నేడు సూర్యగ్రహణం సదర్భంగా తీరుమల శ్రీవారి ఆలయం మూసివేత
సూర్యగ్రహణం: నేడు సూర్యగ్రహణం సదర్భంగా తీరుమల శ్రీవారి ఆలయం మూసివేత. ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి సర్వదర్శనం ప్రారంభం.
పార్లమెంట్ సమావేశాలు: నేడు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై మాట్లాడనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.
మున్నిపల్ ఎన్నికల ఫలితాలు: గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ జరగనుంది. ఉదయం మధ్యాహ్నం 2 గంటల సమయానికి తుది ఫలితాలు వెలువడే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్ అంసెంబ్లీ: అసెంబ్లీలో నేడు ప్రశ్నోత్తరాలపై చర్చ అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై విపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడనున్నారు.
గ్రీన్ ట్రిబ్యునల్: రవిశంకర్ సాస్కృతిక సమ్మేళనానికి అనుమతులివ్వడంపై గ్రీన్ ట్రిబ్యునల్లో ఇవాళ విచారణ కొనసాగనుంది. సాస్కృతిక సమ్మేళనానికి అనుమతుల జారీపై అధికారులను గ్రీన్ ట్రిబ్యునల్ నిలదీసిన విషయం తెలిసిందే.
రావెల సుశీల్ కేసు: రావెల సుశీల్కుమార్ను బంజారా హిల్స్ పోలీసులు నేడు విచారించనున్నారు. సుశీల్ను రెండు రోజుల కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఎస్సీ వర్గీకరణ: ఎస్సీ వర్గీకరణను కోరుతూ నేడు నారావారిపల్లి నుంచి ఆందోళనను ప్రాంరభించనున్న ఎమ్ఆర్పీఎస్