
'మాకు సామాన్య భక్తులే విఐపిలు'
తమకు సామాన్య భక్తులే విఐపిలని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాల రావు గురువారం హైదరాబాద్లో తెలిపారు. రాష్ట్రంలోని దేవాదాయ భూ ములు లీజు వ్యవహారంపై సాధ్యమైనంత త్వరలో సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. దేవాదాయాలకు చెందిన ఆస్తులు ద్వారా ఆదాయం పెరిగే మార్గాలను అన్వేషిస్తామని చెప్పారు.