ఆ విద్యార్థుల వివరాలివ్వండి | Bangladesh School, Colleges Ordered To Report Absent Students | Sakshi
Sakshi News home page

ఆ విద్యార్థుల వివరాలివ్వండి

Published Sun, Jul 10 2016 9:33 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

కొన్నాళ్లుగా ఎవరైనా పిల్లలు తప్పిపోయుంటే వారి వివరాలను అధికారులకు అందజేయాల్సిందిగా ప్రధానమంత్రి షేక్ హసీనా ఇటీవల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

ఢాకా: గత పది రోజులుగా విద్యాలయాలకు హాజరుకాని విద్యార్థుల వివరాలు ఇవ్వాల్సిందిగా అన్ని విద్యాసంస్థలను బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. కొన్నాళ్లుగా ఎవరైనా పిల్లలు తప్పిపోయుంటే వారి వివరాలను అధికారులకు అందజేయాల్సిందిగా  ప్రధానమంత్రి షేక్ హసీనా ఇటీవల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఢాకా దాడి అనంతరం పలువురు విద్యార్థులు తప్పిపోయారని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం  ఈ నిర్ణయం తీసుకుంది.

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జులై 1న గుల్షన్ ప్రాంతంలో హోలే అర్టిసన్ బేకరి అండ్ రెస్టారెంట్ పై ఆరుగురు సాయుధులు దాడి చేసి 22 మందిని అతి కిరాతకంగా హతమార్చారు. ఇందులో ఐదుగురిని మట్టు పెట్టిన ఉగ్రవాదులు ఒకరిని సజీవంగా పట్టుకున్నారు. ఐదుగురు ఉన్నత విద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థులే నని దర్యాప్తులో తేలిన విషయం తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement