ఆ 50 మందిలో 38 మంది భారతీయులే! | 38 Indians among 50 foreigners killed in Nepal quake | Sakshi
Sakshi News home page

ఆ 50 మందిలో 38 మంది భారతీయులే!

Published Sat, May 2 2015 5:11 PM | Last Updated on Sat, Oct 20 2018 6:37 PM

ఆ 50 మందిలో 38 మంది భారతీయులే! - Sakshi

ఆ 50 మందిలో 38 మంది భారతీయులే!

కఠ్మాండు: గతవారం నేపాల్లో సంభవించిన భారీ భూకంపంలో ఈరోజు వరకు తెలిసిన సమాచారం ప్రకారం మొత్తం 50 మంది విదేశీయులు మృతి చెందారు. 46 మంది విదేశీయులు గాయపడ్డారు. చనిపోయినవారిలో 38 మంది భారతీయులు ఉన్నట్లు నేపాల్ హొం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. భారతీయులు మరో పది మంది గాయపడ్డారు. మొత్తం ఆరు వేల ఆరు వందల మంది మృతి చెందగా, 16వేల 500 మంది గాయపడినట్లు పేర్కొంది.

చైనాకు చెందిన ముగ్గురు, ఫ్రాన్స్కు చెందిన ఇద్దరు, అమెరికాకు చెందిన ముగ్గురు, జపాన్, ఆస్ల్రేలియా, ఇస్తోనియా, స్పెయిన్ దేశాలకు చెందిన ఒక్కొక్కరు మృతి చెందినట్లు హొం శాఖ వివరించింది. గాయపడిన భారతీయులను టీచింగ్ హాస్పటల్, పటాన్ హాస్పటల్లో చేర్చినట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement