Ramzan
-
Shoaib Malik-Sana Celebrate Eid:భార్య సనా జావెద్తో షోయబ్ మాలిక్ రంజాన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Eid Mubarak 2024: సానియా మీర్జాతో ఐఏఎస్ స్మితా సబర్వాల్ రంజాన్ వేడుకలు.. ఫొటోలు వైరల్
-
రంజాన్ నెలలో 10 లక్షల బిర్యానీ ఆర్డర్లు లాగించేసిన హైదరాబాదీలు
బిర్యానీ.. ఈ పేరు వింటే చాలు నోటిలో నీళ్లు ఊరాల్సిందే. బిర్యానీ వాసనకే సగం కడుపు నిండిపోతుంది. ఎప్పుడు రెస్టారెంట్కు వెళ్లినా బిర్యానీ తినకుంటే మాత్రం భోజనం అసంపూర్తిగా అనిపిస్తుంటుంది. ఇక మన హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ బిర్యానీ ఘుమఘుమలకు ఒక్క తెలుగు వారేంటి.. దేశవిదేశీయులు ఫిదా అవ్వాల్సిందే. అంతటి గొప్ప పేరును కలిగిన బిర్యానీని రంజాన్ మాసంలో హైదరాబాద్ వాసులు తెగ లాంగించారట.. ఈ ఒక్క నెలలోనే ఏకంగా పది లక్షలు(1 మిలియన్) బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. బిర్యానీ ఆర్డర్లలో దేశవ్యాప్తంగా హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచిందని పేర్కొంది. బిర్యానీతో పాటు హలీమ్ ఆర్డర్లలోనూ నగర వాసులు రికార్డు సృష్టించారని, నెల రోజుల వ్యవధిలో 5.3 లక్షల ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. ఈ ఏడాది రంజాన్ మాసం మార్చి 11న ప్రారంభమైన విషయం తెలిసిందే. నేటితో(శుక్రవారం) ముగిసింది. ఈ క్రమంలో తాజాగా దేశవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ ఆర్డర్ల గురించి వివరాలను స్విగ్గీ ప్రకటించింది. ఈ నెల రోజుల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 60 లక్షల పేట్ల బిర్యానీ ఆర్డర్లు డెలివరీ చేసినట్లు తెలిపింది. మిగతా నెలలతో పోలిస్తే రంజాన్ నెలలో బిర్యానీ ఆర్డర్లు 15 శాతం పెరిగాయని పేర్కొంది. రంజాన్ సందర్భంగా సాయంత్రం 5:30 నుంచి 7 గంటల మధ్య ఇఫ్తార్ ఆర్డర్లు 34% పెరిగినట్లు స్విగ్గీ వెల్లడించింది. ఇఫ్తార్ ఆర్డర్లలోలో చికెన్ బిర్యానీ, మటన్ హలీమ్, సమోసా, ఫలుదా, ఖీర్లు టాప్ ప్లేస్లో ఉన్నట్లు చెప్పింది. హలీమ్ ఆర్డర్లలో ఏకంగా 1454.88 శాతం పెరుగుదల నమోదైందని, దీని తర్వాతి స్థానంలో ఫిర్ని ఆర్డర్లలో 80.97 శాతం, మాల్పువా ఆర్డర్లు 79.09 శాతం, ఫలుదా 57,93 శాతం, డేట్స్ 48.40 శాతం ఆర్డర్లు పెరిగాయని పేర్కొంది. -
అడ్వాన్స్డ్ ఈద్ ముబారక్.. ఇఫ్తార్ విందులో సీఎం వైఎస్ జగన్
సాక్షి, పుట్టపర్తి/కదిరి అర్బన్/బత్తలపల్లి: అందరికీ మేలు జరగాలని, ముస్లిం సోదరులందరికీ ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు (అడ్వాన్స్డ్ ఈద్ ముబారక్) తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. సోమవారం సాయంత్రం శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ముస్లిం సోదరులతో ఆప్యాయంగా మాట్లాడారు. విందులో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఉషశ్రీచరణ్, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, జఖియాఖానమ్, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, మాజీ మంత్రి షాకీర్, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా, కదిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి బీఎస్ మక్బుల్, సీనియర్ నేతలు వజ్రభాస్కర్రెడ్డి, పూల శ్రీనివాసరెడ్డి, పెద్దసంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. -
Ramzan: సుర్మాతో.. కంటి సంబంధిత వ్యాధులకు చెక్!
ముస్లింలు పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసంలో ‘సుర్మా’ ఆద్యంతం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ ప్రత్యేకత చాటుతోంది. ఈ మాసంలో ముస్లింలు వయోభేదం లేకుండా త్రికరణ శుద్ధితో ఉపవాసం(రోజా)ఉంటారు. ఖురాన్ పఠిస్తూ ఐదు పూటలా నమాజ్ ఆచరిస్తారు. మహ్మద్ ప్రవక్త బాటను అనుసరిస్తూ నిష్టగా ఉంటారు. ఈ క్రమంలో ఈ మాసంలో ముస్లింల నేత్రాలకు అలంకరించే సుర్మాకు ఎంతో విశిష్టత ఉంది. విధిగా కళ్లకు సుర్మా అలంకరించడం పవిత్ర కార్యంగా భావిస్తారు. సువాసన వెదజల్లే అత్తర్లకు ప్రాధాన్యమిస్తారు. ఇదీ.. సుర్మా ప్రశస్తి.. నిత్యం అల్లాహ్ నామస్మరణలో గడిపే దైవప్రవక్త హజ్రత్ మూసా అలైహిసలా తుస్సలాంకు అల్లా ప్రసన్నం పొంది అతడిని అల్లా ఎక్కడున్నాడో చూపించమని అనునయులు కోరుతారు. దీంతో ఈజిప్టు, సిరియా ప్రాంతాలకు చెందిన పెద్దలను సమీపంలోని కోహితూర్ పర్వతం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఒక్కసారి అల్లాహ్ నూర్ (ఓ వెలుగు)ప్రత్యక్షంకావడం చూసి ఆశ్చర్యానికి గురవుతారు.అప్పుడే కోహితూర్ పర్వతం భస్మమై బూడిదగా(చూర్ణంగా) మారుతుంది. దైవసంకల్పం కళ్లెదుట సాక్షాత్కరించడంతో తమలోని భక్తి ఉప్పొంగి ఆ చూర్ణాన్ని వారు కళ్లకు అద్దుకుంటారు. ఈ సమయంలో తమ కళ్లకు సుదూరంలోని చీమల కదలికలను సైతం పసిగట్టే విధంగా ప్రకాశవంతం కావడం గమనించి అల్లాహ్ కృపవల్లనే సాధ్యపడిందని భావిస్తారు. అప్పటి నుంచి కోహితూర్ పర్వతానికి చెందిన రాళ్ల చూర్ణమే క్రమంగా సుర్మాగా రూపాంతరం చెందిందనేది ముస్లింల ప్రగఢ నమ్మకం. కళ్లకెంతో మేలు..! భక్తితోపాటు వైద్యపరిభాషలోనూ ఈ సుర్మాకు ఆరోగ్యప్రదాయినిగా పేరుంది. కంటికి సంబంధించిన వ్యాధులకు నివారణగా, కళ్లకు చలువగా పనిచేస్తుంది. నమాజ్ చేయడానికి ముందు వజూ ఆచరించాక మహ్మద్ప్రవక్త కంటికి సుర్మా పెట్టుకునే వారని ప్రతీతి. రాత్రివేళ నిద్రపోయేముందు కళ్లకింద సుర్మ రాసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. సుర్మాతో కంటికి సంబంధించిన వ్యాధులు రావని నిరూపి తం కావడంతో ఇతరులు కూడా సుర్మాను రా సుకోవడానికి ఆకర్షితులవుతున్నారు. మహిళలు కళ్లకు కాటుక బదులు సుర్మా వాడడానికి ఇష్టపడుతున్నారు. అతిథులకు సుర్మ, అత్త ర్లు పూయడం ద్వారా గౌరవించే సంప్రదాయాన్ని ముస్లింలు కొనసాగిస్తున్నారు. సుర్మ, అత్తర్ల విక్రయాలు..! అనేక గ్రామాల్లో రంజాన్ సందర్భంగా అత్తర్లు, సుర్మా విక్రయాలకు గిరాకీ ఉంటుంది. దీనికోసం జిల్లాలో పలు అత్తర్లు, సుర్మా అమ్మకాల దుకాణాలు వెలిశాయి. సుర్మా కిలో పొడి ధర రూ.175 నుంచి రూ.550 వరకు ఉంటుంది. వీటిని చిన్న సీసాల్లో నింపి విక్రయిస్తుంటారు. ఇవి రూ10 నుంచి రూ . 100 విక్రయిస్తున్నారు. కంపెనీని బట్టి వీటి ధరలు నిర్ణయిస్తున్నారు. సుర్మాను భద్రపరచడానికి ఆకర్షణీయమైన ఆకారాల్లో సుర్మేన్లు (భరిణె) మార్కెట్లో ఉన్నాయి. వీటి ధర రూ.50 నుంచి రూ.300 వరకు అందుబాటులో ఉన్నాయి. ఇవి చదవండి: HOLI 2024: జీవితం వర్ణమయం -
రంజాన్ స్పెషల్: చిరంజీవిని కలిసిన అలీ..ఫోటోలు వైరల్
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా సినీ నటుడు అలీ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని మెగాస్టార్ ఆకాంక్షించారు. ఇక రంజాన్ పర్వదినాన్ని చిరంజీవితో పంచుకోవడం ఎంతో అందంగా ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. కాగా అలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. -
ముస్లింలకు ఈద్ ముబారక్ తెలుపుతూ సీఎం జగన్ ట్వీట్
-
రంజాన్ సందడి
సాక్షి, చైన్నె: నెలవంక కన్పించడంతో శనివారం రంజాన్ పండుగను జరుపుకునేందుకు రాష్ట్రంలోని ముస్లింలు సిద్ధమయ్యారు. ప్రత్యేక ప్రార్థనలకు మసీదులు ముస్తాబయ్యాయి. ముస్లింలు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో పండుగ సందడి మిన్నంటుతోంది. మహ్మద్ ప్రవక్త సూక్తుల మేరకు పుణ్య కార్యాలకు, సమత మమతలకు నెలవుగా రంజాన్ మాసం నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ మాసంలో నరక ద్వారాలు మూసుకుని, స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయన్నది ముస్లింల నమ్మకం. అందుకే పాప కర్మల నుంచి విముక్తి పొందడానికి ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఈ మాసంలో ఉపవాస దీక్షల్ని (రోజా) ఆచరించారు. పేద, గొప్ప అన్న బేధం లేకుండా అల్లాకు విశ్వాసపాత్రులుగా ఉంటూ సేవల్లో నిమగ్నమయ్యారు. ధాన ధర్మాలు చేస్తూ ఈద్ ముబారక్ వేళకు సన్నద్ధమయ్యారు. నేడు పండుగ.. శుక్రవారం రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో శనివారం పండుగను జరుపుకునే విధంగా ప్రభుత్వ ఖాజీ ప్రకటించారు. దీంతో పరస్పరం ముస్లింలు మసీదుల వద్ద శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఉదయాన్నే పండుగను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. పవిత్ర రంజాన్ కోసం కొత్త బట్టల కొనుగోళ్లను ఇప్పటికే పూర్తి చేశారు. వస్తువుల కొనుగోళ్ల నిమిత్తం షాపింగ్ సెంటర్లకు తరలివచ్చారు. దీంతో ముస్లింలు అత్యధికంగా ఉండే నగరాలు, పట్టణాలు, ప్రాంతాలలో పండుగ వాతావరణం మిన్నంటుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం కొన్ని చోట్ల ఉదయం తొమ్మిది గంటలకు, మరికొన్ని చోట్ల తొమ్మిదిన్నర, పది గంటలకు రంజాన్ ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల ఈద్గా మైదానాల్లో మరికొన్ని మసీదుల్లో ప్రార్థనలు జరగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని మసీదులను విద్యుద్దీప కాంతులతో అలంకరించి ఉండడం విశేషం. మరికొన్ని చోట్ల ఎండ వేడి నుంచి ఉపశమనం కల్గే విధంగా షామియానాలను, పందిళ్లను ఏర్పాటు చేశారు. అలాగే, రంజాన్ రోజున మాంసం విందు కోసం రాష్ట్రంలోని సంతలలో శుక్రవారం ఒక్క రోజు రూ.20 కోట్ల విలువ గల మేకలు, గోర్రెల విక్రయాలు జరిగాయి. ఇదిలా ఉండగా సౌదీ అరేబియాలో శుక్రవారం రంజాన్ పండుగ జరగడంతో ఆ కాలమానాన్ని అనుసరిస్తూ రాష్ట్రంలో కొన్ని మైనారిటీ సంఘాల నేతృత్వంలో ఈద్ ప్రార్థనలు జరిగాయి. నేతల శుభాకాంక్షలు.. రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని ముస్లింలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ప్రధాన ప్రతి పక్ష నేత, అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరుసెల్వం తమ వేర్వేరు ప్రకటనలలో ముస్లింలు అందరూ ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. రంజాన్ ప్రత్యేక ప్రార్థనలతో కుటుంబసమేతంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. ప్రేమానురాగాలు, సోదరభావం, సమానత్వం వికసించాలని ఆకాంక్షించారు. అలాగే డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, పీఎంకే నేత రాందాసు, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, ఎస్ఎంకే నేత శరత్కుమార్, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ నేత ఖాదర్ మొహిద్దీన్, మనిద నేయ మక్కల్ కట్చి నేత జవహరుల్లా, తమిళ మానిల కాంగ్రెస్ అధినేత జీకే వాసన్, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్, చిన్నమ్మ శశికళ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ అళగిరి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. -
రంజాన్ కోసం అలీ దంపతుల ప్రిపరేషన్ చూస్తే కళ్లు చెదరాల్సిందే! ( ఫొటోలు)
-
హైదరాబాద్ అంటే చాలా ఇష్టం
-
రంజాన్: నోరూరిస్తున్న వంటలు.. జోరందుకున్న పాయాషోర్వా
సాక్షి,చార్మినార్: రంజాన్ మాసంలో వంటలు నోరూరిస్తున్నాయి. పాతబస్తీలో సాధారణ రోజుల్లో లభించే నాన్కీ రోటి, పాయాషోర్వా విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. రంజాన్ మాసంలో వీటిని విక్రయించే హోటళ్లు అధికంగా ఉంటాయి. దీంతో ఈ వంటకం కోసం క్యూ కడుతున్నారు. పాతబస్తీ సంస్కృతికి ఆచార వ్యవహారాలకు నాన్కీ రోటి గుర్తుగా నిలుస్తోంది. ఒకప్పుడు కేవలం ముస్లింలు మాత్రమే తినేవారు. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలు లొట్టలేసుకొని మరీ తింటున్నారు. సాధారణ రోజుల్లో చాలా ముస్లిం కుటుంబాలు ఉదయం లేవగానే బ్రేక్ పాస్ట్లో నాన్కీ రోటిని పాయాషోర్వాతో కలిపి తింటారు. ► ఎలాంటి మసాలా దినుసులు, నూనె పదార్థాలు వాడకుండా కేవలం మైదా పిండితో తయారవుతుండటంతో పేదవారి దగ్గర నుంచి సంపన్న వర్గాల వరకు అందుబాటులో ఉంటుంది. ► పర్షియా భాషలో రోటిని ‘నాన్’ అంటారు. 400 ఏళ్ల క్రితమే ఈ వంటకం మనకు అలవాటైంది. ఇరాన్, టర్కీ దేశాలకు చెందిన ఈ ‘డిష్’ అరబ్బు దేశాల నుంచి మన దేశానికి వ్యాపించింది. ► ఎముకలకు బలాన్నిచ్చే పోషక విలువలు అధికంగా ఉండటంతో పాతబస్తీ ప్రజలు ఇష్టంగా తింటారు. ఇక్కడి ప్రముఖ హోటళ్లలో తెల్లవారు జామున 4 గంటల నుంచే అందుబాటులో ఉంటుంది. -
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు నియమ, నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదన్నారు. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించింది రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానధర్మాల ద్వారా ఖర్చు చేస్తారన్నారు. మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపు మాపేందుకు చేసే కఠోర దీక్షే రంజాన్ ఉపవాస దీక్ష అని చెప్పారు. ఈ మేరకు శనివారం సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఉపవాస దీక్షలు ఆచరించబోతున్న ప్రతి ఒక్కరికీ అల్లా దయతో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సీఎం జగన్ శనివారం ట్వీట్ చేశారు. రంజాన్ నెల ప్రారంభమవుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు. నెల రోజులపాటు అత్యంత నియమనిష్టలతో ఉపవాస దీక్షలు ఆచరించబోతున్న ప్రతి ఒక్కరికీ అల్లా దయతో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2022 కాగా, దేశవ్యాప్తంగా నెలవంక కనబడటంతో ఆదివారం నుంచి రంజాన్ నెల ప్రారంభమవుతుందని రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్పాషా ఖుత్తారీ తెలిపారు. హైదరాబాద్లోని మొజాంజాహీ మార్కెట్లోని కమిటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ముస్లింలు ఆదివారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభించాలని సూచించారు -
మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ లౌకికవాద రాష్ట్రంగా విరాజిల్లుతోందని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రంజాన్ మాసంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా, ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకొనేలా ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. రంజాన్ మాసం సమీపిస్తున్న తరుణంలో... మంత్రులు, ఎమ్మెల్యేలు, పలు ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే నెల 3నుంచి మొదలయ్యే రంజాన్ మాసం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, మసీదులు, ఈద్గాలకు మరమ్మతులు చేసి, అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఉపవాస దీక్షల్లో ఉండే వారికి అవసరమైన నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చూడాలని, రాత్రి వేళల్లో హోటళ్లు, దుకాణాలను మూసేయించొద్దని సూచించారు. -
రంజాన్ సందర్బంగా సామూహిక ప్రార్థనలు వద్దని విజ్ఞప్తి
-
తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ వేడుకలు
-
ముస్లిం సోదరులకు సీఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు (ఈద్ ముబారక్) తెలిపారు. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని, కరోనా మహమ్మారి నుంచి బయట పడి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని పేర్కొన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ముస్లిం సోదరసోదరీమణులంతా నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో నిష్టగా అల్లాను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తారని ముఖ్యమంత్రి అన్నారు. అల్లా రక్షణ, కరుణ పొందాలనే లక్ష్యంతో రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని, ప్రతి ఒక్కరూ ఉన్నదానిలో ఎంతోకొంత దానధర్మాలు చేస్తారని, సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకొంటారని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. చదవండి : కోవిడ్ సంక్షోభంలో.. రైతు కష్టమే ఎక్కువ: సీఎం వైఎస్ జగన్ సీఎం జగన్ లేఖతోనే కదలిక -
ఎవరి ఇళ్లలో వారు ప్రార్థనలు చేసుకోవాలి: సీపీ అంజనీ కుమార్
-
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్: డిప్యూటీ సీఎం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ వేడుకలు జరుపుకోవాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. రంజాన్ పండుగపై రూయత్ హిలాల్ కమిటీ కూడా పలు సూచనలు చేసింది. రంజాన్ వేడుకలను శుక్రవారం రోజునే జరుపుకోవాలని కోరారు. మసీదులు, ఈద్గాలలో నలుగురు కంటే ఎక్కువ మంది ప్రార్థనలు చేయొద్దని సూచించారు. -
స్టార్ హీరో సినిమా: థియేటర్లో, ఓటీటీలో ఒకేసారి!
‘రాధే’ అనుకున్నట్టుగానే రంజాన్కు థియేటర్స్లో సందడి చేయనున్నాడు. అయితే ఈ నెల 13న ఒకేసారి ఇటు థియేటర్స్లో అటు ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కానుంది ‘రాధే’. ఓటీటీ డీల్ దాదాపు 230 కోట్లు ఉంటుందని బాలీవుడ్ టాక్. సల్మాన్ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’. గత ఏడాది కరోనా సమయంలో కూడా ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్ వచ్చినా ముంబయ్ థియేటర్స్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అభ్యర్ధనల మేరకు సల్మాన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు ఒకేసారి ఓటీటీ, థియేటర్స్లో సినిమాను విడుదల చేస్తున్నారు. ముంబయ్లో థియేటర్స్ మూతబడటం, ఇంకా ఉత్తర, దక్షిణాదిన కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీటింగ్ వంటివి ‘రాధే’ సినిమాను ఇలా థియేటర్, ఓటీటీలో రిలీజ్ చేయడానికి కారణం అయ్యుంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చదవండి: ‘రంగస్థలం’ తమిళ ట్రైలర్: చిట్టిబాబు చింపేశాడుగా -
మర్కజ్లో ప్రార్థనలకు అనుమతి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని 50 మంది ప్రజలు రోజుకు 5 సార్లు ప్రార్థనలు చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. అయితే, కరోనా నేపథ్యంలో ప్రార్థనా స్థలాలను మూసివేయాలని ఢిల్లీ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(డీడీఎంఏ) జారీ చేసిన నోటిఫికేషన్లో లేదని వివరించింది. చాలా వరకు ప్రార్థనాస్థలాలు తెరిచే ఉంటున్నాయని పేర్కొంది. ఈ విషయంలో కేంద్రం కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలిపింది. డీడీఎంఏ ఈనెల 10వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్, ఇతర ప్రామాణిక కార్యాచరణ నిబంధనలకు లోబడి తమ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ రంజాన్ నెలలో నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంగణంలోని బంగ్లేవాలీ మసీదులోని బేస్మెంట్ పైనున్న మొదటి అంతస్తులో 50 మందికి రోజుకు 5 పర్యాయాలు నమాజ్ చేసుకునేందుకు అనుమతించాలని జస్టిస్ ముక్తా గుప్తా నిజాముద్దీన్ పోలీసులను ఆదేశించారు. డీడీఎంఏ ఉత్తర్వులతోపాటు, సామాజిక, మత, రాజకీయ, ఉత్సవ సంబంధ సమావేశాలను, ప్రజలు గుమికూడటాన్ని అనుమతించే విషయంలో అఫిడవిట్ సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. అయితే, మరింత మందిని అనుమతించాలనీ, మసీదులోని ఇతర అంతస్తుల్లో కూడా ప్రార్థనలు చేసుకునేందుకు వీలు కల్పించాలంటూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు తరఫున న్యాయవాది రమేశ్గుప్తా కోరగా కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా కోర్టు నిరాకరించింది. ఈ మేరకు నిజాముద్దీన్ ఎస్హెచ్వోకు దరఖాస్తు చేసుకోవచ్చనీ, దీనిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. ఇలా ఉండగా, కరోనా లాక్డౌన్ అమల్లో ఉండగా వేలాదిమందితో తబ్లిగీ జమాత్ నిర్వహించిన ఆరోపణలపై గత ఏడాది మార్చి 31వ తేదీ నుంచి మూతబడి ఉన్న నిజాముద్దీన్ మర్కజ్ను తిరిగి తెరిచేందుకు అనుమతివ్వాలంటూ దాఖలైన పిటిషన్పై జూలై 15వ తేదీన విచారణ జరపనున్నట్లు హైకోర్టు తెలిపింది. చదవండి: ‘కుంభమేళా’పై విమర్శల వెల్లువ -
ముస్లిం ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వెసులుబాటు
సాక్షి, అమరావతి: రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. విధుల నుంచి గంట ముందుగా ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 14 నుంచి మే 13 వరకు గంట ముందుగా ఇంటికి వెళ్లే అవకాశం కల్పించింది. రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం.. కోవిడ్ నిబంధనలతో రంజాన్ వేడుకలు నిర్వహించుకోవాలని సూచించింది. చదవండి: ఇ-వ్యవసాయం.. ఒక్క క్లిక్తో సమగ్ర సమాచారం హోంగార్డు భార్య మృతి కేసులో ట్విస్ట్ -
వస్త్రోత్పత్తిపై కరోనా పడగ
సిరిసిల్ల: ‘మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు’ఉంది సిరిసిల్ల నేతన్నల పరిస్థితి’. రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకునేందుకు వివిధ పథకాల్లో వస్త్రోత్పత్తి ఆర్డర్లను ఇస్తోంది. ఈ మేరకు బట్ట ఉత్పత్తి చేస్తూ.. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మికులకు ఉపాధి కల్పిస్తూ.. వస్త్రోత్పత్తి రంగం ముందుకు సాగుతోంది. అంతా సాఫీగానే సాగుతుందని భావిస్తున్న తరుణంలో కోవిడ్–19 మహమ్మారి వస్త్రోత్పత్తి రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. రాష్ట్ర వ్యాప్తంగా 78 వేల మరమగ్గాలు ఉండగా.. ఒక్క సిరిసిల్లలోనే 34 వేల మరమగ్గాలు ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పాలిస్టర్ బట్టను కొనేవారు లేక వస్త్ర పరిశ్రమ కుదేలైంది. ప్రభుత్వం ఇచ్చిన సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), రంజాన్, బతుకమ్మ చీరల ఆర్డర్ల వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. వీటికి సంబంధించిన బిల్లులు అందక వస్త్రోత్పత్తిదారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్లకు మొత్తంగా రూ.150 కోట్ల మేరకు ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది మూలకు పడిన రంజాన్ బట్ట రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లింలకు కానుకగా అందించేందుకు సిరిసిల్లలోని వస్త్రోత్పత్తిదారులకు 26.23 లక్షల మీటర్ల షర్టింగ్ బట్టకు ఆర్డర్లు ఇచ్చారు. 2020 జనవరి 3వ తేదీన ఆర్డర్లు ఇచ్చిన జౌళిశాఖ అధికారులు.. ఫిబ్రవరి 20లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రంజాన్ బట్టను వస్త్రోత్పత్తిదారులు తయారు చేశారు. 10 లక్షల మీటర్ల బట్టను కొనుగోలు చేశారు. మరో 16.23 లక్షల మీటర్ల బట్ట కార్ఖానాల్లోనే ఉంది. ఈలోగా కరోనా లాక్డౌన్ రావడంతో సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్లో ఉత్పత్తి చేసిన రంజాన్ బట్ట నిల్వలు పేరుకుపోయాయి. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి నూలు, కొనుగోలు చేసి, కార్మికులకు కూలి చెల్లించి అమ్మకానికి సిద్ధంగా ఉన్న బట్టను జౌళిశాఖ కొనుగోలు చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వం రంజాన్ పండుగకు కొత్త బట్టలను పంపిణీ చేయలేదు. దీంతో సుమారు రూ.5.40 కోట్ల విలువైన నిల్వలు సిరిసిల్లలో ఉన్నాయి. ఎస్ఎస్ఏది అదే కథ సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ)లో 1.30 కోట్ల మీటర్ల బట్టను ఉత్పత్తి చేసేందుకు ఆర్డర్లు ఇచ్చారు. వస్త్రోత్పత్తిదారులు ఆ మేరకు బట్ట ఉత్పత్తి చేశారు. పాఠశాలలు తెరిచే నాటికే విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ అందించాలని ప్రభుత్వం భావించి ముందే ఆర్డర్లు ఇచ్చింది. దీంతో ఉత్సాహంగా ఎస్ఎస్ఏ బట్ట ఉత్పత్తి అయింది. రూ.50 కోట్ల విలువైన బట్ట ఉత్పత్తి చేశారు. ఆరు నెలల కిందట ఈ బట్టను కొనుగోలు చేసిన జౌళిశాఖ ఇటీవల రూ.30 కోట్ల మేరకు చెల్లించింది. ఇంకా రూ.20 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉంది. సంక్షేమ శాఖలకు సంబంధించి బట్టల బిల్లులు సైతం రూ.3 కోట్ల మేరకు ఇలాగే పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఇప్పుడు బతుకమ్మ చీరల ఉత్పత్తి పెట్టుబడిగా వస్త్రోత్పత్తిదారులు అప్పులు చేయాల్సి వస్తుంది. సిరిసిల్లలో ఏడు కోట్ల మీటర్ల బతుకమ్మ చీరల బట్టకు ఆర్డర్లు ఇవ్వగా దీని విలువ రూ.350 కోట్లు. 25 వేల మరమగ్గాలు, వెయ్యి ఆధునిక ర్యాపియర్ మగ్గాలపై 225 రంగుల్లో బతుకమ్మ చీరల ఉత్పత్తి సాగుతోంది. మంత్రి కేటీఆర్ వస్త్రోత్పత్తి ఆర్డర్ల బిల్లులు ఇప్పించాలని వస్త్రవ్యాపారులు కోరుతున్నారు. రూ. 30 కోట్లు ఇచ్చాం రంజాన్కు సంబంధించి కొనుగోలు చేసిన వస్త్రానికి ఇటీవల రూ.30 కోట్లు ఇచ్చాం. బతుకమ్మ చీరలను ఇప్పుడే సేకరిస్తున్నాం. దానికి ఎప్పటిలాగే పేమెంట్ ఇస్తాం. వస్త్రం క్వాలిటీ కంట్రోల్ నివేదిక వచ్చిన తరువాత గతంలో కొనుగోలు చేసిన వస్త్రాలకు సంబంధించి జీఎస్టీ బిల్లులను చూసి 10 శాతం బిల్లులను అందరికీ క్లియర్ చేస్తాం. బట్టను తీసుకున్న ఆయా ప్రభుత్వ శాఖల నుంచి ఇంకా బిల్లులు రావాల్సి ఉన్నాయి. అవి రాగానే అన్నింటినీ క్లియర్ చేస్తాం. –శైలజా రామయ్యర్, జౌళిశాఖ డైరెక్టర్ -
తెల్లని కుర్తాలో మెరిసిన సానియా
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన వ్యక్తిగత , వృత్తిగత విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేసి అభిమానులను అలరిస్తారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఆమె తన కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్తో దిగిన ఓ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘రంజాన్ ఈద్ పండగ వేడుకలు’ అంటూ ఆమె క్యాప్షన్ జత చేశారు. కరోనా నేపథ్యంలో రంజాన్ పండుగను సానియా ఇంట్లోనే జరుపుకున్నారు. ఇక ముస్లిం సాంప్రదాయ వేషాధారణలో తెల్లని కుర్తాను ధరించిన సానియా.. ‘చాలా అందంగా కనిపిస్తున్నారు’అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సానియా ముద్దుల కొడుకు ఇజాన్స్ కూడా సంప్రదాయ దుస్తుల్లో క్యూట్గా ఉన్నాడు. ‘లాక్డౌన్ సమయంలో నేను మా కుంటుంబ సభ్యులతో ఇంట్లోనే ఉంటూ రంజాన్ పండగ జరుపుకుంటున్నాను. దయ చేసి మీరు కూడా ఇంట్లోనే ఉండాలి’ అని సానియా మరో ట్వీట్లో అభిమానులకు విజ్ఞప్తి చేశారు. Eid vibes 🌙🤲🏽 #MyIzzy pic.twitter.com/O9BmeUBjql — Sania Mirza (@MirzaSania) May 25, 2020 -
ముస్లిం సోదరులకు ఏపీ గవర్నర్ శుభాకాంక్షలు
సాక్షి, రాజ్భవన్: క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికనే రంజాన్ పర్వదినం అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆయన ఆదివారం రాజ్భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం ‘ఈద్ ఉల్ ఫితర్’ ముగిసిన శుభవేళ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఖురాన్ బోధనలు యుగ యుగాలుగా మానవాళిని ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. రంజాన్ మాస పవిత్రతతో ప్రతి వ్యక్తి మానసిక పరివర్తన చెంది ప్రేమమూర్తిగా మారుతాడని ఆయన అన్నారు. రంజాన్ మాసంలో ఆధ్యాత్మిక ఆరాధనతో అనుబంధం మరింత బలపడుతుందని గవర్నర్ చెప్పారు. క్రమశిక్షణను అనుసరిస్తూ శాంతి, సౌభ్రాతృత్వాన్ని లోకానికి చాటడంలో రంజాన్ మాసం ప్రత్యేకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కఠోర ఉపవాసవ్రతం సహనాన్ని పెంచుతుందని గవర్నర్ తెలిపారు. సర్వమానవాళి సమానత్వాన్ని చాటుతూ, దాతృత్వాన్ని అలవరచే పండుగ రంజాన్ అని ఆయన చెప్పారు. రంజాన్ పండుగ వేళ ఇస్లాంను గౌరవించే ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిసస్తునన్నానని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. -
రంజాన్ ప్రార్థనల్లో బుడ్డోడు.. నెటిజన్లు ఫిదా
-
రెడ్ టీ-షర్టు బుడ్డోడు భలే ఉన్నాడు..
ప్రపంచంలో కల్మషం లేని మనుషులు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్లు పిల్లలు మాత్రమే. చిన్నారులు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది. మురిపాల మూటలు కడుతూ నిర్మలమైన హృదయం కలిగి ఉండే పిల్లలను ప్రేమించనివాళ్లు ఒక్కరు కూడా ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం అలాంటి ఓ పిల్లాడి చేష్టలు నెటిజన్లకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ప్రస్తుతం కరోనా కట్టడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో నిత్యావసరాల కోసం మినహా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా సామూహిక ప్రార్థనలు, బహిరంగ సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి లేదు. ప్రతి ఒక్కరు విధిగా సామాజిక ఎడబాటు పాటించాల్సిందే.(సమ్మేళన ప్రార్థనలకు దూరంగా ఉండండి) ఇక ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ముస్లింలందరూ ఇంట్లోనే ప్రార్థన చేసుకోవాలని మత పెద్దలు, ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ క్రమంలో తమ ఇంట్లోని పెద్దలు నమాజ్ చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన పిల్లాడు తాను సైతం ప్రార్థన చేసేందుకు ఉపక్రమించాడు. రెడ్ టీ షర్టు, నిక్కరు వేసుకున్న ఆ చిన్నారి... తనతో పాటు ఓ డైనోసర్ బొమ్మను తీసుకొచ్చి.. ప్రార్థన చేయాలన్నట్లుగా దాని మెడలు వంచుతూ కెమెరాకు చిక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరినీ ఆకర్షిస్తోంది. బుడ్డోడు భలే ఉన్నాడు అంటూ అతడి చేష్టలకు నెటిజన్లు ఫిదా అవుతూ రంజాన్ శుభాకాంక్షలు చెబుతున్నారు.(నాన్న..ఇంకెంత దూరం!) -
ప్రార్థనా మందిరాలకు వెళ్లకండి
-
ముస్లింలకు అసదుద్దీన్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: పవిత్ర రంజాన్ ప్రార్థనలను ఇళ్లలోనే చేసుకోవాలని ముస్లింలకు ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం వరకు కర్ఫ్యూ ఉంటుంది కాబట్టి బయట తిరిగేందుకు ఎవరినీ అనుమతించరని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇళ్ల వద్ద కూడా సమ్మేళన ప్రార్థనలకు దూరంగా ఉండాలని కోరారు. పేదలు ఎవరూ ఆకలితో ఉండకుండా చూడాలని, ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం అతిపెద్ద ధర్మమని ఆయన అన్నారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. మొత్తం లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత కొన్ని ఆర్థిక కార్యకలాపాలను అనుమతించాలి కోరారు. సినిమా హాల్స్, బహిరంగ సభలపై ఆంక్షలు కొనసాగించాలన్నారు. (అందరికీ న్యాయం జరగడం ముఖ్యం అంటున్న అఖిలేశ్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రణాళిక లేకుండా లాక్డౌన్ విధించారని.. ఇది పేదలు, వలస కూలీలకు తీవ్ర ప్రభావం చూపిందన్నారు. వలస కార్మికులను ఆదుకోవడం కేంద్రం విఫలమైందని ధ్వజమెత్తారు. రేషన్ కార్డులు, బ్యాంకు ఖాతాలు లేని వారికి ప్రభుత్వ సహాయం అందలేదని తెలిపారు. ఈ సంక్షోభం కారణంగా 10 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవచ్చని, ఈ సమస్యను పరిష్కరించే ప్రణాళికను ప్రధాని వెల్లడించాలని డిమాండ్ చేశారు. 90 శాతం వలసదారులకు ప్రభుత్వ రేషన్ రాలేదని, 90 శాతం మందికి జీతాలు ఇవ్వలేదని ఒక సర్వేలో తేలినట్టు వెల్లడించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) గిడ్డంగులలో ఉన్న బియ్యాన్ని పేద, వలస కూలీలకు పంపిణీ చేయాలని సూచించారు. శానిటైజర్ల తయారీకి బియ్యాన్ని ఉపయోగించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఆయన విమర్శించారు. కోవిడ్ -19 నుంచి కోలుకున్న వారందరూ రెడ్క్రాస్కు రక్తదానం చేయాలని, ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా బాధితులను కాపాడటానికి ఇది తోడ్పడుతుందని తెలిపారు. చదవండి: కరోనా మహమ్మారిపై పోరులో అదే కీలకం -
‘భౌతిక దూరాన్ని పాటిస్తూ, ప్రార్థనలు చేయండి’
న్యూఢిల్లీ : ప్రభుత్వం ఇచ్చే సూచనలను పాటిస్తేనే కరోనా మహమ్మారిని సంపూర్ణంగా అరికట్టవచ్చని ఢిల్లీలోని జామా మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్ననేపథ్యంలో ఇంటి వద్దే భౌతిక దూరాన్ని పాటిస్తూ, ప్రార్థనలను చేయాలని పిలుపునిచ్చారు. వీటిని అనుసరించడం ద్వారా ప్రతి ఒక్కరిని రక్షించుకోగలుగుతామని పేర్కొన్నారు. -
ఈద్ స్ఫూర్తిని కొనసాగించాలి
‘ఈద్’ ముగిసి నాలుగు రోజులు గడిచి పొయ్యాయి. నెలరోజులపాటు ఆరాధనలు, సత్కార్యాలు, సదాచారాల్లో మునిగి తేలిన ముస్లిం సమాజం, తమకంతటి పరమానందాన్ని పంచిన పవిత్ర రమజాన్ మాసానికి ఘనంగా వీడ్కోలు పలికింది. అయితే ఈద్ ముగియడంతోనే శుభాల పర్వానికి తెరపడకూడదు. రమజాన్ నెల్లాళ్ళూ మస్జిదులు ఏ విధంగా కళకళలాడాయో, అలాగే రమజాన్ తరువాత కూడా నమాజీలతో కళకళలాడేలా చూడాలి. రమజాన్లో కనిపించిన సేవాభావం, దాతృస్వభావం, న్యాయబద్దత, ధర్మశీలత, వాగ్దానపాలన, ప్రేమ, సోదరభావం, సహనశీలత, పరోపకారం, క్షమ, జాలి, దయ, త్యాగభావం రమజాన్ అనంతరమూ ఆచరణలో ఉండాలి. అసత్యం, అబద్ధం పలకకపోవడం, అశ్లీలానికి పాల్పడక పోవడం, చెడు వినకపోవడం, చూడకపోవడం, సహించకపోవడంతోపాటు, అన్నిరకాల దుర్గుణాలకు దూరంగా ఉండే సుగుణాలు నిరంతరం కొనసాగాలి. తొలకరి జల్లుతో బీడువారిన పుడమి పులకించినట్లు, రమజాన్ వసంతాగమనంతో నైతిక వర్తనంలో, ఆధ్యాత్మిక ప్రగతిలో గణనీయమైన వృద్ధీవికాసాలు జరిగాయి. అనూహ్యమైన మానవీయ పరివర్తనకు బీజం పడింది. ఇప్పుడది నిలబడాలి, నిరంతరం కొనసాగాలి ఈ వృద్ధీ వికాసాలు ఒక్క నెలకే పరిమితం కాకూడదు. మనిషిని మనీషిగా మార్చడానికే ఈ శిక్షణకు ఏర్పాటు చేసింది ఇస్లాం. నిజానికి ఇస్లాం బోధనలు చాలా సరళం, సంపూర్ణం, సమగ్రం, స్పష్టం, స్వచ్ఛం, నిర్మలం. మానవులు వీటిని ఆచరిస్తే, అనుసరిస్తే నైతిక, ఆధ్యాత్మిక, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ రంగాలన్నిటినీ సమన్వయ పరచగలరు. వీటిమధ్య ఒక సమతుల్యతను సాధించగలరు. ఈ రంగాలన్నింటా దైవాభీష్టానికి అనుగుణంగా నడుచుకోవడం ద్వారా ప్రతి పనినీ ఆరాధనగా మలచుకోగలరు. మానవుల ప్రతి పనినీ ఆరాధనా స్థాయికి చేర్చిన ధర్మం ఇస్లాం. అందుకే పవిత్ర రమజాన్ నెలలో వారి శిక్షణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ధర్మం. ఇక దాన్ని సద్వినియోగం చేసుకోవడమైనా, దుర్వినియోగం చేసుకోవడమైనా మన చేతుల్లోనే ఉంది. అందుకని రమజాన్ స్పూర్తిని కొనసాగించాలి. అప్పుడే రోజాల ఉద్దేశ్యం నెరవేరుతుంది. పండుగ ఆనందానికి పరమార్ధం చేకూరుతుంది. భావిజీవితాలు సుఖ సంతోషాలతో గడిచిపోతాయి. సమాజంలో శాంతి, సామరస్యం వెల్లివిరుస్తుంది. దోపిడీ, పీడన, అణచివేత, అసమానతలు లేని చక్కని ప్రేమపూరితమైన సుందరసమాజం ఆవిష్కృతమవుతుంది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
రెడ్మి నోట్ 7 ప్రొ రంజాన్ సేల్
సాక్షి, న్యూఢిల్లీ : రంజాన్ పర్వదినం సందర్భంగా షావోమి స్పెషల్ సేల్ నిర్వహిస్తోంది. రెడ్మి నోట్ 7 ప్రొ స్మార్ట్ఫోన్ను ఈద్ స్పెషల్గా ప్రత్యేకంగా విక్రయిస్తోంది. బుధవారం సాయంత్రం నాలుగు గంటలనుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. ఎంఐ.కామ్, ఫ్లిప్కార్ట్లో ఈ సేల్ మొదలవుతుంది. 48 మెగాపిక్సల్ భారీ కెమెరా, ఏఐ ఫేస్ అన్లాక్ ఫీచర్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటివి ప్రధాన ఫీచర్లు. ముందు ప్రకటించిన ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 12గంటలకు సేల్ మొదలు కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమయిందని షావోమి ఇండియా సీఈఓ మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు. రెడ్మీ నోట్ 7 ప్రొ ఫీచర్లు 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9.0 పై 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, 48+5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 13 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ 4 జీబీ ర్యామ్/ 64 జీబీ స్టోరేజ్ : ధర రూ. 13,999 6 జీబీ ర్యామ్/ 128 జీబీ స్టోరేజ్ : ధర రూ. 16,999 Mi fans, here's your Eidi. #RedmiNote7Pro on special sale. Get the amazing #48MPCameraBeast at 4PM from @Flipkart. pic.twitter.com/LSiihtSKxh — Redmi India (@RedmiIndia) June 5, 2019 -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రంజాన్ వేడుకలు
-
దేశవ్యాప్తంగా మసీదులు దగ్గర ప్రార్ధనలు
-
దేవుడి స్క్రిప్టు గొప్పది
సాక్షి, అమరావతి: దేవుడు ఏం చేసినా చాలా గొప్పగా, ఆశ్చర్యపోయేలా చేస్తాడని, గొప్పగా స్క్రిప్టు రాస్తాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. రంజాన్ మాసంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తాను తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని మించి మెరుగైన పాలన అందించేలా ముస్లిం సోదరులు దువా చేయాలని కోరారు. సోమవారం గుంటూరులోని పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన తొలి అధికారిక కార్యక్రమమైన ‘ఇఫ్తార్ విందు’లో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ముస్లిం సోదరుల ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో పాల్గొని చాలాసేపు వారితో ఆత్మీయంగా గడిపారు. పవిత్ర రంజాన్ మాసంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మహ్మద్ ఇక్బాల్కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ముస్లిం సోదరుల హర్షధ్వానాల మధ్య జగన్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఐదుగురు ముస్లింలకు అసెంబ్లీ టికెట్లు ఇస్తే నలుగురు విజయం సాధించారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే... అస్సలామ్ అలైకుమ్... ‘ఈరోజు రంజాన్ శుభమాసంలో ముస్లిం సోదరుల మధ్య ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ సందర్భంగా నేను ఒకటి మనవి చేయదల్చుకున్నా. దేవుడు ఏం చేసినా కూడా ఆశ్చర్యంగా, గొప్పగా జరిగింది అనిపించే విధంగా చేస్తాడు. దేవుడు ఎంత గొప్పగా పని చేస్తాడు, ఆయన స్క్రిప్టు రాస్తే ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడానికి మొట్ట మొదటి ఉదాహరణ ఇది... ఐదేళ్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలనను మీరంతా చూశారు. ఆ సమయంలో అక్షరాలా 67 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉంటే... 23 మంది ఎమ్మెల్యేలను అన్యాయంగా, డబ్బులిచ్చి ప్రలోభాలకు గురి చేసి కొనుగోలు చేశారు. అందులో నలుగురిని ఏకంగా మంత్రులనే చేశారు. ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే వాళ్లను అనర్హులుగా చేయాలి. లేదా వారి చేత రాజీనామాలు చేయించి ఎన్నికల్లో వాళ్ల పార్టీ గుర్తు మీద మళ్లీ గెలిపించుకుని శాసనసభకు తెచ్చుకోవాలి. కానీ ఇవేమీ జరగలేదు. మన కళ్ల ముందే అన్యాయం, అధర్మం కనిపించింది. అన్ని రకాల మోసాలు, అబద్ధాలు కనిపించాయి. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ టికెట్తో 9 మంది ఎంపీలు గెలిస్తే ముగ్గురిని ఇదే మాదిరిగా కొనుగోలు చేశారు. రంజాన్ మాసంలోనే... గత నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అది కూడా రంజాన్ మాసంలోనే. ఇక టీడీపీకి వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య అక్షరాలా 23, ఆ పార్టీకి వచ్చిన ఎంపీ సీట్లు 3. ఫలితాలు వచ్చింది రంజాన్ మాసంలో మే 23వ తేదీన. ఇంత కన్నా గొప్ప స్క్రిప్టు మరెవరూ రాయలేరు. అదొక్క దేవుడు మాత్రమే రాయగలుగుతాడు. రంజాన్ శుభమాసంలోనే జగన్ అనే నేను మీ అందరి చల్లని దీవెనలతో, దేవుడి ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశా. మళ్లీ రంజాన్ మాసంలోనే ముఖ్యమంత్రిగా నా మొట్టమొదటి అధికార కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలోనే ప్రారంభించి ఈ శుభ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నా. ఆ దేవుడి గొప్పతనానికి ఇంత కన్నా ఉదాహరణలు అవసరం లేదు’’ పెద్ద ఎత్తున హాజరైన ముస్లింలు.. ఇన్షా అల్లాహ్... ఈద్ ముబారక్ ఇన్ అడ్వాన్స్ ... మీ అందరికీ అభినందనలు అంటూ సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం మౌలానా ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ఇఫ్తార్కీ దువా, ఉపవాస దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, షేక్ అంజాద్బాష, మహ్మద్ ముస్తఫా, హఫీజ్ఖాన్, నవాజ్బాష సీఎం వైఎస్ జగన్కు ఖర్జూరం తినిపించారు. జగన్ కూడా వారికి ఖర్జూరం తినిపించారు. అనంతరం మగరీబ్కీ నమాజ్లో వైఎస్ జగన్ ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు. జగన్కు రుణపడి ఉన్నా: ఇక్బాల్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తాను సర్వదా రుణపడి ఉంటానని మాజీ పోలీసు అధికారి, హిందూపురం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. ఎన్నికల్లో తాను ఓటమి పాలైనప్పటికీ ఆదరించి ఎమ్మెల్సీని చేస్తామని సీఎం వైఎస్ జగన్ రంజాన్ మాసంలో ప్రకటించడం తనకు నిజంగా శుభవార్త అని తెలిపారు. వైఎస్ జగన్ సుదీర్ఘకాలం రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తారని తనకు సంపూర్ణంగా విశ్వాసం ఉందని చెప్పారు. మున్సిపల్ కార్మికుల కష్టాలపై ముఖ్యమంత్రి ఆరా! ఇఫ్తార్ విందు ముగించుకుని బయటకు వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్కడ కనిపించిన మున్సిపల్ కార్మికులను పిలిపించి మాట్లాడారు. వారి జీత భత్యాలపై ఆరా తీశారు. ‘జీతాలు ఏమేరకు పెరగాలని ఆశిస్తున్నారు’ అని అడిగారు. ముఖ్యమంత్రి ఇలా తమను పిలిచి మాట్లాడడంతో వారు ఉబ్బితబ్బిబ్బయ్యారు. పాదయాత్ర సమయంలోనూ పలుచోట్ల మున్సిపల్ కార్మికులు కలిసి తమ కష్టాలు ఏకరువు పెట్టారని సీఎం గుర్తుచేసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. ఏపీ భవన్లో ఇఫ్తార్ విందు సాక్షి, న్యూఢిల్లీ: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సోమవారం ఢిల్లీలోని ఏపీ భవన్లో ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు హస్తినలోని ముస్లిం ప్రముఖులతోపాటు పలు దేశాల భారత రాయబార కార్యాలయాల ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా సాయంత్రం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దువా చేశారు. ఇఫ్తార్ అనంతరం మగ్రీబ్ నమాజ్ చేశారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది ఇఫ్తార్ విందు ఏర్పాట్లను ఘనంగా చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో ఇఫ్తార్ విందు ఇస్తుండగా వారి ఆదేశాల మేరకు ఢిల్లీలో కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంప్రదాయ తెలుగు పండుగలతోపాటు ముస్లిం, క్రిస్టియన్స్ పండుగలను ఏటా ఏపీభవన్లో ఘనంగా నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా రంజాన్ మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఇచ్చినట్టు చెప్పారు. సర్వ మానవ సౌభ్రాతృత్వానికి, శాంతి సామరస్యానికి రంజాన్ పండుగ ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఇఫ్తార్ విందులో రిపబ్లిక్ ఆఫ్ పనామా దేశ రాయబారి ముహమ్మద్ తల్హా హాజీ, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ దేశ రాయబార కార్యాలయ ప్రతినిధి అసఘర్ ఒమిది, మారిషస్ హై కమిషనర్ సీవరాజ్ నుందులాల్, పలువురు సీనియర్ ఐఏఎస్లు, ఇస్లామిక్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు. హజరత్ నిజాముద్దీన్ ఆలియా జాఫ్ఫాదా నషీన్ దర్గా ప్రముఖ ఇమామ్ సయెద్ జోహాబ్ నిజామి ఆధ్వర్యంలో మగ్రీబ్ నమాజ్ చేశారు. -
మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట
సాక్షి, సిద్దిపేట: పేద ముస్లిం మైనార్టీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకొని శుక్రవారం సిద్దిపేట మదీనా మసీద్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హరీశ్రావు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల్లో అన్ని మతాలు, కులాలు ఇమిడి ఉన్నాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలందరి అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు. పేద ముస్లిం అమ్మాయిల పెళ్లికి పెద్దన్నగా షాదీ ముబారక్ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందచేస్తున్న ముఖ్యమంత్రికి దేశవ్యాప్తంగా ప్రశంసలువచ్చాయని గుర్తు చేశారు. ముస్లింలకు హజ్యాత్ర ఎంతో ముఖ్యమైనదని, దీనిని గౌరవించిన ప్రభుత్వం ప్రతీ సంవత్సరం పలువురు ముస్లింలను హజ్ యాత్రకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే వారికోసం ప్రత్యేకమైన గురుకులాలు ఏర్పాటు చేశామని అన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. అందరి సహకారంతోనే మరోసారి ఎంపీగా ఎన్నికయ్యానని కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని మతాలు సుభిక్షంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జేసీ పద్మాకర్ తదితరులు పాల్గొన్నారు. -
నిలబడే ఉన్నారా!?
ఒకసారి ప్రవక్త ముహమ్మద్ (స) ఏదో పని మీద బజార్ వెళుతున్నారు. అంతలో ఒక వ్యక్తి కనబడి, ‘ఓ ప్రవక్త (స) మీతో కాస్త పని ఉంది ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను’ అని వెళ్లాడు.‘‘అలాగే తొందరగా రా’’ అని ప్రవక్త అక్కడే నిలబడ్డారు.వెళ్ళిన వ్యక్తి ఆ విషయం మరచిపోయాడు.ఇచ్చిన మాట ప్రకారం ప్రవక్త (స) చాలా సేపు అలాగే నిరీక్షిస్తూ నిలబడ్డారు. చాలాసేపటికి మళ్ళీ ఆ వ్యక్తి అటుగా వచ్చి, ‘‘అయ్యో! మీరు ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నారా? క్షమించండి. నేను ఈ విషయం మరిచే పోయాను’’‘‘ఇచ్చిన మాట తప్పితే శిక్ష ఏమిటో తెలుస్తే, నువ్వు కూడా ఎన్ని రోజులైనా ఇలాగే నిలబడి ఉంటావు తెలుసా?’’ అన్నారు. ‘‘మీరు చేసే అర్థం లేని ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు. కాని మీరు బుద్ధిపూర్వకంగా చేసే ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నిస్తాడు. ప్రమాణ భంగానికి పరిహారం ఏమిటంటే మీరు మీ ఆలుబిడ్డలకు తినిపించే మామూలు భోజనం పదిమంది పేదలకు పెట్టడం లేదా వారికి కట్టుబట్టలు ఇవ్వడం లేదా ఒక బానిసను స్వతంత్రునిగా చెయ్యడం. ఈ స్తోమత లేనివారు మూడు రోజులపాటు ఉపవాసం ఉండాలి. మీరు ప్రమాణం చేసి భంగపరిస్తే, మీ ప్రమాణాలకు పరిహారం ఇది. మీరు మీ ప్రమాణాలను కాపాడుకోండి.’(ఖురాన్:5:89)మనిషి సంఘజీవి. సమాజంలో ఒకరిమీద మరొకరికి నమ్మకం లేకపోతే మనుషులు నమ్మకంతో సత్సంబంధాలు కలిగి జీవించడం కష్టం. అందుకే మాట ఇచ్చేముందు ఆలోచించి ఇవ్వాలని, వాగ్దానం చేసే ముందు ‘ఇన్షాల్లహ్’ అంటే అల్లాహ్ తలిస్తే అని అనాలని ప్రవక్త (స) తెలిపారు.నిజమే కదా. ఏ క్షణాన మృత్యువు కౌగిట్లోకి ఒదిగిపోతామో మనకు తెలియదు. మాట ఇచ్చి, నెరవేర్చకుండా మరణిస్తే? రేపు పరలోకంలో పట్టుబడిపోతాం. జవాబు దారితనాన్ని పటిష్టం చేసుకోవడానికే కదా ఈ రమజాన్లో కఠోర ఉపవాస దీక్ష పాటిస్తున్నాం. కనుక వాగ్దానం చేసి మరచిపోకుండా ఉండేందుకు కూడా ప్రయత్నం చేయాలి. –షేక్ అబ్దుల్ బాసిత్ -
అసలు సంపద
ఒక వ్యక్తి హజ్రత్ జునైద్ బొగ్దాదీ(ర)వద్దకువచ్చి: ‘‘అయ్యా.. నేనొక నిరుపేదను. పేదరికం కారణంగా ఎవరికీ ఏమీ సాయం చేయలేక పోతున్నాను. దీనికి కారణం ఏమిటీ?’ అని ప్రశ్నించాడు. దానికి జునైద్ బొగ్దాదీ, ‘‘నువ్వు దానధర్మాలు చేస్తావా? ఇతరుల పట్ల ఉదారబుద్ధితో వ్యవహరిస్తావా?’’ అని ఎదురు ప్రశ్నించారు. దానికతను చిన్నబుచ్చుకుని‘‘అయ్యా.. నేనే నిరుపేదను. ఆ కారణంగానే ఏమీ చేయలేక పోతున్నానన్నదే నా బాధ. దానధర్మాలు చేయడానికి, ఉదారంగా వ్యవహరించడానికి నా దగ్గరేముందని?’’ అన్నాడా వ్యక్తి.‘‘అదేమిటీ అలా అంటావు? నీ దగ్గర గొప్ప సంపద ఉంది. పరులతో పంచుకోగల నిధులున్నాయి నీ దగ్గర’ అన్నారు బొగ్దాదీ. ఆ వ్యక్తి ‘‘అయ్యా.. నేను చాలా చిన్నవాణ్ణి. నన్ను ఆట పట్టించకండి.’’ అన్నాడు.‘‘అయ్యయ్యో..! ఆట పట్టించడం కాదు. ఇది నిజం. నేను చెబుతా విను.’’ అంటూ..‘‘నీ దగ్గర ఉన్న గొప్ప సంపద నీ ముఖారవిందం. ఎంత పేదరికమైనా, ఎన్ని కష్టాలొచ్చినా ముఖంపై చిరునవ్వును చెదరనీయకు. ఇతరులను చిరునవ్వుతో పలకరించడం ఆరాధనతో సమానం అన్నారు మన ప్రవక్త. దీనికోసం ధనం అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం. ఇది ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది.రెండవది కళ్ళు. ఇవి లక్షలాదిమందిని ప్రభావితం చేస్తాయి.ఆ కళ్ళతో ఒక్కసారి అమ్మ వైపు ప్రేమతో చూస్తే ఒక హజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది.’మూడవది నోరు. నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది. ధనం లేకపోయినా పరవాలేదు. నోరు బాగుంటే చాలు. అంతేకాదు, నోటితో ఇతరులకు మంచిని బోధించవచ్చు. మంచిని చర్చించవచ్చు. దాన్ని విలువైనదిగా భావించు. ఆనందం, సానుకూలత వ్యాప్తి చెందుతాయి.నీ దగ్గరున్న మరో నిధి నీ మనసు. మంచి ఆలోచనలతో ఉదయాన్ని ప్రారంభిస్తే, ప్రశాంతత నీ సొంతమవుతుంది. మానసిక ప్రశాంతత ప్రాప్తమైతే నీ అంత ధనవంతుడు మరెవరూ ఉండరు. తద్వారా ఇతరుల ఆనందంలో, కష్టసుఖాల్లో పాలుపంచుకోవచ్చు. వారి జీవితాలను తాకొచ్చు.మరో గొప్ప సంపద నీ శరీరం. దాంతో ఇతరులకు అనేక మంచిపనులు చేయవచ్చు. అవసరమైన వారికి సహాయం అందించవచ్చు. సహాయం చెయ్యడానికి డబ్బులే అవసరం లేదు. మంచి మనసుంటే చాలు. ఇప్పుడు చెప్పు నువ్వు పేదవాడివా?’’ అన్నారు జునైద్ బొగ్దాదీ రహ్మతుల్లా అలై.ఈ మాటలు విన్న ఆ వ్యక్తి పరమానందభరితుడై, ఆత్మ సంతోషంతో, ఆత్మవిశ్వాసంతో పెద్దపెద్ద అంగలు వేసుకుంటూ ముందుకు సాగిపొయ్యాడు. – తస్లీమ్ -
బంగారంలాంటి ఉపవాసం
‘‘సమాధిలో కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటి. హాజీసాబ్ కు ఏమీ అర్థంకాక తలపట్టుకుని కూర్చున్నారు. అంతలో ఒక దైవదూత వచ్చి ‘‘హాజీ సాబ్ మీరు చేసిన నమాజులు, సత్కార్యాలేమీ మీ మన్నింపుకోసం సరితూగడం లేదు.’’ అంది.‘‘నా జీవితంలో మూడు సార్లు హజ్ యాత్ర చేశాను గదా’’ అన్నాడు.‘‘అందులో రెండు హజ్లు మీ సొంత డబ్బుతో చేయలేదు. ఒక హజ్ మాత్రం లోపభూయిష్టంగా ఉంది’’ అంది దైవదూత. దైవదూత చెప్పిన ఈ మాటలకు హాజీసాబ్ లో ఆందోళన మరింత ఎక్కువయ్యింది. ‘‘మీ దగ్గర ఉపవాసాలేమైనా ఉన్నాయా?’’ అని దైవదూత ప్రశ్న.‘‘నా దగ్గర మొత్తం నలభైఏళ్ల పాటు పాటించిన ఉపవాసాలున్నాయి’’ అని ఎంతో ఆతృతతో చెప్పారు హాజీసాబ్. దైవదూతఒక్కో ఉపవాసాన్ని పరిశీలనగా చూసింది. 40 ఏళ్లపాటు పాటించిన ఉపవాసాల్లో ఒక్క ఉపవాసమూ లోపరహితంగా లేదని తేలింది.‘ఉపవాసంలో చాడీలు, పరనింద, అబద్ధం మానుకోలేకపోయానని. నలభైఏళ్లపాటు పాటించిన ఉపవాసాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయని’ అప్పటికే కుమిలిపోతున్నారు హాజీసాబ్.‘‘హాజీ సాబ్ మీకు శుభాకాంక్షలు..’’ అంటూ దైవదూత సంతోషంగా అభినందనలు అని చెప్పడంతో హాజీసాబ్కు ప్రాణం లేచి వచ్చినట్లయింది.‘‘నా దగ్గర ఉన్న రికార్డును తీక్షణంగా పరిశీలిస్తే మీ కర్మల చిట్టానుంచి బంగారపు ఉపవాసం ఒకటి కనబడింది’’ అంది దైవదూత. ‘‘బంగారపు ఉపవాసమా? నేనెప్పుడూ దాన్ని పాటించలేదే’’ అని హాజీసాబ్ దైవదూత వైపు ఏమీ అర్థం కానట్లు చూశారు.‘మీరు ఏటా రమజాన్లో ఒక నిరుపేద ఉపవాసికి ఇఫ్తార్ చేయించే వారు. అదే ఆ బంగారపు ఉపవాసం అనిపించుకుంది’’ అని దైవదూత సమాధానం ఇచ్చింది.ఎంతో ప్రచారంలో ఉన్న ఈ కథ కల్పితమే కావచ్చు. అబద్ధాలు, చాడీలు, దుర్భాషలు, చెడుచూపు, అవినీతి సొమ్ము సంపాదించడం లాంటి వాటిని మానుకోకుండా ఉపవాసాలు పాటించే వారికి ఆకలిదప్పులు తప్ప మరేమీ ప్రాప్తించవని ప్రవక్త (స) పరోక్షంగా హెచ్చరించారు. – ముహమ్మద్ ముజాహిద్ -
ధర్మానికి లోబడడమే ధైర్యం
ధైర్యవంతులే జీవితంలో ఏదో ఒకటి సాధిస్తారు. కాని ధైర్యంగా కార్యాలు తలపెట్టడమంటే ప్రమాదాలను ఆహ్వానించడమే! అయినప్పటికీ వెరపకుండా ధర్మానికి లోబడి ముందుకు వెళుతూ ఉంటే విజయం వెన్నంటి నడుస్తుంది. ఒక ఊరిలో ఓ నిరుపేద కూలీ ఉండేవాడు. జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. అనేక ఎదురుదెబ్బలు తిన్నాడు. ఎన్నోకష్టాలు భరించాడు. అయినా ఏనాడూ కుంగిపోలేదు. ఎప్పుడూ సంతోషంగా, హాయిగా, నవ్వుతూ ఉండేవాడు. చూసేవాళ్లకు చాలా ఆశ్చర్యం వేసేది. ఇన్నిన్ని బాధలు భరిస్తూ కూడా ఇంత హాయిగా ఎలా ఉండగలుగుతున్నావూ.. అని అతడిని అడిగేవారు. దానికతను ‘‘అల్లాహ్ ఏ ప్రాణి పైనా దాని శక్తికి మించిన బాధ్యత మోపడు. మనం వద్దని అనుకున్నంత మాత్రాన రానున్నవి రాకమానతాయా? ఇదొక్కటి తెలుసుకుంటే చాలు’’ అని చిరునవ్వుతో సమాధానం చెప్పేవాడు.అందుకే, కష్టాల కరవాలం దూసుకొస్తున్నప్పుడు ధైర్యంగా, ఒడుపుగా దాని పిడిని పట్టుకోవాలంటారు పెద్దలు. అలా కాకుండా భయపడుతూ, బెదురుతూ పట్టుకోబోతే పిడివైపుకు బదులు మరో భాగం చేతికి దొరికి గాయాలు కావచ్చు. ప్రమాదం ఏర్పడవచ్చు. ధైర్యసాహసాలు కూడా సరైన విధంగా, యుక్తిగా ప్రయోగిస్తేనే చక్కని సాధనంగా ఉపకరిస్తాయి. కష్టాలకు, కన్నీళ్లకు బెదిరిపోకుండా నిలకడను, శక్తిని ప్రసాదిస్తాయి. భయం, పిరికితనం అన్నవి మనిషిని జీవచ్ఛవంగా మారుస్తాయి. ఉత్సాహం నీరుగారి పోతుంది. ధైర్యసాహసాలంటే మరేమిటోకాదు. మనిషి ధర్మానికి కట్టుబడి జీవించడం. తన విధి, బాధ్యతలను విలువైనవిగా గుర్తించడం. ఏదీ సాధించలేకపోవడానికి, ఏదో ఒకటి సాధించడానికి మధ్యన ఉన్న బేధమే ధైర్యం. మనిషికి అటువంటి తర్ఫీదునిచ్చి ధర్మానికి బద్ధునిగా చేస్తుంది రమజాన్ – మదీహా -
నగరంలో రంజాన్ సందడి
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రంజాన్ వేడుకలు
-
దేశప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన మోదీ
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రమజాన్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: ముస్లీంల పవిత్ర పండుగ రమజాన్ ను తెలుగు రాష్ట్రాలు ఘనంగా జరుపుకుంటున్నాయి. కులమతాలకు అతీతంగా సోదరభావంతో ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. హైదరాబాద్లోని ముస్లీం ప్రార్థనల కొసం ఈద్గా, మసీదుల వద్ద జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నగర మేయర్ బొంతు రాంమోహన్, కమిషనర్ జనార్దన్రెడ్డిలు పండగ శుభాకాంక్షలు తెలిపారు. మాసబ్ ట్యాంక్లోని హాకీ గ్రౌండ్ వద్ద ముస్లీం సోదరులు నమాజ్ చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సనత్ నగర్ రాంగోపాల్ పేట్ నల్లగుట్ట మజీద్లో ఏర్పాటు చేసిన రంజాన్ వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రబాద్ చిలకలగూడ ఈద్గాలో మంత్రి పద్మారావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాన్సువాడలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నల్గొండలోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో శాసనమండలి డిప్యూటీ స్పీకర్ నేతి విద్యాసాగర్, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి , జిల్లా అధికారులు పాల్గొన్నారు. విజయవాడ: రమజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిని వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లీంలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా రామవరప్పాడు రోడ్డు నిర్మాణంలో తొలగించిన మసీదును ఎందుకు నిర్మించడం లేదంటూ చంద్రబాబును ముస్లీం సోదరులు ప్రశ్నించారు. దీంతో ఏడాది లోపు మసీదు నిర్మిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. కడప: రాయచోటి పట్టణంలోని ఈద్గాలో జరిగిన వేడుకల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, పార్టీ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లీం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
ప్రధాని మోదీ రమజాన్ సందేశం
న్యూఢిల్లీ : శుక్రవారం నెలవంక కనిపించడంతో శనివారం దేశమంతటా ఈద్ ఉల్ ఫితర్ (రమజాన్) పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం 7.35 గంటలకు నెలవంక కనిపించిందని జమా మసీదు షాహీ ఇమామ్ బుఖారీ ప్రకటించారు. దేశ ప్రజలకు రమాజన్ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆయన తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్తో పవిత్ర రమాజాన్/రంజాన్ మాసం ముగుస్తుంది. 30 రోజులపాటు ఉపవాసం ఉంటూ భక్తిశ్రద్ధలతో ఈ పర్వదినాన్ని జరుపుకునే ముస్లింలు రమజాన్ సందర్భంగా తమ బంధుమిత్రులు, ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలుపుతారు. మసీదులు, ఈద్గాలు, నిర్దేశిత బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు నిర్వహిస్తారు. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటూ నిరుపేదలకు సహాయం చేస్తారు. రమజాన్ పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈద్ ముబారక్. దేశ పౌరులందరికీ, ప్రత్యేకంగా దేశవిదేశాల్లోని మన ముస్లిం సోదర, సోదరిమణులకు పండుగ శుభాకాంక్షలు. ఈ సంతోషకరమైన సందర్భం మన కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని, మన సమాజం పరస్పర ప్రేమానురాగాలను పెంపొందించాలని కోరుకుంటున్నాను’ అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. ‘ఈద్ ముబారక్, ఈ పర్వదినం సమాజంలో మన ఐక్యతను, సామరస్యాన్ని మరింత పెంపొందించాలని ఆశిస్తున్నా’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అంతేకాకుండా దేశ ప్రజలకు రమజాన్ శుభాకాంక్షలు చెప్తూ.. ఆడియో ఫైల్ను షేర్ చేశారు. పలువురు జాతీయ రాజకీయల నాయకులు, పలువురు ప్రముఖులు కూడా రమజాన్ శుభాకాంక్షలుత తెలిపారు. -
నెలవంక కనిపించె.. ఆనందం వెల్లివిరిసె
సాక్షి, కర్నూలు(కల్చరల్) : ఆకాశంలో రంజాన్ నెలవంక కనిపించింది..ముస్లిం కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. నెల రోజులుగా సహేరీ, ఇఫ్తార్లతో సందడి సందడిగా సాగిన ఉపవాసాల ప్రతిఫలంగా ఈదుల్ ఫితర్ వచ్చేసింది. ముస్లిం కుటుంబాల నిండా ఆనందోత్సాహాల కెరటాలు ఉప్పొంగుతున్నాయి. నూతన దుస్తులు, అత్తర్ల ఘుమఘుమలు, దూద్ సేమియాలు, బిర్యానీల గుబాళింపులు, ఈద్ ముబారక్ల కరచాలనాలతో సందడి చేసుకునే పండుగ ముస్లిం ఇంటి గుమ్మాలలో ఆనంద తోరణాలు కడుతోంది. కర్నూలుతోపాటు నంద్యాల, ఆదోని, ఆత్మకూరు పట్టణాల్లో శుక్రవారం సాయంత్రం ముస్లింలు రంజాన్ నెలవంకను దర్శించారు. కర్నూలులోని ఉస్మానియా కళాశాల సమీపంలోని మైదానంలో రంజాన్ మాసపు చిట్టచివరి ఔట్ పేలింది. ఈదుల్ ఫితర్ పండుగకు సంబంధించిన సందేశాలు మసీదుల నుంచి ముస్లింలందరికీ మతపెద్దలు అందించారు. సిద్ధమైన ఈద్గాలు... నగరంలోని పాత ఈద్గా, కొత్త ఈద్గాల వద్ద ఈదుల్ ఫితర్ నమాజుకు సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి. కొత్తబస్టాండ్ సమీపంలోని పాత ఈద్గాలో ఉదయం 9 గంటలకే నమాజు ప్రారంభమవుతుంది. సంతోష్నగర్లోని కొత్త ఈద్గాలోనూ ఈదుల్ ఫితర్ నమాజుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఈద్గాల వద్ద ముస్లిం సోదరులను ఆహ్వానించే ఫ్లెక్సీలు వెలిశాయి. కొత్త ఈద్గాలో ఉదయం 10 గంటలకు ఈదుల్ ఫితర్ నమాజు ప్రారంభం కానున్నది. జొహరాపురం, గడ్డ ఈద్గాలలో ఉదయం 7 గంటలకే నమాజు జరగనున్నది. పండుగ కోలాహలం... రంజాన్ పండగ కోసం ముస్లిం కుటుంబాలు చేసే కొనుగోళ్లతో కర్నూలులోని పాతబస్తీ సందడి సందడిగా కనిపించింది. శుక్రవారం సాయంత్రం బండిమెట్ట, పూలబజార్, వన్టౌన్, చిన్నమార్కెట్, పెద్దమార్కెట్ ప్రాంతాలు రంజాన్ పండుగ వంటకాల కోసం అమ్మే దినుసుల దుకాణాల వద్ద కోలాహలం కనిపించింది. ముస్లిం కుటుంబాలు బారులు తీరి దుకాణాల వద్ద సేమియాలు, పండుగ సామగ్రి కొనుగోలు చేశారు. కిడ్స్ వరల్డ్ సమీపంలో, అబ్దుల్లాఖాన్ ఎస్టేట్లోని దుకాణాల వద్ద బారులు తీరి జనం దుస్తులు కొనుగోలు చేయడం కనిపించింది. గుడ్బై టు హలీమ్... కర్నూలు నగరంలో రంజాన్ మాసం మొదలైనప్పటినుంచి మే 16వ తేదీ నుంచి వివిధ ప్రాంతాల్లో హలీమ్ అమ్మకాల జోరు కొనసాగింది. ప్రత్యేక సేమియానాలు వేసి సాయంత్రాలు హలీమ్ సెంటర్ల వద్ద సందడి కనిపించేది. శనివారం సాయంత్రం చివరిసారిగా వన్టౌన్, గడియారం ఆసుపత్రి, యుకాన్ ప్లాజా, మౌర్యా ఇన్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో ముస్లిం సోదరులు హలీమ్ సేవిస్తూ దానికి గుడ్బై చెప్పారు. నమాజ్ వేళల్లో ట్రాఫిక్ నియంత్రణ... నగరంలోని పాత ఈద్గాలో ఉదయం 9 గంటలకే నమాజు ప్రారంభం కానుండటంతో ఆనంద్ కాంప్లెక్స్, రాజ్విహార్ మీదుగా వెళ్లే బస్సులను దారి మళ్లించారు. నేషనల్ హైవే వైపుగా వాహనాలను నడిపే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈద్గాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను నగర పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఈద్గాలను పరిశుభ్రం చేసి మంచినీళ్ల ఏర్పాటును నగర మున్సిపల్ కార్పొరేషన్ వారు పర్యవేక్షిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో నగరంలో ఈదుల్ ఫితర్ పండుగ చేసుకునేందుకు పోలీసులు, పురపాలక శాఖ ఏర్పాట్లను చేస్తున్నారు. -
ఈద్ ముబారక్
-
నేడు సర్కార్ ఇఫ్తార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పవిత్ర రంజాన్ ఉపవాసాల సందర్భంగా ముస్లిం సోద రులకు శుక్రవారం దావత్–ఏ–ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఉపవాస దీక్ష విరమించే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 800 మసీదుల్లో సుమారు 4 లక్షల మందికి ఇఫ్తార్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 400 మసీదులు, జిల్లాల పరిధిలో 400 మసీదుల్లో కమిటీల ఆధ్వర్యంలో ఇఫ్తార్ ఇవ్వనున్నారు. ప్రతి నియోజకవర్గానికి నాలుగు మసీదుల చొప్పున ప్రతీ మసీదు కమిటీ ఆధ్వర్యంలో కనీసం 500 మందికి తగ్గకుండా పండ్లు, బిర్యానీ, స్వీట్లు సిద్ధంగా ఉంచేలా చర్యలు చేపట్టారు. దీని కోసం మసీదుకు రూ.లక్ష చొప్పున సుమారు రూ.8 కోట్లను ఆన్లైన్ ద్వారా కమిటీలకు అందజేశారు. హైదరాబాద్లో మెగా ఇఫ్తార్.. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ముస్లిం సోదరు లకు మెగా ఇఫ్తార్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలతో పాటు వివిధ దేశాలకు చెందిన రాయబారులు కూడా పాల్గొన నున్నారు. ఇక్కడ దాదాపు 8 వేల మందికి ఇఫ్తార్ విందు ఏర్పాట్లు చేశారు. రంజాన్ కానుకగా కొత్త బట్టలు.. ప్రభుత్వం సుమారు 4 లక్షల నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకగా కొత్త బట్టలు పంపిణీ చేస్తోంది. 800 మసీదు కమిటీలకు వీటి పంపిణీ బాధ్యతలు అప్పగించింది. ప్రతీ మసీదు పరిధిలో 500 చొప్పున పేద కుటుంబాలను ఎంపిక చేసి మూడు జతల కొత్త బట్టలు ఉండే ప్యాకెట్లను అందజేస్తారు. ఒక్కొక్క ప్యాకెట్లో రూ.525 విలువగల కుర్తా, పైజామా, సల్వారు, కమీజు, చీర, బ్లౌజ్ ఉండనున్నాయి. -
మైనార్టీలకు సర్కారు అండ
సాక్షి, సిద్దిపేట: ‘అల్లా దయతో స్వరాజ్యం సాధించుకున్నాం. అంతా కలసికట్టుగా పనిచేసి అభివృద్ధిలో కూడా రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచాలి’అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్లో 3,000 మంది పేద ముస్లిం కుటుంబాలకు ఆయన రంజాన్ పండుగ బహుమతులు అందచేశారు. మంత్రి మాట్లాడుతూ కరువు, కాటకాలతో అల్లాడిన ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇందుకోసం అల్లా దీవెన కూడా అవసరమని అన్నారు. ఇదే ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణలోని బీళ్లను గోదావరి జలాలతో తడుపుతామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీలకు అండగా ఉంటుందని, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ముస్లిం యువతుల వివాహానికి రూ.1,00,116 ఆర్థిక సహాయం అందచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. అలాగే మైనార్టీ గురుకులాలు ప్రారంభించి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తున్నామన్నారు. ఈ సర్పంచ్లు అదృష్టవంతులు.. ప్రస్తుత సర్పంచ్లు అదృష్టవంతులని హరీశ్ అన్నారు. ప్రస్తుత సర్పంచ్ల పదవీకాలంలోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని, గ్రామాలకు సమీపంలో జిల్లా కేంద్రాలు కూడా వచ్చాయని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, దీంతో సర్పంచ్లకు ప్రజలకు మరింత సేవచేసే అవకాశం వచ్చిందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు. -
జవాన్ల చేతులు కట్టేయలేదు: రాజ్నాథ్సింగ్
లక్నో: జవాన్ల చేతులు ప్రభుత్వం కట్టేయలేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ స్పష్టం చేశారు. రంజాన్ సందర్భంగా జమ్మూ-కశ్మీర్లో కాల్పుల విరమణ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాజ్నాథ్సింగ్ మాట్లాడుతూ...భద్రతా దళాలపై ఆంక్షలు విధించలేదని పేర్కొన్నారు. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొద్ది రోజుల క్రితం ఓ ప్రకటనలో జమ్మూ-కశ్మీరులో రంజాన్ సందర్భంగా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో భద్రతా దళాలు పాల్గొనబోవని తెలిపింది. అయితే భద్రతా దళాలపై దాడి జరిగినపుడు, పౌరుల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైతే కాల్పులకు పాల్పడే హక్కు భద్రతా దళాలకు ఉందని పేర్కొంది. దీనిపై రాజ్నాథ్ సింగ్ మంగళవారం మాట్లాడుతూ ఇది కాల్పుల విరమణ కాదన్నారు. కేవలం కార్యకలాపాలను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. ఉగ్రవాద కాల్పులకు పాల్పడితే భద్రతా దళాలు కాల్పులు ప్రారంభిస్తాయని చెప్పారు. తాము భద్రతా దళాల చేతులను కట్టేయలేదని, ఇటీవల ఉగ్రవాద దాడి జరిగినపుడు ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. -
రమజాన్ రోజాలు
పవిత్ర రమజాన్ రాకడతో శుభాల పర్వం మొదలయింది. ముస్లిములు ఎంతో ఉత్సాహంతో ఉపవాసదీక్షలు ప్రారంభించారు. భక్తిశ్రధ్ధలతో పవిత్ర ఖురాన్ పారాయణం చేస్తున్నారు. మసీదులన్నీ భక్తులతో నిండిపోతున్నాయి. చిన్నపిల్లలు సైతం రోజా పాటించడానికి ఉబలాటపడుతున్నారు. దీనిక్కారణం ఏమిటి? అసలు ఉపవాసం ఎందుకుండాలి? దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? దీనికి స్వయంగా దైవమే, ‘ఉపవాసం వల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది’ అంటున్నాడు. భయభక్తులంటే ఏమిటి? మానవుడి మనస్సు దుష్కర్మలపట్ల ఏవగింపును,అసహ్యతను ప్రకటిస్తూ, సత్కర్మల పట్ల అధికంగా మొగ్గుచూపే ఒకానొక స్థితి. ఈ స్థితిని మానవ ఆంతర్యంలో జనింపజేయడమే ఉపవాసాల అసలు ఉద్దేశం. అందుకని ఉపవాసం పాటించేవారు బాహ్య పరిశుభ్రతతోపాటు, అంతఃశ్శుధ్ధిని కూడా పాటించాలి. ఉపవాసదీక్ష పాటిస్తున్నప్పటికీ అసత్యం పలకడం, అసత్యాన్ని ఆచరించడం మానుకోనివారు నిజానికి వ్రతం పాటిస్తున్నట్లుకాదు. కేవలం పస్తులుండటంతో సమానం. ముహమ్మద్ ప్రవక్త(స) ఇలాచెప్పారు: ’ఉపవాసదీక్ష పాటించే చాలామందికి, తమ ఉపవాసాలద్వారా, ఆకలిదప్పుల బాధతప్ప మరెలాంటి ప్రయోజనమూ చేకూరదు’. అంటే, ఉపవాస లక్ష్యం మనిషిని ఆకలిదప్పులతో మాడ్చిఉంచడం ఎంతమాత్రం కాదు. దైవాదేశ పాలనలో మరింత రాటుదేలే విధంగా తీర్చిదిద్దడం. దైవవిధేయతా పరిధిని ఏమాత్రం అతిక్రమించకుండా, అన్నిరకాల చెడుల నుంచి సురక్షితంగా ఉంచడం. ఏడాదికొకసారి నెలరోజులపాటు నైతిక విలువలు, దైవాదేశపాలనను అభ్యాసం చేయిం చడం. నెల్లాళ్ళ శిక్షణ అనంతరం మిగతా పదకొండు నెలలకాలం దీని సత్ప్రభావం జీవితాల్లో ప్రసరించే విధంగా ఏర్పాట్లుచేయడం. పవిత్ర రమజాన్లో ఏవిధంగా అన్నిరకాల చెడులకు, అవలక్షణాలకు దూరంగా సత్కార్యాల్లో, దానధర్మాల్లో, దైవధ్యానంలో, సమాజ సంక్షేమ కార్యకలాపాల్లో పాల్గొంటారో, అలాగే మిగతా కాలమంతా సమాజంలో శాంతి, న్యాయం,ధర్మం పరిఢవిల్లుతూ జీవితం సాఫీగా గడిచిపోవాలని, పరలోక సాఫల్యం సిధ్ధించాలన్నది అసలు ధ్యేయం. ఈ రమజాన్లో అటువంటి తర్ఫీదు పొందే భాగ్యం ప్రతి ఒక్కరికీ దక్కాలని మనసారా కోరుకుందాం. (రమజాన్ పర్వదినం ప్రారంభం సందర్భంగా) – యండి.ఉస్మాన్ ఖాన్ -
ఆకలి తీర్చే ఆకలి
ఇంకొకరి ఆకలి తీర్చాలంటే మనకు ఆకలి తెలియాలి. మహ్మదీయులు ఈ మాసంలోఆకలితో ఉండేది.. ప్రేమను తీర్చేందుకే.ఇతరులకు మంచి చేసే సంకల్పంలోవారికి ఆకలి బాధే తెలియదు. అంత గొప్ప నియమం ఈ మాసం.అంత గొప్ప పుణ్యం ఈ ఆకలి.మహమ్మదీయుల దగ్గర ప్రపంచంనేర్చుకోవాల్సిన ధర్మం.. ఆకలి తీర్చే ఆకలి. రమజాను మాసం అనగానే ఉపవాసాలు గుర్తొస్తాయి. దేవుడిని ఆరాధించే మార్గాల్లో ఉపవాసం కూడా ఒకటి. ముస్లింలు ఉపవాసం ఎందుకు చేస్తారు? దేవుని వాక్కు అయిన దివ్య ఖుర్ఆన్ ఈ మాసంలోనేప్రవక్త ముహమ్మద్ ద్వారా మానవాళికి లభించింది. దానికి కృతజ్ఞతగా ఈ మాసంలో ముస్లిములు ఉపవాసాలు పాటిస్తారు. అదొక్కటే కాదు ఈ మాసం అంతా శిక్షణాకాలం లాంటిది. ఇస్లామీయ బోధనలు, ప్రమాణాల ప్రకారం ఈ నేల అంతా ముస్లింలు జీవించడానికి నిబద్ధులవుతారు. ఈ నెల రోజుల శిక్షణ తర్వాత మిగిలిన పదకొండు నెలల జీవితాన్ని క్రమబద్ధం చేస్తుందని ముస్లింల విశ్వాసం. ‘రమజాను నెలను పొందే వ్యక్తి ఆ నెల అంతా విధిగా ఉపవాసం ఉండాలి. వ్యాధిగ్రస్తులైన వారు లేదా ప్రయాణంలో ఉన్నవారు, ఆ ఉపవాస దినాలను వేరే దినాలలో పూర్తిచెయ్యాలి’ అని ఖురానులో ఉంది. అందుకే ముస్లింలు దేవుని పట్ల భయభక్తులతో ఉపవాసాలు ఉంటారు. ఎవరు చూడని ఏకాంతంలో ఉన్నప్పటికీ పచ్చి మంచినీరు కూడా తాగకుండా నిగ్రహాన్ని పాటిస్తారు. దేవుడు చూస్తున్నాడన్న స్పృహæ దీనికి కారణం. భారతదేశంలో అయితే దాదాపు పధ్నాలుగు గంటల పాటు, ఇంగ్ల్లండు వంటి దేశాల్లో అయితే దాదాపు పద్ధెనిమిది గంటల పాటు అన్నపానీయాలకు దూరంగా ఉండడం వల్ల ఎంత సంపన్నుడైనా ఆకలి బాధ, దప్పిక బాధేమిటో అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. పేదల కష్టాలను అర్థం చేసుకుని ఆదుకుంటాడు. అందుకే మనిషి కడుపు నిండా తినరాదని మూడింట ఒక వంతు కడుపు ఖాళీగా ఉండాలని ప్రవక్త బోధించారు. పంచుకునే మాసం రంజాను మాసంలో అన్నపానీయాలకు దూరంగా ఉండడమే కాదు, తమ వద్ద ఉన్న ఆహారాన్ని ఇతరులతో పంచుకోవడం ఈ నెలలో చాలా సాధారణంగా కనబడే దృశ్యం. మసీదుల్లో లేదా ఇతర ప్రదేశాల్లో ఉపవాస విరమణ (ఇఫ్తార్) జరుగుతున్నప్పుడు చాలా మంది తమతో పాటు ఆహారపదార్థాలు తీసుకుని వస్తారు. కొందరు ఏమీ లేకుండానే వచ్చేస్తారు. తమ పక్కన ఉన్న వ్యక్తి పరిచయస్తుడా కాదా అన్నది ఎవరు పట్టించుకోరు. తన వద్ద ఆహారం ఉన్న వ్యక్తి ఎదుటి వ్యక్తి ముందు పెడతాడు. అవతలి వ్యక్తి కూడా నిస్సంకోచంగా తీసుకుని తింటాడు. తినే ప్రతి వ్యక్తి మిగిలిన వారికి సరిపోతుందో లేదో అన్న ధ్యాసతోనే తింటాడు. ఇలా పంచుకుని తినే అందమైన వాతావరణం రమజానులో చాలా సాధారణంగా కనబడుతుంది. ఇదే పద్ధతి సంవత్సరమంతా ఉంటే ఆకలితో బాధపడే వారెవ్వరు సమాజంలో ఉండరు. రమజాను మాసంలో అన్నదానాలు, ఇఫ్తార్ విందులు జరుగుతూనే ఉంటాయి. అందులో పేదలు, మధ్యతరగతి, సంపన్నులు అనే తేడా లేకుండా అందరూ పాల్గొనడం కూడా చూడవచ్చు. సామాజికంగా అందరం ఒక్కటే అనే అద్భుతమైన అందమైన భావన ఆచరణాత్మకంగా కనిపిస్తుంది. పేదరికానికి జవాబు పేదరిక నిర్మూలనకు ఇస్లామ్ ప్రతిపాదించే సూత్రం పంపిణీ. సమాజం వద్ద వ్యక్తుల వద్ద ఉన్న సంపదలో పేదసాదలకు కూడా హక్కు ఉందని ఇస్లాం చెబుతుంది. ఈ సంపద పంపిణీకి ఇస్లామ్ ప్రతిపాదించే గొప్ప నియమం జకాత్. ఆ మాటకు అర్థం ‘తప్పనిసరిగా చేయవలసిన దానం’. ‘తల్లిదండ్రులను, బంధువులను, అనాథలను, నిరుపేదలను ఆదరించాలి. ప్రజలను సహృదయంతో పలుకరించాలి. జకాత్ ఇవ్వాలి’ అని ఖురానులో ఉంది. ఆ జకాత్ ఎలా ఇవ్వాలి? ‘కేవలం పరుల మెప్పును పొందటానికి ఇవ్వకండి. దెప్పిపొడిచి, గ్రహీత మనస్సును గాయపరచి ఇవ్వకండి. అలా చేస్తే మీ దానం మట్టిలో కలిసినట్టే‘ అని ఖురాన్లో ఉంది. రమజాను మాసంలో అందువల్లనే ముస్లిములు ఇతోధికంగా దానధర్మాలు చేస్తుంటారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడరు. దేవుని ప్రసన్నతతో పాటు ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని కూడా అనుభవిస్తారు. జకాత్ అంటే శుభ్రం చేయడం జకాత్ అంటే అసలు అర్థం శుభ్రం చేయడం. మనిషి తన సంపద నుంచి తాను శుభ్రపడాలి. ఉన్నసంపదలో రెండున్నర శాతం జకాత్గా చెల్లించాలి. ఎవరికి చెల్లించాలన్నది కూడా నిర్ధిష్టంగా ఉంది. రమజాను మాసంలో తప్పనిసరిగా చేసే మరో దానం ఫిత్ర్. ఇది పండుగ ముందు రోజు చేస్తారు. ఒక కుటుంబంలో ఎంత మంది ఉంటే, తల ఒక్కింటికి రెండున్నర కిలోల ధాన్యం లేదా దాని సమాన వెల పేదలకు ఇవ్వాలి. పండుగ రోజున ఏ పేదసాదలు ఖాళీ కడుపుతో ఉండరాదని చేసిన ఏర్పాటిది. ఇవి కాకుండా ‘సదఖా’ రూపంలో స్వచ్ఛందంగా చేయవలసిన దానాలను కూడా ఇస్లాం ప్రోత్సహించింది. అందుకే రమజాను మాసంలో విస్తృతంగా దానధర్మాలు చేయడం మనకు కనబడుతుంది. ఇండోనేషియా, మలేషియా, ఖతర్, సౌదీ అరేబియా, ఎమన్ దేశాల్లో ఏటా 38,088 కోట్ల రూపాయలు జకాత్ పేరుతో సమీకరణం అవుతున్నాయి. ఇవి ప్రపంచ దేశాలలో అవసరమైన మానవీయ సహాయానికి తోడ్పడుతున్నాయి. మతాలతో సంబంధం లేకుండా సంవత్సరానికి ఒకసారి ప్రపంచంలోని ప్రతి ఒక్కరు తమ సంపదలో రెండున్నర శాతం దానం చేయగలిగితే అసలు పేదరికం అనేదే ఉండదు. జకాత్లో గొప్ప ఆర్థిక సూత్రం ఇది. దానం వల్ల కలిగే మేలు ప్రపంచవ్యాప్తంగా మానవీయ సహకారానికి జకాత్, సదకా నిధులను ఉపయోగిస్తున్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ దేశాలు 2013లో అంతర్జాతీయ మానవీయ సహకారానికి అందించిన మొత్తం 14,700 కోట్ల రూపాయలు. ముస్లిం దేశాల్లో జకాత్ వసూలు ప్రభుత్వ పరంగా జరుగుతుంది. ముస్లిమేతర దేశాల్లో స్వచ్ఛంద సంస్థలు జకాత్ వసూలు చేసి సేవాకార్యక్రమాలకు, విద్య, వైద్యం తదితర కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతోంది. జకాత్ ఫౌండేషన్ భారతదేశంలో సివిల్ సర్వీసు కోచింగ్ వంటి సేవలు కూడా అందిస్తోంది. సిరియాలో అంతర్యుద్ధంలో దాదాపు రెండున్నర లక్షల మంది మరణించారు. టర్కీ తదితర దేశాలు అక్కడ భారీస్థాయిలో మానవీయ సహకారం జకాత్ నిధుల నుంచే అందిస్తున్నాయి. అనేక దేశాల్లో ప్రకృతి విపత్తులు, ఎబోలా వంటి వ్యాధులు ఇలా ఎన్నెన్నో కడగండ్లు. అంతర్జాతీయ మానవ సహకారానికి నిధులు సరిపోని పరిస్థితి. దానం చేయడం అంటే ఎదుటి వాడికి ఉపకారం చేయడం కాదు. అది పుచ్చుకునేవాడి హక్కు, ఇచ్చేవాడి బాధ్యత అన్న భావన ఇస్లామ్లో ముఖ్యమైనది. – వాహెద్ -
రంజాన్ నెల ప్రారంభం : వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్ : ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజులపాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య పవిత్ర మాసాన్ని ముస్లిం సోదర సోదరీమణులంతా జరుపుకుంటారని, వారికి అల్లాహ్ దీవెనలు లభించాలని ఆయన ఆకాంక్షించారు. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించినది రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారని పేర్కొన్నారు. రంజాన్ అంటే ఉపవాస దీక్ష మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని ఆయన అన్నారు. Greetings on the beginning of the Holy month of #Ramzan. — YS Jagan Mohan Reddy (@ysjagan) 17 May 2018 -
ముందుగానే రంజాన్ ఎందుకిలా.?
సాక్షి సిటీబ్యూరో: ఈసారి రంజాన్ మాసం ముందొచ్చినట్టు అనిపిస్తుంది కదూ! అవును దీనికి ఓ కారణముంది. ఇంగ్లిష్ క్యాలెండర్తో పోలిస్తే... ఇస్లామిక్ క్యాలెండర్లో రోజుల సంఖ్య తక్కువ. అందుకే రంజాన్ ముందుగానే మొదలవుతుంది. గతేడాది రంజాన్ మే 27న ప్రారంభమైంది. ఈసారి ఈ నెల 16న నెలవంక దర్శనమిస్తే... 17న రంజాన్ మొదలవుతుంది. అంటే 12 రోజులు ముందుగానే రంజాన్ ప్రారంభమవుతుందన్న మాట. ఒక్క రంజాన్ మాసమే కాదు... ఇస్లామిక్ క్యాలెండర్లో అన్ని మాసాలు ముందుగానే వస్తాయి. ఎందుకిలా అంటారా? అయితే చరిత్ర తెలుసుకోవాల్సిందే. మహ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనా నగరానికి వలస (హిజ్రత్) వెళ్తారు. ఇది ఇస్లామిక్ చరిత్రలో ఓ ఘట్టం. మదీనాకు చేరుకున్న నాటి నుంచే హిజ్రీ క్యాలెండర్ ప్రారంభమైంది. ప్రస్తుతం హిజ్రీ 1439వ సంవత్సరం నడుస్తోంది. ఆంగ్ల సంవత్సరాదిలో ఉన్నట్టే... హిజ్రీ క్యాలెండర్లోనూ 12 నెలలు ఉంటాయి. మొదటి నెల మొహరంతో మొదలై వరుసగా సఫర్, రబ్బీల్ఆవ్వల్, రబీవుల్సానీ, జమాదుల్ఆవ్వల్, జమాదుస్సానీ, రజ్జబ్, షాబాన్, రంజాన్, షవ్వాల్, జీఖద్, జిలహజ్ ఉంటాయి. ఇందులో రంజాన్ తొమ్మిదో నెల. ప్రతి నెలలో తక్కువే... ఇంగ్లిష్ క్యాలెండర్లో ఒక్క ఫిబ్రవరిని మినహాయిస్తే మిగతా నెలల్లో కొన్నింటిలో 30 రోజులు, మరికొన్నింటిలో 31 రోజులు ఉంటాయి. కానీ ఇస్లామిక్ క్యాలెండర్లో అలా ఉండదు. కొన్ని నెలల్లో 29 రోజులు , మరికొన్నింటిలో 30 రోజులు ఉంటాయి. ఏ నెలలోనూ 31 రోజులు ఉండవు. అంటే ఇంగ్లిష్ క్యాలెండర్తో పోలిస్తే ఇస్లామిక్ క్యాలెండర్లో ఏడాదికి 10–12 రోజులు తగ్గిపోతాయి. అందుకే రంజాన్ మాసం 12రోజులు ముందుగానే వస్తోంది. నెలవంక ఆధారంగా... ఆంగ్ల సంవత్సరాది ప్రకారం అర్ధరాత్రి 12గంటలు దాటిన తర్వాత మరుసటి రోజు ప్రారంభమవుతుంది. కానీ ఇస్లామిక్లో అలా కాదు. సూర్యాస్తమయంతో మరుసటి రోజు మొదలవుతుంది. నెలలు కూడా అంతే... నెలవంక చూసిన తర్వాత మరుసటి నెల మొదలవుతుంది. అంటే సాయంత్రం వేళ నెలవంక దర్శమిచ్చిన మరుక్షణం నుంచే ఇస్లామిక్ నెల ప్రారంభమవుతుంది. సాయంత్రం వేళ నెలవంక దర్శనమిచ్చాకే రంజాన్ మాసం ప్రారంభమైందంటూ మసీదుల్లో సైరన్ మోగిస్తారు. -
మసీదుల మరమ్మతుకు రూ.5 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రంజాన్ను పురస్కరించుకుని మసీదుల మరమ్మతుకు రూ.5 కోట్లు కేటాయించినట్లు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. శుక్రవారం ఆయన సచివాలయంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు ఎ.కె.ఖాన్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మహ్మద్ సలీం, నగర శాసనసభ్యులు, వివిధ శాఖల అధికారులతో కలసి రంజాన్ ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం మహమూద్ అలీ మాట్లాడుతూ వచ్చే నెలలో రంజాన్ పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల పేద ముస్లి కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసు యంత్రాంగం 24 గంటలు పనిచేస్తుందని నాయిని అన్నారు. పండుగ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ముస్లిం సోదరులు గంట ముందుగా ఆఫీసు విడిచి వెళ్లడానికి అనుమతించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
ముస్లింలు అక్కడ నమాజ్ చేయొద్దు: యోగి
లక్నో: రోడ్లపై నమాజ్ చేయొద్దని ముస్లింలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోరారు. రంజాన్ పర్వదినం రోజున రోడ్లపైకి వచ్చి నమాజ్ చేయడం సరి కాదని యోగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను తాను ఇలా అడగకపోతే ఉత్తరప్రదేశ్ పోలీసు స్టేషన్లలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకోవడం ఆపేయాలని తాను కోరలేనని అన్నారు. గత ప్రభుత్వం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను సరిగా నిర్వహించలేదని చెప్పుకొచ్చిన ఆయన.. ఇక నుంచి అంగరంగ వైభవంగా పండుగను జరుపుకుందామని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా దేశంలోని ప్రతి ఒక్కరూ తమ పండుగల రోజుల ఆరాధ్య దైవాలను పూజించుకోవచ్చని యోగి పేర్కొన్నారు. పోలీసు వ్యవస్ధలో మార్పు తెచ్చేందుకు కీర్తనలు, ప్రార్థనలు ఉపయోగపడతాయని యోగి వ్యాఖ్యానించినట్లు జాతీయ మీడియా ఓ కథనం ప్రచురించింది. -
వీధికుక్కల దాడిలో బాలుడి మృతి
♦ రంజాన్ పండుగ రోజు విషాదం ♦ శరీరంపై వంద గాట్లు.. మేడ్చల్ జిల్లాలో ఘటన హైదరాబాద్: ఆనందంగా గడపాల్సిన రంజాన్ పండుగ రోజు ఆ ఇంట విషాదం నెలకొంది. మజీద్ బయట ఆడుకుం టున్న చిన్నారిని వీధికుక్క లు బలితీసుకున్నాయి. కళ్లెదుటే కన్నకొడుకు కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఈ విషాదకర ఘటన మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండలం మూడు చింతలపల్లి కాశవాడలో సోమవారం చోటు చేసుకుంది. మూడు చింతలపల్లి కాశవాడకు చెందిన ఎం.డి.ఇమామ్, ఖాదర్బీ దంపతులకు హసీనా, ఎండీ ఫారుక్(7), ఎండీ హస్మీ సంతానం. రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం ఉదయం వీరు స్థానిక మజీద్కు వచ్చారు. అందరూ నమాజ్ చేస్తుండగా ఫారూక్ మజీద్ సమీపంలో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో పోట్లాడుకుంటూ వచ్చిన ఆరు వీధి కుక్కలు ఒక్కసారిగా ఫారూక్పై దాడి చేశాయి. బాలుడి తల, మెడ, వీపు, కడుపు, కాళ్లు, చేతులు ఇలా శరీరమంతా గాయాలై తీవ్ర రక్త స్రావమైంది. ‘అల్లా ,అబ్బా, అమ్మీ ముజుకో బచావో’అంటూ ఆ చిన్నారి మొత్తుకుంటున్నా కుక్కలు విడిచి పెట్టలేదు. కేకలు విన్న తండ్రి ఇమామ్ వెంటనే చిన్నారి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే తీవ్రంగా కరవడంతో బాలుడి పరిస్థితి విషమించింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఫారుక్ను అంబులెన్స్లో మొదట నగరంలోని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. బాలుడి శరీరంపై వంద కాట్లు ఉన్నాయి. పరిస్థితి విష మంగా ఉందని వైద్యులు చెప్పడంతో నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొం దుతూ ఫారూక్ మృతి చెందాడు. ఫారూక్ మృతిని తట్టుకోలేక కుటుం బీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో ఆస్పత్రిలో విషా దఛాయలు అలుముకున్నాయి. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కో సం బాలుణ్ని అంబులెన్స్లో నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అక్క డి వైద్యులు బాలుని శరీరంపై ఉన్న సుమారు వందకుపైగా కుక్కగాటు గాయా లను శుభ్రం చేసి రిగ్ ఇంజక్షన్ ఇచ్చారు. నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. -
విందు భోజనానికి నోచుకోని ఖైదీలు
హైదరాబాద్: రంజాన్ను పురస్కరించుకొని ప్రత్యేక వంటకాలు వడ్డిస్తారని ఆశపడ్డ చంచల్గూడ ఖైదీలకు నిరాశే మిగిలింది. సాధారణ భోజనంతో పాటు ఒక లడ్డూ మాత్రమే జైలు అధికారులు వడ్డించడంతో వారంతా ఆవేదన వ్యక్తంచేశారు. చంచల్ గూడ పురుషుల జైల్లో దాదాపు 350 మంది ముస్లిం ఖైదీలు నెల పాటు రంజాన్ ఉపవాస దీక్షలు పాటించారు. ప్రార్థనలకు ప్రత్యేకంగా జైల్లో ఓ బ్యారెక్ కూడా అధికారులు కేటా యించారు. అయితే రంజాన్ రోజు ప్రత్యేక వంటకాలు వడ్డిస్తారని ఊహించిన ఖైదీలకు నిరాశే ఎదురైంది. ఖైదీల సంక్షేమం, సంస్కరణలు కోసం కృషి చేస్తున్నామని ప్రచారం చేసుకునే ఉన్నతాధికారులకు పం డుగపూట ఖైదీలకు విందు భోజనం వడ్డిం చాలన్న ఆలోచన రాకపోవడం దురదృష్టక రమని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
వెల్లివిరిసిన మతసామరస్యం
జిల్లా వ్యాప్తంగా సోమవారం మతసామరస్యం వెల్లివిరిసింది. రంజాన్ను పురస్కరించుకుని కులమతాలకు అతీతంగా అందరిలోనూ ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలతో నియమాన్ని ఆచరించిన ముస్లింలు.. ఆదివారం రాత్రి నెలవంక దర్శనంతో పులకించిపోయారు. సోమవారం ఉదయమే కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రత్యేక ప్రార్థనల కోసం ఈద్గా మైదానాలకు చేరుకున్నారు. జిల్లా కేంద్రం అనంతపురంతో పాటు కదిరి, హిందూపురం, తాడిపత్రి, ధర్మవరం, గుంతకల్లు, ధర్మవరం తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ముస్లింలు సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. - సాక్షి నెట్వర్క్, అనంతపురం -
సామరస్యానికి ప్రతీక రంజాన్: వైఎస్ జగన్
హైదరాబాద్: రంజాన్ పండుగను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈద్ ముబారక్ తెలిపారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భా వానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని, ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. మనిషిలోని చెడు భావనలను, అధర్మం, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ అని జగన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. Pleased to have received these Ramzan wishes from the little ones. Thank you. Wishing each and everyone a very happy Ramzan. Eid Mubarak. pic.twitter.com/ofZAeux6RS — YS Jagan Mohan Reddy (@ysjagan) 26 June 2017 -
ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి
► రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం, ఏపీ సీఎం హైదరాబాద్: ముస్లిం సోదరులు పవిత్రమైన రంజాన్ (ఈద్–ఉల్– ఫితర్) పండుగను సోమవారం జరు పుకోనున్నారు. ఆదివారం రాత్రి నెల వంక దర్శనమిచ్చినట్లు హైదరాబాద్ రూహియత్–ఏ–హిలాల్ కమిటీ అధ్యక్షుడు మౌలానా ఖుబూల్ పాషా సుత్తారి ప్రకటించారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముస్లిం సోదరులు సోమవారం ఈద్–ఉల్–ఫితర్ పండుగను జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో రంజాన్ మాసం దీక్షలు ముగిసినట్లయింది. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, ఏపీ సీఎం చంద్ర బాబు, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని ఆనందోత్సాహలతో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. -
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్
న్యూఢిల్లీ : ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) పండు గను సోమవారం జరుపుకోవాలని ఢిల్లీ జుమా మసీ దు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ ప్రకటించారు. బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఆదివారం నెలవంక కనిపించిందని తెలిపారు. రంజాన్ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ప్రజలకు శుభా కాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మాట్లాడుతూ..రంజాన్ పండుగ ప్రజల్లో సోదరభావాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ పండుగ క్షమాగుణం, త్యా గం, దానంచేయడం లాంటి సుగుణాలను బోధిస్తుందని పేర్కొన్నారు. దేశంలో శాంతి, ప్రజల మధ్య ఐక్యత కోసం ప్రార్థనలు చేయాలని ఆమె కోరారు. -
26న ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్ రద్దు
కర్నూలు(అర్బన్): ప్రతినెల చివరి సోమవారం జరుగుతున్న ఎస్సీ, ఎస్టీ స్పెషల్ గ్రీవెన్స్ను ఈనెల 26న రంజాన్ పండుగ సందర్భంగా రద్దు చేసినట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ప్రకాష్ రాజ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై నెల చివరి సోమవారం యథావిధిగా ఈ గ్రీవెన్స్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లాలోని వివిద దళిత సంఘాల నాయకులు, ప్రజలు, అధికారులు గమనించాలని ఆయన కోరారు. -
ఈద్గాలలో ఈదుల్ఫిత్ర్ నమాజు వేళల
కర్నూలు (ఓల్డ్సిటీ): నగరంలోని నాలుగు ఈద్గాలలో ఈదుల్ఫిత్ర్ నమాజు వేళలను ఆయా ఈద్గాల నిర్వాహకులు ప్రకటించారు. పాత ఈద్గా ముతవల్లి అయిన ప్రభుత్వ ఖాజీ సలీంబాషా ఖాద్రి మాట్లాడుతూ నెలవంక కనిపించిన మరుసటి రోజున రంజాన్ పండుగ నిర్వహిస్తామన్నారు. ఈద్గాకు వెళ్లేటప్పుడు అల్లాహుఅక్బర్ అల్లాహుఅక్బర్, అల్లాహు అక్బర్ అల్లాహుఅక్బర్ లాఇలాహ ఇల్లల్లాహు అల్లాహుఅక్బర్ అల్లాహుఅక్బర్ వలిల్లా అల్హంద్ అని పఠించాలన్నారు. ఈద్గాకు వెళ్లే సమయంలో ఒక దారి, తిరిగి వచ్చే సమయంలో మరోదారిలో రావాలని మసీదుల్లో ప్రకటనలు జారీ చేశారు. ఈద్గా నమాజు వేళలు గడ్డా ఈద్గా -ఉదయం 7.00 గంటలు జోహరాపురం ఈద్గా ఉదయం 7.15 గంటలు పాత ఈద్గా ఉదయం 9.00 గంటలు కొత్త ఈద్గా ఉదయం 10.00 గంటలు -
26న డయల్ యువర్ కలెక్టర్, మీ కోసం కార్యక్రమాలు రద్దు
కర్నూలు(అగ్రికల్చర్): ఈ నెల 26వ తేదీ సోమవారం రంజాన్ పర్వదినం ఉన్నందున ఆ రోజు నిర్వహించాల్సిన డయల్ యువర్ కలెక్టర్, మీ కోసం( ప్రజాదర్బార్)కార్యక్రమాలను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఆదే విధంగా సాయంత్రం జరిగే ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ను కూడా రద్దుచేశామన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కలెక్టర్ శనివారం ప్రకటనలో తెలిపారు. -
ఆజా.. ఆజా.. లాడ్ బజార్
రంజాన్ సమీపిస్తోంది. పాతబస్తీలో సందడి పెరిగింది. గాజుల కొనుగోళ్లతో లాడ్ బజార్ గలగలలాడుతోంది. చిన్నా..పెద్దా షాపింగ్ సందడితో గల్లీలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. కొత్త దుస్తులు, గాజులు, చెప్పులు, వాచీలు, హ్యాండ్బ్యాగులు, అలంకరణ వస్తువులకు గిరాకీ పెరిగింది. షీర్కుర్మాకు ఉపయోగించే సేమియాలు పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. ఇకరంజాన్ మాసంలో చివరిది కావడంతో శుక్రవారం చార్మినార్, మక్కామసీద్, మదీనా తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున ముస్లింలు సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. -
జకాత్ నిధులు విద్య కోసం వెచ్చించండి: ఏకేఖాన్
హైదరాబాద్: రంజాన్ మాసంలో వచ్చే సుమారు వెయ్యి కోట్ల రూపాయల జకాత్ ధనాన్ని ముస్లింల విద్య, సంక్షేమం కోసం ఖర్చు చేస్తే నగరంలో పేదరికం అంతమౌతుందని మాజీ డీజీపీ, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహదారులు అబ్దుల్ ఖయ్యూం ఖాన్ అభిప్రాయపడ్డారు. సోమవారం హైదరాబాద్ జకాత్ అండ్ చారిటెబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బంజారహిల్స్లోని సంస్థ కార్యాలయంలో వార్షిక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా ట్రస్టు కార్యకలపాల బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅథితిగా ఏకే ఖాన్ పాల్గొని మాట్లాడారు. జకాత్ నిధుల వల్ల నగరంలోని పేద ముస్లింల పరిస్థితులు బాగుపడతాయన్నారు. హైదరాబాద్ జకాత్ ట్రస్టు ద్వారా గత 25 ఏళ్లలో 11 వేల ముస్లిం కుటుంబాలు లబ్దిపొందాయని తెలిపారు. జకాత్ నిధులను సాముహికంగా జమ చేసి ముస్లిం విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఖర్చు చేయాలని పిలుపు నిచ్చారు. ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంలో చేరితే అ కుటుంబం నుంచి పేదరికం దూరం అవుతుందన్నారు. ముస్లింలు ఇతర ఖర్చులను తగ్గించి పిల్లల విద్యపై డబ్బులు ఖర్చు చేయాలని కోరారు. జకాత్ ట్రస్టు విద్య కోసం చేస్తున్న కృషి అభినందనీయమని ఏకే ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. -
17 నుంచి రంజాన్ తోఫా
కర్నూలు(అగ్రికల్చర్): రంజాన్ పర్వదినాన్ని పురష్కరించుకొని ముస్లిం కార్డుదారులకు రంజాన్ తోఫా అందజేయనున్నారు. 2.02 లక్షల మంది ముస్లిం కార్డుదారులకు తోఫా కానుకలను ఈ నెల 17 నుంచి పంపిణీ చేయనున్నారు. మండలాలు, మున్సిపాలిటీల వారీగా కార్డుల వివరాలను తహసీల్దార్లకు పంపారు. ఇందులో అనర్హులు ఉన్నారా... లేదా అర్హత కలిగిన ఏ కుటుంబమైనా లేదా అనేదానిని పరిశీలించాల్సి ఉంది. రంజాన్ తోఫా కింద 5కిలోల గోదుమ పిండి, 2 కిలోల చక్కెర, 1కిలో సేమియా, 100 ఎంఎల్ నెయ్యి ఇస్తారు. అన్ని ప్రత్యేక ప్యాకెట్లలోనే ఉంటాయి. వీటిని ఒక బ్యాగ్లో వేసి ఇస్తారు. ఇప్పటి వరకు స్టాక్ పాయింట్లకు 60 శాతం సరుకులు వచ్చాయని జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ జయకుమార్ తెలిపారు. ఈ– పాస్ మిషన్ల ద్వారానే కార్డుదారులకు పంపిణీ చేస్తారు. -
వోడాఫోన్ రంజాన్ స్పెషల్ ఆఫర్లు
ముంబై: వోడాఫోన్ ఇండియా తన ఖాతాదారులకోసం పవిత్ర రంజాన్ సందర్భంగా స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. మంగళవారం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఆఫర్ లో అన్ లిమిటెడ్ కాలింగ్, ఉచిత ప్రత్యేక డేటా ప్లాన్లను ప్రకటించింది. రంజాన్ స్పెషల్ ప్యాక్ లో ఒకరోజు వ్యాలిడిటీతో , 2జీ వినియోగదారులు 444 * 5 # డయలింగ్ ద్వారా రూ.5 తో అపరిమిత డేటా ఆఫర్ను పొందవచ్చు. అలాగే 3జీ కస్టమర్లు * 444 * 19 # డయలింగ్ ద్వారా రూ.19 లపై అపరిమిత డేటా ఆఫర్ను పొందవచ్చు. అయితే యుపి (వెస్ట్) ఉత్తరాఖండ్ ప్రాంతంలోని నివాసితులకు మాత్రమే ఈ ఆఫర్లు లభ్యం. -
యూపీ జైలులో 32 మంది హిందువుల ఉపవాసాలు
ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జైలులో ముస్లింలతో పాటు 32 మంది హిందూ ఖైదీలు కూడా ఉపవాస దీక్ష చేపట్టారు. ‘రోజా’ పాటిస్తున్న ఖైదీల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, ఇఫ్తార్ విందులో భాగంగా పాలు, డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నట్లు జైలు సూపరింటెండెంట్ రాకేశ్ సింగ్ చెప్పారు. జైలులో ఉన్న మొత్తం 2,600 మంది ఖైదీల్లో 1174 మంది ముస్లింలు, 32 మంది హిందువులు రంజాన్ మాసం సందర్భంగా ఉపవాసాలుంటున్నారు. -
రహదారులు రక్తసిక్తం
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం - ఒకరికి గాయాలు జిల్లాలోని రహదారులు రక్తసిక్తమయ్యాయి. మంగళవారం చోటుచేసుకున్న వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో రహదారులు నలుగురిని పొట్టనపెట్టుకోగా మరొకరు గాయాలతో బయటపడ్డాడు. సుంకులమ్మ దర్శనానికి వెళ్లిన దంపతులకు పుత్రశోకం మిగలగా.. రంజాన్ సరుకులు తీసుకొచ్చేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ఇంటికి చేరకుండానే మృత్యువాత పడ్డాడు. మరో ప్రమాదంలో దుబాయ్ నుంచి వస్తున్న కుమారుడిని రిసీవ్ చేసుకునేందుకు వెళ్తున్న ఓ తండ్రిని, డ్రైవర్ ప్రాణాలను రహదారులు బలిగొన్నాయి. సుంకులమ్మ దర్శనానికి వెళ్లిన తల్లికి కడుపు కోత బస్సు ఢీకొని ఐదేళ్ల చిన్నారి మృతి.. కె.నాగులాపురం(గూడూరు): మండలంలోని కె.నాగులాపురం సుంకులమ్మ దర్శనార్థం వచ్చిన ఓ తల్లికి కడుపుకోత మిగిలింది. ఐదేళ్ల తన కుమారుడిని కళ్లముందే ఆర్టీసీ బస్సు నుజ్జునుజ్జు చేయడంతో గుండెలవిసేలా రోదించింది. గూడూరు పట్టణానికి చెందిన సింగనిగేరి కోస్గి వీరేష్, వరలక్ష్మి దంపతులు వారి బంధువులు సుంకులమ్మ ఉత్సవం చేస్తుండగా ఇద్దరు కుమారులతో వచ్చారు. బంధువులతో కలిసి అమ్మవారి ఆలయం వైపు వెళ్తుండగా ఎమ్మిగనూరు వైపు నుంచి కర్నూలు వస్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా భక్తుల గుంపు మీదకు దూసుకెళ్లింది. ప్రమాదంలో చిన్నారి విక్రమ్(5)బస్సు టైర్ల కింద పడిపోయాదు. కల్ల ముందే బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు వీరేష్, వరలక్ష్మితో పాటు బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా మారు మోగింది. పోలీసులు సంఘటన ప్రాంతానికి వచ్చి బస్సు డ్రైవర్ను అదుపులో తీసుకుని మృతదేహాన్ని పంచనామా కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. రంజాన్ సరుకులు తీసుకొద్దామని వెళ్లి.. పత్తికొండ రూరల్: రంజాన్ పండుగకు సరుకులు తీసుకొద్దామని బయల్దేరిన ఓ వ్యక్తి మృత్యుఒడికి చేరిన సంఘటన మంగళవారం మండల పరిధిలోని కొత్తపల్లి రిజర్వాయర్ సమీపంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. దేవనకొండ మండల పరిధిలోని ఎంకె కొట్టాల నుంచి పత్తికొండకు కమాల్సా(35), అతని బావమరిది ఖాజామొద్దీన్ రంజాన్ పండుగకు సరుకులు కొందామని, బైక్పై పత్తికొండకు బయలుదేరారు. కొత్తపల్లి రిజర్వాయర్ సమీపంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ వారి బైక్ను కల్వర్టు వద్ద ఢీకొంది. దీంతో బైక్పై ఉన్న కమాల్సా కల్వర్టుపై నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందగా వెనక కూర్చున్న ఖాజామోద్దీన్ గాయాలపాలయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఖాజామొద్దీన్ పత్తికొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడికి భార్య ఫాతిమాబి, కుమార్తె హరిఫాబి, ఉమర్ఫారుఖ్ సంతానం ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడిని తీసుకొచ్చేందుకు వెళ్తూ.. ఆళ్లగడ్డ: బతుకు దెరువు కోసం పరాయి దేశంలో ఉంటూ ఎన్నో ఏళ్ల తరువాత తిరిగి వస్తున్న కొడుకును స్వగ్రామానికి తీసుకు వచ్చేందుకు వెళ్తూ ఓ తండ్రి కొడుకును చూడకుండానే అనంత లోకాలకు వెళ్లిన సంఘటన ఆళ్లగడ్డ సమీపంలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ రామయ్య తెలిపిన వివరాలు.. వైఎస్సార్ జిల్లా మండల కేంద్రం సుండుపల్లికి చెందిన నాగయ్య కుమారుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. సెలవుపై గ్రామానికి వస్తున్నానని హైదరాబాద్ విమానాశ్రయానికి కారు తీసుకురావాలని సూచించడంతో నాగయ్య ఇన్నోవా కారు బాడుగకు తీసుకుని మంగళవారం తెల్లవారు జామున బయలు దేరాడు. ఈ క్రమంలో పట్టణ శివారులోని ఆల్ఫా కళాశాల సమీపంలోకి వచ్చేసరికి కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ప్రమాదంలో నాగయ్య అక్కడిక్కడే మృతి చెందగా ఒంటిమిట్ట మండలం మండపంపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ శశికుమార్ (21) తీవ్రంగా గాయపడగా స్థానిక వైద్యశాలకు తరలిస్తుంగా మృతి చెందాడు. డ్రైవర్ పక్కన కూర్చున్న మరో వ్యక్తికి ఎటువంటి గాయాలు కాలేదని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు -
‘నిషేధం’పై భగ్గుమన్న విపక్షాలు
న్యూఢిల్లీ/తిరువనంతపురం: కబేళాల కోసం పశువుల క్రయవిక్రయాలను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు భగ్గుమన్నాయి. కేంద్ర నిర్ణయాన్ని సమాఖ్య వ్యవస్థపై దాడిగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభివర్ణించారు. రంజాన్ మాసం ఆరంభంలోనే కేంద్రం తీసుకున్న చర్య తమపై ప్రత్యక్ష దాడిగా మైనారిటీలు భావించే ప్రమాదం ఉందన్నారు. నోటిఫికేషన్ను రద్దు చేయాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు. ప్రజల ఆహారపు అలవాట్లను నియంత్రించే హక్కు కేంద్రానికి లేదని పుదుచ్చేరి సీఎం వి.నారాయణస్వామి తేల్చిచెప్పారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా కేరళలోని ఆందోళనకారులు పలుచోట్ల బీఫ్ వండి తమ నిరసనను తెలియజేశారు. మోదీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం బ్లాక్ డే పాటిస్తామని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రకటించింది. నోటిఫికేషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డీఎంకే కోరింది. మరోవైపు కబేళాలకు పశువుల తరలింపుపై నిషేధాన్ని కేంద్రం సమర్థించుకుంది. ఈ నిర్ణయం వల్ల నిబంధనలకు విరుద్ధంగా జరిగే పశువుల అమ్మకాలతో పాటు స్మగ్లింగ్ను అరికట్టడం వీలవుతుందని పర్యావరణ శాఖ తెలిపింది. -
నాటి బీజం... నేటి సేవా వృక్షం
బంధువులు కానీ స్నేహితులు కానీ హాస్పిటల్లో ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? పండ్లు తీసుకెళ్లి ఆత్మీయంగా పలకరిస్తారు. ఆదరంగా మాట్లాడతారు. ఏమీ కాదని ధైర్యం చెబుతారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తారు... ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తారు. అయితే... మౌలానా గియాజ్ అహ్మద్ రషాదీ అంతటితో ఆగిపోలేదు. హైదరాబాద్, ఉస్మానియా హాస్పిటల్లో తన బంధువుని పరామర్శించి, మరో బెడ్ మీద ఏకాకిగా ఉన్న 65 ఏళ్ల పేషెంటును కూడా పలకరించాడు. కుశలం అడుగుతూ... ‘మీకు ఎవరూ లేరా? మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరూ రాలేదేమిటి’? అని అడిగాడు. అప్పుడా పెద్దాయన ‘నాకు ఎవరూ లేరని, అల్లా నా కోసం నిన్ను పంపించాడు’ అన్నాడు. ఆ మాట రషాదీ మార్గాన్ని మార్చేసింది. ఇప్పుడు రషాదీ గొప్ప సమాజసేవకుడు. ఆ పెద్దాయనతో మొదలు పెట్టిన సహాయం... నేడు శాఖోపశాఖలుగా విస్తరించింది. పదకొండు రాష్ట్రాల్లో ‘సఫా బైతుల్ మాల్’ ఆపన్నులకు సేవలందిస్తోంది. రంజాన్ మాసంలో అన్నం పెడుతోంది. వందలాది ఇళ్లలో ఈదుల్ ఫిత్ర్ పండుగ చేస్తోంది. ఉస్మానియాతో మొదలు! ఉస్మానియాలో పరిచయమైన ఆ పెద్దాయనకు ఆహారం, మందులు తెచ్చి ఇచ్చాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు అలాగే చేశాడు. అలా సమాజంలో ఎంతమంది ఉన్నారోననే ఆలోచన. అది బీజంలా నాటుకుంది. స్నేహితులను కలుపుకుని 2006లో ‘సఫా బైతుల్ మాల్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్’ స్థాపించాడు. ఈ పదేళ్లలో అది నగరంలోని 70 బస్తీలకు, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడ, ఒరిస్సా, బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాలకు విస్తరించింది. ఎక్కడెక్కడ అవసరం? రషాదీ హైదరాబాద్, ఓల్డ్ మలక్పేటలో అరబిక్ టీచర్. మదర్సాలలో చదువుకునే విద్యార్థుల్లో ఈ సేవాగుణాన్ని అలవరిచి, వారినే స్వచ్ఛంద సహాయకులుగా మార్చుకున్నారు. విద్య, వైద్యంతోపాటు అనారోగ్యంతో ఉన్న వారికి మందులు, తిండి లేని వారికి దినుసులు ఇస్తారు. పిల్లల పోషణ భారంతో కుంగిపోతున్న మహిళలు, వృద్ధులకు ప్రభుత్వం ఇచ్చే రేషన్ కార్డును పోలిన కార్డును మంజూరు చేస్తున్నారు. నెలనెలా బస్తీల్లో 4,500 కుటుంబాలకు సరుకులను పంచుతారు. రెండొందలకు పైగా వితంతువులకు నెలకు వెయ్యి రూపాయల పింఛన్ ఇస్తున్నారు. మానసిక, శారీరక వికలాంగులకు వైద్యంతోపాటు పెన్షన్ ఇస్తున్నారు. ఒక వ్యక్తిలో మొదలైన ఒక మంచి ఆలోచన... మంచి ఫలాలనే ఇస్తుందని మరోసారి నిరూపితమైంది. రషాదీ ఆ పని చేసి చూపించారు. – మంజూర్ ⇔ రంజాన్ నెలలో పేదవారికి బియ్యం, 15 రకాల నిత్యావసర సరుకులు ఇస్తారు. రంజాన్ పండగ చేసుకోవడానికి ఈద్ ప్యాక్లు ఇస్తారు. ⇔ ఆనాథ పిల్లల కోసం ప్రత్యేక హాస్టల్ కమ్ స్కూల్ ఏర్పాటు చేశారు. ఇందులో నగరంతో పాటు ఇతర జిల్లాలకు చెందిన 330 మంది పిల్లలున్నారు. ⇔ పేదలకు అంత్యక్రియలు, ఆనాథలైన ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. సంస్థ నిర్వహణ! ⇔ ఐదు వందలకు మించిన విరాళం తీసుకోరు. ఇంట్లో పాత పేపర్లు, పాత సమాను కూడా ఇవ్వవచ్చు. ఇందుకోసం జీపీఎస్తో అనుసంధానమైన సంస్థ వాహనాలు బస్తీల్లో తిరుగుతాయి. ⇔ ఇల్లు, ఊరు మారే వాళ్లు వద్దనుకున్న సామాను, దుస్తులను ఇచ్చేస్తుంటారు. ఈ సంస్థ హెల్ప్లైన్కి ఫోన్ చేసి సమాచారం ఇస్తే వాహనం వెళ్తుంది. వైద్యం ఒక్కటే చాలదు! ఈ పదేళ్లలో లక్షల మందికి విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో సహయపడుతున్నాం. మొదట్లో రోగులకు మందులు ఇవ్వాలనుకున్నాం. పేదల బస్తీల్లో సర్వే చేసినప్పడు వారుపడుతున్న ఇబ్బందులను చూశాక వైద్యం ఒక్కటే చాలదనిపించింది. దాంతో విద్య, ఇతర సంక్షేమాలను కూడా చేర్చాం. రంజాన్ శుభ మాసం సందర్భంగా... సంస్థ ద్వారా జకాత్, సదకాత్, ఫిత్రా ఇవ్వాలంటే హెల్ప్లైన్ (09394419820). – మౌలానా గియాజ్ అహ్మద్ రషాదీ సఫా బైతుల్ మాల్ అధ్యక్షులు మందులు... పెన్షన్ కూడా! నా భర్త చనిపోయాడు. పిల్లలు లేరు. బీపీ, షుగర్, థైరాయిడ్తో బాధపడుతున్నాను. సఫా బైతుల్ మాల్ సభ్యులు తెల్లకార్డు ఇచ్చారు. మూడేళ్ల నుంచి ప్రతి నెలా వైద్యం చేసి మందులు, వితంతు భృతి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. – మహెమూద్ బీ ఫలక్నుమా, హైదరాబాద్ క్యాన్సర్కు వైద్యం! నేను ఆటో డ్రైవర్ని. రెండేళ్ల క్రితం క్యాన్స్ర్ వచ్చింది. సఫా బైతుల్ మాల్ వారు వైద్యం చేయిస్తున్నారు. నా కుటుంబాన్ని పోషిస్తున్నారు. – మహ్మద్ షుకూర్, హైదరాబాద్ -
రంజాన్ షురూ !
- పుణ్యాల మూటకట్టుకునే సీజన్ పవిత్ర రంజాన్ మాసం - నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కర్నూలు(ఓల్డ్సిటీ): పుణ్యాలు మూట కట్టుకునే పవిత్ర రంజాన్ మాసం ఇది. అల్లా ఆరాధనలో గడిపే మాసం కావడంతోనే దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. పవిత్ర ఖురాన్లో పేర్కొన్న ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ఉపవాస వ్రతం. దీనినే పార్సీ భాషలో రోజా, అరబ్బీలో సౌమ్ అంటారు. పవిత్ర ఖురాన్ సంపూర్ణంగా భువిపైకి అవతరించిన దినం కూడా రంజాన్ మాసంలోనే ఉండటం విశేషం. కలిమా, నమాజ్, రోజా, జకాత్, హజ్ అనేవి ఇస్లాంకు మూలస్తంభాలు. వీటిలో హజ్ తప్ప మిగతా నాలుగు మూల సూత్రాలు అమలయ్యేది ఒక్క రంజాన్ నెలలో మాత్రమే. ఆర్థిక స్థోమత కలిగిన వారు తప్పకుండా హజ్ యాత్ర నియమాన్ని కూడా సంపూర్ణం చేయాలి. ఇస్లాంలోకి ప్రవేశించే మార్గమే కలిమా. లాఇలాహ ఇల్లాల్లాహ్, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ (సొల్లెల్లాహు అలైహివసొల్లం). ఆ సృష్టికర్తే (అల్లాయే) సమస్త సృష్టికి దైవం. ఆయన ప్రవక్త ముహమ్మద్ (సొ.అ.స.) అని అర్థం. ఈ సూత్రాన్ని విశ్వసించడమే కాకుండా ఆచరించాలి. రెండో మూలస్తంభం నమాజ్. నమాజ్ను నిత్యజీవితంలో రోజుకు ఐదుపూటలు పాటించాలి. రోజా, జకాత్ (దానధర్మాలు) వంటివాటికి రంజాన్ మాసంలోనే గొప్ప అవకాశం. మరో మూల సూత్రమైన నమాజు లేనిదే రోజా సంపూర్ణం కానేరదు. ప్రతి నమాజులోనూ కలిమా పఠనం జరుగుతుంటుంది. ఒక్క హజ్ తప్ప మిగతా మూల స్తంభాలను నిలబెట్టడంలో రంజాన్ మాసం ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఇందులో ఉపవాసాలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. సమయపాలన ముఖ్యం: ధర్మనిష్ఠతో ఉపవాసాలు ఉండాలి. నిర్ణీత సమయాల్లోనే సహెర్, ఇఫ్తార్లు పాటించాలి. అందరూ ఒకేసారి కచ్చితమైన వేళలు పాటించేందుకు వీలుగా కర్నూలు నగరంలో ఔటు పేల్చే విధానం ఉంది. ఉపవాసంలో శరీరానికే కాకుండా మనసుకూ కళ్లెం వేయాల్సి ఉంటుంది. మంచి దృష్టితో చూడాలి. మంచినే పాటించాలి. చెడుకు దూరంగా ఉండాలి. ఐదుపూటలా విధిగా నమాజు చేయాలి. ఖురాన్ పఠనం, సారాంశంపై అవగాహన, అల్లా నామస్మరణ, అల్లాచింతన వంటివి విరివిగా చేయాలి. రంజాన్ నెలలో చేసే ఏ పవిత్ర కార్యానికైనా 70 రెట్ల పుణ్యం అధికంగా లభిస్తుంది. దీంతో ఈ మాసంలో దాన ధర్మాలు విరివిగా చేస్తారు. మాసపు చివర్లో ప్రతి ముస్లిం ఫిత్రా దానం చెల్లించుకోవాలి. ఆర్థికస్థోమత కలిగిన వారు జకాత్ దానం చేయాలి. ప్రతి మసీదులోనూ తరావీలో ఖురాన్ పఠనం కర్నూలు నగరంలోని ప్రతి మసీదులోనూ ఇటీవల తరావీలో ఖురాన్ పఠనం తప్పనిసరి చేశారు. పవిత్ర ఖురాన్లో 30 పారాలు ఉంటాయి. రోజుకో పారా చొప్పున నెల మొత్తాన్ని పఠిస్తారు. గతంలో బహు కొద్ది మసీదుల్లో మాత్రమే తరావీలో ఖురాన్ పఠనం పఠించే వారు. ప్రస్తుత కాలంలో ఖురాన్ కంఠస్థం చేసే (హాఫిజ్ల) సంఖ్య మెరుగ్గా ఉండటంతో ప్రతి మసీదులోనూ రంజాన్ మాసంలో ఒక హాఫిజ్ను ఏర్పాటు చేసుకుని నెలమొత్తం మసీదుల్లో సంపూర్ణం ఖురాన్ పఠనంతోనే తరావీ నమాజులు పాటిస్తున్నారు. నియమాలు.. మతగ్రంథాల ప్రకారం వయోజనులైన స్త్రీపురుషులందరూ విధిగా రోజా దీక్ష పాటించాలి. వృద్ధులు, పిల్లలు, వ్యాధిగ్రస్థులు, ప్రయాణంలో ఉన్న వారికి మాత్రమే మినహాయింపు ఉంటుంది. అయితే వ్యాధిగ్రస్థులు కూడా ఆరోగ్యం చేకూరిన తర్వాత ఆ రోజాలను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. రంజాన్ అంటే పాపాలను దహించివేయుట అనే అర్థం వస్తుంది. ఉపవాసదీక్షలు అనేవి మనిషిలోని చెడు భావనలను, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపేవిగా ఉండాలి. సాధ్యమైనంత మేరకు పుణ్యకార్యాలు చేపడుతుండాలి. -
రేపటి నుంచి రంజాన్ ఉపవాసాలు
కర్నూలు (ఓల్డ్సిటీ): ఆకాశంలో నెలవంక శుక్రవారం సాయంత్రం కనిపించకపోవడంతో.. శనివారం తప్పనిసరిగా కనిపించే అవకాశాలు ఉన్నాయని.. ఆదివారం నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతున్నట్లు కర్నూలు ప్రభుత్వ ఖాజీ సలీంబాషా ఖాద్రి ప్రకటించారు. హిలాల్ కమిటీ తీర్మానం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రంజాన్ మాసపు ఉపవాసాలు అల్లాకు అత్యంత ప్రీతిపాత్రమైనవన్నారు. ఐదుపూటలా నమాజుతో పాటు తరావీ నమాజు చేయాలని, ఉపవాసాల్లో ధర్మనిష్ఠ పాటించాలని సూచించారు. -
రంజాన్కు ఘనంగా ఏర్పాట్లు చేయండి
అధికారులకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇబ్బందులు తలెత్తకుండా ఘనంగా ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తల సాని శ్రీనివాస్యాదవ్, మైనారిటీ సంక్షేమ శాఖ సలహా దారు ఏకే ఖాన్, నగర శాసనసభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. రంజాన్ మాసం ప్రారంభమైనప్పటి నుంచి పండుగ వరకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం జరుగకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను మహమూద్ అలీ ఆదేశించారు. మసీదుల వద్ద ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాతబస్తీలో తాగునీరు, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాలు, ప్రత్యేక డంపింగ్ బిన్లను ఏర్పాటు చేయాలని అధి కారులకు సూచించారు. చార్మినార్ ప్రాంతంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలన్నారు. పండుగ సందర్భంగా 24 గంటలు హోటల్స్ తెరిచే ఉంటాయన్నారు. మసీద్ల రిపేర్ల నిమిత్తం రూ.5 కోట్లు, మక్కా మసీద్ రిపేరు కోసం రూ.8.48 కోట్లు కేటాయించామన్నారు. ప్రభుత్వ కార్యాల యాల్లో పని చేసే ముస్లిం ఉద్యోగులకు గంట ముందుగా ఆఫీసు విడిచి వెళ్లడానికి ప్రభుత్వం అనుమతినిచ్చిందన్నారు. సమావేశంలో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మహ్మద్ సలీం, ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, అహ్మద్ పాషాఖాద్రి, ముంతాజ్ అహ్మద్ ఖాన్, మోజంఖాన్, మాగంటి గోపీనాథ్, జాఫర్ హుస్సేన్, అహ్మద్ బిన్ బలాల, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, కమిషనర్ జనార్దన్రెడ్డి, జలమండలి ఎండీ దానకిషోర్, విద్యుత్ శాఖ సీఎండీ రఘుమారెడ్డి, మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు. -
బంగ్లా ఈద్గాపై దాడి: రంగంలోకి భారత ఎన్ఎస్జీ
- ఒక ముష్కరుడి హతం.. మరో ఆరుగురి కోసం వేట ఢాకా: అధికారిక ఇస్లామిక్ దేశమైన బంగ్లాదేశ్ లో రంజాన్ పండుగ నాడు ముష్కరులు బీభత్సం సృష్టించారు. దాదాపు ఏడుగురు సాయుధులు.. బంగ్లాలోనే అతిపెద్ద ఈద్గా(ముస్లింల ప్రార్థనా స్థలం) అయిన షోలాకియాపై దాడి చేశారు. నమాజ్ చేసేందుకు వచ్చినవారిపై పెద్ద ఎత్తున బాంబులు, తుపాకులు, కత్తులతో విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఈ దాడిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ సహా నలుగురు మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముష్కరుల్లో ఒకణ్ని భద్రతాబలగాలు అంతమొందించాయి. మరొకడిని సజీవంగా పట్టుకున్నాయి. ఈద్గా సమీపంలోని స్కూల్ భవనంలో దాక్కున్న మరి కొదరు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. మెడలో తుపాకులు, ఓ చేతిలో నాటు బాంబులు, మరో చేతిలో కత్తులు చేతబట్టుకున్న దాదాపు ఏడుగురు.. షోలాకియా ఈద్గా ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని, పోలీస్ చెక్ పోస్టుపై బాంబులు విసిరారని, వెంటనే తేరుకున్న పోలీసులు ముష్కరులపై కాల్పులు జరిపారని, ప్రతిదాడిలో ఒక ఉగ్రవాది చనిపోగా, మరొకడు సజీవంగా పట్టుబడ్డాడని కిశోర్ గంజ్ జిల్లా పోలీస్ డిప్యూటీ చీఫ్ తౌఫజల్ హుస్సేన్ తెలిపారు. పోలీసు కాల్పులతో పారిపోయిన ముష్కరులు ఈద్గా సమీపంలోని ఓ స్కూల్ భవనంలోకి చొరబడి, లోపలినుంచి కాల్పులు చేస్తున్నారని, వారి కోసం వేట కొనసాగుతోందని పేర్కొన్నారు. రంగంలోకి భారత ఎన్ఎస్జీ రంజాన్ పర్వదినాన పొరుగు దేశంలో చోటుచేసుకున్న భీకర పరిణామాలపై భారత ప్రభుత్వ స్పందించింది. బంగ్లా ప్రభుత్వ అభ్యర్థన మేరకు నలుగురు నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్ జీ) అధికారులను కిశోర్ గంజ్ కు పంపనుంది. 26/11 ముంబై, గుర్ దాస్ పూర్, పఠాన్ కోట్ ఎయిర్ బేస్ వంటి ఉగ్రదాడుల సమయంలో సమర్థవంతంగా పనిచేసి, ముష్కరులను అంతం చేయడంతో ఎన్ఎస్జీది కీలక పాత్ర. ప్రస్తుతం షోలాకియా ఈద్గా సమీపంలో దాక్కున్న ముష్కరులను మట్టుపెట్టడంతోపాటు, దర్యాప్తులో మన ఎన్ఎస్ జీ అక్కడి సిబ్బందికి సహకరిస్తుంది. -
ముష్కరులు, పోలీసుల మధ్య హోరాహోరీ కాల్పులు
ఢాకా: ఇసుక వేస్తే రాలనంతగా కిక్కిరిన జనం.. కిలోమీటర్ల మేర వరుసలు కట్టి నమాజ్ కు నడుం వంచుతోన్న ముస్లింలు.. అంతకంతా లోపలికి వస్తోన్న వేలదిమంది.. రంజాన్ పర్వదినమైన గురువారం ఉదయం 9 గంటలకు బాంగ్లాదేశ్ లోనే అతిపెద్దదైన షోలాకియా ఈద్గా వద్ద కనిపించిన దృశ్యాలు. బంగ్లా న్యూస్ చానెళ్ల కథనం ప్రకారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలోనే, అంటే 9:30 గంటలకు ఈద్గా ప్రవేశ ద్వారం వద్ద పెద్ద చప్పుడైంది. తుపాకులు ధరించి, నాటు బాంబులు చేతబట్టుకున్న కొందరు ముష్కరులు.. పోలీసులు, నమాజ్ చేస్తున్నవారిపై బాంబులు విసిరారు. ఒక పోలీసు, మరో పౌరుడు అక్కడికక్కడే కుప్పకూలారు. క్షణాల్లో కలకలం మొదలైంది. హాహాకారాలు చేస్తూ జనం పరుగులు తీశారు. బాంబులు విసిరి పరుగెత్తిన ముష్కరులు ఓ ఇంట్లోకి చొరబడి దాక్కున్నారు. షోలాకియా ఈద్గాలో పేలుడు జరిగిన నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు ముష్కరులు దాక్కొన్న ఇంటిని చుట్టుముట్టాయి. లోపలి ముష్కరులు భద్రతా బలగాలపై కాల్పులు జరుపుతున్నారు. ఇటువైపు నుంచి ప్రతికాల్పులూ జరుగుతున్నాయి. ముష్కరుల ఏరివేత ఆపరేషన్ ఎన్నిగంటలు పడుతుందనే విషయం ఇంకా తెలియరాలేదు. కాగా, బంగ్లాదేశ్ సమాచార శాఖ మంత్రి హసన్ ఉల్ హక్ పేలుళ్లపై భిన్నంగా స్పందించారు. ఈద్గాలో బాంబులు విసిరింది దయేష్ ఉగ్రవాదులు కాదని, రాజకీయ ప్రత్యర్థులేనని ట్వీట్ చేశారు. బంగ్లాలో అధికార, విపక్ష పార్టీ మధ్యల మధ్య హింసాత్మక దాడులు జరుగుతోన్న సంగతి తెలిసిందే. జులై 1న ఢాకాలోని ఓ రెస్టారెంట్ లోకి చొరబడ్డ ఐసిస్ ఉగ్రవాదులు 20 మందిని పొట్టనపెట్టుకున్న విషాదం నుంచి తేరుకోకముంతే రంజాన్ పండుగనాడు ఈద్గాలో పేలుళ్లు జరగడం బంగ్లాదేశీల్లో విషాదం నింపింది. -
బంగ్లాలో పండుగ విషాదం: ఈద్గా వద్ద పేలుడు
ఢాకా: ముస్లింలు పర్వదినాన్ని ఆనందోత్సాహల మధ్య జరుపుకొంటోన్న తరుణంలో ఉగ్రమూకల కళ్లుకుట్టాయి. ప్రార్థనలు చేస్తున్నవారే లక్ష్యంగా దాడులకు తెగబడ్డాయి. బంగ్లాదేశ్ లోనే అతి పెద్ద ఈద్గా వద్ద గురువారం ఉదయం ముష్కరులు బాంబులు పేల్చారు. ఇప్పటివరకు తెలిసిన సమాచారం మేరకు పేలుళ్లలో ఒక పోలీసు, పౌరుడు మృతి చెందారు. 12 మందికి పైగా గాయపడ్డారు. ఈద్గాకు సమీపంలోని ఓ ఇంట్లోకి చొరబడ్డ ముష్కరులు.. లోపలినుంచి కాల్పులు జరుపుతున్నారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఉగ్రవాదులను మట్టుపెట్టే ఆపరేషన్ ను ప్రారంభించారు. కాల్పుల మోతతో ఈద్గా పరిసరాలు భీతావాహంగా మారాయి. బంగ్లా రాజధాని ఢాకాకు 100 కిలోమీటర్ల దూరంలోని కిశోర్ గంజ్ పట్టణ శివారులో గల షోలాకియా ఈద్గా.. ఆ దేశంలోనే అతిపెద్ద ప్రార్థనా స్థలం. పర్వదినంనాడు దాదాపు 4 లక్షల మంది ముస్లింలు అక్కడ ప్రార్థనలు చేస్తారు. పెద్ద సంఖ్యలో జనం గుమ్మికూడటాన్ని అవకాశంగా తీసుకున్న ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈద్గా ప్రవేశ ద్వారం వద్ద చోటుచేసుకున్న పేలుడులో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఒకరు మరణించగా, ఐదుగురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం ఢాకాలోని ఓ రెస్టారెంట్ లోకి చొరబడ్డ ఐసిస్ ఉగ్రవాదులు 20 మందిని పొట్టనపెట్టుకున్న సంఘటన నుంచి తేరుకోకముందే పండుగనాడు పేలుడు జరగడం బాగ్లాదేశీల్లో విషాదం నింపింది. -
దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. లక్షలాది మంది ముస్లింలు సంప్రదాయ దుస్తులు ధరించి తమకు సమీపంలో ఉన్న మసీదులకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఢిల్లీ జమామసీదులో గురువారం జరిగిన సామూహిక ప్రార్థనల్లో ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పిల్లలు, పెద్దలంతా ఈ ప్రార్థనలకు హాజరయ్యారు. ఒకరినొకరు హత్తుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముస్లింలు తమ ఉపవాస దీక్షలను విరమించి పండగ చేసుకుంటున్నారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మక్కామసీద్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నెలరోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసదీక్షలు నిర్వహించిన ముస్లిం సోదరులు.. దీక్షలకు పరిపూర్ణ ఫలితం లభించే రంజాన్ పండుగ రోజున సంబరాలు జరుపుకుంటున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఆలింగనాలు, కరచాలనాలు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోనూ ఈద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమంలో పాల్గొని... ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయ దుస్తులు ధరించిన పిల్లలు ప్రార్థనా మందిరం వద్ద సందడి చేశారు. -
నేడే రంజాన్ పండుగ
న్యూఢిల్లీ : ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ను దేశవ్యాప్తంగా గురువారం భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. దేశంలోని ముస్లింలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. సర్వమత ఐకమత్యానికి, ప్రపంచశాంతికి ఈ పండుగ ప్రతీక అని అభివర్ణించారు. అలాగే వివిధ దేశాల నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. కశ్మీర్, కేరళ రాష్ట్రాల్లో ఈద్-ఉల్-ఫితర్ను బుధవారమే జరుపుకున్నారు. మసీదులు, ఈద్గాలకు వెళ్ళి భక్తి శ్రద్దలతో ప్రత్యేకప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ సందర్భంగా శ్రీనగర్లోని హాజరత్బల్ మసీదులో 50 వేల మంది ప్రార్థనలు చేశారు. దీని తరువాత శ్రీనగర్ పాతబస్తీలోని ఈద్గాలో 40 వేల మంది ప్రార్థనలు చేశారు. శ్రీనగర్లో ఉద్రిక్త పరిస్థితులు శ్రీనగర్ : శ్రీనగర్లోని సఫక్దల్లోని ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనలు చేసుకుంటున్న వారిపై దుండగులు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఘర్షణల్లో 30 మంది గాయపడ్డారు. పోలీస్ అధికారితో పాటు, 20 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డ వారిలో ఉన్నారు. వేర్పాటువాద నేతలు గిలానీ, ఉమర్ ఫరూఖ్, యాసీన్ యాసీన్లను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.