ఈ నెల 7, 8వ తేదీలు (శని, ఆదివారాలు)లో ఎగ్జిబిషన్ (నుమాయిష్)ను మధ్యాహ్నం నుంచి ప్రారంభిస్తామని ఎగ్జిబిషన్ సొసైటీ ....
అబిడ్స్: ఈ నెల 7, 8వ తేదీలు (శని, ఆదివారాలు)లో ఎగ్జిబిషన్ (నుమాయిష్)ను మధ్యాహ్నం నుంచి ప్రారంభిస్తామని ఎగ్జిబిషన్ సొసైటీ గౌరవ కార్యదర్శి పి.నరోత్తమరెడ్డి, కోశాధికారి అనిల్ స్వరూప్ మిశ్రాతెలిపారు. ఈ రోజుల్లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. వారాంతం, సెలవు రోజులు కావడంతో సందర్శకుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.