రైల్వే ట్రాక్ పనుల్లో అపశ్రుతి | One killed in accident while railway track work in secunderabad | Sakshi

రైల్వే ట్రాక్ పనుల్లో అపశ్రుతి

Oct 17 2016 10:10 AM | Updated on Aug 25 2018 5:39 PM

నగరంలోని బాలనగర్ ఫిరోజ్గూడ రైల్వే ట్రాక్ పనుల్లో సోమవారం అపశ్రుతి చోటుచేసుకుంది.

హైదరాబాద్ : నగరంలోని బాలనగర్ ఫిరోజ్గూడ రైల్వే ట్రాక్ పనుల్లో సోమవారం అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ మట్టిపెళ్లలు విరిగిపడి ఓ రైల్వే కార‍్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు.

కాగా ఈ ప్రమాద ఘటనపై అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వలేకపోతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు నాంపల్లి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement