మెట్రో పిల్లర్ గుంటలో పడి బాలుడి మృతి | 7 years old boy dies in freak accident | Sakshi
Sakshi News home page

మెట్రో పిల్లర్ గుంటలో పడి బాలుడి మృతి

Published Thu, Oct 13 2016 5:00 PM | Last Updated on Tue, Oct 16 2018 5:16 PM

7 years old boy dies in freak accident

హైదరాబాద్ : మెట్రో పిల్లర్ కోసం తీసిన గుంటలో పడి ఏడేళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. నగరంలోని పాత గాంధీ ఆస్పత్రి సమీపంలో మెట్రో పిల్లర్ కోసం తీసిన గుంటలో నీరు నిండటంతో.. ప్రమాదవశాత్తు బాలుడు అందులో పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని వెలికి తీసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement