ఇంజనీరింగ్లో ప్రవేశాలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సోమవారం ప్రారంభమైంది.
40,001వ ర్యాం కు నుంచి చివరి ర్యాంకు వరకు ఈ వెరిఫికేషన్కు హాజరుకావాలని సూచించారు. యూనివర్సిటీల నుంచి అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీలు, సీట్ల జాబితా ఉన్నత విద్యామండలికి అందలేదు. మంగళ, బుధవారాల్లో వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ సారి సీట్లు భారీగా తగ్గిపోనున్నాయి. ఏఐసీటీఈ గతేడాది 277 కాలేజీల్లో 1,39,468 సీట్లకు అనుమతివ్వగా, ఈసారి 250 కాలేజీల్లో 1,26,315 సీట్లకు అనుమతిచ్చింది. గతేడాది ఏఐసీటీ ఈ అనుమతిచ్చిన సీట్లన్నింటికీ వర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. 1.04 లక్షల సీట్లకే ఓకే చెప్పాయి. ఈసారి 85 వేల నుంచి 90 వేల లోపు సీట్లకే అనుబంధ గుర్తింపు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఏఐసీటీఈ బీ–ఫార్మసీలోనూ సీట్లకు కోత విధించింది. గతేడాది 144 కాలేజీల్లో 14,460 సీట్లకు అనుమతివ్వగా ఈసారి 137 కాలేజీల్లో 12,931 సీట్లకే అనుమతి ఇచ్చింది.