
పీజీ ఆయుష్కు ప్రత్యేక ఎంట్రన్స్
వర్సిటీలో పరీక్షలన్నింటినీ డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించారు. దీనివల్ల నిష్పాక్షికంగా వ్యవహరించడానికి వీలుకలగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మెడికల్, డెంటల్, నర్సింగ్ కాలేజీలకు చెందిన దాదాపు 250 మంది ప్రిన్సిపల్స్ అందరూ అకడమిక్ సెనెట్లో సభ్యులుగా ఉన్నారు. అన్ని కాలేజీలకు ప్రాతినిధ్యం అన్న పద్ధతిని సవరించి కేవలం 20 మంది ప్రిన్సిపల్స్ మాత్రమే సభ్యులుగా ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులకు బోర్డ్ ఆఫ్ స్టడీస్ను నెలకొల్పారు. అందులో వైస్ ఛాన్స్లర్సహా పలువురు వైద్య నిపుణులు సభ్యులుగా ఉంటారు. ఈ సమావేశంలో వైస్ ఛాన్స్లర్ డాక్టర్ కరుణాకర్రెడ్డి, ఆయుష్ కమిషనర్ రాజేందర్రెడ్డి, వైద్య విద్య మాజీ సంచాలకులు డాక్టర్ పుట్టా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.