఒకవేళ కరోనా కనుక త్వరితంగా అదుపులోకి వస్తే జేఈఈ మెయిన్ను మాత్రం మే నెలాఖరులో నిర్వహించే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది. -
ఆలస్యం.. ఆవేదనభరితం
రంగారెడ్డి, పెద్దేముల్: మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రానికి ఇద్దరు విద్యార్థినులు ఆలస్యంగా వచ్చారు. దీంతో వారిని అధికారులు అనుమతించలేదు. దీంతో విద్యార్థినులు కన్నీటిపర్యంతమయ్యారు. సోమవారం పెద్దేముల్ మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు నిర్వహించారు. బంట్వారం మండలంలోని మోడల్ కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థినులు అనూష, స్వర్ణలత ఉదయం 9.20 నిమిషాలకు వచ్చారు. ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి రావడంతో అధికారులు వారిని అనుమతి ఇవ్వలేదు. బంట్వారం మండలం బోపూనారం నుంచి మోమెడ్పై రావడంతో అలస్యమైందని పరీక్షకు అనుమతి ఇవ్వాలని విద్యార్థినులు కోరినా అధికారులు స్పందించలేదు. దీంతో విద్యార్థినులు అక్కడే కుప్పకూలిపోయారు. ఏఎన్ఏం వారికి జ్యూస్ పంపిణీ చేశారు. -
ఒక్క నిమిషం ఆలస్యంపై పిల్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైతే పరీక్షలకు అనుమతించబోమని ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసే ఈ నిబంధనను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని పిల్ దాఖలు చేసిన న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టును అభ్యర్థించారు. భోజన విరామ సమయంలో పిల్ను అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. బుధవారం విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డిల ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యార్థులు కొద్ది నిమిషాలు ఆలస్యంగా పరీక్షకు హాజరైతే పరీక్షలు రాసేందుకు అనుమతించని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులను మానసికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసే ఈ నిబంధనను రద్దు చేయాలని, సమయ పాలనపై విద్యార్థులకు అవగాహన కల్పించాలేగానీ, ఇలాంటి షరతు విధించి ఏడాది చదువును పణంగా పెట్టేలా చేయడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని ఆయన కోరారు. -
ఇంట్లో తండ్రి మృతదేహం.. 'పరీక్ష'
విజయనగరం, గరివిడి: ఇంట్లో తండ్రి మృతదేహం ఉండగా... పుట్టెడు దుఖంతో పరీక్షకు హాజరయ్యాడు కుమారుడు. కన్నీటిని దిగమింగుకొని పరీక్షను రాశాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని దుమ్మెద గ్రామానికి చెందిన పతివాడ రాంబాబు చీపురుపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి పతివాడ సత్యం(55) కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తండ్రి మృతి చెందడంతో రాంబాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పరీక్షకు హాజరు కావాలా! వద్దా! అనే మీమాంసలో చివరకు తన దుఖాన్ని గుండెల్లో దాచుకొని పరీక్షకు హాజరయ్యాడు. తనను ఎంతో కష్టపడి చదివించిన తండ్రి ఆశయం నెరవేర్చాలని, జన్మనిచ్చిన తండ్రి ఇకరారని తెలుసుకుని ఆయన ఆశయానికి విలువనిచ్చి పరీక్ష రాసేందుకు చీపురుపల్లిలోని జీవీఆర్ కళాశాలకు వెళ్లాడు. ఈ ఘటన గ్రామస్తులను కన్నీరు పెట్టించాయి. సత్యం మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
లైట్లు వెలగక.. ఫ్యాన్ తిరగక
ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో సకల సౌకర్యాలు కల్పించామని ఊదరగొట్టిన అధికారుల డొల్లతనం తొలిరోజే బయటపడింది. చాలా కేంద్రాల్లో ఫ్యాన్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు చెమటలు కక్కుతూనే పరీక్ష రాశారు. వెలుతురు సరిగాలేని గదుల్లో లైట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకటికి పదిసార్లు సమీక్షలతో కాలం గడిపిన జిల్లా ఉన్నతాధికారులు, ఇంటర్బోర్డు అధికారులు పరీక్ష వేళ చేతులెత్తేయడంతో విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. అనంతపురం విద్య: ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు తెలుగు/సంస్కృతం పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 97 కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహించారు. మొత్తం 34,839 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 33,709 మంది హాజరయ్యారు. జిల్లా కేంద్రం అనంతపురంలోని ప్రధాన పరీక్ష కేంద్రాల్లో అధికారులు కనీసం ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయని పరిస్థితి. దీంతో విద్యార్థులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. లైట్లు లేకపోవడంతో చీకట్లోనే పరీక్షలు రాయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పరీక్షలు బాగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా గత 20 రోజులుగా జాయింట్ కలెక్టర్–2, ఆర్ఐఓలు అనేక సందర్భాల్లో సమీక్షలు నిర్వహించారు. అయినప్పటికీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, న్యూటౌన్–ఎస్.ఎస్.బీ.ఎన్ కళాశాల పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు పనిచేయకపోవడం.. ఫ్యాన్లు అసలు లేకపోవడంతో విద్యార్థులు చుక్కలు చూడాల్సి వచ్చింది. జూమ్ యాప్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఇంటర్మీడియట్ పరీక్షలు తొలి రోజు పకడ్బందీగా నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. మాస్కాపీయింగ్ జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ఆర్ఐఓ, ఇతర ఉన్నతాధికారులతో ఇంటర్బోర్డు కార్యదర్శి ‘జూమ్ యాప్’ ద్వారా పర్యవేక్షించారు. 97 పరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. యాప్.. బంపర్ గైడ్ గతంలో విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి వెళ్లి అక్కడ నోటీసు బోర్డులో వేసిన సమాచారం ఆధారంగా తమకు కేటాయించిన గదికి వెళ్లేవారు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేకుండా ముందు రోజు రాత్రే విద్యార్థుల తల్లిదండ్రుల రిజిస్టర్డ్ నంబర్కు పరీక్ష కేంద్రం, సీటింగ్ అరైంజ్మెంట్ సమాచారాన్ని చేరవేసేలా ఇంటర్బోర్డు అధికారులు ‘సెంటర్ మొబైల్ లొకేటర్ యాప్ ’ను అందుబాటులోకి తీసుకవచ్చారు. ఈ యాప్ ఇంటర్ విద్యార్థులకు బాగా ఉపయోగపడింది. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ఎయిడ్ కిట్లను ఏర్పాటు చేశారు. నేడు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థులకు గురువారం తెలుగు/సంస్కృతం పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో 97 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనుండగా.. 32,041 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలని అధికారులు కోరుతున్నారు. ముందస్తుగానే పరీక్ష కేంద్రానికి వస్తే ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 27 ప్రత్యేక బస్సులు ప్రతి విద్యార్థికీ, తాను చదువుతున్న కళాశాలకు 20 కి.మీ దూరం లోపే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ‘ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదు’ అని గతంలో పేర్కొన్నప్పటికీ.. బుధవారం పరీక్ష ప్రారంభమయ్యే గంట ముందు సడలింపు ఇచ్చారు. పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాల వరకు విద్యార్థి పరీక్షకు హాజరు కావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు కారణాన్ని చీఫ్ సూపరింటెండెంట్కు తెలియజేయాల్సి ఉంటుంది. ఆయన సమ్మతిస్తే పరీక్షకు అనుమ తిస్తారు. ఎక్కువ ఆలస్యమైతే ప్రత్యేకమైన పరిస్థితులు, కారణాలు ఉంటే అనుమతించే అంశంపై ఛీప్ అబ్జర్వర్లు నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కోసమే ఆర్టీసీ ప్రత్యేకంగా 27 సర్వీసులు నడిపింది. -
తొలిరోజే లీకేజీ.. వాట్సప్లో ఫిజిక్స్ పేపర్
యశవంతపుర: ఆదిలోనే హంసపాదు అన్నట్లు పీయూసీ (ఇంటర్మీడియేట్) ద్వితీయ ఏడాది పరీక్షల మొదటిరోజే లీకేజీ రగడ నెలకొంది. బుధవారం రాష్ట్రమంతటా పీయూసీ పరీక్షలు ఆరంభమయ్యాయి. విజయపుర (బిజాపుర)లో ఇండి పట్టణ పోలీసులు ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. లీక్ చేసిన మురుగేశ్ సగరతో పాటు పరీక్ష రాస్తూ పేపర్ను బయటకు వేసిన మురుఘేంద్ర అనే విద్యార్థిని అరెస్ట్ చేశారు. ఇండి పట్టణంలోని శాంతేశ్వర విద్యావర్ధక సంఘం కాలేజీలో బుధవారం ఉదయం ప్రశ్నాపత్రం లీకైంది. మురుఘేంద్ర అనే విద్యార్థి భౌతికశాస్త్రం పరీక్షను రాస్తూ క్వశ్చన్ పేపర్ను కేంద్రం బయట ఉన్న స్నేహితుడు మురుగేశ్ సగరకు విసిరాడు. దీనిని అతడు ఫోటో తీసి వాట్సప్లో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. పేపర్ లీకైందని పెద్దస్థాయిలో ప్రచారం జరిగింది. ఇది తెలిసి ఇండి పట్టణ పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. సూపర్వైజర్ సస్పెండ్.. పరీక్ష రూం సూపర్వైజర్ నారాయణకర్ను జిల్లా కలెక్టర్ వైఎస్ పాటిల్ సస్పెండ్ చేశారు. పరీక్ష కేంద్రానికి కలెక్టర్తో పాటు ఎస్పీ అనుపమ అగ్రవాల్ వచ్చి పరిశీలించి పునరావృతం కాకుండా సూచనలు చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీలో కాలేజీ సిబ్బంది పాత్ర మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముమ్మర తనిఖీ జరుగుతోంది. లీకేజీలు, కాపీయింగ్ జరగకుండా పకడ్బందీగా పరీక్షలు జరుపుతామని ఒకవైపు విద్యామంత్రి సురేష్కుమార్ పదేపదే ప్రకటిస్తూ ఉన్న తరుణంలో లీకేజీ సంఘటన సంభవించింది. -
మీకు ఆల్ ది బెస్ట్: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. కష్టపడి చదివితే... మంచి ఫలితాలు సాధించగలరని వారిలో స్ఫూర్తి నింపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 10,65,156 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 1,411 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. (చదవండి: ఎన్పీఆర్పై సీఎం జగన్ ట్వీట్) Best of luck to all the students appearing for the Intermediate exams. I urge my young friends to write the exams stress-free and without pressure of any kind. Hard work & preparation will help you ace through them. — YS Jagan Mohan Reddy (@ysjagan) March 4, 2020 కేవలం అవే ముఖ్యం కాదు: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బెస్ట్ విషెస్ తెలిపారు. పరీక్షలు, గ్రేడ్లు ముఖ్యమేనని.. అయితే అవే సర్వస్వం కాదన్నారు. ఒత్తిడికి లోను కాకుండా.. ఉత్తమ ప్రదర్శన కనబరచాలని పేర్కొన్నారు. ఇక విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం ఇంటర్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. కాగా ఈనెల 4 నుంచి 23 వరకు తెలంగాణలో నిర్వహించే పరీక్షలకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షా సమయం కంటే నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని, విద్యార్థులు వీలైనంత ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) My best wishes to the lakhs of young students who are appearing for their Intermediate board (10+2) examinations starting today While exams & grades are important, they are NOT everything in life. Don’t stress, Do your best 👍 — KTR (@KTRTRS) March 4, 2020 -
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10,65,156 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 5,46,368 మంది, సెకెండియర్ విద్యార్థులు 5,18,788 మంది ఉన్నారు. వీరికోసం 1,411 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసింది. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. -
నిమిషం ఆలస్యమైనా సెంటర్లోకి నిరాకరణ
సాక్షి, సిటీబ్యూరో: సమస్యాత్మక పరీక్ష కేంద్రాలపై గట్టి నిఘా ఏర్పాటు చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మాల్ ప్రాక్టీస్కు ఏమాత్రం ఆస్కారం లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ఒక్కో సెంటర్కు ఒక సిట్టింగ్ స్క్వాడ్ను ప్రత్యేకంగా నియమించింది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మొత్తం 404280 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరి కోసం 462 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, వీటిలో 16 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఆయా కేంద్రాలపై నిఘా ఉంచుతున్నట్లు బోర్డు అధికారులు ప్రకటించారు. ప్రశ్నపత్రాలను మరో రెండు మూడు రోజుల్లో స్థానికంగా ఎంపిక చేసిన పోలీస్స్టేషన్లకు తరలించి ప్రత్యేక కౌంటర్లలో భద్రపర్చనున్నారు. ఇందుకోసం హైదరాబాద్లో 26, మేడ్చల్ జిల్లాలో 18, రంగారెడ్డి జిల్లాలో 28 పోలీస్ స్టేషన్లను ఎంపిక చేశారు. సెంటర్ లొకేషన్ యాప్ ప్రారంభం.. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సెంటర్ లొకేషన్ యాప్ను సిద్ధం చేశారు. గతేడాదే ఈ సేవలను అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. ఆశించిన స్థాయిలో ఫలితాలు అందించలేకపోయింది. ప్రస్తుతం ఈ యాప్ పని తీరును మరింత ఆధునికీకరించి అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులు తమ స్మార్ట్ఫోన్ ద్వారా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్లి సెంటర్ లొకేషన్ యాప్ అని టైప్ చేసి, ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. యాప్లో హాల్టికెట్ నంబర్ టైప్ చేసి సెర్చ్ చేస్తే.. విద్యార్థి ఉన్న చోటికి పరీక్ష కేంద్రం ఎంత దూరంలో ఉందో తెలుస్తుంది. పరీక్ష కేంద్రానికి ఏ రూట్లో ఎలా చేరుకోవాలో కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఈ యాప్ ద్వారా హాల్టికెట్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్పై ప్రిన్సిపాల్ సంతకం కూడా అవసరం లేదు. కాలేజీ ఫీజు పూర్తిగా చెల్లించని విద్యార్థులకు ఆయా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు వారి హాల్ టికెట్లు ఇవ్వకుండా మొండికేస్తుండటం తెలిసిందే. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసే యాజమాన్యాలకు చెక్ పెట్టేందుకే ఈ అవకాశాన్ని అందుబాటలోకి తెచ్చినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. నిర్దేశిత సమయానికి మించి నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఇంటర్బోర్డు స్పష్టం చేసింది. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఉదయం 8 గంటలకే ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. విద్యార్థులు ఒత్తిడికిలోనుకావొద్దు పరీక్షల సమయం సమీపిస్తుండటంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. తమ పిల్లలు అందరికంటే ఎక్కువ మార్కులు సాధించాలని, తమ కాలేజీకి మంచి గుర్తింపు తీసుకురావాలనే ఆశతో కొన్ని కాలేజీల యాజమాన్యాలు పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇది చదువు.. అది చదువు అంటూ వారిని బలవంతం చేస్తున్నారు. కీలకమైన ఈ సమయంలో పిల్లలకు అండగా నిలవాల్సిన తల్లిదండ్రులు కూడా మార్కులు లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఫలితంగా విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. మార్కులు, ర్యాంకులే జీవితం కాదు. తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లలకు అండగా నిలవాలి. వారిని మానసికంగా పరీక్షలకు సిద్ధం చేయాలి. – జయప్రదాబాయి, జిల్లాఇంటర్మీడియట్ ఆఫీసర్, హైదరాబాద్ పరీక్షల తేదీలు.. సమయం ఇలా ఫస్టియర్: మార్చి 4 నుంచి 21 వరకు సెకండియర్: మార్చి 5 నుంచి 23 వరకు సమయం: ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు -
కాసులిచ్చుకో.. మార్కులేసుకో!
సాక్షి, ఆదిలాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈనెల 1 నుంచి 20 వరకు నాలుగు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే జిల్లాలో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ అంతా అస్తవ్యస్తంగా తయారైందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇంటరీ్మడియెట్ పరీక్ష నిర్వహణ అధి కారులు ఆడిందే ఆటా.. పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాసుల కోసం కొంతమంది పరీక్ష నిర్వహణ అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు. కొంతమంది పరీక్షల ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అధికారులు కాసులు తీసుకుంటూ పరీక్షల్లో మార్కులు వేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో.. జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు రాస్తున్న ఎంపీసీ, బైపీసీ, జనరల్ విద్యార్థులు మొత్తం 5,272 మంది ఉన్నారు. వీరిలో ఎంపీసీ విద్యార్థులు 1884 మంది, బైపీసీ విద్యార్థులు 3388 ఉండగా, ఒకేషనల్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 749, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 655 మంది ఉన్నారు. మొత్తం ఒకేషనల్ విద్యార్థులు 1404 మంది ఉన్నారు. వీరికి విడతల వారీగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాసులు ముట్టజెప్పి.. ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అదే కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్ష కేంద్రం ఉండడంతో జోరుగా కాపీయింగ్ జరుగుతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రైవేట్ కళాశాలలకు అదే కళాశాలకు చెందిన లెక్చరర్ ఒకరు ఇంటర్నల్గా వ్యవహరిస్తుండగా, మరో కళాశాలకు చెందిన లెక్చరర్ ఎక్స్టర్నల్గా ఉంటారు. విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించి పేపర్లు మూల్యాంకణం చేసి మార్కులు వేస్తారు. అయితే మార్కుల కోసం కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఎక్స్టర్నల్గా వచ్చిన కొంతమందికి విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక బ్యాచ్ పరీక్షకు రూ.3వేల వరకు అప్పజెబుతున్నారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు నాలుగు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. మొత్తం 120 మార్కులు ఉండగా, ప్రైవేట్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు వంద శాతం మార్కులు వేయడం గమనార్హం. ఇందుకు విద్యార్థుల నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంసెట్, ఇతర పోటీ పరీక్షలకు ఈ మార్కులు దోహద పడనుండడంతో వారు సైతం కాసులు ముట్టజెబుతున్నారు. కాగా ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రం ప్రాక్టికల్లో 30 మార్కులకు గాను 11 నుంచి 24 లోపు మాత్రమే మార్కులు వేస్తున్న అధికారులు ప్రైవేట్ విద్యార్థులకు మాత్రం 30 మార్కులకు 29 నుంచి 30 వరకు వేయడం గమనార్హం. అయితే ఈ విషయమై ఓ అధికారిని అడగగా ప్రైవేట్ కళాశాలల్లో రూ.1500 నుంచి రూ.2వేల వరకు మాత్రమే ఇస్తున్నారని చెప్పడం కొసమెరుపు. ఇంత జరుగుతున్నా ఇంటరీ్మడియెట్ బోర్డు అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వారు మౌనంగా ఉండటం పట్ల వారికి కూడా వాటా అందుతుందా అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మా దృష్టికి రాలేదు ప్రాక్టికల్ పరీక్షల్లో ఎక్స్టర్నల్ విధులు నిర్వహించే లెక్చరర్లకు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు డబ్బులు ఇస్తున్నారనే విషయం మా దృష్టికి రాలేదు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. కాపీయింగ్కు ప్రోత్సహిస్తే చర్యలు తీసుకుంటాం. – దస్రునాయక్, డీఐఈవో, ఆదిలాబాద్ -
పరీక్షకు సిద్ధం
ఖమ్మంసహకారనగర్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బుధ వారం ప్రథమ, గురువారం ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని 52 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభం కానుండగా.. వాటిలో 27 ప్రైవేటు, 25 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 34,679 మంది పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనుండగా.. ఉదయం 8 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించనున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు జనరల్ విభాగంలో 14,532, ఒకేషనల్లో 2,077 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 16,136, ఒకేషనల్ విభాగంలో 1,934 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఆయా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నడుమ ప్రశ్నపత్రం బండిళ్లను తెరవనున్నారు. పరీక్షల హైపవర్ కమిటీ కన్వీనర్గా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ వ్యవహరించగా.. సీపీ తఫ్సీర్ ఇక్బాల్, ఆర్జేడీ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబుతోపాటు సీనియర్ ప్రిన్సిపాల్ ఒకరు ఉండనున్నారు. అలాగే డీఈసీ కమిటీలో ముగ్గురు అధికారులు విధులు నిర్వహించనున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ మూడు బృందాలు ఉండగా.. వీటిలో జూనియర్ లెక్చరర్, డిప్యూటీ తహసీల్దార్, ఏఎస్ఐ స్థాయి అధికారులు ఉంటారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పరీక్ష కేంద్రం సమీపంలోని జిరాక్స్ సెంటర్లు పరీక్ష సమయానికి గంట ముందు, తర్వాత మూసివేయాల్సి ఉంటుంది. నిమిషం నిబంధన అమలు పరీక్షకు గంట ముందు నుంచే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించనున్నారు. ఉదయం 9 నుంచి పరీక్ష మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుండగా.. 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రవాణా, విద్యుత్, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. ప్రశాంతంగా పరీక్షలు రాయండి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. విద్యార్థులు పరీక్ష సమయానికంటే ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. నిమిషం నిబంధన అమలులో ఉంటుంది. – రవిబాబు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, ఖమ్మం -
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈనెల 27 (బుధవారం) నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల 16 వరకు జరిగే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇంటర్ బోర్డు పూర్తి చేసింది. మొత్తం 9,42,719 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,52,550 మంది ఉండగా, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 4,90,169 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,277 పరీక్ష కేంద్రాలను ఇంటర్ బోర్డు ఏర్పాటుచేసింది. వీటిలో 1,277 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 1,277 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 24,508 మంది ఇన్విజిలేటర్లను నియమించింది. 1,277 పరీక్ష కేంద్రాల్లో 40 సెల్ఫ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 32 సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని బోర్డు నిర్ణయించింది. పరీక్షలు పూర్తయ్యే వరకు సిట్టింగ్ స్క్వాడ్స్ అక్కడే ఉంటాయి. అలాగే ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాల బండిల్స్ విప్పే చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాల నిఘా ఉంచనుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా నిమిషం నిబంధన అమలుచేస్తామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ కె.అశోక్ తెలిపారు. విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, ఉదయం 8:45 గంటలకల్లా పరీక్ష హాల్లోకి చేరుకోవాలని పేర్కొన్నారు. 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టంచేశారు. విద్యార్థులు వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని, ఇందుకోసం సెంటర్ లొకేటర్ మొబైల్ యాప్ను వినియోగించుకోవాలని సూచించారు. అందులో పరీక్ష కేంద్రం ఫొటోతో పాటు గూగుల్ రూట్ మ్యాప్ ఉంటుందని వివరించారు. వెబ్సైట్లో హాల్టికెట్లు..: హాల్టికెట్లను ఇంటర్ బోర్డు ఇప్పటికే కాలేజీలకు పంపించింది. ఫీజులు చెల్లించలేదనే కారణంతో కాలేజీలు విద్యార్థులకు హాల్టికెట్లు ఇవ్వడంలేదన్న ఫిర్యాదుల నేఫథ్యంలో వెబ్సైట్లోనూ హాల్టికెట్లను ఉంచింది. bie.telangana.gov.in వెబ్సైట్ నుంచి విద్యార్థులు తమ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. వెబ్సైట్ నుంచి హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకొని నేరుగా పరీక్షకు వెళ్లవచ్చని, దానిపై ఎవరి సంతకం అవసరం లేదని అశోక్ తెలిపారు. ఫీజుల కోసం విద్యార్థులకు హాల్టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులపాలు చేసే కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థులూ.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి - హాల్టికెట్ లేకుండా పరీక్షకు అనుమతించరు. హాల్టికెట్లలో పొరపాట్లు ఉంటే మాత్రం సంబంధిత ప్రిన్సిపాల్ ద్వారా జిల్లా ఇంటర్ విద్యా అధికారిని సంప్రదించాలి. - జవాబు పత్రంలో 24 పేజీలు ఉన్నాయో లేదో ముందే చూసుకోవాలి. బార్కోడ్, సబ్జెక్టు వివరాలను కూడా సరిచూసుకోవాలి. - మొబైల్స్, పేజర్లు, కాలిక్యులేటర్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, పేపర్లు పరీక్ష హాల్లోకి అనుమతించరు. ఒకవేళ వాటిని ఎవరికీ తెలియకుండా తీసుకెళ్తే మాల్ ప్రాక్టీస్ కేసు బుక్ చేస్తారు. - కాపీయింగ్, మాల్ప్రాక్టీస్, ఒకరికి బదులు ఒకరు పరీక్ష రాస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. - పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. జిరాక్స్ కేంద్రాలు మూసివేస్తారు. - పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు తలెత్తితే హైదరాబాద్లోని హెల్ప్లైన్ కేంద్రానికి (040–24601010, 040–24732369) ఫోన్ చేయవచ్చు. -
ప్రేమలో పడ్డాను.. పాస్ చేయండి..
ముజఫర్నగర్, ఉత్తరప్రదేశ్ : ప్రేమ వల్లే తాను పరీక్ష సరిగా రాయలేకపోతున్నానంటూ ఓ విద్యార్థి జవాబు పత్రంలో రాసుకొచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు పరీక్షల్లో చోటు చేసుకుంది. రసాయన శాస్త్ర పరీక్షకు తాను సరిగా చదవలేదని, అందుకు తన ప్రేమే కారణమని చెప్పుకొచ్చాడు సదరు విద్యార్థి. ‘పూజను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమ మనిషి ఒక్కచోట కుదురుకోనివ్వదు. కూర్చొనివ్వదు. నిల్చొనివ్వదు. అందుకే పరీక్షకు సరిగా చదవలేకపోయాను.’ అంటూ విద్యార్థి జవాబు పత్రంలో రాశాడు. జవాబు పత్రంలో మిగతా పేజీలన్నింటిలో హార్ట్ సింబల్ను అందంగా గీశాడు. దీనిపై మాట్లాడిన ముజఫర్నగర్ స్కూల్ ఇన్స్పెక్టర్ మునేష్ కుమార్.. జవాబు పత్రాల్లో చాలామంది విద్యార్థులు తమ బాధలను రాశారని చెప్పారు. కొందరైతే పాస్ చేయాలంటూ డబ్బును పిన్ చేసి పంపారని తెలిపారు. ఒక విద్యార్థి అయితే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలని కూడా చూశాడని చెప్పారు. తనకు తల్లి లేదని, ఫెయిల్ అయితే తండ్రి చంపేస్తాడని ఆ విద్యార్థి జవాబు పత్రంలో రాశాడని వివరించారు. మరొక విద్యార్థి తనను పాస్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని రాశాడని తెలిపారు. -
టాటా... వీడుకోలు
సాక్షి, సిటీబ్యూరో: ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ముగిశాయి. దీంతో చివరి రోజు విద్యార్థులు సందడి చేశారు. ఒకరినొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. సెల్ఫీలు, ఫొటోలతో తమ మధుర జ్ఞాపకాలను సెల్ఫోన్లలో బంధించుకుని తల్లిదండ్రులతో కలిసి ఆనందంగా ఇళ్లకు బయలుదేరారు. రెండేళ్ల పాటు కలిసి చదువుకున్న తోటి స్నేహితులను వదిలి వెళ్తుండడంతో కొందరు భావోద్వేగానికి గురయ్యారు. నగరంలోని పలు కళాశాలలు, హాస్టళ్ల వద్ద ఇవే దృశ్యాలు కన్పించాయి. -
ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రథమ సంవత్సర ద్వితీయ భాష పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలు రాసేందుకు 4,82,360 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 4,61,516 మంది హాజరయ్యారు. 20,844 మంది (4.32 శాతం) గైర్హాజరు అయినట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. వికారాబాద్, కరీంనగర్, సూర్యాపేట్లో మూడు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు అయినట్లు తెలిపింది. రేపటి నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలు.. మార్చి 2 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు తెలిపింది. ద్వితీయ సంవత్సర పరీక్షల్లో భాగంగా మొదటి రోజు ద్వితీయ భాష పరీక్ష ఉంటుందని పేర్కొంది. ఆ పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక బందోబస్తు: కడియం పదో తరగతి, ఇంటర్ పరీక్షలు పక్కాగా నిర్వహించాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దూరప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల్లోని పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక బందోబస్తు కల్పించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్ష సమయం కన్నా ముందే కేంద్రాల వద్ద ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పరీక్షల సమయంలో కేంద్రాలకు సమీపంలో ఉండే జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. -
28 నుంచి ఇంటర్ పరీక్షలు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : ఇంటర్మీడియెట్ పరీక్షలు ఈనెల 28 నుంచి ప్రారంభంకానున్నాయని, ఉదయం 8.30 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని ఆర్ఐఓ బి.ప్రభాకరరావు సూచించారు. శనివారం స్థానిక సెయింట్ థెరిస్సా కళాశాలలో ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై 102 పరీక్షా కేంద్రాల సీఎస్లు, డీఓలు, ఏసీఎస్లతో సమావేశం నిర్వహించారు. వి ద్యార్థులు ఉదయం 8.45 గంటలకే వారికి కేటాయించిన సీట్లలో కూర్చునేలా సం బంధిత అధికారులు చర్యలు తీసుకో వాలని ఆయన ఆదేశించారు. పరీక్షా కేం ద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసేలా సంబంధిత అధికారులతో చర్చించి ఏర్పాట్లు చేయాలని, పరీక్షా కేంద్రాల్లో గాలి, వెలుతురు సరిగా ఉండేలా చూడటంతోపాటు ప్రాథమిక చికిత్సకిట్లు ఉంచేలా వైద్యాధికారులను సంప్రదించాలని సూచించారు. విద్యార్థులు బెంచీలపై కూర్చుని మాత్రమే పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. -
రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఆదివారం విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేస్తారు. ఒకేసారి ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలవుతాయి. ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విద్యార్ధులు పరీక్ష ఫలితాలను www.sakshi.com, www.sakshieducation.com లో చూసుకోవచ్చు. -
బాలికలదే హవా
– ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన అమ్మాయిలు – జూనియర్ ఇంటర్లో జిల్లాకు 9వ స్థానం – సీనియర్ ఇంటర్లో 10వ స్థానం – ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఒకేసారి విడుదల - ప్రభుత్వ కళాశాలల్లో పెద్దపప్పూరు టాప్ అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బాలికలు హవా కొనసాగింది. గురువారం విడుదలైన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలికలే మొదటిస్థానంలో నిలిచారు. మొదటి సంవత్సరం ఫలితాలు గతేడాదికంటే ఈ సారి మెరుగుపడగా, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెనుకబడ్డాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో గతేడాది జిల్లా 11వ స్థానంలో నిలిచింది. ఈసారి 54 శాతం ఉత్తీర్ణతతో 9వ స్థానానికి ఎగబాకింది. జిల్లాలో మొత్తం 33,244 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయగా 18,076 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 16,356 మంది బాలురకు గాను 7,990 మంది 49 శాతం, 16,888 మంది బాలికలకు గాను 10,086 మంది 60 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ కళాశాలల్లో తగ్గిన ఉత్తీర్ణత జిల్లాలోని 39 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గతేడాదికంటే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. గతేడాది 40 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా ఈసారి 35.96 శాతానికి పడిపోయింది. మొత్తం 7,124 మంది విద్యార్థులకు గాను 2,562 మంది ఉత్తీర్ణత సాధించారు. పెద్దపప్పూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. ఇక్కడ 66 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 86.36 శాతంతో 57 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే రొద్దం కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచింది. 111 మంది విద్యార్థులకు గాను 68.47 శాతంతో 76 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గుడిబండ కళాశాల తృతీయ స్థానంలో నిలిచింది. 189 మంది విద్యార్థులకు గాను 56.61 శాతంతో 107 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక రాయదుర్గం జూనియర్ కళాశాల చివరిస్థానంలో నిలిచింది. 401 మంది విద్యార్థులకు గాను 17.71 శాతంతో కేవలం 71 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎయిడెడ్ కళాశాలల్లో 39.19 శాతం ఉత్తీర్ణత ఎయిడెడ్ కళాశాలల్లో 39.19 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అనంతపురం నగరంలోని ఎస్ఎస్ఎస్ బాలికల కళాశాల ప్రథమస్థానంలో నిలిచింది. ఇక్కడ 479 మంది విద్యార్థినులకు గాను 48.02 శాతంతో 230 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే గోరంట్ల ఎస్ఏపీఎస్ కళాశాల చివరిస్థానంలో నిలిచింది. 154 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 15.58 శాతంతో కేవలం 24 మంది గట్టెక్కారు. దిగజారిన ద్వితీయ సంవత్సరం స్థానం ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మన జిల్లా స్థానం రాష్ట్రంలో గతేడాదికంటే ఈసారి కిందకు దిగజారింది. గతేడాది 8వ స్థానంలో ఉండగా ఈసారి 10వ స్థానానికి పడిపోయింది. మొత్తం 28,230 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 70 శాతంతో 19,747 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 13,761 మంది బాలురకు గాను 8,945 మంది 65 శాతం, 14,469 మంది బాలికలకు గాను 10,802 మంది 75 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ కళాశాలల్లో 63.55 శాతం ఉత్తీర్ణత జిల్లాలోని 39 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది 63.55 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదికంటే 0.55 శాతం మెరుగుపడింది. మొత్తం 5,918 మంది విద్యార్థులకు గాను 3,761 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక్కడ కూడా పెద్దపప్పూరు జూనియర్ కళాశాలే జిల్లా ప్రథమస్థానం దక్కించుకుంది. ఈ కళాశాలలో 85 మంది విద్యార్థులకు గాను 94.12 శాతంతో 80 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కంబదూరు కళాశాల ద్వితీయస్థానంలో నిలిచింది. 93 మంది విద్యార్థులకు గాను 86.02 శాతంతో 80 మంది ఉత్తీర్ణత సాధించారు. చిలమత్తూరు కళాశాల తృతీయస్థానంలో నిలిచింది. 87 మంది విద్యార్థులకు గాను 81.61 శాతంతో 71 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక నల్లమాడ కళాశాల చివరి స్థానంలో నిలిచింది. ఇక్కడ 72 మంది విద్యార్థులకు గాను 38.89 శాతంతో 28 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ‘ఎయిడెడ్’లో 56.71 శాతం ఉత్తీర్ణత ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లాలోని ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు 56.71 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 1,208 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 685 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక్కడ కూడా నగరంలోని ఎస్ఎస్ఎస్ బాలికల కళాశాల ప్రథమస్థానంలో నిలిచింది. 410 మంది విద్యార్థినులకు గాను 62.93 శాతంతో 258 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎస్ఎస్బీఎన్ కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచింది. 283 మంది విద్యార్థులకు గాను 56.18 శాతంతో 159 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక గోరంట్ల ఎస్ఏపీఎస్ కళాశాల ఇక్కడ కూడా చివరిస్థానంలో నిలిచింది. 117 మంది విద్యార్థులకు గాను 28.21 శాతంతో కేవలం 33 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. నెట్ కేంద్రాలు, సెల్ఫోన్లతో సందడి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఒకేసారి విడుదల చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు వారి బంధువులు నెట్ సెంటర్ల వద్ద, ఆండ్రాయిడ్ ఫోన్లతో సందడి చేశారు. మార్కులు తెలుసుకునేందుకు ఎగబడ్డారు. ఫలితాలు వెలువడగానే అనంతపురం నగరంతో పాటు హిందూపురం, ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, కదిరి, ఉరవకొండ, గుత్తి, పుట్టపర్తి, మడకశిర పట్టణాల్లోని నెట్ కేంద్రాలు కిటకిటలాడాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు స్వీట్లు తినిపించుకుంటూ ఆనందంగా గడిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం గత ఫలితాలు ఇలా... సంవత్సరం శాతం 2008 45 2009 33.53 2010 36 2011 44 2012 47 2013 45.5 2014 49 2015 53 2016 47 2017 54 ఇంటర్ ద్వితీయ సంవత్సరం గత ఫలితాలు ఇలా... సంవత్సరం శాతం 2008 60 2009 52.86 2010 53 2011 57 2012 55 2013 63 2014 65 2015 66 2016 69 2017 70 -
కోతలు ప్రారంభం
► జిల్లాలో అప్రకటిత విద్యుత్ కోతతో జనం అవస్థలు ► పరీక్షల కాలం కావడంతో విద్యార్థుల ఆందోళన ► కోతలేమీ లేవంటున్నఅధికారులు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని పాలకులు చెబుతున్న మాటలు కోతలని తేలిపోయింది. వేసవి ప్రారంభంలోనే విధిస్తున్న అప్రకటిత కోతలు జనానికి విసుగు తెప్పిస్తున్నాయి. పరీక్షల సీజన్ కావడంతో పుస్తకాలతో కుస్తీ పడుతున్న విద్యార్థులకు తరచూ కరెంటు పోతుండడంతో ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. వేసవి ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మున్ముందు ఎలా ఉంటుందో నని ప్రజలు భయపడుతున్నారు. అయితే సంబంధిత అధికారులు మాత్రం అదేమీ లేదని చెబుతుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అరసవల్లి: కోతల కాలం వచ్చేసింది. వేసవికాలం తొలి రోజుల నుంచే విద్యుత్ కోతలు తప్పడం లేదు. కావాల్సిన విద్యుత్ సర్ప్లస్లో ఉందని. ఎక్కడా కోతలంటూ లేవని ఓ వైపు విద్యుత్ శాఖాధికారులు చెప్తుంటే....మరోవైపు గత రెండ్రోజులుగా తరచూ విధిస్తున్న కోతలతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారుల ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. జిల్లాలో విద్యుత్ విని యోగదారులు సుమారు 18 లక్షల మంది వరకు ఉన్నారు. వీరికి సరిపడా విద్యుత్ సరఫరా ఉందని, కోతలు విధించే అవకాశాలే లేవంటూ విద్యుత్ శాఖాధికారులు చెబుతుండగా.. తాజా పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అప్రకటిత కోత: జిల్లాలోని పలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరా గంటల తరబడి నిలిచిపోయింది. ముఖ్యంగా ఉదయం, మధ్యాహ్న సమయాల్లో నాలుగు గంటలకు పైగానే అప్రకటిత కోతలు విధిస్తున్నారు. కొన్ని గ్రామాకు రాత్రి వేళల్లో కూడా సరఫరా నిలిపి వేస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్ర, శనివారాల్లో అప్రకటిత కోతలు విధించడంతో పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అవస్థలు పడ్డారు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా, మరికొద్ది రోజుల్లో డిగ్రీ, పదో తరగతి పరీక్షలు మొదలుకానున్నాయి. వేసవి మొదట్లోనే ఇలా కోతలుంటే..రానురాను ఇంకా ఏమేరకు కోతలుంటాయో అని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీన జరిగిన ఎంఎల్సీ ఎన్నికల సమయంలో కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో చీకట్లోనే బ్యాలెట్బాక్సులకు సిబ్బంది సీళ్లు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. అప్రకటిత కోతతో చిరు వ్యాపారులు, చిన్న పరిశ్రమలతో పాటు, వెల్డింగ్, మిల్లులు, జిరాక్స్, నెట్ సెంటర్లు, ఐస్క్రీం పార్లర్ల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకపక్క నగదు లేక జనం అవస్థలు పడుతుంటే.. అరకొరగా పని చేస్తున్న ఏటీఎంలు కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయంతో పనిచేయకుండా పోతున్నాయి. రోజుకు 40 లక్షల యూనిట్లు వినియోగం: జిల్లాకు 220 కేవీ టెక్కలి, గరివిడి ఉపకేంద్రాలతో పాటు 132/33 కేవీ చిలకపాలెం, పాలకొండ, రాజాం, నరసన్నపేట, ఇచ్ఛాపురం, టెక్కలి, పలాస, పైడిభీమవరం, పాతపట్నం తదితర తొమ్మిది విద్యుత్ ఉపకేంద్రాల ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతోంది. జిల్లాలో ఉన్న మొత్తం గృహ, గృహేతర వినియోగదారులకు రోజుకు 40 లక్షల యూనిట్లు అవసరం. అయితే వేసవి కాలంలో కావాల్సిన డిమాండ్కు తగిన సరఫరా ఉండదనేది ఈ కోతలతో స్పష్టమవుతోంది. విద్యుత్ కోతలు ఉండవని.. 24 గంటల సరఫరా ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నప్పటికీ అవన్నీ కోత లేనని తేలిపోయింది. ఇదిలావుంటే కేవలం మరమ్మతుల కారణంగానే విద్యుత్ కోతలు విధిస్తున్నామంటూ సంబంధిత అధికారులు కారణాలు చెబుతున్నారు. లైన్ క్లియరెన్స్తోనే అంతరాయం: గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉన్న మాట వాస్తవమే. అయితే గాలులు వీయడంతో పలుచోట్ల లైన్ క్లియరెన్స్ (ఎల్సీ) తీసుకుని విద్యుత్ లైన్ల మరమ్మతు పనులు చేపడుతున్నాం. అందుకే సరఫరా నిలిపివేశాం. ఎటువంటి కోతలు లేవు. సీఎండీ ఆదేశాల మేరకు ప్రతి శనివారం లైన్లకు తగిలే చెట్లు కొట్టడం వంటి పనులు చేపడుతున్నాం. విద్యుత్ సరఫరా జిల్లాలో సర్ప్లస్లో ఉంది. కోతలుండే అవకాశమే లేదు. ---డి.సత్యనారాయణ, ఎస్ఈ, విద్యుత్ శాఖ ఇంటర్ పరీక్షలు రాస్తున్నాం. గంటల కొలది కరెంట్ ఉండటం లేదు. దీంతో చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది. కరెంట్ ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. --- కె.శ్రీనివాస్, అరసవల్లి విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం కలుగుతుంది. దీంతో వెల్డింగ్ పనులు మధ్యలో ఆగిపోతున్నాయి. షెడ్లు వేయడానికి ఎత్తులో ఉండి పనిచేయాల్సి వస్తుంది. మద్యలో తరచుగా కరెంట్ వస్తూ, పోతూ ఉండడంతో పనులకు తీవ్ర ఇబ్బందిగా ఉంటుంది. --ఆర్.దాలినాయుడు, వప్పంగి అంధకారంలో వీరఘట్టం: వీరఘట్టం మండల ప్రజలు శనివారం రోజంతా విద్యుత్ కష్టాలను ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ పలుమార్లు సరఫరా పోయినప్పటికీ సర్దుకుపోయారు. అయితే మండలానికి విద్యుత్ను సరఫరా చేసే వీరఘట్టంలోని సబ్స్టేషన్ వద్ద సాంకేతిక సమస్య తలెత్తింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో విద్యుత్ తీగ తెగిపోవడంతో మండలం మొత్తం కరెంటు సరఫరా నిలిచిపోయింది. సమస్యను పరిష్కరించేందుకు సిబ్బంది చేసిన ప్రయత్నం రాత్రి పదిన్నర గంటల వరకూ కొలిక్కిరాలేదు. దీంతో పిల్లలు.. వృద్ధులు..చిన్నారులు..అవస్థలు ఎదుర్కొన్నారు. విక్రంపురం గ్రామానికి చెందిన చీపురుపల్లి అనూష అనే ఆరేళ్ల చిన్నారి ఉబ్బసం కారణంగా ఊపిరి తీసుకోవడానికి అవస్థలు పడింది. దీంతో తల్లిదండ్రులు వీరఘట్టంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొని వచ్చారు. అయితే కరెంటు లేకపోవడంతో బ్రితింగ్మిషన్ పని చేయలేదు. దీంతో సబ్–స్టేషన్ కార్యాలయానికి మాత్రం కరెంటు ఉండడంతో బాలికను అక్కడకు తీసుకొని వెళ్లి కృత్రిమశ్వాసను అందించడంతో ప్రమాదం నుంచి బయటపడింది. -
ఒకే గదిలో ఐదుగురు డిబార్
యాదగిరిగుట్ట: ఇంటర్ ద్వితియ సంవత్సరం పరీక్షల్లో భాగంగా ఒకే గదిలో పరీక్ష రాస్తున్న ఐదుగురు విద్యార్థులను అధికారులు డీబార్ చేశారు. యాదాద్రి జిల్లా యాదగిరిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఈ సంఘటన జరిగింది. నేడు జరుగుతున్న ఇంటర్ ద్వితియ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష సందర్భంగా వీరంతా మాస్ కాపీయింగ్కు పాల్పడుతు పట్టుబడ్డారు. జిల్లాలోని పరీక్ష కేంద్రాలను పరిశీలించిన రిజనల్ జాయింట్ డైరెక్టర్ సుహాసిని ఇది గుర్తించి అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి వచ్చే సమయంలో సరిగ్గా తనిఖీలు నిర్వహించవకపోవడం పై మండిపడ్డారు. కామారెడ్డిలో మరో ముగ్గురు: ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ పరీక్షా కేంద్రంలో ముగ్గురు ఇంటర్ విద్యార్థులు డిబార్ అయ్యారు. ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీకి వచ్చిన సమయంలో ముగ్గురు విద్యార్థులు కాపీ కొడుతూ పట్టుపడటంతో స్క్వాడ్ అధికారి నాగరాజు వారిని డిబార్ చేశారు. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
-
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
► రెండు జిల్లాల్లో 88 సెంటర్లు, 56,375 మంది విద్యార్థులు ► ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష ► నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు ► మాస్కాపీయింగ్కు పాల్పడితే డిబారే ► సాక్షి ప్రత్యేక ఇంటర్య్వూలో ఇంటర్ విద్యాశాఖాధికారి ఆండ్రూస్ ఖమ్మం జెడ్పీసెంటర్: ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నాం. ప్రణాళికాబద్ధంగా పరీక్షా కేంద్రాలను గుర్తించాం. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. విద్యా, వైద్య, ఆరోగ్య, పోలీస్, ఆర్టీసీ, పోస్టల్ డిపార్ట్మెంట్లను సమన్వయం చేస్తూ చర్యలు తీసుకుంటున్నామని ఆదివారం సాక్షికి ఇచ్చిన ప్రత్యేకఇంటర్య్వూలో ఇంటర్ విద్యాశాఖాధికారి ఆండ్రూస్ తెలిపారు. పరీక్షల ఏర్పాట్లపై పలు అంశాలను వివరించారు. ఇంటర్య్వూ ఆయన మాటల్లోనే... సాక్షి: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎన్ని పరీక్షా కేంద్రాలు? డీఐఈఓ: ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మొత్తం 88పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం. వాటిలో ఖమ్మంలో 55 సెంటర్లు వీటిలో 18 ప్రభుత్వ, ఒకటి ఎయిడెడ్, ఆరు సోషల్ వెల్ఫేర్, ఒకటి మోడల్ స్కూల్, ఒక హైస్కూల్, 28 ప్రైవేటు కళాశాలలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 33 సెంటర్లు ఉన్నాయి. వీటిలో 13 ప్రభుత్వ, 3 సోషల్వెల్ఫేర్, 4 ట్రైబల్ వెల్ఫేర్, 13 ప్రైవేటు కళాశాలలున్నాయి. సాక్షి: రెండు జిల్లాల్లో ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు? డీఐఈఓ: రెండు జిల్లాల్లో 56,375 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో ఖమ్మం జిల్లాలో 35,744 మంది, ప్రథమ సంవత్సరం 18 వేలు, ద్వితీయ సంవత్సరం 17,744 మంది రాయనున్నారు. భద్రాద్రి జిల్లాలో 20,631 మంది విద్యార్థులు కాగా, వీరిలో మొదటి సంవత్సరం 8,111, ద్వితీయ సంవత్సరం 8,281 మంది విద్యార్థులున్నారు. సాక్షి: పరీక్షలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? డీఐఈఓ: మార్చి 1 నుంచి 14 వరకు పరీక్షలు జరగనున్నాయి. 9న జరగాల్సిన పరీక్ష 19న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మాస్కాపీయింగ్కుపాల్పడితే డిబార్చేస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందే. సాక్షి: పరీక్షల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డీఐఈఓ: జిల్లాల్లో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. మాస్ కాపీయింగ్ జరగకుండా ఇన్విజిలేటర్లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నాం. పరీక్షలు జంబ్లింగ్ విధానంలో జరగనున్నాయి. సాక్షి: సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారా? జిల్లాలో ఎన్ని ఉన్నాయి? డీఐఈఓ: గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఒక సమస్యాత్మక కేంద్రం ఉంది. సాక్షి: విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? డీఐఈఓ: విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం. కింద కూర్చొని పరీక్షలు రాయకుండా ఏర్పాట్లు చేశాం. అన్ని కేంద్రాల్లో డెస్క్ బెంచీలు ఏర్పాటు చేస్తున్నాం. మంచినీరు, విద్యుత్, మెడికల్ క్యాంపులు ఉండేలా చూస్తున్నాం. సాక్షి: ప్రాక్టికల్స్ నిర్వహణ సక్రమంగా జరగలేదన్న వాదన ఉంది కదా? డీఐఈఓ: ప్రాక్టికల్స్ నిర్వహణ పక్కాగా నిర్వహించాం. ప్రతిభ ఉన్నవారికే మార్కులు వస్తాయి. దీనిపై ఎలాంటి అనుమానాలకు తావు లేదు. పనితనాన్ని బట్టే మార్కులుంటాయి. సాక్షి: పరీక్ష కేంద్రంలోకి ఎన్ని గంటలకు అనుమతిస్తారు? డీఐఈఓ: 8 గంటల నుంచి విద్యార్థులను అనుమతిస్తాం. 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదు. ఇవే ఆదేశాలు అన్ని సెంటర్లకు జారీ చేశాం. సాక్షి: పరీక్షా కేంద్రాలపై ఎలాంటి నిఘా ఉంది? డీఐఈఓ: ప్రతికేంద్రం వద్ద పోలీస్బందోబస్తు ఉంటుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. పరీక్షల నిర్వహణపై హైపవర్ కమిటీ మెంబర్లు ఉన్నారు. రెండుజిల్లాలకు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్, 60 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, ఏడుగురు సిట్టింగ్ స్క్వాడ్, 88 మంది డిపార్ట్ మెంటల్ అధికారులు, నలుగురు డీఈసీ మెంబర్లు పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారు. -
ఇంటర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్?
♦ పరస్పర అవగాహనతో అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేటు కాలేజీలు ♦ సూర్యాపేటలో గణితం పేపర్ లీకయిందంటూ ప్రచారం... అదేం లేదన్న బోర్డు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో కొన్ని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు పరస్పర అవగాహనతో ఉమ్మడిగా మాల్ప్రాక్టీస్కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు తమ విద్యార్థుల కోసం ఈ తరహా మాల్ప్రాక్టీస్కు పాల్పడుతున్నట్లు పరీక్షల విధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్లే పేర్కొంటున్నారు. ఆ తరహాలోనే బుధవారం గణితం పేపర్-2ఏ పరీక్ష సందర్భంగా సూర్యాపేటలో పేపర్ లీకజీ గందరగోళం చోటుచేసుకుందని చెబుతున్నారు. బుధవారం సూర్యాపేటలో గణితం పేపర్ లీక్ అయిందం టూ ప్రచారం జరిగింది. పలు టీవీ చానెళ్లు స్క్రోలింగ్లు కూడా వేశాయి. అయితే ఈ ఘటనపై నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ, రీజ నల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ విచారణ జరిపినట్లు... అక్కడ ఎలాంటి పేపర్ లీకేజీ జరగలేదని తేల్చినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఆ వదంతులు మినహా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొంది. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం, ఇంటర్ బోర్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ లీకేజీ ప్రచారాన్ని ఖండించింది. కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాల కుట్రలో భాగంగానే దీన్ని పరిగణించాలని పేర్కొంది. కానీ సూర్యాపేటతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోని పలు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఉమ్మడిగా మాల్ప్రాక్టీస్కు పాల్పడుతున్నాయని జూనియర్ లెక్చరర్లు ఆరోపిస్తున్నారు. పక్కా ప్రణాళిక, కాలేజీల మధ్య ఒప్పందాల మేరకు పరీక్ష ప్రారంభమయ్యాక సెల్ఫోన్ ద్వారా ప్రశ్నపత్రాన్ని బయటకు లీక్ చేస్తున్నారని... జవాబులను తిరిగి సెల్ఫోన్ ద్వారానే పరీక్ష కేంద్రాల్లోకి చేరవేస్తున్నారని పేర్కొంటున్నారు. ఆ తరహాలోనే సూర్యాపేటలో బుధవారం పరీక్ష సందర్భంగా గందరగోళం చోటు చేసుకుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, మాల్ ప్రాక్టీస్ను అరికట్టాలని తెలంగాణ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇంటర్ పరీక్షలకు 94.38 శాతం హాజరు బుధవారం జరిగిన ఇంటర్ సెకండియర్ మ్యాథ్స్, బోటనీ, సివిక్స్ పరీక్షలకు 94.38 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు బోర్డు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మాస్ కాపీయింగ్కు పాల్పడుతూ మొత్తం 57 మంది విద్యార్థులు అధికారులకు పట్టుబడ్డారు. వీరిపై మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు. -
సోషల్ మీడియాలో ఇంటర్ ప్రశ్నాపత్రాలు?
సూర్యాపేట : రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో జోరుగా మాస్కాపియింగ్ జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. బుధవారం జరుగుతున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం మాథ్య్-ఏ పేపర్ పరీక్ష జరుగుతుండగా ఈ విషయం బయటపడింది. నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని కొన్ని ప్రైవేటు కళాశాలలకు చెందిన అధ్యాపక బృందమే ఈ పని చేసినట్లు తెలుస్తోంది. పరీక్ష జరుగుతున్న సమయంలోనే ప్రశ్నపత్రాన్ని బయటకు తీసుకెళ్లి.. వాటికి సరైన సమాధానాలు రాసి... తీసుకొచ్చి... విద్యార్థులకు పంచుతున్నట్లు అధికారులకు సమాచారం. మరో వైపు ఏపీలోని నెల్లూరుజిల్లాలో కూడా కాపీయింగ్ జోరుగా జరగుతోంది. జిల్లాలోని రాపూర్ లోని ఓ ఎగ్గామ్ సెంటర్ లో మాస్ కాపీయింగ్ జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. సెకండియన్ మ్యాథ్స్ , సివిక్స్ ప్రశ్నా ప్రతాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నట్టు సమాచారం. ఈరోజు ఉదయం 8 గంటలకే ప్రశ్నాప్రత్రాలు లీక్ అయ్యాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికి పోలీసులకు సమాచారం ఫిర్యాదు చేశారు. ఘటనకు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మార్చి 2 నుంచి ఇంటర్ పరీక్షలు
-
మార్చి 2 నుంచి ఇంటర్ పరీక్షలు?
- ఒకవేళ కుదరకుంటే 9 నుంచి నిర్వహణకు బోర్డు కసరత్తు - రెండు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు - ఏపీ కంటే ముందుగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి 2 నుంచి ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు కసరత్తు చేస్తోంది. జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల తేదీలు, సెలవులను పరిగణనలోకి తీసుకొని ఒకవేళ 2 నుంచి నిర్వహణ సాధ్యం కాకుంటే అదే నెల 9వ తేదీ నుంచి నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు రెండు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. తొలుత మార్చి 11 నుంచి పరీక్షలు నిర్వహిం చాలని ఉన్నతాధికారులు భావించినా ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షలను అదే తేదీ నుంచి నిర్వహించేందుకు ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు ఇప్పటికే షెడ్యూలు/టైంటేబుల్ జారీ చేయడంతో అంతకంటే ముందుగానే పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ మొదటి వారంలో (4వ తేదీన నిర్వహించే అవకాశం) ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ రాత పరీక్షను నిర్వహించే అవకాశం ఉండటం, అదే నెల నుంచి జూన్ వరకు వివిధ జాతీయస్థాయి పోటీ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో మార్చిలోనే ఇంటర్ పరీక్షలను పూర్తి చేయాలని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. తద్వారా విద్యార్థులు జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేం దుకు సులభంగా ఉంటుందని, విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చూడవచ్చని పేర్కొంటున్నాయి. ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రాక్టికల్స్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ వంటి పరీక్షలను ఫిబ్రవరిలోనే బోర్డు నిర్వహించనుంది. మరోవైపు మార్చి మూడో వారంలో పదో తరగతి పరీక్షలను (మార్చి 16 లేదా 18వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది) నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అంతకంటే ముందే ఇంటర్ పరీక్షలను పూర్తి చేసేలా బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. గత విద్యా సంవత్సరం ఇంటర్ పరీక్షలను 2015 మార్చి 9 నుంచి బోర్డు నిర్వహించింది. ప్రథమ సంవత్సర ఫలితాలను ఏప్రిల్ 22న, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఏప్రిల్ 27న ప్రకటించింది. -
ఆంధ్రా విద్యార్థులకు తెలంగాణ హాల్ టికెట్లు
రాష్ట్ర ఉన్నత విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం ఇంటర్ విద్యార్థులకు శాపంగా మారింది. రాష్ట్రం విడిపోవడంతో ఉన్నత విద్యాశాఖను కూడా విభజించారు. కానీ కొంతమంది ఇంటర్ విద్యార్థుల హాల్ టికెట్లు తెలంగాణా బోర్డు నుంచి రావడంతో వారు అవాక్కయ్యారు. బుధవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతంలో ఉన్న 7 పరీక్ష కేంద్రాల్లో నలుగురు విద్యార్థులకు తెలంగాణ బోర్డు నుంచి హాల్ టికెట్లు వచ్చాయి. గురువారం నుంచి ప్రారంభం కానున్న ద్వితీయ సంవత్సరం విషయంలోనూ సూరిపోగు రాజ్కుమార్ అనే విద్యార్థికి తెలంగాణ హాల్ టికెట్ వచ్చింది. మార్కుల జాబితా, ధ్రువీకరణ పత్రం కూడా తెలంగాణ బోర్డు నుంచి వస్తే మన రాష్ట్రంలో ఉన్నత చదువుకు, ఉద్యోగాలకు అనర్హుడుగా అవుతానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రింటింగ్ ప్రెస్ వల్లే ఇబ్బందులు ఈ విషయమై ఇంటర్మీడియెట్ ప్రాంతీయ బోర్డు అధికారి రమేష్ను ‘సాక్షి’ వివరణ కోరగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినా హైదరాబాద్లో ప్రింటింగ్ప్రెస్ ఒకటేనని అందువలనే ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయన్నారు. చీరాల్లో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నుంచి హాల్టికెట్లు పొందిన విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తామని, ఆందోళన చెందనవసరం లేదన్నారు. తెలంగాణ బోర్డు నుంచి వచ్చిన హాల్టికెట్లున్న విద్యార్థులు సంబంధిత ప్రిన్సిపాళ్ల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే సమస్యలు రాకుండా చూస్తానన్నారు. -
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
ఏలూరు సిటీ :ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు సజావుగా సాగేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు చర్యలు చేపట్టారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అర్ధగంట ముందుగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్మీడియెట్ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి బి.వెంకటేశ్వరరావు కోరారు. ప్రథమ సంవత్సరం ఇంటర్ పరీక్ష నేటితో ప్రారంభమవుతుంది. ఈ పరీక్షలకు సంబంధించి ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలందించేందుకు ప్రథమ చికిత్స శిబిరం, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. విద్యార్థులెవరూ పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు తీసుకురావద్దని అధికారులు కోరుతున్నారు. ఫస్ట్ ఇంటర్ విద్యార్థులు 33,394 మంది బుధవారం నిర్వహించే ఫస్టియర్ పరీక్షకు జిల్లాలో 33,394 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది 68109 మంది పరీక్షలు రాయనున్నారు. ఇక ఫస్ట్ ఇంటర్ విద్యార్థులు 33394 మంది ఉండగా వారిలో జనరల్ కోర్సులకు సంబంధించి 30297 మంది ఉంటే బాలురు 13687 మంది, బాలికలు 16610 మంది, వోకేషనల్ కోర్సులకు సంబంధించి 3097 మందిలో బాలురు 1735, బాలికలు 1362 మంది పరీక్షలు రాస్తారు. సెకండ్ ఇంటర్ పరీక్షలకు 34715మంది హాజరుకానుండగా వారిలో జనరల్ విద్యార్థులు 30907మంది ఉంటే బాలురు 14296 మంది, బాలికలు 16611మంది, వోకేషనల్ 3808 మందిలో బాలురు 2018, బాలికలు 1790మంది ఉన్నారు. పరీక్షల షెడ్యూల్ ఇదే ఫస్ట్ ఇంటర్ పరీక్ష టైం టేబుల్ 11న సెకండ్ లాంగ్వేజ్ -1, 13న ఇంగ్లిష్ -1 16న గణితం-1 ఎ, బొటనీ -1, సివిక్స్-1, ఫిజియాలజీ -1 18న గణితం -1 బీ, జువాలజీ -1, హిస్టరీ-1 20న ఫిజిక్స్ -1, ఎకానమిక్స్ -1, క్లాసికల్ లాంగ్వేజ్-1 24న కెమిస్ట్రీ -1, కామర్స్ -1, సోషియాలజీ -1, ఫైన్స్ఆర్ట్స్, మ్యూజిక్ -1 26 న జియాలజీ -1, హోమ్ సైన్స్ -1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ -1, లాజిక్ -1, బ్రిడ్జి కోర్సు గణితం -1 30 న మోడ్రన్ లాంగ్వేజ్ -1, జాగ్రఫీ -1 సెకండ్ ఇంటర్ టైంటేబుల్ 12న లాంగ్వేజ్ పేపరు-2, 14న ఇంగ్లిష్ పేపరు-2 17న గణితం పేపరు-2ఎ, బోటనీ పేపరు-2, సివిక్స్ పేపరు-2, ఫిజియాలజీ-2 19న గణితం-2 బీ, జువాలజీ -2, హిస్టరీ-2 23న ఫిజిక్స్ -2, ఎకనమిక్స్-2, క్లాసికల్ లాంగ్వేజ్ -2 25న కెమిస్ట్రీ-2, కామర్స్-2, సోషియాలజీ -2. ఫైన్స్ఆర్ట్స్, మ్యూజిక్-2 27న జియాలజీ -2, హోమ్సైన్సు-2, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2, లాజిక్-2, బ్రిడ్జికోర్సు గణితం-2 31న మెడ్రన్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ-2 -
మొదటిరోజు ప్రశాంతం
విద్యార్థుల సంఖ్య 50,655 హాజరైనవారు 46,067 గైర్హాజరైనవారు 4,588 కరీంనగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలో పరీక్ష సెంటర్ అడ్రస్ మారడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. నగరంలోని భారతి జూనియర్ కళాశాల కేంద్రం నంబర్ హాల్టికెట్లో కమాన్రోడ్ అని ఉండడం, కళాశాల కోతిరాంపూర్లోని బైపాస్రోడ్లో ఉండడంతో కాసేపు ఉరుకలు పరుగులు పెట్టారు. మొదటి రోజు పరీక్ష కావడంతో విద్యార్థుల వెంబడి వారి తల్లిదండ్రులు, బంధువులు కేంద్రాల వద్దకు తోడుగా వచ్చారు. దీంతో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఎక్కడ చూసినా జనం రద్దీ కనిపించింది. నగరంలోని సైన్స్వింగ్ కళాశాలలో విద్యార్థులను పరీక్షలకు అనుమతించడంలో పక్షపాతం వహిస్తున్నారని ఆలస్యంగా వచ్చిన కొందరిని అనుమతించి మరికొందరి అడ్డుకున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆర్ఐఓ సుహాసినితోపాటు పరీక్షల కేంద్రం అధికారులు సెంటర్ను సందర్శించి వివరాలు ఆరా తీశారు. జిల్లావ్యాప్తంగా పరీక్షల నిర్వహణ సజావుగా సాగినప్పటికీ మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థుల కోసం పరీక్ష రాసేందుకు బెంచీలు ఏర్పాటు చేయకుండా కింద కూర్చోబెట్టి నిబంధనలను బేఖాతరు చేశారు. కళాశాలకు ఎక్కువ మంది విద్యార్థులను కేటాయించడంతో ఇరుకు గదులు సరిపోకపోవడంతో కింద కూర్చోబెట్టి పరీక్షలు నిర్వహించారు. ఇద్దరు డిబార్... ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో సోమవారం ఇద్దరు విద్యార్థులు మాల్ప్రాక్టీస్కు పాల్పడుతూ డిబార్ అయ్యారు. సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల కోహెడలో ఒకరు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మపురిలో ఒకరు, ఇద్దరు మాల్ప్రాక్టీసుకు పాల్పడుతూ పట్టుబడ్డట్లు ఆర్ఐఓ సుహాసిని వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా జనరల్ విభాగంలో 45,233 మందికి 41,691 మంది, ఒకేషనల్ విభాగంలో 5422 మందికి 4,376 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. జనరల్, ఒకేషనల్ విభాగాల్లో జిల్లావ్యాప్తంగా 50,655 మంది విద్యార్థులకు, 46,067 మంది హాజరుకాగా, 4,588 మంది గైర్హాజరయ్యూరు. -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
నల్లగొండ అర్బన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సోమవారం జిల్లా వ్యాప్తంగా 115 పరీక్షా కేంద్రాలలో ప్రారంభమయ్యాయి. ప్రథమ సంవత్సరం లాంగ్వేజ్ పేపర్-1 పరీక్షకు మొత్తం 45,859 మంది విద్యార్థులకు గాను 40,763 మంది విద్యార్థులు హాజరయ్యారు. 5096 మంది గైర్హాజరు అయ్యారు. జనరల్ విభాగంలో 41,367 మంది విద్యార్థులకు గాను 37,092 మంది పరీక్ష రాయగా 4275 మంది గైర్హాజరు అయ్యారు. అదే విధంగా ఒకేషనల్ విభాగంలో 4492 మందికి గాను 3671 మంది హాజరు, 821 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. కాగా జిల్లా కేంద్రంలో ఆర్ఐఓ ఎన్.ప్రకాశ్బాబు పలు సెంటర్లను తనిఖీ చేశారు. హై పవర్ కమిటీ (హెచ్పీసీ), జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) సభ్యులు, ఫ్లైయింగ్ స్వ్కాడ్, సిట్టింగ్ స్వ్కాడ్లు 45 సెంటర్లలో తనిఖీలు జరిపారు. జిల్లాలోని వివిధ సెంటర్లలో... మోత్కూరు మండలంలోని అడ్డగూడూరు ప్రభుత్వ, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కాలేజీ విద్యార్థినులు 21 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి పరీక్షలకు హాజరయ్యారు. గురుకుల విద్యా సంస్థ వారు సమకూర్చిన డీసీఎం వ్యానులో వారు మోత్కూరు మండల కేంద్రంలోని మూడు పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. ప్రథమ సంవత్సరం వారు 79 మంది విద్యార్థులు ఉండగా, ద్వితీయ సంవత్సరం 73 మంది ఉన్నారు. ఇక్కడే సెంటర్ ఏర్పాటు చేస్తే బాగుండేదని విద్యార్థుల తల్లిదండ్రులన్నారు. గత సంవత్సరం కేవలం ప్రథమ సంవత్సరం విద్యార్థులే ఉండటం వల్ల సెంటర్ కేటాయించలేదని చెప్పిన అధికారులు, ఈయేడు ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నప్పటికీ సెంటర్ను కెటాయించలేదు. సూర్యాపేట పట్టణంలో విద్యార్థులకు 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5224 మంది విద్యార్థులకు గాను 4664 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 560 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రాల్లో 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ చొప్పున నియమించాల్సి ఉంది. కానీ కొన్ని కేంద్రాల్లో ఇన్విజిలేటర్ల కొరత ఉంది. అంఛనాలకు మించి విద్యార్థులకు పరీక్షలకు హాజరుకావడంతో వివిధ పరీక్షా సెంటర్లలో సరిపోను సీటింగ్ లేక వరండాల్లో ఏర్పాటు చేశారు. వరండాల్లో కింద కూర్చొని పరీక్షలు రాయడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. చౌటుప్పల్ పట్టణంలో ఐదు ఇంటర్ పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓ పరీక్షా కేంద్రాన్ని లక్కారం శివారులోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేశారు. ఇది మండల కేంద్రానికి కిలోమీటర్ కంటే ఎక్కువ దూరంలోనే ఉంది. ఇక్కడికి బస్సు, ఆటో సౌకర్యం ఏదీ లేకపోవడంతో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. నాంపల్లిలోని పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు సరిపడా బెంచీలు లేక, నేలపైనే కూర్చొని పరీక్ష రాశారు. మర్రిగూడలోని వేమన జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలు మండల కేంద్రానికి 2కి.మీ దూరంలో ఉండడంతో వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు బస్ సౌకర్యంలేక విద్యార్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. -
సర్వం సిద్ధం
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు కేంద్రాల వద్ద 144 సెక్షన్ వెబ్సైట్లోనూ హాల్టికెట్లు విద్యారణ్యపురి : జిల్లాలో ఈ నెల 9 నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు జనరల్, ఒకేషనల్ విభాగాల్లో మొత్తం 1,04,381 మంది హాజరుకానున్నారు. 9న ప్రారంభం కానున్న ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 48,874 మంది, 10న మొదలయ్యే సెకండియర్ పరీక్షలకు 55,507 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జిల్లావ్యాప్తంగా 131 పరీక్ష కేంద్రాలు కేటారుుంచారు. ఇందులో 62 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు కాగా... 69 ప్రభుత్వ, ఇతర రెసిడెన్షియల్ , ఎయిడెడ్ కాలేజీలు ఉన్నారుు. సుమారు 5 వేల మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. 131 మంది చొప్పున చీఫ్ సూపరింటెండెంట్లు(సీఎస్), డిపార్టుమెంటల్ ఆఫీసర్లను( డీఓ) నియమించారు. ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లతోపాటు పది సిట్టింగ్ స్క్వాడ్లను నియమాకం చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఒక్కో బృందంలో డిప్యూటీ తహసీల్దార్, ఏఎస్ఐ, సీనియర్ లెక్చరర్లు సభ్యులుగా ఉన్నారు. సిట్టింగ్ స్క్వాడ్ ఒక్కో బృందంలో సీనియర్ లెక్చరర్తోపాటు పీడీ లేదా లైబ్రేరియన్ ఉన్నారు. అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, కస్టోడియన్లను కూడా నియూమకం చేశారు. ఉన్నతస్థారుులో పర్యవేక్షణకు హైపవర్ కమిటీ నియూమకమైంది. ఇందులో జాయింట్ కలెక్టర్, ఎస్పీ, ఇంటర్విద్య ఆర్జేడీ, డీవీఈఓ ఉన్నారు. పరీక్షల షెడ్యూల్.. ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలు 27వ తేదీ వరకు కొనసాగనున్నారుు. ఆయా పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరగనున్నారుు. విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు ఉదయం 8.30 గంటల కల్లా చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. విద్యార్థులకు సంబంధించిన హాల్టికెట్లను ఇప్పటికే ఆయా కళాశాలలు ప్రిన్సిపాళ్లు తీసుకెళ్లారని, ఈ మేరకు వాటిని తీసుకుని పరీక్షలకు హాజరుకావాలని తెలిపారు. వెబ్సైట్ నుంచి కూడా హాల్టికెట్లను తీసుకోవచ్చని వెల్లడించారు. పరీక్షల నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా, పరీక్షల సమయంలో విద్యుత్ కోతలు విధించకుండా సంబంధిత అధికారులతో ఇంటర్ విద్య ఆర్ఐఓ మాట్లాడారు. ఇటీవల కలెక్టరేట్లో వివిధ శాఖాధికారులతో కలెక్టర్ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు సంబంధిత అధికారులకు కూడా ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతోపాటు కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను పరీక్షల సమయంలో మూసివేయాలని అధికారులు ఆదేశించారు. సమస్యాత్మక కేంద్రాలు 23 జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి సమస్యాత్మక కేంద్రాలు 23 ఉన్నట్లు గుర్తించిన అధికారులు... వీటిపై ప్రత్యేక దృష్టిసారించారు. కాపీయింగ్ నిరోధానికి చర్యలు తీసుకున్నారు. ఏపీటీడబ్ల్యూఆర్ జూనియర్ కాలేజీ(కురవి), ఏపీఎస్డబ్ల్యూజేసీ (మహబూబాబాద్), జీజేసీ(బి)(మహబూబాబాద్), ప్రిస్టన్ జూనియర్ కాలేజీ (జనగామ), ప్రభుత్వ జూనియర్ కాలేజీ(పరకాల), తేజస్విని గాంధీ జూనియర్ కాలేజీ (భూపాలపల్లి), ప్రభుత్వ జూనియర్ కాలేజీ (భూపాలపల్లి, మద్దూరు, చేర్యాల, నెక్కొండ), పోతన కో ఆపరేటివ్ జూనియర్ కాలేజీ (పాలకుర్తి), ప్రభుత్వ జూనియర్ కాలేజీ (కేసముద్రం, గూడూరు, కొత్తగూడెం,నర్మెట, చిట్యాల, దేవరుప్పుల, కొడకండ్ల, జఫర్గఢ్ సెంటర్లు సమస్యాత్మక కేంద్రాల జాబితాలో ఉన్నారుు. కాగా, జిల్లాలో మూడు సెల్ఫ్ సెంటర్లు ఏర్పాటుచేశారు. ఇందులో ధర్మసాగర్, మంగపేట, తాడ్వారుు ప్రభుత్వ నియర్ కాలేజీలు ఉన్నాయి. -
సోమవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం
హైదరాబాద్: ప్రధమ, ద్వితీయ సంవత్సరాల ఇంటర్ పరీక్షలకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు పూర్తిచేసింది. మార్చి 9 వ తేదీ సోమవారం నుంచి 27 వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 1,251 పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఇంటర్ పరీక్షలకు 973,237 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొంది. వారిలో 426, 448 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం, 506789 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయనున్నారని వివరించింది. -
ఇంటర్ పరీక్షలపై ఎన్నాళ్లీ ప్రతిష్టంభన!
-
ఇంటర్ పరీక్షలపై ఎన్నాళ్లీ ప్రతిష్టంభన!
* ఇంటర్ పరీక్షలపై వీడని గందరగోళం * పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పట్టు * వేరుగా నిర్వహించేందుకే తెలంగాణ మొగ్గు.. గవర్నర్ సమావేశం పెట్టినా కొలిక్కి రాని సమస్య సాక్షి, హైదరాబాద్: ఇరు రాష్ట్రాల్లోనూ ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. పరీక్షలను వేర్వేరుగా నిర్వహించేందుకు వేర్వేరుగా ఇరు రాష్ట్రాలు పరీక్షల టైం టేబుల్ ప్రకటించినా.. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 19 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన పరీక్షల వ్యవహారాన్ని తేల్చకుండా.. ఇరు ప్రభుత్వాలు వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. వేర్వేరు పరీక్షల వల్ల విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని, ఉమ్మడిగానే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పట్టుపడుతుండగా... కలిపి నిర్వహిస్తేనే సమస్యలు వస్తాయంటూ, సొంతంగా పరీక్షల నిర్వహణకు తెలంగాణ మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో పరీక్షలకు అవసరమైన పేపరు కొనుగోళ్లు, ముద్రణ పనుల విషయంలో ఏం చేయాలో అర్థంకాక అధికారులు తల పట్టుకుంటున్నారు. ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వాల నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్ప ముందుకు సాగలేని పరిస్థితి నెలకొంది ఒక దశలో తెలంగాణ, ఏపీలకు చెందిన మంత్రులు జగదీశ్రెడ్డి, గంటా శ్రీనివాసరావు సమావేశమై చర్చించినా... పరీక్షల నిర్వహణ అంశాన్ని తేల్చలేకపోయారు. చివరకు ఈ ఇద్దరు మంత్రులతో గవర్నర్ నరసింహన్ సమావేశం నిర్వహించినా సమస్య కొలిక్కి రాలేదు. ఇరు రాష్ట్రాల మంత్రులు మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటారని భావించినా కుదరడం లేదు. ఇటీవల ఇంటర్బోర్డులో మంత్రుల సమావేశానికి ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వచ్చినా.. అసెంబ్లీ సమావేశాల కారణంగా జగదీశ్రెడ్డి హాజరుకాలేకపోయారు. ఆ తరువాత గంటా శ్రీనివాసరావు విదేశ పర్యటనకు వెళ్లడంతో పరీక్షల సమస్య అలాగే ఉండిపోయింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో మునిగిపోతున్నారు. పరీక్షల విషయంగా ఏదో ఒకటి త్వరగా తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ముందుకు సాగని పనులు.. ఇంటర్ పరీక్షలకు ప్రశ్నపత్రాల రూపకల్పన, పేపర్ సరఫరాకు టెండర్లు పిలవడం తప్ప మరే పనులు మొదలుకాలేదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పేపర్ సరఫరా కోసం టెండర్లు పిలిచినా.. ప్రభుత్వాల నుంచి స్పష్టత రాకపోవడంతో వాటిని ఖరారు చేయలేని పరిస్థితి నెలకొంది. * ప్రశ్నపత్రాల రూపకల్పనలో భాగంగా ఒక్కో సబ్జెక్టులో 12 సెట్ల పేపర్లు తయారు చేయించా ల్సి ఉంది. అయితే రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తే సరిపోయేలా 18 సెట్ల చొప్పున ప్రశ్నపత్రాలను రూపొందించారు. * ఈ ప్రశ్నపత్రాల ముద్రణ పనులను ఇరు రాష్ట్రాలకు కలిపి ఇవ్వాలా? వేర్వేరుగా ఇవ్వాలా? అనే అంశంపై స్పష్టత లేదు. దీనిపై ఇరు ప్రభుత్వాల నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. 19 లక్షల మంది విద్యార్థులకు అవసరమైన 1.20 కోట్ల జవాబు పత్రాలకు సంబంధించిన పేపరు కొనుగోలు, బుక్లెట్ల ముద్రణకు టెండర్లను కూడా పిలవలేదు. * ఫీజు చెల్లించిన విద్యార్థుల సమాచారం (డాటా) ప్రాసెసింగ్కు టెండర్లు పిలవలేదు. వాటిని బట్టే ఏ కోర్సులో ఎంత మంది చదువుతున్నారు. ఏ సబ్జెక్టులో, ఏ మీడియంలో ఎన్ని ప్రశ్నపత్రాలు, ఎన్ని జవాబు పత్రాలు ముద్రిం చాలనేది వెల్లడవుతుంది. తమ పరిధిలోకి తెచ్చుకుంటుందా? * వేర్వేరుగా పరీక్షల నిర్వహణకు కట్టుబడిన తెలంగాణ ప్రభుత్వం.. తొలుత వేరుగా ఇంటర్ బోర్డు ఏర్పాటుకు ఫైలు సిద్ధం చేసింది. ఆ యాక్టును అడాప్ట్ చేసుకున్నా... ఆ తరువాత బోర్డు ఏర్పాటును పక్కనపెట్టింది. ప్రస్తుతం ఉన్న బోర్డుపై అధికారం తమదేనని, కోరితే ఏపీలోనూ తామే పరీక్షలను నిర్వహిస్తామని తెలంగాణ చెబుతోంది. కానీ ఇంతవరకు బోర్డును తమ పరిధిలోకి తెచ్చుకోలేదు. ఏపీ నేతృత్వం లోనే ఇంటర్ బోర్డు కొనసాగుతోంది. అయితే బోర్డును తెలంగాణ తమ పరిధిలోకి తెచ్చుకొని పరీక్షలు నిర్వహిస్తుందా? లేదా? అన్నదీ తేలలేదు. ఏ పేరిట సర్టిఫికెట్లు..? ఉమ్మడిగా పరీక్షలను నిర్వహిస్తే సర్టిఫికెట్లను ఏ బోర్డు పేరుతో ఇస్తారన్న అంశంపైనా స్పష్టత లేదు. ప్రస్తుత ఇంటర్బోర్డుకు బోర్డు ఇంటర్మీడియట్ ఏపీ అని ఉంటుంది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా ఏపీ బోర్డు పేరుతో సర్టిఫికెట్లను ఇస్తారా? ఒక వేళ బోర్డును తెలంగాణ తమ ఆధీనంలోకి తెచ్చుకుంటే ఏపీ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు ఆఫ్ తెలంగాణ పేరుతో సర్టిఫికెట్లు ఇస్తారా? లేక ఏపీ పేరుతో ఇస్తారా? ఒక రాష్ట్రంలో విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికెట్లకు మరో రాష్ట్రం బోర్డుతో పేరుతో ఉంటే అంగీకరిస్తారా? అనే అంశాలను తేల్చాల్సి ఉంది. పరీక్షలను ఉమ్మడిగా నిర్వహిస్తే జవాబు పత్రాల మూల్యాంకనం సందర్భంగా స్వ రాష్ట్రం మీద అభిమానంతో ఎక్కువ మార్కు లు వేసుకోవచ్చనే అభిప్రాయాలూ ఉన్నాయి. విద్యార్థులకు నష్టం: ఏపీ ఉన్నత విద్యా సంస్థల్లో పదేళ్ల పాటు ఉమ్మడి ప్రవేశాలు ఉండాలని పునర్విభజన చట్టంలోనే స్పష్టం చేశారు. అందుకే ఇంటర్ పరీక్షలు కూడా ఉమ్మడిగానే జరగాలి. వేర్వేరు పరీక్షల వల్ల కామ న్ మెరిట్ను నిర్ధారించడం కుదరదు. వేరుగా పరీక్షలు నిర్వహిస్తే ఏపీ విద్యార్థులకు నష్టం వాటిల్లుతుంది. నష్టం జరగదు: తెలంగాణ విభజన చట్టం స్ఫూర్తిని కచ్చితంగా పాటిస్తాం. చట్టం నిబంధనల ప్రకారం తెలంగాణలోని విద్యా సంస్థల్లో ప్రవేశాలకు 15 శాతం ఓపెన్ కోటాను అమలుచేస్తాం. అందులో మెరిట్లో ఉన్న ఏపీ విద్యార్థులకు సీట్లను ఇస్తాం. కామన్ మెరిట్ తీసేందుకు పర్సంటైల్, నార్మలైజేషన్ విధానం అమలు చేయవచ్చు. జేఈఈ మెయిన్ వంటి పరీక్షల్లో అన్ని రాష్ట్రాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకే ఈ విధానాన్ని సీబీఎస్ఈ ప్రవేశపెట్టింది. లేదంటే ఎంసెట్లో ఇంటర్ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీని తొలగించి, ఇంటర్ మార్కుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించవచ్చు. ఈ విధానాలతో వేర్వేరుగా ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తే తెలంగాణ విద్యార్థులకు గానీ, ఏపీ విద్యార్థులకు గానీ నష్టం ఉండదు. తల్లిదండ్రుల్లో ఆందోళన.. ఇంటర్ పరీక్షలకు ఐఐటీ, ఎన్ఐటీ వంటి ఇతర పరీక్షలతో సంబంధం ఉంటుం ది. ఇవీ మార్చిలో పూర్తికావాలి. అందుకే నాలుగు నెలల ముందు నుంచే పనులు చేపట్టాలి. కానీ ఇరు రాష్ట్రాలు ఎవరి భేషజాలతో అవి ఉన్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చట్టం ప్రకారం ఇంటర్ బోర్డు తెలంగాణకే రావాలి. కానీ బోర్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. ఈ గొడవల ప్రభావం పరీక్షలపై పడే అవకాశముంది. అందువల్ల దీనిపై త్వరగా తేల్చాలి. - చుక్కా రామయ్య, విద్యావేత్త -
'అవసరమైతే ఒక మెట్టు దిగడానికి ఓకే'
హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలపై జరగాల్సిన ఏపీ, తెలంగాణ మంత్రుల సమావేశం వాయిదా పడింది. సమావేశానికి తెలంగాణ విద్యాశాఖ జగదీశ్ రెడ్డి హాజరుకాలేదు. ఆయన కోసం ఇంటర్ బోర్డులో ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గంటకుపైగా నిరీక్షించారు. అసెంబ్లీలో ఎల్ బీసీ సమావేశం కారణంగా భేటీకి రాలేనని గంటాకు జగదీశ్ రెడ్డి సమాచారం ఇవ్వడంతో ఆయన వెనుదిరిగారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఒక్క మెట్టు దిగడానికైనా సిద్ధమని గంటా ప్రకటించారు. తెలంగాణ సర్కారు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరిపేందుకు కూడా తమకు అభ్యంతరం లేదన్నారు. సకాలంలో పరీక్షలు జరిపి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీయిచ్చారు. తెలంగాణ మంత్రితో మాట్లాడి తదుపరి భేటీ ఎప్పుడనేది తెలియజేస్తామన్నారు. -
ఇంటర్ బోర్డు పై ఇరు రాష్ట్రాల పోరు
-
ఇంటర్ పరీక్షలపై కొనసాగుతున్న సందిగ్ధం
-
ఇంటర్ పరీక్షలపై కొనసాగుతున్న సందిగ్ధం
హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలపై సందిగ్ధత కొనసాగుతోంది. పరీక్షల నిర్వహణపై గవర్నర్ సమక్షంలో రెండు రాష్టాల విద్యాశాఖ మంత్రులు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. బుధవారం గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశమయ్యారు. ఇంటర్ పరీక్షలు విడిగానే నిర్వహించుకుంటామని తెలంగాణ మంత్రి అన్నారు. ఉమ్మడిగానే నిర్వహించాలని ఏపీ మంత్రి కోరారు. ఉమ్మడిగా పరీక్షలు నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని మంత్రులకు గవర్నర్ సూచించారు. ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళతామని చెప్పి మంత్రులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. -
అవసరమైతే కోర్టుకెళతాం: మంత్రి గంటా
-
అవసరమైతే కోర్టుకెళతాం: మంత్రి గంటా
హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ మంత్రులు గవర్నర్ నరసింహన్ ను కోరారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, కింజరపు అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్ మంగళవారం గవర్నర్ ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. గవర్నర్ ను కలిసిన తర్వాత గంటా శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. బుధవారం తెలంగాణ విద్యాశాఖ మంత్రిని పిలిచి గవర్నర్ మాట్లాడతానన్నారని చెప్పారు. పరీక్షలు వేర్వేరుగా నిర్వహిస్తే విద్యార్థులు నష్టపోతారని, ఉమ్మడిగా నిర్వహించాలని విభజన చట్టంలో ఉందని తెలిపారు. ఈ విషయంలో అవసరమైతే కోర్టుకు వెళతామని, కేంద్రానికి కూడా ఫిర్యాదు చేస్తామని గంటా శ్రీనివాసరావు అన్నారు. -
వేరుగానే ఇంటర్ పరీక్షలు!
-
మార్చి 9 నుంచి ఇంటర్ పరీక్షలు
* సొంతంగా నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం * తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు వేర్వేరుగా టైమ్టేబుళ్లు, ప్రశ్నపత్రాలు * ఏపీలో మార్చి 11 నుంచి పరీక్షలు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలను సొంతంగానే నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగానే ముందుకెళుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ సర్కారు తిరస్కరించింది. రాష్ట్రంలో ఈ పరీక్షలను వచ్చే ఏడాది మార్చి 9 నుంచి 27 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఇంటర్ బోర్డు టైమ్టేబుల్ ప్రకటించింది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆమోదం తీసుకున్న వెంటనే బోర్డు అధికారులు ఈ టైమ్టేబుల్ను జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మార్చి 11 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీనివాసరావు ప్రటించిన మరుసటి రోజే తెలంగాణలో వేరుగా పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ జారీచేయడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేకుండా తెలంగాణలో వేరుగానే పరీక్షలు నిర్వహిస్తామని, వేర్వేరు ప్రశ్నాపత్రాలతోనే ఈసారి పరీక్షలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతోంది. ఇందులో భాగంగా పరీక్షల నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లను కూడా వేరుగానే చేయమని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను మంత్రి జగదీశ్రెడ్డి గత నెలలోనే ఆదేశించారు. అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు టైంటేబుల్తో కూడిన ప్రతిపాదనలను బోర్డు రెండు రోజుల క్రితం పంపించింది. తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శికి వెళ్లిన ఆ ఫైలు మళ్లీ తెలంగాణకు రావాల్సి ఉంది. కానీ అది తెలంగాణ అధికారులకు రాకముందే.. తెలంగాణ విద్యాశాఖ మంత్రి, ప్రభుత్వం నుంచి ఆమోదం లభించక ముందే.. ఏపీ విద్యాశాఖ మంత్రి తాము మార్చి 11 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహిస్తామని గురువారం ప్రకటించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి గురువారం రాత్రే చర్చించారు. తెలంగాణలో వేరుగానే పరీక్షలను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణకు వేరుగా టైంటేబుల్ రూపొందించి తీసుకురావాలని శుక్రవారం ఉదయమే ఇంటర్ బోర్డు అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో అధికారులు మార్చి 9 నుంచి పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించి తీసుకురావడంతో ఆమోదముద్ర వేశారు. వెంటనే ఇంటర్ బోర్డు అధికారులు ఆ టైంటేబుల్తోపాటు ఆంధ్రప్రదేశ్ టైంటేబుల్ను ప్రకటించారు.