సంప్రదాయ దుస్తులు ధరించిన యువత మేళ తాళాల మధ్య నృత్యాలు చేస్తుండగా జగన్నాథ రథయాత్ర వైభవంగా జరిగింది.
సంప్రదాయ దుస్తులు ధరించిన యువత మేళ తాళాల మధ్య నృత్యాలు చేస్తుండగా జగన్నాథ రథయాత్ర వైభవంగా ముందుకు సాగింది. బుధవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లోని జగన్నాథ మందిరం వద్ద రథయాత్ర కోలాహలం ఆకట్టుకుంది. గవర్నర్ దంపతులు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసి పూజలు నిర్వహించారు.
జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవి ఉత్సవమూర్తుల విగ్రహాలను రథాలపైకి చేర్చే ఘట్టం అంగరంగ వైభవంగా సాగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన రథయాత్ర పూజలు మధ్యాహ్నం 1 గంటకు రథాలను లాగే ఘట్టంతో కన్నుల పండువగా జరిగాయి. సరిగ్గా 3.30 గంటలకు ముగ్గురూ దేవతామూర్తుల విగ్రహాలను సమీపంలోని కనకదుర్గా దేవాలయానికి చేర్చారు. దారి పొడవునా భక్తులు రథయాత్రను తిలకించారు.