బీజింగ్: ముస్లిం మైనారిటీలైన ఉయిఘర్లు అధికంగా ఉండే జిన్జియాంగ్లో ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న పిల్లలు, విద్యార్థులు పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండటంపై ఈ ఏడాదీ చైనా నిషేధం విధించింది. నాస్తికత్వాన్ని అధికారికంగా పాటించే అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రాంతంలో వారిపై రంజాన్ ఉపవాసాలపై కొన్నేళ్లుగా నిషేధం విధిస్తూ వస్తోంది.