colleges
-
అన్ని కాలేజీలకు ఒకే ఫీజు సరికాదు
సాక్షి, అమరావతి: పీజీ మెడికల్, డెంటల్ కోర్సులకు రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కాలేజీలని్నంటిలో ఏకీకృత ఫీజు సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీహెచ్ఈఆర్ఎంసీ) సిఫారసుల మేరకు 2020–21 నుంచి 2022–23 విద్యా సంవత్సరాలకు ఫీజును ఖరారు చేస్తూ ప్రభుత్వం 2020 మే 29న జారీ చేసిన జీవో 56ను రద్దు చేసింది.ఈ జీవో చట్టం ముందు నిలబడదని స్పష్టం చేసింది. ఏపీహెచ్ఈఆర్ఎంసీ అన్నీ మెడికల్, డెంటల్ కాలేజీలను ఒకే గాటన కట్టి, ఏకీకృత ఫీజు నిర్ణయించడం చట్ట విరుద్ధమన్న కాలేజీల వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఆ కాలేజీలు ప్రతిపాదించిన ఫీజుల వివరాలను పరిగణనలోకి తీసుకుని తిరిగి ఫీజు ఖరారు చేయాలని, ఆపైన రెండు నెలల్లో ఆదేశాలు జారీ చేయాలని కమిషన్ను ఆదేశించింది.ఒకవేళ ప్రతిపాదించిన ఫీజుతో కాలేజీలు విభేదిస్తే, ఆ కాలేజీ యాజమాన్యం అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే తగిన ఉత్తర్వులు జారీ చేయాలంది. కమిషన్ ఫీజులను పెంచితే, పెంచిన మేర బ్యాలెన్స్ మొత్తాలను అభ్యర్థుల నుంచి వారిచి్చన హామీ మేరకు కాలేజీలు వసూలు చేసుకోవచ్చని చెప్పింది. అదనపు ఫీజు వసూలులో నిర్ణయం అంతిమంగా కాలేజీలదేనని స్పష్టం చేసింది. జీవో 56ను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం ఈ ఏడాది సెప్టెంబర్లో విచారణ జరిపి, తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం తీర్పు వెలువరించింది.ఏకీకృత ఫీజు వల్ల కొన్ని లాభపడుతూ ఉండొచ్చు..ఏకీకృత ఫీజు విద్యార్థుల ప్రయోజనాలకు కూడా విరుద్ధం కావొచ్చునని హైకోర్టు తీర్పులో పేర్కొంది. తక్కువ ఫీజు ఉంటే మరింత ఎక్కువ చెల్లించాలని విద్యార్థులను కాలేజీలు బలవంతం చేయవచ్చునని తెలిపింది. ఏకీకృత ఫీజు వల్ల తగిన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధనా సిబ్బంది లేని కాలేజీలు లాభపడే అవకాశం ఉందని పేర్కొంది. మంచి సదుపాయాలు, నాణ్యమైన బోధనా సిబ్బంది కల్పిస్తున్న కాలేజీలకు ఇది నష్టం కలిగించవచ్చని తెలిపింది. ఇటువంటి కాలేజీలు ఎక్కువ ఫీజులు కోరడంలో తప్పులేదని తెలిపింది.ఫీజుల ఖరారుకు ముందు కాలేజీలు సమర్పించిన ఆదాయ, వ్యయాలు, మౌలిక సదుపాయాల వివరాలని్నంటినీ కమిషన్ పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదంది. ఆచరణ సాధ్యం కాని ఫీజును నిర్ణయించడం వల్ల ప్రత్యేక వృత్తి విద్యా కోర్సులు అందించే విద్యా సంస్థలు మూతపడతాయని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఆయా కాలేజీల నాణ్యత, సమర్థత, ఉత్పాదకతపైనా ప్రభావం చూపుతుందని తెలిపింది. -
ఢిల్లీలో ఆంక్షలు సడలించేందుకు ‘సుప్రీం’ నిరాకరణ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం కట్టడికి అమలు చేస్తున్న గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 ఆంక్షలను సడలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది. తమ ఆదేశాలు లేకుండా ఆంక్షలు తొలగించవద్దని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. దీనిపై గురువారం ని ర్ణయం తీసుకుంటామని తెలిపింది.ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఢిల్లీలో పాఠశాలలు, కళాశాలలు తెరిచే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. విద్యార్ధులు ఇంట్లో ఉండటం వల్ల కాలుష్య సమస్య తీరదని అభిప్రాయపడింది. ‘పెద్ద సంఖ్యలో విద్యార్థులకు తమ ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు లేవు, అందువల్ల ఇంట్లో కూర్చున్న పిల్లలకు, పాఠశాలకు వెళ్లే పిల్లలకు తేడా ఉండదు. అంతేగాక ఆన్లైన్ క్లాస్లలో పాల్గొనడానికి అందరి విద్యార్థులకు సౌకర్యాలు లేవు. ఇలాగే ఆన్లైన్ తరగతులు కొనసాగితే వారు వెనకబడిపోతారు. పాఠశాలలు, అంగన్వాడీలు మూసివేయడం వల్ల చాలా మంది విద్యార్ధులు మధ్యాహ్న భోజన సౌకర్యం కోల్పోతున్నారు. ’ అని జస్టిస్ ఎఎస్ ఓకా, జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. చదవండి: షిండేనే మహారాష్ట్ర సీఎం!ఈ మేరకు ఢిల్లీలో విద్యాసంస్థలు తెరిచే అంశాన్ని పరిశీలించాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్కు సూచించింది. అదే విధంగా 1 నుంచి 10,11, 12 తరగతులకు శారీరక తరగతులపై నిషేధం కొనసాగించడంతోపాటు ఫిజికల్ క్లాసుల నిర్వహణపై రేపటిలోగా (మంగళవార) నిర్ణయం చెప్పాలని సీఏక్యూఎమ్ను(CAQM) ఆదేశించింది.ఇక ఢిల్లీ పోలీసులపై సుప్రీంకోర్టు కొరడా ఝుళిపించింది. కాలుష్యాన్ని నివారించడంలో ఆంక్షలను సరిగా అమలు చేయకపోవడంపై సిటీ పోలీస్ కమిషనర్పై మండిపడింది. వాహనాల నియంత్రణకు చెక్పోస్టులు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేని వాహనాలను అనుమతించిన అధికారులపై సీరియస్ అయ్యింది. ఆదేశాలు అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.యాక్షన్ ప్లాన్-4 అమలు సమాజంలో అనేక వర్గాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని సుప్రీం ఆవేదన వ్యక్తం చేసింది. నిర్మాణరంగంలో కార్మికులు, దినసరి కూలీలు పనులు కోల్పోయారని తెలిపింది. 12 సెక్షన్ ప్రకారం శ్రామికులు ఇబ్బంది పడకుండా ఉండేలా వివిధ అధికారులకు ఆదేశాలు జారీ చేసేందుకు సీఏక్యూఎమ్కు అన్ని అధికారాలు ఉన్నాయి. కావున వారిందరికీ ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM)కి సూచించింది. -
తెలంగాణ వ్యాప్తంగా కాలేజీల సమ్మె! ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు డిమాండ్
-
బెంగళూరులో మూడు కాలేజీలకు బాంబు బెదిరింపులు
బెంగళూరు: బెంగళూరులో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి.బెంగళూరులోని మూడు ప్రముఖ కాలేజీలకు శుక్రవారం బాంబు బెదిరింపు మెయిల్స్ రావటంతో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. బీఎంఎస్ కాలేజీ, ఎంఎస్ రామయ్య కాలేజీ, బీఐటీ కాలేజీలకు బాంబు బెదిరింపులు రావటంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.Bengaluru Bomb Threat: Major Colleges, Including BIT, BMSCE and MSRIT Receive Bomb Threats; Probe Launchedhttps://t.co/BjoVZwox4e#Bengaluru #BIT #BombThreat— LatestLY (@latestly) October 4, 2024క్రెడిట్స్: LatestLYసమాచారం అందిన వెంటనే ఆయా కాలేజీల్లో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ , ఇతర సంబంధిత బృందాలు సెర్చ్ చేస్తున్నాయి. అవి నిజమైన బెదిరింపులా లేదా ఉత్తుత్తి బెదిరింపులా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఈ బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపులకు సంబంధించి.. హనుమంతనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.చదవండి: యూపీలో దారుణం.. నలుగురి కుటుంబ సభ్యుల హత్య -
38 కాలేజీల్లో జాబ్ గ్యారంటీ కోర్సులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కచ్చితమైన ఉపాధి కల్పించే ప్రయత్నాల్లో భాగంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ)రంగాల్లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణీత కాలేజీల్లో ప్రస్తుత 2024–25 విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా జాబ్ గ్యారంటీ కోర్సులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. రెగ్యులర్ డిగ్రీతోపాటు మినీ డిగ్రీ కోర్సుగా ‘బీఎఫ్ఎస్ఐ’ నైపుణ్య శిక్షణను అందించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 38 కాలేజీల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ఉన్నత విద్యామండలి గుర్తించిన 18 ఇంజనీరింగ్ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో చదువుతున్న 10వేల మంది విద్యార్థులకు శిక్షణ అందనుంది. ఈ కాలేజీల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్తో.. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ‘బీఎఫ్ఎస్ఐ’ కోర్సులు అందేవిధంగా కాలేజీలను ఎంపిక చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జాబ్ డిమాండ్ ఉన్న బీఎఫ్ఎస్ఐ సంస్థలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దేందుకు ఈ కోర్సు ఉపయోగపడనుంది. ఖరీదైన ఈ కోర్సును డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచితంగా అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా శిక్షణను అందుకోనున్న 10 వేల మంది విద్యార్థుల వివరాలతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ను రూపొందిస్తోంది. విద్యార్థుల బయోడేటాతోపాటు చదువుతున్న కాలేజీ, వారి విద్యార్హతలు, సాంకేతిక కోర్సుల అనుభవం వివరాలన్నీ అందులో పొందుపరుస్తారు. బీఎఫ్ఎస్ఐ రంగంలో పేరొందిన కంపెనీలు తమకు అవసరమైన ఉద్యోగులను ఎంపిక చేసుకునేందుకు ఈ పోర్టల్ వారధిగా పనిచేయనుంది. ఆ కంపెనీలు ఈ పోర్టల్లో ఉన్న విద్యార్థులతో నేరుగా వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ నైపుణ్యాలతో డిగ్రీ, ఇంజనీరింగ్లో కోర్సులు చేసిన విద్యార్థులకు ఉద్యోగ భరోసా దక్కనుంది. జాబితాలోని నాన్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే.. పింగళి ప్రభుత్వ మహిళా కాలేజీ– వడ్డేపల్లి, హన్మకొండ ఎస్ఆర్–బీజీఎన్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ– ఖమ్మం నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల– నల్గొండ ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, హైదరాబాద్ భవన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, హైదరాబాద్ ప్రభుత్వ సిటీ కాలేజీ, హైదరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సిద్దిపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, బేగంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఖైరతాబాద్ ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజీ, నాంపల్లి నిజాం కాలేజీ, హైదరాబాద్ ఆర్బీవీఆర్ఆర్ డిగ్రీ కాలేజీ, హైదరాబాద్ సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కాలేజీ, మెహదీపట్నం, హైదరాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా డిగ్రీ కాలేజీ, హైదరాబాద్ సెయింట్ పియస్ ఎక్స్ మహిళా డిగ్రీ కాలేజీ, నాచారం హైదరాబాద్ తారా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సంగారెడ్డి ఎంవీఎస్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, మహబూబ్నగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కరీంనగర్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, కోఠి, హైదరాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ, నిజామాబాద్ జాబితాలోని ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే.. బీవీఆర్ఐటీ హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీ (జేఎన్టీయూహెచ్) జి.నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (జేఎన్టీయూహెచ్) గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్– టెక్నాలజీ కాలేజీ (జేఎన్టీయూహెచ్) జేబి ఇంజనీరింగ్– టెక్నాలజీ కాలేజీ (జేఎన్టీయూహెచ్) జేఎన్టీయూ కూకట్పల్లి ప్రధాన క్యాంపస్ (జేఎన్టీయూహెచ్) కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జేఎన్టీయూహెచ్) మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జేఎన్టీయూహెచ్) వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ (జేఎన్టీయూహెచ్) వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్–టెక్నాలజీ (జేఎన్టీయూహెచ్) కిట్స్ వరంగల్ (కాకతీయ వర్సిటీ) చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఓయూ) మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీ (ఓయూ) మాటూరి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజీ (ఓయూ) మెథడిస్ట్ ఇంజనీరింగ్– టెక్నాలజీ కాలేజీ (ఓయూ) ఉస్మానియా వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ (ఓయూ) స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్– టెక్నాలజీ కాలేజీ (ఓయూ) ఆర్జీయూకేటీ బాసర (ఆర్జీయూకేటీ) బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నర్సాపూర్ (జేఎన్టీయూహెచ్) -
ప్రైవేట్ పై చంద్రబాబు మోజు
-
Rajasthan: బంద్తో విద్యాసంస్థల మూసివేత.. ఇంటర్నెట్ నిలిపివేత
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి ఈరోజు (బుధవారం) భారత్ బంద్కు పిలుపునిచ్చింది. బంద్ ప్రభావం రాజస్థాన్లోని విద్యాసంస్థలపై కనిపించింది.బంద్ పిలుపు నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. చిత్తోర్గఢ్ జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా భరత్పూర్లో భారత్ బంద్ దృష్ట్యా ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో స్థానికులు పలు ఇబ్బందులు పడుతున్నారు.భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పోలీసు బలగాలను మోహరించారు. చిత్తోర్గఢ్లో షెడ్యూల్డ్ కులాలు- తెగల మహార్యాలీ నిర్వహిస్తున్నారు.ఈ ర్యాలీ సందర్భంగా వీరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పిస్తారు. రాజస్థాన్లోని వివిధ విశ్వవిద్యాలయాలలో బుధవారం జరగాల్సిన పలు పరీక్షలను వాయిదా వేశారు. -
కాలేజీల్లో డ్రగ్స్ కట్టడికి క్లబ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ రక్కసిని అరికట్టడం, డ్రగ్స్ ముప్పును నివారించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. ఈ రెండు సమస్యలను పరిష్కరించేందుకు 24/7 పనిచేసే టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తేనుంది. వారం పది రోజుల్లో ఈ టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెస్తామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం ప్రకటించారు.ఎక్కడ ఇలాంటి తప్పులు జరిగినా విద్యార్థులు నిర్భయంగా ఈ నంబర్కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో శనివారం మాసాబ్ట్యాంక్లోని జేఎన్ఏఎఫ్ఏయూ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వారి వారి జీవితాలతోపాటు దేశాన్ని సైతం నాశనం చేస్తుందన్నారు. పాఠశాల స్థాయిలో డ్రగ్స్ను అరికట్టేందుకు ప్రహరీ క్లబ్లను ఏర్పాటుచేశామని, కాలేజీల్లో సైతం ఇలాంటి క్లబ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.పటిష్టమైన వ్యవస్థ: డీజీపీ జితేందర్తెలంగాణను డ్రగ్ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. రాష్ట్రంలో ర్యాగింగ్ను ఇప్పటికే నిషేధించామని, ర్యాగింగ్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైపుణ్యాలు తగ్గుతున్నాయని అన్నారు. దీనికి పరిష్కారంగానే ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటుచేసి, స్కిల్స్ కోర్సులను ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు.నగరాల్లోని వర్సిటీలు, కాలేజీలే కాకుండా మారుమూల ప్రాంతాల్లోని చిన్న కాలేజీల వరకు డ్రగ్స్ చేరాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. డ్రగ్స్తో కుటుంబాలు సైతం ఆర్థికంగా చితికిపోతున్నాయని పేర్కొన్నారు. కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన మాట్లాడుతూ.. యాంటీనార్కోటిక్స్ బ్యూరో తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదన్నారు. మన యువతను నాశనం చేయాలని కొంతమంది దుష్టులు కంకణం కట్టుకున్నారని, డ్రగ్స్ అనే యాసిడ్ను పిల్లలపై ప్రయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.యాంటీనార్కోటిక్స్ బ్యూరో డైర్టెర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ డ్రగ్స్ సంబంధిత సమాచారాన్ని 87126 71111 నంబర్కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. ర్యాగింగ్కు సంబంధించి ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిలో ఆరుగురు వైద్యులపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటరమణ, ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు డిగ్రీ కాలేజీలపై ‘న్యాక్’ పిడుగు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు ఇప్పటివరకు లేకున్నా ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చేవి. న్యాక్ను కేవలం నాణ్యత ప్రమాణాలకు సూచిక గానే పరిగణించేవి. రాష్ట్రంలో 1100 కాలేజీల్లో, కేవలం ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు కలిపి 200 కాలేజీలకే న్యాక్ గుర్తింపు ఉంది. కానీ ఇక మీదట ప్రతీ కాలేజీ న్యాక్ పరిధిలోకి రావాల్సిందే. ఇది ఉంటేనే అనుబంధ గుర్తింపు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలనే ప్రతిపాదన న్యాక్ తీసు కొస్తోంది. రాష్ట్రంలోని న్యాక్ గుర్తింపు ఉన్న (న్యాక్ కాలేజీలు), న్యాక్ గుర్తింపు లేని కాలేజీలు (నాన్–న్యాక్ కాలేజీలు)గా విభజి స్తారు. నాన్ న్యాక్ కాలేజీలకు క్రమంగా అను మతి ఇవ్వకూడదనే నిబంధన తేవాలనే యోచ నలో ఉన్నారు. ఈ మేరకు ఇటీవల బెంగళూరు కేంద్రంగా న్యాక్ విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించింది. దక్షిణ భారత రాష్ట్రాల ఉన్నత విద్య మండళ్ళ చైర్మన్లను, పలువురు విద్యారంగ నిపుణులను ఈ సమావేశాలకు ఆహ్వానించింది. న్యాక్ నిబంధనలను మరింత సరళతరం చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరించింది. కొత్త నిబంధనలపై రాష్ట్రాల స్థాయిలో అవగా హన కల్పించాలని కోరింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమవ్వాలని సూచించింది.90 శాతం కాలేజీలకు ఇబ్బందే!మౌలిక సదుపాయాల పెంపు, ఫ్యాకల్టీ, ఫలితాలు, ఉపాధి అవకాశాలు, సొంత బిల్డింగ్ ఉందా? వంటి అంశాలకు న్యాక్ బృందం మార్కులు ఇస్తుంది. దీని ఆధారంగానే గ్రేడ్ను కేటాయిస్తుంది. ఎక్కువగా కార్పొరేట్ కళాశాలలు మాత్రమే ఈ ర్యాంకులు పొందుతున్నాయి. కాగా, ఇప్పటి వరకూ న్యాక్ బృందాలు కళాశాలలను స్వయంగా పరిశీలించిన తర్వాతే గుర్తింపు ఇచ్చేవి. అలా కాకుండా ఆన్లైన్లోనూ పరిశీలించి అనుమతులు ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే న్యాక్ నిబంధనలు అమలు చేయాలంటే 90 శాతం కళాశాలలు ఇబ్బందిపడే అవకాశం ఉంది. కార్పొరేట్ కళాశాలలు మాత్రమే దీనివల్ల విస్తరిస్తాయనే విమర్శలొస్తున్నాయి. దాంతో న్యాక్ నిబంధనల్లో కొంత సడలింపు ఇవ్వాలని మండళ్ళ చైర్మన్లు ప్రతిపాదిస్తున్నారు. నాణ్యత లక్ష్యంగా సడలింపులు న్యాక్ నిబంధనల్లో సమూల మార్పులు చేసేందుకు న్యాక్ కౌన్సిల్ ప్రతిపాదించింది. దీనిపై విస్తృత స్థాయి చర్చ జరిగింది. గుర్తింపు ప్రక్రియను మరింత సరళీకృతం చేయడమే దీని ఉద్దేశం. అన్ని కాలేజీలను న్యాక్ గుర్తింపు పరిధిలోకి తేవడం, నాణ్యత పెంచడమే లక్ష్యం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్య మండలి చైర్మన్)అలాగైతే ఇబ్బందేన్యాక్ నిబంధనల పేరుతో చిన్నకాలేజీల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో నిరుద్యోగులు పెట్టుకున్న కాలేజీలు ఇప్పటికే అనేక ఇబ్బందుల్లో ఉన్నాయి. ఎన్నో కాలేజీలు మూతపడ్డాయి. న్యాక్ గుర్తింపును ఐచ్ఛికంగానే పరిగణించాలి. – గౌరీ సతీశ్, అధ్యక్షుడు, రాష్ట్ర ప్రైవేటు పీజీ, డిగ్రీ కాలేజీ యాజమాన్య సంఘంమూడు కేటగిరీల ఏర్పాటుఇక మీదట విద్యా సంస్థలను 3 కేటగిరీలుగా విభజించాలని న్యాక్ భావిస్తోంది. విశ్వవిద్యాలయాలు, అటాన మస్ కాలేజీలు, అనుబంధ కాలేజీలు అనే 3 విభాగాలను గుర్తిస్తారు. కాగా, విశ్వవిద్యాలయాలు ఇప్పటికే అన్ని వసతులతో ఉంటాయి. అటానమస్ కాలేజీలూ నిధులు సమకూర్చుకోవడంలో వెనుకాడవు. కానీ అనుబంధ గుర్తింపు ఉన్న కాలేజీల్లో ఫ్యాకల్టీ, మౌలిక వసతుల ఇబ్బంది ఉందన్న వాదనలున్నాయి. -
కాలేజీల్లో మోరల్ పోలీసింగ్
సాక్షి, హైదరాబాద్: కళాశాలల్లో మోరల్ పోలీసింగ్ను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. అన్ని ఇంటరీ్మడియెట్, డిగ్రీ కళాశాలల్లో కేరళ మాదిరిగా మోరల్ పోలీసింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. సమాజంలో ఉండే సమస్యలను మనమే గుర్తించి పరిష్కరిస్తే.. దుష్ఫలితాలను నివారించుకోవచ్చన్నారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులను వలంటరీ పోలీసింగ్కు కోసం వినియోగించుకోవాలని సూచించారు.శనివారం జేఎన్టీయూలో వలంటరీ పోలీసింగ్ వ్యవస్థపై నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సమాజంలో పెడధోరణులు పెరగడానికి సాంకేతికత ఓ కారణమన్నారు. పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా పెడితే.. చాలావరకు సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఉమ్మడి కుటుంబాలు చిన్నారుల మానసిక దృఢత్వానికి తోడ్పతాయని, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడమే చిన్నారుల మానసిక బలహీనతలకు కారణమని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం.. డ్రగ్స్ నిర్మూలనపై సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. మత్తు పదార్థాలతో జరిగే నష్టాల గురించి పాఠశాలలు, కళాశాలల్లో పాఠ్యాంశంగా బోధించడంతోపాటు నైతిక పోలీసింగ్ను నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించే వ్యవస్థ ఉండాలని నిర్వాహకులకు సూచించినట్లు తెలిపారు. బడులు, కళాశాలల్లో ఎన్ఎస్ఎస్ వలంటీర్స్ అవసరం ఎంతో ఉందని తెలిపారు. వారితో పోలీసులకు సమాచారం చేరవేసే వ్యవస్థను తయారు చేసుకుంటే.. తెలంగాణను డ్రగ్స్రహిత రాష్ట్రంగా మార్చవచ్చని చెప్పారు. డ్రగ్స్పై ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందంటూ ‘మీ అన్నగా పిలుపునిస్తున్నా... డ్రగ్స్ నిర్మూలనకు సహకరించండి’అని విజ్ఞప్తి చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేలా నిర్ణయాలు తమ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని నిర్ణయించిందని, అందుకోసం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్టేడియం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. భవిష్యత్లో క్రీడాకారులను ప్రోత్సహించేలా నిర్ణయాలు ఉంటాయన్నారు. ప్రజాప్రతినిధి అనేది అత్యంత పవిత్రమైన బాధ్యతని, ప్రజా సమస్యలపై ఫోకస్గా పనిచేయడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. సమస్యలకు భయపడి పారిపోకుండా, పోరాడాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీకైనా, బిల్ గేట్స్కైనా, రేవంత్ రెడ్డికైనా ఉండేది రోజుకు 24 గంటలేనని, రోజుకు 16 గంటలు మీరు ఎంత ఫోకస్గా పనిచేస్తే అంత బాగా మీ లక్ష్యాలను చేరుకోవచ్చని సూచించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు డీజీపీ డాక్టర్ జితేందర్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు. -
కాలేజీలో చేరగానే మెసేజ్
సాక్షి, హైదరాబాద్ : పైవేట్ కాలేజీల ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఇంటర్బోర్డు ఈసారి సరికొత్త విధానం అందుబాటులోకి తీసుకురానుంది. విద్యార్థి ఏ కాలేజీలో చేరినా, వెంటనే అతని వ్యక్తిగత మొబైల్కు మెసేజ్ వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఉన్నతాధికారులు చర్చించారు. ఇందుకు అవసరమైన సాఫ్ట్వేర్ రూపకల్పన చేసేందుకు ప్రయతి్నస్తున్నారు. అయితే కాలేజీలో చేరిన వెంటనే వివరాలు హైదరాబాద్లోని కేంద్ర కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. అప్పుడే ఈ మెసేజ్ పంపే వీలుంది. దీనికి ప్రైవేట్ కాలేజీలు ఇష్టపడే అవకాశం లేదు. కొన్ని నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్ కాలేజీలు దీనివల్ల నష్టం జరుగతుందని భావిస్తున్నాయి. ప్రయోజనం ఏమిటి? ఇప్పటి వరకూ ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులను ఒక బ్రాంచ్లో చేర్చుకొని, వేరొక చోట కూర్చోబెట్టి బోధన చేస్తున్నాయి. ఉదాహరణకు మాదాపూర్ బ్రాంచ్లో ఓ విద్యార్థి అడ్మిషన్ తీసుకుంటాడు. కానీ అతని క్లాసులు వనస్థలిపురం బ్రాంచ్లో జరగుతాయి. పరీక్ష కేంద్రం సమీపంలో వేయాల్సి ఉంటుంది. కాబట్టి పరీక్షకు దరఖాస్తు చేసే ప్రాంతాన్నే కొలమానంగా తీసుకుంటారు. దీనివల్ల దూరంగా ఉండే ప్రాంతంలో పరీక్ష కేంద్రం ఉంటుంది.అదీగాక అంతర్గత పరీక్ష నిర్వహించి, బాగా మార్కులొచ్చే వారిని వేరు చేసి చదివిస్తున్నారు. మార్కులు తక్కువగా ఉండే వారి పట్ల ఏమాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదు. ఈ బ్రాంచ్ల్లో నైపుణ్యం లేని అధ్యాపకులను తక్కువ వేతనాలకు నియమిస్తున్నారు. ఈ విధానాన్ని అడ్డుకోవడానికి మెసేజ్ విధానం దోహదపడుతుందని ఓ అధికారి తెలిపారు. తనకు వచ్చే మెసేజ్లో అన్ని వివరాలు ఉంటాయి..కాబట్టి వెంటనే అదే కాలేజీలో చదివేలా తల్లిదండ్రులు జాగ్రత్త పడతారని, అన్ని కేటగిరీల విద్యార్థులు ఒకే క్యాంపస్లో చదువుకునే వీలుందని అధికారులు భావిస్తున్నారు. సహకారం అందేనా? మెసేజ్ విధానంపై కాలేజీ యాజమాన్యాలు పెదవి విరుస్తున్నాయి. అడ్మిషన్ల వివరాలు గడువులోగా ఇంటర్ బోర్డుకు పంపే వీలుందని, కానీ మెసేజ్ సిస్టం తీసుకొస్తే ప్రతీ రోజు వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని యాజమాన్యాలు అంటున్నాయి. దీనివల్ల క్లరికల్ పని ఎక్కువగా ఉంటుందని, తనిఖీల పేరుతో అధికారులు వేధించే వీలుందని చెబుతున్నారు. ఈ విధానాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. -
కాలేజ్కి కూడా వెళ్లలేదు..కానీ ఏడాదికి ఏకంగా రూ. 10 కోట్లు..!
ఓ వ్యక్తి కాలేజ్ చదువు కూడా చదవకుండా కోట్లు గడిస్తున్నాడంటే నమ్ముతారా..!. ఏ వ్యాపారం చేసో అనుకుంటే పొరబడ్డట్లే. ఎందుకంటే..అతడు చక్కగా పెద్ద కార్పోరేట్ కంపెనీలో అప్రెంటీస్గా మొదలు పెట్టి..ఏకంగా కంపెనీ పార్ట్నర్గా పనిచేసే స్థాయికి చేరకున్నాడు. ఎలాంటి గ్రాడ్యుయేషన్ చదువులు చదవకుండా.. ఎలా అతడికి సాధ్యం అయ్యింది? అతడి సక్సెస్ సీక్రెట్ ఏంటంటే.. యూకేకి చెందిన న్యూటన్(30) యూవివర్సిటి విద్య కూడా చదవలేదు. కానీ డెలాయిట్ కంపెనీలో పార్టనర్గా పనిచేస్తున్నాడు. అతడి వార్షిక వేతనం సుమారుగా రూ. 10 కోట్లు పైనే ఉంటుందట. ఇదంతా ఎలా సాధ్యం అనే కదా..!. అతడి కెరీర్ జర్నీ 12 ఏళ్ల క్రితం డెలాయిట్ కంపెనీలో బ్రైట్స్టార్ట్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్లో చేరడంతో మొదలయ్యింది. అలా కంపెనీ పార్ట్నర్గా పనిచేసే స్తాయికి ఎదిగిపోయాడు. అది కాలేజ్డ్రాపౌట్స్ కోసం ఏర్పాటు చేసిన డెలాయిట్ బ్రైట్ స్టార్ అప్రెంటీస్ ప్రోగ్రామ్ అతడి తలరాతనే మార్చిందని చెప్పొచ్చు. నూటన్ పెరిగిందంతా డోరెట్స్లోనే. తన తండ్రి 16 ఏళ్ల వయసులో పాఠశాల చదువును విడిచిపెట్టి ఆర్మీలో చేరిపోయాడు. తన అమ్మ పబ్లోనూ, ట్రావెలింగ్ ఏజెన్సీలోనూ పనిచేసేది. దీంతో తల్లిదండ్రుల ప్రంపంచానికి దూరంగా పెరిగాడు న్యూటన్. ఆర్థిక పరిస్థితి వల్లే కదా తాను ఈ పరిస్థితిని ఎదుర్కొంటోంది అని భావించి సంపాదన మార్గాల గురించి తీవ్రంగా అన్వేషించడం ప్రారంభించేవాడు. తీరిక దొరికితే అందుకోసమే వెతికేవాడు. ఐతే అనుకోకుండా విశ్వవిధ్యాలయంలో గణితం అధ్యయనం చేసేందుకు సీటు లభించింది. ఇలా అతడి కుటుంబంలో విశ్వవిద్యాలయంలో సీటు పొందిన ఏకైక వ్యక్తి కూడా న్యూటనే. కానీ అందులో చేరలేదు. సంపాదన మార్గాల మీదే అతడి ధ్యాసంతా. అందుకోసం రెండు మూడు చిన్నా చితకా ఉద్యోగాలు కూడా చేసేవాడు. అంతేగాదు స్కూల్ చదువుతో డబ్బులు వచ్చే స్కీములు ఏం ఉన్నాయా అని చూసేవాడు. ఆ కారణాల రీత్యా అతడు చదువాలనే దానిపై దృష్టి కేంద్రీకరించ లేదు. ఆ అన్వేషణలో భాగంగానే న్యూటన్ డెలాయిట్ బ్రైట్స్టార్ట్ అప్రెంటిస్ ప్రోగ్రామ్లో చేరాడు. ఐతే ఇది విద్యార్థులు కళాశాలలో చేరి చదువుకునేలా చేసేందుకు ఏర్పాటు చేసిన ఉపాది మార్గం ఇది. దీన్ని కాలేజ్ యూనివర్సిటీలే ఏర్పాటు చేశాయి. అయితే ఇదంతా న్యూటన్కి నచ్చక ఒకింత అసహనం అనిపించినా, డబ్బు సంపాదించే మార్గం దొరికిందన్న ఉద్దేశ్యంతో అందులో జాయిన్ అయ్యాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ కంపెనీ పార్ట్నర్గా క్వాలిఫైడ్ అకౌంటెంట్ అండ్ ఆడిటర్గా విధులు నిర్వర్తించే రేంజ్కి చేరాడు. నిజానికి డెలాయిట్ కంపెనీ రిక్రూట్మెంట్ కోసం ఈ బ్రైట్స్టార్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా విద్యార్థుల ఉపాది పొందుతూ కాలేజ్ చదువును చదువుకునేలా ప్రోత్సహిస్తుంది. అంతేగాక ఈ ప్రోగ్రాం ద్వారా వారిలో దాగున్న టాంటెంట్ బయటకి వెలికితీస్తుంది. పైగా సామాజికంగా ఆర్థిక నేపథ్యం సరిగా లేని వ్యక్తులకు ఈ ప్రోగ్రాం ఒక గొప్ప వరం. అంతేగాదు కెరీర్లో మంచిగా సెటిల్ అవడానికి ఉపకరించే గొప్ప ఉపాధి మార్గం ఇది. ఇక్కడ న్యూటన్ సంపాదన ధ్యాస కళాశాలకు వెళ్లనీయకుండా చేసినా..ఉద్యోగంలో ఉన్నతంగా ఎదిగేలా చేసి ఈ స్థాయికి తీసుకురావడం విశేషం. ఇక్కడ డిగ్రీలు, పీహెచ్డీలు కాదు ముఖ్యం. సంపాదించాలనే కసి పట్టుదల అన్ని నేర్చుకునేలా, ఎదిగిలే చేస్తుందనడానికి న్యూటనే స్ఫూర్తి కదూ..!. (చదవండి: ఆర్బీఐ మాజీ గవర్నర్కే పాఠాలు బోధించిన వ్యక్తి..కోట్ల ఆస్తులను..!) -
విద్యార్థులే కానీ... వేసవి సెలవులు లేవు
వేసవి వస్తే విద్యార్థులు రిలాక్స్ అవుతారు. వేసవి సెలవులను ఆస్వాదిస్తారు. కానీ.. ఈ విద్యార్థులకు మాత్రం వేసవి సెలవులు లేవు. కాలేజీలకు వెళుతున్నారు. ఎందుకంటే వీళ్లు రియల్ స్టూడెంట్స్ కాదు.. రీల్ స్టూడెంట్స్. కొందరు స్టార్స్ ప్రస్తుతం స్టూడెంట్స్గా నటిస్తున్నారు. షూటింగ్ సెట్స్లో క్లాసులకు హాజరు అవుతున్నవారు కొందరైతే.. ప్రిపరేషన్ స్టూడెంట్స్ మరికొందరు. ఈ విద్యార్థుల గురించి తెలుసుకుందాం. ► కెరీర్లో పలు చిత్రాల్లో కాలేజ్ స్టూడెంట్గా నటించారు హీరో సూర్య. కానీ ఐదు పదుల వయసుకి చేరువ అవుతున్న టైమ్లో కూడా కాలేజ్కి వెళ్లెందుకు రెడీ అవుతున్నారు. ‘సూరరై ΄ోట్రు’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర కాంబినేషన్లో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. స్టూడెంట్ నుంచి గ్యాంగ్స్టర్గా మారే ఓ వ్యక్తి జీవితం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందట. స్టూడెంట్ రోల్ కోసం ప్రస్తుతం సూర్య బరువు తగ్గుతున్నారని సమాచారం. 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. ►కాలేజీ స్టూడెంట్ రోల్ హీరోయిన్ రష్మికా మందన్నాకు బాగా కలిసి వస్తుందని చె΄÷్పచ్చు. ఆ మాటకొస్తే... నటిగా రష్మికా మందన్నా కెరీర్ మొదలైంది కన్నడ హిట్ క్యాంపస్ డ్రామా ‘కిర్రిక్ పార్టీ’ సినిమాతోనే. అంతేకాదు...రష్మికా మందన్నా తెలుగు ఎంట్రీ మూవీ ‘ఛలో’లోనూ, రెండో మూవీ ‘గీత గోవిందం’లోనూ ఆమెది కాలేజీ స్టూడెంట్ రోల్. ఇలా కాలేజీ స్టూడెంట్గా రష్మికా మందన్నా చేసిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్. తాజాగా ఈ కోవలో రష్మికా మందన్నా చేస్తున్న చిత్రం ‘ది గాళ్ఫ్రెండ్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా పీజీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ రోల్లో కనిపిస్తారని తెలిసింది. ఆమె బాయ్ ఫ్రెండ్గా దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. ఓ కాలేజీ స్టూడెంట్ తన ప్రేమను నెగ్గించుకునే క్రమంలో పడిన సంఘర్షణ నేపథ్యంతో ఈ సినిమా ఉంటుందట. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ‘చి..ల..సౌ’తో దర్శకుడిగా తొలి సినిమాతోనే హిట్ కొట్టిన రాహుల్ రవీంద్రన్ ‘ది గాళ్ ఫ్రెండ్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజయ్యే చాన్స్ ఉంది. ► కాలేజీలో ఓ ఫెయిల్యూర్ స్టూడెంట్గా తెరపై శ్రీ విష్ణు కనిపించిన ప్రతిసారీ ఆయనకు మంచి పేరు వచ్చింది. ‘నీదీ నాది ఒకే కథ’, ‘బ్రోచేవారెవరురా’ వంటి సినిమాల్లో శ్రీ విష్ణు స్టూడెంట్గా నటించారు. మళ్లీ ఈ తరహా పాత్రలో శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. శ్రీవిష్ణుతో పాటు ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్, ప్రియదర్శి ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఓ యూనివర్సిటీలోని ముగ్గురు పీహెచ్డీ స్కాలర్స్ జీవితాలు ఓ ఘటనతో సడన్గా ఏ విధంగా మలుపు తిరిగాయి? అనే కోణంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమా ఫస్టాఫ్లో కాలేజీ సీన్స్ ఉంటాయి. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో వి సెల్యూలాయిడ్, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. స్టూడెంట్గా ఇన్నాళ్లూ సెట్లో బిజీగా ఉన్న శ్రీవిష్ణు ఇప్పుడు ఈ చిత్రం ప్రమోషన్స్తో బిజీగా ఉంటున్నారు. ► ‘ఏవండీ.. (మృణాల్ ఠాకూర్).. రామచంద్రా.. (చిన్న వాయిస్తో విజయ్ దేవరకొండ).. నేను కాలేజ్కి వెళ్లాలి.. కొంచెం దించేస్తారా? (మృణాల్ ఠాకూర్),.. ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా..’ (విజయ్ దేవరకొండ)...‘ఫ్యామిలీస్టార్’ సినిమాలోని డైలాగ్ ఇది. సో.. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కొన్ని సన్నివేశాల్లో కాలేజ్కి వెళతారని కన్ఫార్మ్ చేసుకోవచ్చు. ‘గీత గోవిందం’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో రూ΄÷ందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది. బాలీలో ఓ పాట చిత్రీకరిస్తే ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ► ‘ఇగై’ సినిమా కోసం లా పాయింట్స్ చెబుతున్నారు అంజలి. ఎందుకంటే ఈ సినిమాలో అంజలి లా స్టూడెంట్. అశోక్ వేలాయుదం దర్శకత్వంలో రూ΄÷ందుతున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు అంజలి. చిత్రీకరణ ్రపారంభమైంది. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ నటీనటులే కాక.. మరికొందరు కూడా కాలేజీ స్టూడెంట్ రోల్స్ చేస్తున్నారు. -
ఉన్నత విద్యకు ‘స్కిల్’ జత
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో నైపుణ్యం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి కోర్సులను కాలేజీలు, యూనివర్సిటీలు అందుబాటులోకి తెచ్చేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంగీకారం తెలిపింది. తాజా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రస్తావించింది. విధాన పరమైన నిర్ణయాన్ని ప్రకటించినప్పటీకీ పెద్దగా నిధులు కేటాయించక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటం లేదన్నది భారత పారిశ్రామిక వేత్తల అభిప్రాయం. సీఐఐ, ఎఫ్ఐఐ, నాస్కామ్ వంటి సంస్థల అధ్యయనంలోనూ ఇదే వెల్లడైంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక భాగస్వామ్యంతో ఈ కోర్సులను ముందుకు తీసుకెళ్ళాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కన్పిస్తోంది. తక్షణ అవసరం ఇదే..: దేశంలో ఇంజనీరింగ్ పూర్తి చేసే విద్యార్థుల్లో కేవలం 8 శాతం మంది మాత్రమే నైపుణ్యం (స్కిల్)తో బయటకు వస్తున్నారు. మిగతా వాళ్ళలో కొంతమంది స్కిల్ కోసం ప్రత్యేక కోర్సులు నేర్చుకుంటున్నారు. అయితే వాళ్లలో కోర్సు నేర్చుకునే నాటికే కొత్త నైపుణ్యాలు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో మళ్ళీ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటే తప్ప మంచి వేతనంతో ఉద్యోగం లభించే అవకాశం కన్పించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే విశ్వవిద్యాలయాలకు యూజీసీ తక్షణ మార్పులను సూచించింది. నైపుణ్యాభివృద్ధి మండళ్లు స్వల్ప వ్యవధి కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి అక్కర్లేదని కూడా తెలిపింది. కాకపోతే పారిశ్రామిక భాగస్వామ్యం తప్పనిసరి. అప్పుడే విద్యార్థి అనుభవ పూర్వకంగా నైపుణ్యం సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణత సాధించి డిగ్రీ, బీటెక్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు 3–6 నెలల వ్యవధిలో 27 రకాల నైపుణ్య కోర్సులను యూజీసీ సూచిస్తోంది. వీటికి 12 నుంచి 30 క్రెడిట్స్ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమీక్ష జరిపింది. ఏయే కోర్సులు అందుబాటులోకి తేవచ్చు అనే విషయాన్ని ప్రభుత్వానికి ఉన్నతాధికారులు వివరించారు. ఇవీ స్కిల్ కోర్సులు అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే కాలంలో మొత్తం 27 స్కిల్ కోర్సులను నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులకే అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో ఏఐ అండ్ ఎంఎల్, రోబోటిక్స్, ఐవోటీ, ఇండ్రస్టియల్ ఐవోటీ, స్మార్ట్ సిటీస్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వీఆర్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్, 5 జీ కనెక్టివిటీ, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, ఎల్రక్టానిక్స్ సిస్టమ్ డిజైన్, వీఎస్ఎస్ఐ డిజైన్స్, కంప్యూటర్ భాషలో ప్రాథమిక అవగాహన, మెకానికల్ టూలింగ్, మొబైల్ కమ్యూనికేషన్ లాంటి ప్రధానమైన కోర్సులున్నాయి. తెలంగాణలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల భాగస్వామ్యంతో ఐవోటీ, ఏఐఎంఎల్ సహా ఇతర కంప్యూటర్ కోర్సుల్లో స్వల్పకాలిక కోర్పులు నిర్వహించవచ్చని అధికారులు అంటున్నారు. సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలసిస్ వంటి వాటికి విస్తృత అవకాశాలున్నాయని భావిస్తున్నారు. తొలి దశలో ప్రైవేటు యూనివర్సిటీలు మాత్రమే ఈ దిశగా ముందుకు వెళ్ళే వీలుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని డీమ్డ్ వర్సిటీలు ఈ దిశగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి. స్కిల్తో ఉద్యోగం సులభం డిగ్రీతో పాటు నైపుణ్యం ఉంటే ఉద్యోగం లభించడమే కాదు.. అందులో రాణించడం కూడా సులభం. కంపెనీలు ఇలాంటి అర్హతలే కోరుకుంటున్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే నాటికి ఏదైనా ఒక రంగంలో నైపుణ్యం అవసరం. ఈ దిశగా ప్రభుత్వం, వర్సిటీలు అడుగులు వేయడం అభినందనీయం. – శ్రీరాం వెంకటేష్ (ఉన్నత విద్య మండలి కార్యదర్శి) -
జనవరి 22న ఉత్తర ప్రదేశ్లో విద్యాసంస్థలకు సెలవు
లక్నో: జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెలవు ప్రకటించారు. ఈనెల 22నన అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం దృష్టా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రామజన్మభూమి ఆలయంలో శ్రీరామ్లల్లా 'ప్రాణ-ప్రతిష్ఠ' కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను సీఎం ఆదిత్యనాథ్ పరిశీలించారు. అదే విధంగా జనవరి 22న రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండవని సీఎం తెలిపారు. ఆ రోజు అన్ని ప్రభుత్వ భవనాలను సుందరంగా అలంకరించాలని, బాణాసంచా కాల్చి వేడుకలు జరుపుకోవాలని సీఎం ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. కాగా అయోధ్యలో జనవరి 22న నూతన రామాలయ ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఘనమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి నాలుగు వేల మంది సాధువులను, 2,200 మంది ఇతర అతిథులను ఆహ్వానించారు. కాశీ విశ్వనాథుని ఆలయం, మాతా వైష్ణో దేవి ఆలయ ప్రతినిధులు, ఇస్రో శాస్త్రవేత్తల పేర్లు ఆహ్వానితుల జాబితాలో ఉన్నాయి. సినీ పరిశ్రమ, వ్యాపార, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పంపారు. చదవండి: మాల్దీవుల వివాదం.. ప్రధాని మోదీకి మద్దతుగా శరద్ పవార్ -
ఆన్లైన్ డిగ్రీ కోర్సులతో జాగ్రత్త: యూజీసీ
న్యూఢిల్లీ: విదేశీ యూనివర్సిటీల సహకారంతో కాలేజీలు, ఎడ్టెక్ కంపెనీలు అందించే డిగ్రీల కు తమ గుర్తింపు లేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) స్పష్టం చేసింది. ఇటువంటి డిగ్రీలకు ఏమాత్రం విలువ లేదని, ఆయా కోర్సుల్లో చేరవద్దని విద్యార్థులను హెచ్చరించింది. విదేశీ వర్సిటీలు, విద్యా సంస్థలతో కొన్ని ఉన్నత విద్యా సంస్థలు, కాలేజీలు పొందే అనుబంధ గుర్తింపు, ఒప్పందాలను తాము అనుమతించడం లేదని యూజీసీ సెక్రటరీ మనీశ్ జోషి చెప్పారు. ఆయా సంస్థలు ఇచ్చే డిగ్రీలు, డిప్లొమాలకు ఎటువంటి విలువా ఉండదని వివరించారు. -
టోకెన్లతోనే సరి
సాక్షి, హైదరాబాద్: టోకెన్లు ఇచ్చి ఏడాది అవుతున్నా..పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు మాత్రం విడుదల కాలేదు. గతే డాది అక్టోబర్లో ఆయా బిల్లులకు సంబంధించి ఆర్థికశాఖ పోర్టల్లో జనరేట్ అయ్యి టోకెన్ నంబర్లు కూడా జారీ అయ్యాయి. నిధులు విడుదల కాకపోవడంతో ఇటు విద్యార్థులు..అటు ప్రైవేట్ కాలేజీ యాజమన్యాలు లబోదిబోమంటున్నాయి. దరఖాస్తు నుంచి ట్రెజరీ వరకు ఇలా... పోస్టుమెట్రిక్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన, కోర్సు కొనసాగిస్తున్న విద్యార్థులు ఈపాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయడం..వాటిని కాలేజీస్థాయిలో యాజమాన్యాలు పరిశీలించి సంక్షేమశాఖలకు సమర్పించడం... సంక్షేమశాఖల అధికా రులు ఆయా దరఖాస్తులను మరోమారు పరిశీలించి ఆమోదం తెలపడం.. ఆ తర్వాత అర్హులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలకు ఖజానా శాఖకు సిఫార్సు చేయడం అంతా ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది. కాలేజీ యాజమాన్యాలు ఒక్కో విద్యార్థికి సంబంధించిన ఫైలు కాకుండా ఒక కోర్సు చదువుతున్న విద్యార్థులందరి ఫైళ్లు కలిపి ఒక బిల్లుగా తయారు చేసి ఖజానాశాఖకు సమర్పిస్తాయి. అవన్నీ రెండేళ్ల కిందటివే... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్నాయి. 2019–20, 2020–21 విద్యా సంవత్సరాలకు సంబంధించి పలు బిల్లులు గతేడాది అక్టోబర్ నాటికి ఖజానా శాఖకు సమర్పించాయి. నాలుగు సంక్షేమ శాఖలకు సంబంధించి రూ.1115 కోట్లు వరకు బిల్లులున్నాయి. ఇందులో సాగానికిపైగా బీసీ సంక్షేమ శాఖకు సంబంధించినవే. సంక్షేమ శాఖలు సమర్పించిన బిల్లులను ఖజానా అధికారులు పరిశీలించి టోకెన్లు జనరేట్ చేస్తారు. అయితే ఇప్పటివరకు ఆర్థిఖశాఖ పోర్టల్లో ఆ బిల్లులకు ఆమోదం దక్కలేదు. ఏడాది కాలంగా ఇవన్నీ పెండింగ్లో ఉండడంతో ఒకవైపు విద్యార్థులు, మరోవైపు కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉపకారవేతన నిధులు విద్యార్థి బ్యాంకు ఖాతాలో, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కాలేజీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాక జాప్యం జరుగుతుండడంతో కాలేజీ యాజమాన్యాలు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రతినిధులు రాష్ట్ర సంక్షేమశాఖ ఉన్నతాధికారులు, ఆర్థికశాఖ అధికారులను ప్రత్యేకంగా కలిసి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా, నిధుల విడుదలపై ప్రభుత్వం స్పందించలేదు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులతో కాలేజీల నిర్వహణపై చేతులెత్తేయాల్సి వస్తోందంటూ తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌరి సతీశ్ ‘సాక్షి’తో అన్నారు. -
జగనన్న ఆరోగ్య సురక్షతో అందరికీ రక్ష
సాక్షి, అమరావతి: జగనన్న ఆరోగ్య సురక్ష పథకం రాష్ట్ర ప్రజలందరికీ రక్ష అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90 శాతం కుటుంబాలు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. దీనిని బట్టి తమ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంత బలోపేతం చేసిందో, ఏ స్థాయిలో వైద్య సేవలు అందిస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం ద్వారా ఇప్పటివరకు 2.30 కోట్ల ఓపీలు నమోదయ్యాయని చెప్పారు. ఇది ఒక చరిత్రగా అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.8,500 కోట్ల ఖర్చుతో కొత్తగా 17 మెడికల్ కళాశాలలు నిర్మిస్తోందని, వీటిలో ఐదింటిని సీఎం జగన్ శుక్రవారం పారంభించారని గుర్తు చేశారు. వచ్చే రెండేళ్లలో మిగిలిన 12 కళాశాలలను కూడా పూర్తిచేసి ప్రారంభిస్తామన్నారు. సంక్షేమ రాడార్ నుంచి తప్పించుకోకుండా.. జగనన్న సంక్షేమ రాడార్ నుంచి ఎవరూ తప్పించుకోకూడదనే లక్ష్యంతో ఆరోగ్య సురక్ష కార్యక్రమం రూపుదిద్దుకుందని మంత్రి రజని చెప్పారు. మొదటి దశలో వలంటీర్ల ఇంటింట సర్వే ఈ నెల 15న ప్రారంభమైందని, స్థానిక ప్రజా ప్రతినిధులు, వలంటీర్లు, ఎన్ఎస్ఎస్, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు తొలి దశలో గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నట్టు మంత్రి చెప్పారు. సీహెచ్వో లేదా ఏఎన్ఎం ఆ ఇంటికి ఎప్పుడు వస్తారనే విషయాన్ని వలంటీర్లు సమాచారం ఇస్తారన్నారు. రెండో దశలో సీహెచ్వో, ఏఎన్ఎంలు ప్రజల ఇళ్లకే వెళ్లి అందించే సేవలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయన్నారు. ప్రజల అంగీకారం మేరకు బీపీ, మధుమేహం, హిమోగ్లోబిన్ వంటి ఏడు రకాల పరీక్షలను ఇంటివద్దే చేస్తారన్నారు. మూడో దశలో వలంటీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సేవాభావం గల వ్యక్తుల బృందాలు మరోసారి ఇంటింటికీ వెళ్లి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించే తేదీ, అందించే సేవలను వివరిస్తారన్నారు. నాలుగో దశలో ఈ నెల 30న వైద్య శిబిరాలు మొదలుపెట్టి.. 45 రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించినట్టు మంత్రి రజిని వివరించారు. శిబిరాల్లో రోగులను పరీక్షించి, అవసరమైన వారికి మందులు ఇస్తారని, చికిత్స అవసరమైతే వారిని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రిఫర్ చేస్తారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో, తహసీల్దార్, పీహెచ్సీల వైద్యాధికారులు.. పట్టణాల్లో మునిసిపల్ కమిషనర్లు, మునిసిపల్ ఆరోగ్య అధికారులు, యూపీహెచ్సీల వైద్యాధికారులు వైద్య శిబిరాల బాధ్యత తీసుకుంటారన్నారు. ఐదో దశలో ఆ గ్రామానికి చెందిన ఫ్యామిలీ డాక్టర్, సీహెచ్వో, ఏఎన్ఎంలు రిఫరల్ కేసులకు సంబంధించిన రోగులకు ఫాలోఅప్ వైద్యం అందిస్తారన్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో రోగులకు సరైన వైద్యం అందిందా లేదా.. రోగం పూర్తిగా అదుపులోకి వచ్చిందా లేదా పరిశీలిస్తారని వివరించారు. నిఫా వైరస్పై అప్రమత్తం నిఫా వైరస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి రజని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. నకిలీ మందుల విషయంలో కఠినంగా ఉన్నామని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పీజీ సీట్ల విషయంలో నకిలీ ఎల్వోపీలపై విచారణ కొనసాగుతోందని, ఇది పూర్తిగా ఎన్ఎంసీ పరిధిలోని అంశం అవడంతో వారి ద్వారా విచారణ కోరినట్టు పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కార్యదర్శి మంజుల, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్, డీహెచ్ రామిరెడ్డి పాల్గొన్నారు. -
తెలంగాణలో ఒకే రోజు 9 మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈ రోజు మరుపురానిదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఒకే రోజు 9 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏడాదికి 10 వేల మంది డాక్టర్లు తయారవుతున్నారని అన్నారు. ప్రగతి భవన్ వేదికగా ఆన్లైన్లో ఈ కార్యక్రమం జరిగింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, భూపాలపల్లి, కుమరంభీమ్, సిరిసిల్ల,నిర్మల్, వికారాబాద్, జనగాం జిల్లాల్లో నూతనంగా మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. వచ్చే ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ కలను సాధిస్తున్నామని అన్నారు. బోధన కాలేజీలే కాకుండా అనుబంధ ఆస్పత్రులను కూడా నెలకొల్పినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. దీంతో 50 వేల పడకల్ని ఆక్సిజన్ బెడ్లుగా తయారు చేశామని స్పష్టం చేశారు. ప్రస్తుతం 500 టన్నుల ఆక్సిజన్ను రాష్ట్రంలో ఉత్పత్తి చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణను ఎగతాళి చేసినవాళ్లకు ఇదో మంచి ఉదాహరణ అని అన్నారు. దేశంలో వైద్య రంగంలో మూడో స్థానంలో తెలంగాణ ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలో మరణాల రేటు కూడా తగ్గించామని చెప్పారు. కొత్తగా ప్రారంభించిన వాటితో కలిపి రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య నాలుగు రెట్లకు పెరిగింది. రాష్ట్రంలో మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 21కి చేరింది. కొత్త కాలేజీలతో కలిపి తెలంగాణలో మెడికల్ సీట్ల సంఖ్య 8,515కు పెరిగింది. ఇదీ చదవండి: తెలంగాణలో ప్రారంభమైన టెట్ పరీక్ష -
15న ఆ 9 చోట్ల భారీ ర్యాలీలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15న ఏకకాలంలో తొమ్మిది జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయా జిల్లా కేంద్రాల్లో కనీసం 15 వేల నుంచి 20 వేల మందితో భారీ ర్యాలీలు నిర్వహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభం నేపథ్యంలో శుక్రవారం మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీ రామారావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 15న జనగామ, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలలో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్నాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఈ నెల 15న ఏదో ఒక చోట కొత్త మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారని, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు కామా రెడ్డిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని కేటీఆర్ తెలిపారు. దేశంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. మంత్రి హరీశ్ మాట్లాడుతూ ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లను కలిగి ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. -
ప్రాణం మీదకొస్తున్న ‘ప్యాకేజీ’ చదువులు!
చదువు.. తెలివి ముందుగా ‘ప్యాకేజీ ’ చదువుల ఇంజనీర్ కథ .. ఓ వ్యక్తి బాగా చదువుకున్నాడు. ఇంజనీర్ అయ్యాడు. బాగా సంపాదిస్తున్నాడు. కారు కొనుక్కున్నాడు. డ్రైవర్ను కూడా పెట్టుకున్నాడు. ఫంక్షన్ ఉండడంతో ఓ రోజు ఊరెళ్లాల్సి వచ్చింది. కానీ, డ్రైవర్ సెలవు పెట్టాడు. దానితో తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఊరికి బయలు దేరాడు. దాదాపుగా ఊరిదాకా వెళ్లాడు. కానీ అంతలోనే కారు టైరు పంక్చరయ్యింది. మార్చడానికి ఎప్పటిలా డ్రైవర్ లేడు. చేసేదేంలేక తానే టైర్ మార్చే ప్రయత్నం చేయసాగాడు. కష్టపడి టైర్ విప్పాడు. దురదృష్టం మనవాడిని వెన్నాడుతూనే ఉంది. స్టెప్నీ టైర్ తీసిపెట్టి బిగించే టైమ్లో కాలు తాకి విప్పిపెట్టిన నట్లు పక్కనే ఉన్న మురికి కాల్వలో పడ్డాయి. ఉసూరుమన్నాడు. దిగి తీద్దామంటే బురద... అంటితే ఫంక్షన్కు అటెండ్ కావడం ఎలా? కర్రలు గట్రాలతో రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఏదీ వర్కవుట్ కాలేదు... తలపట్టుకుని అలాగే కూర్చున్నాడు. అరగంట గడిచింది. ఆ దారిలో పశువులను తోలుకుంటూ ఓ ఆసామి వస్తున్నాడు అతన్ని పిలిచి తన బాధంతా చెప్పి ఎలాగైనా ఆ న ట్లు తీసివ్వాలని రిక్వెస్ట్ చేశాడు. దానికి ఎంత డబ్బయినా ఇస్తానని చెప్పాడు. కొంచెంసేపు ఆ ఇంజనీర్వైపు కారువైపు అలాగే చూసి నవ్వుతూ ఇలా అన్నాడు. ‘‘బాబూ!, డబ్బుల విషయం అలా ఉంచు. నేను దిగి తీసివ్వడానికి అభ్యంతరం ఏమీ లేదు. కానీ, అందులో దిగాకా నేను మళ్లీ ఇంటికి వెళ్లి బురద కడుక్కుని రావాలి. నువ్వు కూడా దానిలో దిగలేవు. అందుకని నేనో ఉపాయం చెబుతా.. మిగతా చక్రాలవి ఒక్కో నట్టు తీసి ఈ టైరుకు బిగిద్దాం. కారు నడవడానికి ఢోకా ఉండదు. నువ్వు హాయిగా వెళ్లొచ్చు. ఓ పది కిలోమీటర్ల దూరంలో మెకానిక్ షాపు ఉంది. అక్కడకి వెళ్లి నట్లు వేయించుకుని వెళ్లు. నీకు డబ్బు ఖర్చు, నాకు బురదా తప్పుతాయి. ఆ ఐడియాకు ఆ మెకానికల్ ఇంజనీర్ అవాక్కయ్యాడు. ఈ మాత్రం ఆలోచన రాక అరగంట నుంచి ఇబ్బంది పడ్డానే అనుకున్నాడు.. చదువు మెకానికల్ అయిపోయి, ఉద్యోగానికి మాత్రమే, అందునా ప్యాకేజీలకు మాత్రమే పనికి వచ్చే చదువుతో తయారైన బుర్ర నుంచి ఇలాంటి పదునైన ఆలోచన రావడం కష్టమే..చావుల చదువు.. ఓ సీలింగ్ ఫ్యాన్.. మేధో బుర్రలకు తట్టిన గొప్ప ఐడియా. సీలింగ్ ఫ్యాన్కు దానికి ఆధారంగా ఉండే రాడ్కు మధ్య ఓ స్ప్రింగ్ను బిగిస్తారు. ఈ ఫ్యాన్లకు 20 కిలోల కన్నా ఎక్కువ బరువు వేలాడితే వెంటనే స్ప్రింగ్ సాగుతుంది. దానితో ఫ్యాను సీలింగ్ నుంచి కిందకు దిగుతుంది. స్ప్రింగ్ సాగగానే సైరన్కూడా మోగుతుంది. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే ఇవి ఇప్పుడు రాజస్థాన్లోని కోటా పట్టణంలోని హాస్టళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. కోటాలోని ఐఐటీ కోచింగ్ సెంటర్లలో చదివే విద్యార్థులు ఫ్యాన్లకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నారని.. వాటిని ఆపాలని ప్రయత్నం. వీటితో పాటు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకోకుండా భవనాల వెలుపలా, బాల్కనీల్లో సూసైడ్ ప్రూఫ్ వలలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి 150 కిలోల బరువు మోయగలవు. ఎవరైనా విద్యార్థులు భవనంపై నుంచి దూకినా గాయాలు కావు. పరిష్కారం ఇదేనా.. అన్న చర్చ పక్కన పెడితే.. విద్యావ్యవస్థ సిగ్గు పడాల్సిన సందర్భం ఇది. చదువు ఏమి ఇస్తది.. జ్ఞానం ఇస్తది.. బతుకుకు భరోసా ఇస్తది. చావు నిస్తదా.. చదువు ఎంత గొప్పదయితే అంత చావునిస్తదా. చదువు ఎందుకంత గొప్పదయ్యింది. మంచి జ్ఞానాన్ని, జీవితంపై భరోసాను కాదు మంచి జీతాన్ని ఇస్తదని, మంచి ప్యాకేజీలను ఇస్తదని ఆశ.. దానివల్ల విద్యార్థులపై ఒత్తిడి. పదిహేను లక్షలమందితో పోటీపడి 12 వేల మంది గెలుచుకునే క్రీడ. ఇందులో బలయ్యేది.. ఎక్కువగా తక్కువ స్థోమత ఉన్న కుటుంబంలోంచి వచ్చిన పిల్లలేనట. ఉన్న ఎకరమో, అరెకరమో అమ్మి, లేదా ఆర్థిక స్థోమత లేక అప్పోసప్పో చేసి తల్లిదండ్రులు పిల్లల బాగుకోసం చదువులకు పంపితే..అది ఇంకా పిల్లలపై ఒత్తిడి పెంచుతోంది. అసలే తీవ్రమైన పోటీ.. ఎడ తెరిపిలేకుండా శిక్షణ, ఆ చదువులు అబ్బుతాయా లేదా అన్న విచక్షణ లేకుండా.. మంచి ప్యాకేజీలో స్థిరపడాలన్న తల్లిదండ్రుల ఆకాంక్ష,, వెరసి చదువులు స్ప్రింగ్ ఫ్యాన్లు, సూసైడ్ ప్రూఫ్ నెట్ దాకా వచ్చాయి. .... ఇంతా కష్టపడి చదివిన ఐఐటీ డిగ్రీలు అవి నేర్పిన వృత్తిలోనే స్థిర పడుతున్నారా... ఏది దొరికితే ఆ ఉద్యోగం చేస్తున్నారు.. మనం పైన సరదాగా చెప్పుకున్న మెకానికల్, ప్యాకేజీ చదువులయిపోయాయి. మనసుకు పట్టినా పట్టకపోయినా.. మెకానికల్గా చదువుకుని బయటపడ్డవాళ్లు బతికిపోతున్నారు.. లేని వాళ్లు చితికి పోతున్నారు. చదవేస్తే... తెల్లారితే చాలు.. ఎక్కడో ఓ చోట.. ఎవరో ఓ విద్యార్థి ఆత్మహత్య వార్త వింటున్నాం. చదువుల ఒత్తిడి.. పరీక్షల్లో పాస్ కాకపోతే ఎలాగనే ఆవేదన.. తల్లిదండ్రులు, స్నేహితుల ముందు పరువుపోతుందనే ఆందోళన.. విద్యా సంస్థల్లో అధ్యాపకులు, సిబ్బంది వేధింపులు.. ఇలాంటివన్నీ కలసి విద్యార్థుల ఆత్మ‘హత్య’లకు కారణమవుతున్నాయి. కుటుంబ, వ్యక్తిగత కారణాలూ వీటికి తోడవుతున్నాయి. కొన్నేళ్లుగా ఈ సమస్య మరింతగా పెరుగుతూ వస్తోంది. జూనియర్ కాలేజీల నుంచి మొదలుకుని మెడికల్ కాలేజీలు, ప్రఖ్యాత ఐఐటీల వరకు అన్నిచోట్లా విద్యార్థుల బలవన్మరణాలు జరుగుతున్నాయి. దేశంలో 2017– 2021 మధ్య ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయి. అదే ఒక్క విద్యార్థులనే పరిగణనలోకి తీసుకుంటే 32 శాతం పెరిగాయి. 2017లో 9,905 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడితే.. 2021లో ఈ సంఖ్య 13 వేలకుపైనే. దేశంలో సగటున రోజుకు 35 మంది.. అంటే ప్రతి రెండు గంటల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇందులోనూ పురుష విద్యార్థుల బలవన్మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా 2020లో విద్యార్థుల ఆత్మహత్యల్లో ఒక్కసారిగా 21శాతం పెరుగుదల నమోదైనట్టు గుర్తించారు. దేశంలోనే టాప్ విద్యాసంస్థలు అయిన ఐఐటీలు, ఐఐఎంలు, నిట్లు, సెంట్రల్ యూనివర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి. 2018 నుంచి 2023 ఏప్రిల్ మధ్య వీటిలో 103 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతుంటే.. ఛత్తీస్గఢ్, గుజరాత్, కేరళ, తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతూ వస్తున్నాయి. వయసుపరంగా చూస్తే.. 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వారి ఆత్మహత్యలు బాగా పెరిగాయి. ఈ ఏజ్వారు 2017 కల్లా 45,217 మంది బలవన్మరణానికి పాల్పడగా.. 2021 నాటికి ఈ సంఖ్య 56,543కు చేరుకుంది. అయితే విద్యార్థులు స్కూల్ చదువు పూర్తిచేసి కాలేజీల్లో చేరినప్పుడు.. ఒక్కసారిగా మారిపోతున్న విద్యా వాతావరణం, కాలేజీ చదువుకు అయ్యే ఖర్చు, విద్యార్థుల సామాజిక–సాంస్కృతిక–ఆర్థిక స్థాయిల్లో భేదాలతో ఒత్తిడి వంటివి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇవి వారి కుటుంబాల్లో సమస్యలకు కారణమై.. ‘కుటుంబ సమస్యల’తో బలవన్మరణాలు జరుగుతున్నాయని అంటున్నారు. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన ‘భారత్లో ప్రమాద మరణాలు, ఆత్మహత్యల నివేదిక (ఏడీఎస్ఐ)’లోని అధికారిక లెక్కలే ఇవి. ఇంకా నమోదుకాని ఆత్మహత్యలు మరెన్నో. సరికొత్త చలపతి, రచయిత -
అదనంగా 1,410 ఇంజనీరింగ్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం నుంచే మరో 1,410 ఇంజనీరింగ్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ఆఖరి నిమిషంలో ఈ సీట్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఎంసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా మార్చారు. ♦ మహబూబాబాద్, ఖమ్మం జిల్లా పాలేరులో కొత్తగా రెండు ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రభుత్వం అనుమతించింది. ఇవి జేఎన్టీయూహెచ్ పరిధిలో నడుస్తాయి. వాస్తవానికి ఈ రెండు కాలేజీల్లో ఒక్కోదాంట్లో 300 వరకూ సీట్లు మంజూరయ్యాయి. ఈ ఏడాది మాత్రం సీఎస్ఈ, ఈసీఈ, సీఎస్ఈ–ఎంఎల్ కోర్సులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. ఒక్కో బ్రాంచ్లో 60 చొప్పున, ఒక్కో కాలేజీలో 180 సీట్లు అందుబాటులోకి వస్తాయి. రెండు కాలేజీల్లో కలిపి 360 సీట్లు ఉంటాయి. ♦ ఘట్కేసర్లోని కొమ్మూరు ప్రతాప్రెడ్డి ఎంబీఏ కాలేజీకి కూడా ఇంజనీరింగ్ కోర్సులకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఈ కాలేజీలో ఆరు బ్రాంచ్లకు కలిపి 360 సీట్లు అదనంగా వస్తాయి. ♦ హైదరాబాద్లోని టీఆర్ఆర్ పాలిటెక్నిక్ కాలేజీని అప్గ్రేడ్ చేశారు. దీంతో 300 సీట్లు అదనంగా రాబోతున్నాయి. ♦ ఇవి కాకుండా మరో మూడుకాలేజీలకు అదనంగా సీట్లు ఇవ్వడానికి అనుమతి లభించింది. దీనికి జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపు రావాల్సి ఉంది. ♦ ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. అన్నీ కలిపి 1,410 సీట్లు అదనంగా రాబోతున్నాయని ఉన్నత విద్యామండలి పేర్కొంది. పెరిగిన సీట్లూ కంప్యూటర్ కోర్సుల్లోనే కొత్తగా పెరిగే 1,410 సీట్లల్లో ఎక్కువగా కంప్యూటర్ కోర్సులే ఉన్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 83,766 సీట్లు కన్వీనర్ కోటా కింద ఉంటే, 58 వేల వరకూ కంప్యూటర్ సంబంధిత బ్రాంచ్ల్లోనే ఉన్నాయి. మూడు విడతలుగా సీట్ల భర్తీ చేపట్టినా, ఇంకా 3,034 సీట్లు కంప్యూటర్ కోర్సుల్లో మిగిలాయి. తాజాగా మరో 900 వరకూ కొత్త సీట్లు కలుపుకుంటే, దాదాపు 4 వేల సీట్లు మిగిలే అవకాశం ఉంది. ప్రత్యేక కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా.. ఆఖరిదశలో అనుమతులు, కొత్త సీట్లు రావడంతో వాటి భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ తేదీలు మార్చారు. వాస్తవానికి ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ మొదలు పెట్టి, 23న సీట్ల కేటాయింపు చేపట్టాలని భావించారు. ఈ తేదీల్లో మార్పులు చేస్తూ సాంకేతిక విద్యా శాఖ కొత్త షెడ్యూల్ ఇచ్చింది. 18వ తేదీ స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ (కొత్తవారు) 17–22 తేదీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు 26న సీట్ల కేటాయింపు 26–28 తేదీల్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ 27–29 తేదీల్లో కాలేజీలో రిపోరి్టంగ్ -
వాతావరణ శాఖ హెచ్చరికలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
సాక్షి, బెంగళూరు: వారం నుంచి వదలని వానలతో కర్ణాటకలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో రేపు (జులై 26న) రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్టు విద్యాశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కేరళలోనూ వానలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈక్రమంలోనే అతి భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వయనాడ్, కోజీకోడ్, కన్నూర్, మళప్పురం జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు మూసి ఉంచాలని రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని విద్యాసంస్థలు ఇప్పటికే సెలవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. (షాకింగ్ వీడియో.. గ్రేటర్ నోయిడాలో నీట మునిగిన 200కు పైగా కార్లు) తెరిపినివ్వని వర్షం కారణంగా కాసర్గాడ్ జిల్లాలోని వెళ్లరికుందు, హోస్దుర్గ్ తాలుకాలు జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు కూడా సెలవులు ఇస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, వానలు, వరదల కారణంగా కేరళలలో ముగ్గురు ప్రాణాలు విడిచినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇడుక్కి, వయనాడ్, కాసర్గాడ్ జిల్లాలో సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. పలు చోట్ల చెట్లు కూలి ఇళ్లు ధ్వంసమయ్యాయని, భారీ వృక్షాలు ఉన్న చోట్ల జనం జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. కాగా, జులై 27 వరకు దక్షిణ భారతానికి భారీగా వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఏపీలో ఐదురోజులపాటు భారీ వర్షాలు..రేపు.. ఎల్లుండి ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు) -
స్కిల్ కాలేజీలతో పరిశ్రమల అనుసంధానం
సాక్షి, అమరావతి: స్కిల్ కాలేజీలు, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానం చేసి ఆయా కంపెనీలకు అవసరమైన కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం విజయవాడలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో నైపుణ్యశాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 15కల్లా పరిశ్రమలతో అనుసంధాన ప్రక్రియను పూర్తిచేయాలని నిర్దేశించారు. స్కిల్హబ్లలో శిక్షణ కోసం ఇప్పటివరకు 15,559 మంది నమోదు చేసుకున్నట్లు నైపుణ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్కుమార్ మంత్రికి వివరించారు. ఇప్పటి వరకు మొత్తం 3,636 మందికి ఉపాధి అవకాశాలు అందించినట్లు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ వినోద్కుమార్ చెప్పారు. స్కిల్ కాలేజీలు, స్కిల్హబ్లకు సంబంధించి కొత్త విధానంలో బ్రాండింగ్ చేయాలని మంత్రి బుగ్గన సూచించారు. చదవండి: ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా?.. కేసీఆర్ ఏమంటారో! -
కాలేజీలు, వర్సిటీల్లో..చదువు... సంపాదన
సాక్షి, అమరావతి: యూనివర్సిటీలు, కాలేజీలు, ఉన్నత విద్యాసంస్థల్లో ‘ఎర్న్ వైల్ లెర్న్’ (చదువుతూ సంపాదన–ఈడబ్ల్యూఎల్) పథకాన్ని త్వరలో ప్రవేశపెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. దీనికి సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలను సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలకు పంపింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులను చదువుల్లో ముందుకు తీసుకెళ్లడంతోపాటు వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు ఈ పథకాన్ని యూజీసీ రూపొందించింది. ఈ వర్గాల విద్యార్థులు తమ విద్యను కొనసాగిస్తూనే కొంత సంపాదించుకునేందుకు వీలుగా ‘చదువుతూనే సంపాదన’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దీనిని విజయవంతంగా అమలుచేయడం ద్వారా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు పార్ట్టైమ్ ఎంగేజ్మెంట్ అవకాశాలను అందించాలని అన్ని ఉన్నత విద్యాసంస్థలకు యూజీసీ ప్రతిపాదించింది. ప్రతి గంటకు నిర్ణీత మొత్తాన్ని చెల్లించాలని, గరిష్టంగా వారానికి 20 గంటలపాటు నెలలో 20 రోజులు ఈ పార్ట్టైమ్ వర్క్లు వారికి అప్పగించాలని యూజీసీ పేర్కొంది. రోజూ తరగతిలో బోధనాభ్యసన ప్రక్రియలు పూర్తయిన తర్వాతే ఈ పార్ట్టైమ్ సేవలను విద్యార్థులకు కల్పించాలని తెలిపింది. ‘చదువుతూ సంపాదన’ అనే ఈ పథకం ద్వారా ఈ వర్గాల విద్యార్థులు వారి చదువులకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి వీలవుతుందని, అదే సమయంలో వారు ఉపాధి మార్గాలను మెరుగుపర్చుకునేలా నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందించుకోగలుగుతారని యూజీసీ అభిప్రాయపడింది. ఈ ‘ఎర్న్ వైల్ లెర్న్’ పథకం బలహీనవర్గాలకు చెందిన విద్యార్థుల చదువుల్లో ఆర్థిక కష్టాలను తగ్గించడంతో పాటు విద్యార్థుల్లో కష్టపడి సంపాదించే తత్వాన్ని పెంపొందిస్తుంది. చదువుల్లో విద్యార్థులను మరింత మెరుగుపరుస్తుంది. విద్య నాణ్యత పెరగడంతోపాటు వారిలో సానుకూల దృక్పథాన్ని అభివృద్ధి చేస్తుంది’.. అని యూజీసీ తన ముసాయిదా ప్రతిపాదనల్లో పేర్కొంది. అంతేకాక.. వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి, సాంకేతిక నైపుణ్యాల మెరుగుకు తోడ్పాటునందిస్తుందని, తద్వారా ఈ వర్గాల విద్యార్థుల్లో సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతాయని యూజీసీ అభిప్రాయపడింది. ‘విద్యార్థులు వృత్తిపరమైన పనులను త్వరగా చేపట్టడంలో ఈ కార్యక్రమం సహాయపడుతుంది. పార్టుటైమ్ పనుల కేటాయింపు ఇలా.. సామాజికంగా, ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు విద్యాసంస్థల్లో ఎలాంటి పార్ట్టైమ్ ఉపాధి కార్యక్రమాలు కలి్పంచాలో కూడా యూజీసీ సూచించింది. ఇందుకు సంబంధించిన జాబితాను రూపొందించింది. ఇందులో.. ♦ రీసెర్చ్ ప్రాజెక్టులతో కూడిన అసిస్టెంట్షిప్, లైబ్రరీ అసైన్మెంట్లు, కంప్యూటర్ సర్విసెస్, డేటాఎంట్రీ, లేబొరేటరీ అసిస్టెంట్లు తదితరాలతో పాటు ఆయా సంస్థలు ఇతర అంశాల్లోనూ పార్ట్టైమ్ జాబ్లను కలి్పంచాలని యూజీసీ పేర్కొంది. ♦ ఇందుకు సంబంధించి ఆయా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రత్యేక సెల్లను ఏర్పాటుచేయాలని తెలిపింది. ♦ సంస్థ డీన్ లేదా డిపార్ట్మెంటల్ హెడ్ తదితరులతో చర్చించి అర్హులైన విద్యార్థులను గుర్తించిన అనంతరం ఉన్నతాధికారుల ఆమోదంతో విద్యార్థులకు తగ్గ పనులను అప్పగించాలని వివరించింది. ♦ ప్రతి అకడమిక్ సెషన్లోనూ ఈ విద్యార్థులను గుర్తించి పూల్గా ఏర్పరచి వీసీ, లేదా ప్రిన్సిపాళ్ల ఆమోదంతో పార్ట్టైమ్ పనులు కేటాయించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ♦ జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా ఈ మార్గదర్శకాలు రూపొందించారు. ♦ సామాజిక–ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి ఇది ఎంతో ఉత్తమమైన కార్యక్రమమని యూజీసీ వివరించింది. ♦ మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు, చిన్నచిన్న పట్టణాల నుంచి వచ్చిన పిల్లలు, దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడ్డ వారికి ఈ కార్యక్రమం ద్వారా ప్రాధాన్యమివ్వాలని తెలిపింది. బ్రిడ్జి కోర్సుల నిర్వహణ ఇక ఉన్నత విద్యాసంస్థల్లో చేరే ఈ విద్యార్థులకు తొలి ఏడాదిలోనే బ్రిడ్జి కోర్సులను నిర్వహించాలని యూజీసీ పేర్కొంది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఈ విద్యార్థులు సంబంధిత కోర్సుల్లోని అంశాలకు సంబంధించి పూర్వపు పరిజ్ఞానాన్ని పూర్తిగా నేర్చుకునే పరిస్థితుల్లేక వెనుకబడి ఉంటారని, ఆ లోపాన్ని పూరించేందుకు ఈ కోర్సులు ఎంతగానో తోడ్పడతాయని తెలిపింది. ఇతర విద్యార్థులతో సమాన స్థాయికి వీరు చేరుకునేందుకు ఇవి అవకాశం కలి్పస్తాయని తెలిపింది. సెమిస్టర్ ప్రోగ్రామ్ ప్రారంభానికి ముందు ఏటా వీటిని నిర్వహించాలని సూచించింది. -
అటువంటి కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ గ్రాంట్తో నడిచే కాలేజీ కార్యకలాపాలు సక్రమంగా సాగనప్పుడు, ఆస్తుల దుర్వినియోగం జరిగినప్పుడు ఆ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం తప్పు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా నర్సరావుపేటలోని శ్రీ త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన ఎన్బీటీ అండ్ ఎన్వీసీ కాలేజీ యాజమాన్య బాధ్యతలను, ఆస్తులను టేకోవర్ చేస్తూ 2017లో జారీ చేసిన జీవో 17ను హైకోర్టు సమర్ధించింది. ఆ జీవోను సవాలు చేస్తూ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎన్బీటీ అండ్ ఎన్వీసీ కాలేజీ సెక్రటరీ, కరస్పాండెంట్ నల్లా రామచంద్ర ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఆ విద్యా సంస్థ సెక్రటరీ కాలేజీ కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించకపోవడంతో కళాశాలలో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది లేని పరిస్థితి నెలకొందని, దీంతో పేద, అణగారిన వర్గాల ప్రజలకు విద్యనందించాలన్న లక్ష్యం నెరవేరకుండా పోయిందని హైకోర్టు తెలిపింది.ఈ పరిస్థితుల్లో విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వమే ఆ కాలేజీని టేకోవర్ చేసిందని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు ఇటీవల తీర్పు వెలువరించారు. కోడెల వల్లే మా కాలేజీకి ఈ దుస్థితి కళాశాలను ప్రభుత్వం టేకోవర్ చేయడాన్ని సవాలు చేస్తూ నల్లా రామచంద్రప్రసాద్ 2017లో దాఖలు చేసిన వ్యాజ్యంలో అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ను ప్రతివాదిగా చేర్చి, ఆయనపై పలు ఆరోపణలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ గంగారావు తుది విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది డి.కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ.. స్థానిక రాజకీయ కారణాలతో అప్పటి స్పీకర్ తమ కాలేజీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకున్నారని, యాజమాన్యంలో చీలికలు తెచ్చారని తెలిపారు. తమ కాలేజీలోని బోధన, బోధనేతర సిబ్బందిని ఇతర కాలేజీలకు బదిలీ చేయించి, కాలేజీలో విద్యార్థులు లేకుండా చేశారన్నారు. అంతిమంగా కాలేజీని నడపలేని స్థితికి కోడెల తీసుకొచ్చారని తెలిపారు. ఆ తరువాత తమ వివరణను పరిగణనలోకి తీసుకోకుండానే కాలేజీని టేకోవర్ చేస్తూ ప్రభుత్వం 2017లో జీవో జారీ చేసిందన్నారు. ఉన్నత విద్యా శాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అంతర్గత వివాదాల వల్ల కాలేజీ కార్యకలాపాలు సక్రమంగా సాగడంలేదని, నిధుల దుర్వినియోగం కూడా జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. విచారణ జరిపిన కమిటీ ఆ కాలేజీని టేకోవర్ చేయాలని సిఫారసు చేసిందన్నారు. పిటిషనర్కు షోకాజ్ నోటీసు ఇచ్చి, వివరణ కోరామని తెలిపారు. వివరణను పరిగణనలోకి తీసుకున్న తరువాతే కాలేజీని టేకోవర్ చేస్తూ జీవో ఇచ్చినట్లు తెలిపారు. -
వీళ్ల తెలివి తగలెయ్య! కళాశాల టాయిలెట్లో సీసీ కెమెరా.. ఆ తర్వాత
ప్రపంచంలో రకరకాల దొంగలను మనం చూస్తూనే ఉంటాం. వీరిలో కొందరు విలువైన వస్తువులను దోచుకోగా, మరికొందరు తక్కువ విలువైన వస్తువులను దోచుకుంటుంటారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని ఓ దొంగ కళాశాలలోని కుళాయిలను తరచూ మాయం చేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన కాలేజీ సెక్యూరిటీ టీమ్ దొంగలను పట్టుకునేందుకు తీసుకున్న చర్యల కారణంగా విద్యార్థులు నిరసనకు దిగారు. అసలు అక్కడ ఏం జరిగిందంటే.. సీసీకెమెరా.. పొరపాటు జరిగింది. అజంగఢ్లోని డీఏవీ పీజీ కళాశాల విద్యార్థులు 'తోటి చోర్' (నీటి కుళాయి దొంగ)ను పట్టుకునేందుకు ప్లాన్ చేశారు. అందుకోసం కళాశాలలోని పలు చోట్ల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో టాయిలెట్ల వెలుపల కూడా ఒక కెమెరాను ఏర్పాటు చేశారు. దీంతో మండిపడ్డ విద్యార్థులు కళాశాల యాజమాన్యం తీరుపై మండిపడుతూ నిరసనకు దిగారు. ఈ పరిణామాలపై యాజమాన్యం స్పందిస్తూ.. క్యాంపస్లో నిత్యం నీటి కుళాయిలు చోరీకి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని నివారించేందుకు కుళాయిలపై నిఘా ఉంచాలనుకున్నాం. అందులో భాగంగానే సీసీటీవీ కెమరాలు ఏర్పాటు చేశాం. అయితే, పొరపాటున టాయిలెట్వైపు ఒక కెమెరా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దాన్ని తీసివేసి మరో చోట మళ్లీ ఇన్స్టాల్ చేయమని ఆర్డర్ కూడా జారీ చేసినట్లు చెప్పింది. కళాశాల ప్రిన్సిపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. బాత్రూం దగ్గర సీసీటీవీ కెమెరా ఒకటి ఏర్పాటు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే దిద్దుబాటు చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పారు. మరో వైపు కళాశాల అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళనకు దిగిన విద్యార్థులు వారి నిరసనను విరమించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: యువతకు మంచి భవిష్యత్ను అందించాలనే ఆలోచనలను ఆచరణలో పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.100 కోట్లతో 3 పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్ గౌర్ సోమవారం గెజిట్ విడుదల చేశారు. ఈ వివరాలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల, అనంతపురం జిల్లా గుంతకల్, వైఎస్సార్ జిల్లా మైదుకూరుల్లో పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ కాలేజీలు అందుబాటులోకి వస్తే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్, మెటలర్జికల్ విభాగాల్లో డిప్లొమా కోర్సుల కోసం సుదూర ప్రాంతాలు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ యువతకు మరింత వెసులుబాటు ఉంటుందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ మరింత మెరుగుపడి విద్య పూర్తవగానే ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని తెలిపారు. మంజూరైన 3 పాలిటెక్నిక్ కాలేజీల్లో ఒకదాన్ని రూ.30 కోట్లతో తన నియోజకవర్గం డోన్ పరిధిలోని బేతంచెర్లలో ఏర్పాటు చేస్తుండటం పట్ల సీఎం వైఎస్ జగన్కు బుగ్గన రాజేంద్రనాథ్ కృతజ్ఞతలు తెలియజేశారు. 3 కాలేజీలను వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికే కేటాయించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. చదవండి: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్ -
టెర్రస్పై ఇన్స్టాగ్రామ్ రీల్ చిత్రీకరిస్తుండగా..కిందపడి విద్యార్థి మృతి
ఇన్స్టాగ్రామ్ రీల్ చిత్రిస్తుండగా టెర్రస్పై నుంచి కిందపడి విద్యార్థి మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన చత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..బిలాస్పూర్ పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ కళాశాలలో బీఎస్సీ ఫస్ట్ ఈయర్ చదువుతున్న 20 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి ఇన్స్టాగ్రామ్ రీల్ షూట్ చేసేందుకు టెర్రస్పైకి ఎక్కాడు. ఐతే వీడియో చిత్రీకరించే సమయంలో ప్రమాదవశాత్తు విద్యార్థి టెర్రస్ పైనుంచి కిందపడి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని అశుతోష్ సోవోగా గుర్తించారు పోలీసులు. అతను తన ఐదుగురు స్నేహితులతో కలిసి ఇన్స్టాగ్రాం రీల్ చేయడానిక ప్లాన్ చేసినట్లు తెలిపారు. ఐతే అశుతోష్ కాలేజ్ టెర్రస్ సరిహద్దు గోడను దూకి కిటికి స్లాబ్పైకి ఎక్కుతుండగా ప్రమాదం జరిగిందన్నారు. అదే సమయంలో స్నేహితులు మొబైల్లో చిత్రికరిస్తుండటంలో మునిపోవడంతో.. ఈ అనుహ్య ప్రమాదాన్ని గుర్తించకపోవడంతో అతన్ని రక్షించలేకపోయారని పోలీసులు తెలిపారు. మృతుడు 20 అడుగుల ఎత్తు నుంచి పడిపోయాడని తెలిపారు. ఈ మేరకు పోలీసులు ప్రమాదవశాత్తు మృతి చెందిన కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఐతే అందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇలాంటి రిస్క్లు తీసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంతకీ ఆ ఈ వీడియోలో వారు ఏం చెప్పాలనుకున్నారంటే..సావో అనే వ్యక్తి కిటికీ స్లాబ్పైకి దూకడం వీడియోలో కనిపిస్తుంది. నేను ఇక్కడి నుంచి దూకితే తిరిగి రాలేను అను చెబుతాడు. అప్పుడే అతని స్నేహితుడు నువ్వు రాగలవు అని చెబుతున్నట్లు వీడియోలో వినపడుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే పట్టు తప్పి అశుతోష్ కిందపడిపోయాడు. అతని స్నేహితులు అశుతోష్ని రక్షించలేకపోయారు. ఇలాంటి రిస్క్లతో కూడిన రీల్ని చిత్రీకరించేటప్పుడూ పలు జాగ్రత్తుల తీసుకోవడం ముఖ్యమని పోలీసులు చెబుతున్నారు. (చదవండి: చైనాతో పరిస్థితి డేంజర్గానే ఉంది! జైశంకర్) -
స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిలపై నిషేధంపై తాలిబన్ల కీలక ప్రకటన
కాబూల్: అఫ్గానిస్తాన్లో అమ్మాయిలు హైస్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో చదవుకోకుండా తాలిబన్ ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ చర్యను ప్రపంచదేశాలు తీవ్రంగా తప్పుబట్టాయి. తాజాగా ఇందుకు సంబంధించి తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. విద్యాసంస్థల్లో అమ్మాయిలపై విధించిన నిషేధం శాశ్వతం కాదని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ఇది కొంతకాలం వాయిదా మాత్రమే పడినట్లు పేర్కొన్నారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో అమ్మాయిలకు అనువైన వాతావరణం కల్పించిన తర్వాత వాళ్లు మళ్లీ చదువుకుంటారని పేర్కొన్నారు. మహిళా విద్యకు తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే ఇది ఎప్పటివరకు పూర్తవుతుందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. అఫ్గాన్లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరాచక పాలన కొనసాగుతోంది. ముఖ్యంగా మహిళల హక్కులను వారు కాలరాస్తున్నారు. మగ తోడు లేకుండా, హిజాబ్ ధరించకుండా మహిళలు బయటకు వెళ్లొద్దని నిబంధన తీసుకొచ్చారు. అలాగే ఆరో తరగతి తర్వాత అమ్మాయిల, అబ్బాయిలు కలిసి చదువుకోవడాన్ని తాలిబన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యాసంస్థల్లో అమ్మాయిలపై డిసెంబర్లో నిషేధం విధించారు. చదవండి: కరోనా పరీక్షలు.. దక్షిణ కొరియా, జపాన్పై చైనా ప్రతీకార చర్యలు.. -
2024 నాటికి అన్ని కాలేజీలకు నాక్ గుర్తింపు!
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం... అన్ని కళాశాలల్లో ప్రమాణాల పెంపునకు సైతం అనేక చర్యలు చేపట్టింది. 2024 నాటికి డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు అన్ని ఉన్నత విద్యాసంస్థలకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) గుర్తింపును తప్పనిసరి చేసింది. నాక్తో పాటు ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్లోనూ రాష్ట్ర విద్యాసంస్థలు స్థానం సంపాదించేలా చర్యలు చేపట్టింది. కాలేజీలకు నాక్ గుర్తింపు రావడంలో సహకారం అందించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో ప్రత్యేకంగా క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ను ఏర్పాటు చేయించింది. దీని ద్వారా అన్ని కాలేజీలు నాక్ ‘ఎ’ గ్రేడ్తో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకులు సాధించేలా కార్యాచరణ చేపట్టింది. క్వాలిటీ అస్యూరెన్స్ సెల్లో వర్సిటీలు, స్వయంప్రతిపత్తి పొందిన కాలేజీలు, పరిశ్రమల ప్రముఖులతోపాటు ఉన్నత విద్యాశాఖ నుంచి సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సెల్ ద్వారా ఇప్పటికే కాలేజీలు నాక్ గుర్తింపు సాధించేలా మార్గనిర్దేశం చేస్తోంది. విద్యా ప్రమాణాల పెంపు, నాక్ గుర్తింపునకు అవసరమైన వనరుల కల్పన, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్కు అవసరమయ్యే అంశాల్లో కాలేజీలను ముందుకు తీసుకువెళ్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో క్వాలిటీ లీడర్లుగా 164 ఇంజనీరింగ్, డిగ్రీ, ఫార్మసీ కాలేజీలు, వర్సిటీలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కాలేజీలు నాక్ గుర్తింపు సాధించేలా సహకారం అందిస్తున్నారు. ప్రమాణాల పెంపునకు అత్యధిక ప్రాధాన్యం.. తొలి అడుగుగా నాక్ ‘బీ’ కేటగిరీలో ఉన్న కాలేజీలను గుర్తించి.. వాటి ద్వారా అసలు నాక్ గుర్తింపు లేని కాలేజీలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే 72 నాక్ గుర్తింపు ఉన్న కాలేజీలను, 13 వర్సిటీలను గుర్తించి వాటిని క్యూ (క్వాలిటీ) మెంటార్లుగా ఏర్పాటు చేశారు. వీటితోపాటు మరో 117 కాలేజీలను కూడా క్వాలిటీ మెంటార్లుగా గుర్తించి 346 కాలేజీలు నాక్ గుర్తింపు సాధించేలా వాటిని అనుసంధానించారు. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాములు, శిక్షణ, ఈ–కంటెంట్ ప్రిపరేషన్ తదితర అంశాల్లో ఆయా కాలేజీలకు సహాయమందిస్తున్నారు. ఉద్యోగాలు కొల్లగొట్టేలా ఉచిత శిక్షణ.. ప్రభుత్వం అన్ని కోర్సుల్లో ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు విద్యార్థులకు సర్టిఫికేషన్ కోర్సులను ఉచితంగా అందిస్తోంది. ఇంటర్న్షిప్ కోసం కాలేజీలను పరిశ్రమలతో అనుసంధానించారు. మైక్రోసాఫ్ట్, సిస్కో, సేల్స్ఫోర్స్, ఏడబ్ల్యూఎస్ వంటి సంస్థల ద్వారా లక్ష మందికి వర్చువల్ ఇంటర్న్షిప్నకు చర్యలు చేపట్టారు. ఐసీఐసీఐ, విప్రో, ఐబీఎం, ఎడెల్వైస్, హీరో, హోండా, మారుతి సుజికీ వంటి సంస్థల్లో ఫుల్స్టేక్, హెచ్ఆర్, మార్కెటింగ్, సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్ వంటి అంశాల్లో 50 వేల మందికి వర్చువల్ ఇంటర్న్షిప్ను అందిస్తున్నారు. -
తగని వసతులు లేని చదువులా?
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తమ బతుకులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మారతాయని ఆశించి ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ ప్రజలు పాల్గొన్నారు. అయితే ఈ ఉద్యమంలో ప్రత్యేక పాత్ర పోషించింది మాత్రం అణగారిన కులాల ప్రజలు. అలాగే విద్యార్థుల పాత్రా మరువ రానిది. అయితే ఉద్యమంలో కేవలం యూనివర్సిటీల విద్యార్థులు మాత్రమే పాల్గొన్నట్లు చెబుతూ ఇతర విద్యార్థుల పాత్రను ప్రస్తావించరు చాలామంది. తెలంగాణలోని స్కూల్స్, జూనియర్ కాలేజీలు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివేవారూ సొంత రాష్ట్ర సాధనలో స్వార్థంలేని కృషి చేశారు. స్వరాష్ట్రం సిద్ధించినా పాఠశాలల పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉందని చెప్పడానికే విద్యార్థుల త్యాగాలను ఇప్పుడు గుర్తు చేయవలసి వస్తున్నది. ఇటీవల కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన యూడీఐఎస్ఏ 2021– 22 నివేదిక మన పాఠశాలలు మౌలిక వసతుల లేమితో కునారిల్లుతున్న సంగ తిని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు కలిపి సుమారు 43,083 ఉన్నాయి. అందులో మొత్తం 69,15,241 విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సుమారు 3,20,894 ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఈ లెక్కల వల్ల సగటున ఒక పాఠశాలకు కేవలం 7గురు టీచర్స్ మాత్రమే ఉన్నారన్న ఆందోళనకరమైన సంగతి స్పష్టమవుతున్నది. రాష్ట్రంలో కేవలం 31,716 పాఠశాలలకే పిల్లలు ఆటలు ఆడుకునే మైదానాలు ఉన్నాయి. కేవలం 772 బడులలో మాత్రమే డిజిటల్ లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ వరల్డ్ అని ఉపన్యాసాలు దంచుతున్నాయి కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. మన విద్యార్థులకు కావాల్సిన టాయిలెట్స్ విషయానికి వస్తే... కేవలం 33,428 పాఠశాలల్లో మాత్రమే బాలికలకు అత్యవసరమైన టాయిలెట్స్ సదుపాయాలు ఉన్నాయి. సుమారు 10 వేల పాఠశాలల్లో కనీసం టాయిలెట్స్ లేవు. మగపిల్లలకు కేవలం 29,137 పాఠశాలల్లో టాయిలెట్స్ సదుపాయాలు ఉన్నాయి. తాగునీరు అందుబాటులో లేని పాఠశాలలు 6 వేలకు పైగా ఉన్నాయి. మొన్నటి వరకు కరోనా వ్యాధి కారణంగా మన పిల్లలు ఆన్లైన్లో అరకొర విద్యాభ్యాసాన్ని కొన సాగించారు. అయితే అందులో కూసింత ఆర్థికంగా బలంగా ఉన్నవారు మంచి వసతులతోనే చదువుకున్నారు. అయితే ప్రధానంగా నష్ట పోయింది మాత్రం ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యను కొనసాగిస్తున్న అణగారిన గ్రామీణ, పట్టణ పేదల పిల్లలే. వీరికి కంప్యూటర్లు, వైఫైవ్ లేదా ఇంటర్నెట్ వంటివి అందుబాటులో లేకపోవడం వల్లనే నష్టపోయారు. టాయిలెట్, స్కూల్ లైబ్రరీలు, పిల్లలు ఆడే మైదానాలు, సరిపడా టీచర్స్, స్కూల్లో ఆన్లైన్ సదుపాయం, డిజిటల్ లైబ్రరీలు, ఇతర సరి పడా నైపుణ్యాలు నేర్పే పరికరాలు లేకుంటే ఏ విధంగా మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో నెట్టుకురాగలరు? ప్రత్యామ్నాయ వసతులు లేకపోతే కరోనా వంటి మహమ్మారులు ప్రబలిన కాలంలో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఆన్లైన్ క్లాసులను ఎలా ఉప యోగించుకోగలరు? ఒక పక్క చిన్న చిన్న ఉప ఎన్ని కల్లోనూ పార్టీలు వందల, వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి గెలవడానికి ప్రయత్నిస్తున్నాయి కానీ... అవే పార్టీలు అధికారంలో ఉన్నా దేశానికి ఎంతో అవసరమైన విద్యకు బడ్జెట్ను తగిన మొత్తంలో కేటాయించక పోవడం విషాదం. ఇప్పటికీ వేలాది పాఠశాలల్లో ఆడపిల్లలకు మరుగు దొడ్లు లేవంటే బాలికా విద్య పట్ల మన ప్రభుత్వాల చిత్తశుద్ధి ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కనీస మరుగుదొడ్లు లేని పాఠశాలల వల్లే అనేకమంది తల్లి దండ్రులు ఆడపిల్లలను బడులకు పంపించడం లేదనే కఠోర వాస్తవం ప్రభుత్వాలకు తెలియదా? ‘బంగారు తెలంగాణ’, ‘వెండి తెలంగాణ’ అనే కబుర్లు మాని... తెలంగాణ ప్రభుత్వం అన్ని విద్యా సంస్థల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలి. ఆరు వేల ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం తాగడానికి ఇప్పటికీ మంచి నీటి వసతి లేదంటే పిల్లలు ఎలా చదువుకోవాలి? మౌలిక సదుపాయాల కల్పన జరిగినప్పుడే స్వరాష్ట్రం కొరకు విద్యార్థులు చేసిన త్యాగాలకు ఫలితం దక్కేలా చేసినట్లు అవుతుంది. అశోక్ ధనావత్, వ్యాసకర్త ఎం.ఏ. డెవలప్మెంట్ స్టడీస్ విద్యార్థి ది హేగ్, నెదర్లాండ్స్ -
కళాశాలల త‘ఖరారు’..!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు అత్యంత కీలకమైనవి ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన పథకాలే. ఇవి అమలు చేయాలంటే సదరు కాలేజీ తప్పకుండా ఈపాస్ వెబ్ పోర్టల్లో ధ్రువీకరణ చేయించుకోవాలి. ఇందుకోసం సంబంధిత కాలేజీల యాజమాన్యాలు ఈపాస్ పోర్టల్లో కాలేజీ గుర్తింపు పత్రాలు, ఏటా సంబంధిత బోర్డు/ యూనివర్సిటీ ద్వారా పొందిన అఫిలియేషన్ పత్రాలను అప్లోడ్ చేయాలి. వాటిని పరిశీలించిన అధికారులు సదరు కాలేజీని ధృవీకరించి అందులో చదువుతున్న విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను వర్తింపజేస్తారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 4,833 ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కాలేజీలుండగా.. వీటిలో ఇప్పటి వరకు పోర్టల్లో సంక్షేమాధికారులు ధ్రువీకరించిన కాలేజీలు 2,843 మాత్రమే. ధృవీకరణ పొందిన వాటిలో 2,626 జూనియర్ కాలేజీలుండగా.. మరో 150 ఐటీఐలున్నాయి. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కాలేజీల కేటగిరీలో ఇప్పటివరకు ధ్రువీకరణ పొందినవి కేవలం 67 కాలేజీలు మాత్రమే ఉండడం గమనార్హం. జాప్యం ప్రభావం విద్యార్థులపైనే... కాలేజీ యాజమాన్యాలు ఈపాస్లో ధ్రువీకరణ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. కానీ చాలా కాలేజీలు ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తున్నాయి. కొన్ని కాలేజీలు మొక్కుబడిగా ఈపాస్ పోర్టల్లో వివరాలు సమర్పించి చేతులు దులుపుకుంటున్నాయి. అఫిలియేషన్, గుర్తింపు పత్రాలను పూర్తిస్థాయిలో అప్లోడ్ చేయకుండానే సబ్మిట్ చేస్తున్నట్లు సంక్షేమ శాఖల అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో పూర్తిస్థాయి పత్రాలు సమర్పించిన కాలేజీలను మాత్రమే కన్ఫర్మ్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలు వెబ్సైట్లో ధ్రువీకరణ పొందగా... డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలు మాత్రం అత్యంత వెనుకబడ్డాయి. ►డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 117 కాలేజీలుండగా... వీటిలో కేవలం రెండు కాలేజీలు మాత్రమే పోర్టల్లో ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసుకున్నాయి. ►జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలో 200 కాలేజీల్లో ఒక్క కాలేజీ కూడా పోర్టల్లో కన్ఫర్మ్ కాలేదు. ►డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో 30 కాలేజీలు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో 111 కాలేజీలు, పాలమూరు యూనివర్సిటీ పరిధిలో 99 కాలేజీలు, శాతవాహన యూనివర్సిటీ పరిధిలో 115 కాలేజీలు, తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో 79 కాలేజీలు, టీఎస్ పారామెడికల్ బోర్డు పరిధిలో 142 కాలేజీలుండగా వీటిలో ఇప్పటివరకు ఒక్క కాలేజీకి కూడా ధ్రువీకరణ దక్కలేదు. ►ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 535 కాలేజీలుండగా... కేవలం 8 కాలేజీలు మాత్రమే పోర్టల్లో కన్ఫర్మ్ అయ్యాయి. ►కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో 115 కాలేజీలుండగా... ఒక్క కాలేజీ మాత్రమే కన్ఫర్మ్ అయ్యింది. ►డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ పరిధిలో 215 ఐటీఐల్లో 150 ఖరారు కాగా మిగతావి పెండింగ్లో ఉన్నాయి. -
TS: ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం.. యాక్షన్ ప్లాన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో గుణాత్మక మార్పులకు ఉన్నత విద్యామండలి శ్రీకారం చుడుతోంది. వచ్చే ఏడాది నుంచి డిమాండ్ మేరకే కోర్సులు, సీట్లను అనుమతించాలని నిర్ణయించింది. విద్యార్థుల డిమాండ్ను బట్టి బ్రాంచ్లను మార్చుకునేందుకు అవకాశం ఇవ్వనుంది. జీరో అడ్మిషన్లున్న కోర్సులు, కాలేజీలను రద్దు చేసే ప్రతిపాదనను కఠినంగా అమలు చేసే యోచనలో ఉంది. చదవండి: టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ 'మరో ప్రస్థానం' ఈ మేరకు రూపొందించిన యాక్షన్ ప్లాన్కు మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ ఇప్పటికే సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఈ ఏడాది నుంచే సంస్కరణలకు ఉన్నత విద్యామండలి తెర తీసింది. ప్రవేశాలు, డిమాండ్ లేని కాలేజీల్లో దాదాపు లక్ష సీట్లను ఫ్రీజ్ చేసింది. కాలేజీల అభ్యర్థన మేరకు ఈ ఏడాది తిరిగి అనుమతించినా, వచ్చే సంవత్సరం కచ్చితంగా అమలు చేయాలని భావిస్తున్నారు. కోర్సుల హేతుబద్దీకరణ రాష్ట్రంలో 4.60 లక్షల డిగ్రీ సీట్లున్నాయి. కానీ, ఏటా 2 నుంచి 2.5 లక్షల సీట్లే భర్తీ అవుతున్నాయి. కొన్ని కాలేజీల్లో జీరో ప్రవేశాలుంటే, మరికొన్నింటిలో 15 శాతంలోపే ఉంటున్నాయి. ఇలాంటి కాలేజీల్లోని విద్యార్థులు ఇతర కాలేజీల్లోకి వెళ్లేందుకు ఉన్నత విద్యామండలి అనుమతివ్వాలని నిర్ణయించింది. విద్యార్థుల సంఖ్యకు మించి సీట్లున్న కాలేజీల మూడేళ్ల డేటాను తెప్పించి, వీటిని హేతుబద్దీకరించాలని భావిస్తోంది. ఉదాహరణకు ఒక కాలేజీలో 240 సీట్లు ఉంటే, 110 మందే విద్యార్థులు చేరినప్పుడు 180 సీట్లకే అనుబంధ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతీ సెక్షన్కు 60 మంది విద్యార్థుల చొప్పున మూడు సెక్షన్లకు అనుమతించి, ఒక సెక్షన్ను ఎత్తివేస్తారు. మూడేళ్లలో 60 సీట్లు కూడా నిండని కాలేజీల్లో 120 సీట్లు ఉంటే, వాటిని 60 సీట్లకే పరిమితం చేస్తారు. కోర్సుల మార్పిడి ఇలా.. దోస్త్ ప్రవేశాల డేటాను ప్రామాణికంగా తీసుకుని కోర్సుల మారి్పడి చేపట్టాలని నిర్ణయించారు. మూడేళ్లలో ఒక కాలేజీకి విద్యార్థులు ఏ కోర్సుకు ఎక్కువగా దరఖాస్తు చేస్తున్నారో చూస్తారు. అతి తక్కువ దరఖాస్తులు వచ్చిన కోర్సుల్లోని సీట్లను తగ్గించుకుని, ఎక్కువ మంది దరఖాస్తు చేసే కోర్సుల్లో సీట్లు, సెక్షన్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలని భావించారు. గత కొన్నేళ్లుగా విద్యార్థులు బీఏ కోర్సుల్లో 20 వేలకు మించి దరఖాస్తు చేయడం లేదు. బీఎస్సీ డేటా సైన్స్, కంప్యూటర్ అనుబంధ కోర్సులకు ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి. ఈ లెక్కన కొన్ని సంప్రదాయ కోర్సులు గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. మార్పులు అవసరం ఏటా ఇంటర్ ఉత్తీర్ణులు 3.60 లక్షలుంటే, డిగ్రీ సీట్లు 4.60 లక్షల వరకూ ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని డిమాండ్–నిష్పత్తి విధానం అమలు దిశగా అడుగులేస్తున్నాం. కోర్సులు, కాలేజీల హేతుబద్ధీకరణ చేపట్టాలని భావిస్తున్నాం. విద్యార్థులు ఇష్టపడే, ఉపాధి అవకాశాలు ఉండే కోర్సుల్లో సీట్లు పెంచడమే ఈ సంస్కరణల ఉద్దేశం. –ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ నష్టం లేకుండా చూడాలి ఇంజనీరింగ్ ప్రవేశాల తర్వాతే విద్యార్థులు డిగ్రీలో చేరడంపై నిర్ణయం తీసుకుంటారు. అందుకే ఈ ఏడాది దోస్త్ ప్రవేశాలు మందకొడిగా ఉన్నాయి. లక్ష సీట్లు ఫ్రీజ్ చేయడం సరికాదని అధికారులకు చెప్పాం. వాళ్లు ఒప్పుకున్నారు. ఏ సంవత్సరమైనా ఒక్కో కోర్సులో ప్రవేశాలు ఒక్కో రకంగా ఉంటాయి. పెరగడం, తగ్గడం సహజం. వీటిని దృష్టలో పెట్టుకుని కాలేజీలకు నష్టం జరగకుండా సంస్కరణలు చేపట్టాలి. – ఎకల్దేవి పరమేశ్వర్, ప్రైవేటు డిగ్రీ కాలేజీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ఇంజినీరింగ్ కాలేజీల ‘లీలలు’.. షోకాజ్ నోటీసులు జారీ!
అనంతపురం: ఇంజినీరింగ్ కళాశాలలు మాయ చేస్తున్నాయి. నిజనిర్ధారణ కమిటీ తనిఖీల్లో అధ్యాపకులు ద్విపాత్రాభినయం బయటపడింది. ఒక్కో అధ్యాపకుడి పేరు రెండు కళాశాలల్లో నమోదు కావడం నివ్వెరపరుస్తోంది. ఇంజినీరింగ్ విద్యలో నాణ్యత ప్రమాణాలకు జేఎన్టీయూ (ఏ) యాజమాన్యం పెద్ద పీట వేస్తోంది. నిబంధనలు విస్మరిస్తూ, నామమాత్రంగా నడుపుతున్న కళాశాలలపై కన్నెర్ర చేస్తోంది. బోధన ప్రమాణాలు పాటించకపోవడంతో పాటు తక్కువ అడ్మిషన్లతో నెట్టుకొస్తున్న 30 ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు చేయడం యూనివర్సిటీ చరిత్రలో ప్రథమం. అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో వసతులు, విద్యార్థి – అధ్యాపక నిష్పత్తి, క్యాంపస్ పరిస్థితి, ఆటస్థలం, గ్రంథాలయ సదుపాయం, ల్యాబ్ తదితర అంశాలను యూనివర్సిటీ ఏటా నిజనిర్ధారణ కమిటీల ద్వారా పరిశీలిస్తోంది. ఏ కళాశాలకు ఎన్ని సీట్లు కేటాయించాలనే దానికి కమిటీ నివేదికే ప్రామాణికం. నివ్వెరపోయే వాస్తవాలు.. జేఎన్టీయూ అనంతపురం పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల గారడీని నిజనిర్ధారణ కమిటీ తమ పరిశీలనలో బహిర్గతం చేసింది. ఒకే కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుడి పేరు మరో ఇంజినీరింగ్ కళాశాలలోనూ నమోదైనట్లు గుర్తించింది. ఇలాంటివి 40 ఇంజినీరింగ్ కళాశాలల్లో బయటపడ్డాయి. ఒక అధ్యాపకుడు రెండు చోట్ల ఎలా పని చేస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆయా కళాశాలలకు షోకాజ్లు జారీ చేసింది. కొన్ని సబ్జెక్టుల్లో పీహెచ్డీ పూర్తి చేసిన అభ్యర్థుల కొరత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఒకరి పేరునే రెండు, మూడు కళాశాలల్లో పనిచేస్తున్నట్లు ఆయా యాజమాన్యాలు చూపించాయి. మరో వైపు కొన్ని కళాశాలల్లో ఫ్యాకల్టీ నియమించుకోకుండా అర్హులైన అధ్యాపకుల పేర్లను మాత్రమే చూపించాయి. పది రోజుల్లో సరైన వివరణ ఇవ్వాలని షోకాజ్లో పేర్కొంది. -
ఇంజనీరింగ్ విద్య పల్లెకు దూరం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ చేయాలంటే ఇక రాజధానికే చేరాలా? సొంతూళ్లలో ఉండి చదువుకోవడం సాధ్యం కాదా? సాంకేతిక విద్యారంగ నిపుణులు లేవనెత్తే సందేహాలివి. నిజమే! ఇంజనీరింగ్ కాలేజీలు శరవేగంగా మూతపడుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చేరువగా ఉండే కాలేజీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలేజీలు మాత్రమే పోటీ ప్రపంచంలో పడుతూ లేస్తూ నిలబడుతున్నాయి. రాష్ట్రంలో 2014లో 249 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, ఇప్పుడు వీటి సంఖ్య 175కు తగ్గింది. అంటే 2014 నుంచి ఇప్పటివరకు ఎనిమిదేళ్లలో 74 కాలేజీలు మూతపడ్డాయి. ఇందులో 54 కళాశాలలు గ్రామీణ ప్రాంతాలకు చేరువలో జిల్లా కేంద్రంలో ఉండేవే. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న కాలేజీల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని కాలేజీల మనుగడే కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రధాన బ్రాంచీల్లోనే పూర్తిగా సీట్లు నిండని కళాశాలలు 15 వరకూ జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ కొన్ని కాలేజీల్లో భారీగా సీట్లు మిగిలిపోతున్నాయి. హైదరాబాద్ బాట పట్టడం వల్లేనా?: టెన్త్ వరకూ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నా... తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హాస్టల్లో ఉండి ఇంటర్ చదివేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఎంసెట్, జేఈఈ మెయిన్స్ సహా పలు పోటీ పరీక్షలకు రాజధానిలో కోచింగ్ తీసుకోవడం తేలికని భావిస్తున్నారు. ఇంజనీరింగ్ తర్వాత ఉపాధే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. దీంతో అవసరమైన అనుబంధ కోర్సులు చేసేందుకు హైదరాబాద్లోనే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. పలు కంపెనీలు క్యాంపస్ నియామకాలను హైదరాబాద్ పరిసర కాలేజీల్లోనే నిర్వహిస్తున్నాయనే ప్రచారం ఉంది. కంప్యూటర్ కోర్సులూ కారణమే.. గత ఐదేళ్లుగా సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సుల కన్నా, కంప్యూటర్ సైన్స్, కొత్తగా వచ్చిన దాని అనుబంధ కోర్సులకే విద్యార్థులు ప్రాధాన్యమిస్తున్నారు. గత ఏడాది సీఎస్ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల్లో 38,796 సీట్లు ఉంటే, 37,073 సీట్లు భర్తీ అయ్యాయి. ఆ తర్వాత స్థానంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 13,935 సీట్లకు 12,308 సీట్లు, సివిల్లో 6 వేల సీట్లకు 3 వేలే భర్తీ అయ్యాయి. ఈఈఈలో ఉన్న 7 వేల సీట్లల్లో 4 వేలు, మెకానికల్లో 5,800 సీట్లుంటే 2,550 మాత్రమే భర్తీ అయ్యాయి. దీన్నిబట్టి చూస్తే.. సివిల్, మెకానికల్లో చేరే వారి సంఖ్య తగ్గింది. మారిన ట్రెండ్కు అనుగుణంగా కొత్త కోర్సులను నిర్వహించడం గ్రామీణ కాలేజీలకు సాధ్యం కావడం లేదు. నల్లగొండ జిల్లాలో ఒకప్పుడు 48 కాలేజీలుంటే, ఇప్పుడు 11కు పరిమితమయ్యాయి. ఖమ్మం జిల్లాలో 28 ఉంటే, ఇప్పుడు 8 మి గిలాయి. మహబూబ్నగర్ జిల్లాలో 11లో రెండు మాత్రమే ఉన్నాయి. ప్రతీ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. నిర్వహణ కష్టం.. కాలానుగుణంగా వస్తున్న మార్పులతో గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీలకు నిర్వహణ కష్టంగానే ఉంది. మంచి ఫ్యాకల్టీ హైదరాబాద్ విడిచి వెళ్లే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో భవిష్యత్ ప్రయోజనాల కోసం విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు హైదరాబాద్నే ఎంచుకుంటున్నారు. ఇది గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీలకు గడ్డు పరిస్థితి తెస్తోంది. –ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, వీసీ, జేఎన్టీయూహెచ్ క్షేత్రస్థాయిలో మార్పులు అవసరం గ్రామీణ ప్రాంత ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంచాలి. సంప్రదాయ సివిల్, మెకానికల్ కోర్సులకు ఆధునిక సాంకేతికత జోడించి కొత్తదనం వచ్చేలా చూడాలి. వీటితో ఉపాధి ఉంటుందనే నమ్మకం కలిగించాలి. లేకపోతే ఇంజనీరింగ్ విద్య మరింత భారమయ్యే అవకాశం ఉంది. –అయినేని సంతోష్కుమార్, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
‘న్యాక్’కు దూరంగా కాలేజీలు!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యా ప్రమాణాలకు కొలమానమైన ‘నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)’గుర్తింపును అన్ని కాలేజీలకు తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను కూడా సిద్ధం చేస్తోంది. న్యాక్ గుర్తింపు లేని కాలేజీలకు యూనివర్సిటీల నుంచి అనుబంధ గుర్తింపు ఇవ్వకుండా కట్టడి చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా న్యాక్ గుర్తింపు ఉన్న కాలేజీలు, యూనివర్సిటీల జాబితా పెంచాలని ఉన్నత విద్యామండలి ప్రయ త్నం చేస్తున్నా పెద్దగా స్పందన కన్పించడం లేదు. సదస్సుకు కూడా రాకుండా.. న్యాక్ బెంగళూరు కేంద్రం ఉన్నతాధికారులతో రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలకు అవగాహన కల్పించాలని ఉన్నత విద్య మండలి భావించింది. దీనిపై ఈ నెల 20న సదస్సు నిర్వహించేందుకు సిద్ధమైంది. కానీ రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలు న్యాక్ గుర్తింపు ఏమోగానీ, కనీసం సదస్సులో పాల్గొనేందుకు కూడా విముఖత చూపినట్టు తెలిసింది. అనుకున్న మేర కాలేజీలు పాల్గొనేందుకు సుముఖత చూపకపోవడంతో న్యాక్ ప్రధాన కార్యాలయం ఆధికారులు సదస్సును వాయిదా వేశారు. నజరానా ఇస్తామన్నా.. న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే కాలేజీలకు రూ.లక్షల్లో నజరానా ఇస్తామని కూడా ఉన్నత విద్యా మండలి గతంలో ప్రకటించింది. అయినా ఒక్క కాలేజీ కూడా ముందుకు రాలేదు. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. అవి గుర్తింపు కోసం దరఖాస్తు చేయాలంటే ప్రమాణాలు పెంచుకోక తప్పదు. అంతగా ఆదాయం లేని తాము ప్రమాణాల కోసం ఎందుకు ఖర్చు చేయాలనే ఆలోచనతో అవి వెనుకడుగు వేస్తున్నాయి. ‘న్యాక్’ గ్రేడ్ ఉంటే విలువ దేశంలోని విద్యాసంస్థల్లో అంతర్జాతీయ స్థాయి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేసేందుకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)ను అమల్లోకి తెచ్చారు. వివిధ రంగాల్లోని ప్రముఖులతో ఏర్పడే న్యాక్ కమిటీల ఆధ్వర్యంలో విద్యా ప్రమాణాలను అంచనా వేస్తారు. న్యాక్ ప్రధానంగా ఏడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. పాఠ్య ప్రణాళిక రూపకల్పన, అమలు; విద్యాబోధన స్థాయి; పరిశోధన దిశగా పురోగతి; మౌలిక సదుపాయాలు; విద్యార్థి పురోగతి; ఆ సంస్థకు ఉన్న విశ్వసనీయత; అత్యుత్తమమైన ప్రమాణాల అమలు తదితర అంశాలను పరిశీలించి.. సదరు కాలేజీలు, యూనివర్సిటీలకు మార్కులు, గ్రేడ్లు ఇస్తుంది. ఈ గ్రేడ్ల ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు అందే అవకాశం కూడా ఉంటుంది. గుర్తింపు తప్పనిసరి అవ్వొచ్చు ఉన్నత విద్యా రంగంలో ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు న్యాక్ గుర్తింపు ఉంటేనే ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించాయి. కాకపోతే ఇది అమలు చేయడానికి కొంత సమయం ఇచ్చాయి. రాష్ట్రంలోనూ న్యాక్ గుర్తింపు కోసం ఉన్నత విద్యా మండలి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కాలేజీలను ప్రోత్సహించి, చేయూతనివ్వాలని చూస్తోంది. ఈ ప్రక్రియను భవిష్యత్లో మరింత ముందుకు తీసుకెళ్తాం. న్యాక్ గుర్తింపు పొందడం తప్పనిసరి కావొచ్చు కూడా.. – వి.వెంకటరమణ, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ -
మల్టీ డిసిప్లినరీ అటానమస్ సంస్థలుగా కాలేజీలు
యూనివర్సిటీల తరహాలో దేశంలోని అన్ని కాలేజీలు మల్టీ డిసిప్లినరీ (బహుశాస్త్ర మిశ్రిత) అటానమస్ సంస్థలుగా ప్రగతి సాధించేలా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ముసాయిదా ప్రతిపాదనలను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలు మల్టీ డిసిప్లినరీ సంస్థలుగా ఉన్నందున దేశంలోని కాలేజీలు కూడా ఆ స్థాయికి చేరేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలను రూపొందించింది. వీటిపై మార్చి 20లోగా దేశంలోని నిపుణులు, ఇతర స్టేక్ హోల్డర్లు తమ అభిప్రాయాలు వెల్లడించాలని యూజీసీ పేర్కొంది. పరిశోధనలు చేయించడంతో పాటు, ఉన్నత ప్రమాణాలతో కూడిన బోధన, డిగ్రీలను ప్రదానం చేసే అటానమస్ సంస్థలుగా కాలేజీలు రూపుదాల్చేలా చర్యలు చేపట్టనుంది. పారిశ్రామిక భాగస్వామ్యం, రీసెర్చ్ ప్రాజెక్టులు తదితర కార్యక్రమాల ద్వారా ఆయా సంస్థలు యూనివర్సిటీల స్థాయికి చేరుకోవడమే ఈ ముసాయిదా ప్రతిపాదనల లక్ష్యమని యూజీసీ వివరించింది. – సాక్షి, అమరావతి 2035 నాటికి అన్ని కాలేజీలూ స్వయం ప్రతిపత్తితో ఎదిగేలా.. 2035 నాటికి అన్ని కాలేజీలు స్వయం ప్రతిపత్తితో డిగ్రీలను ప్రదానం చేసే సంస్థలుగా ఎదిగేలా చేయాలన్నది వీటి ఉద్దేశం. 2030 నాటికి ప్రతి జిల్లాలో కనీసం ఒక్కటైనా పెద్ద సంస్థ ఈ విధమైన స్వయం ప్రతిపత్తి కలిగిన స్థాయికి ఎదగాలని యూజీసీ నిర్దేశించింది. అలాగే నాలుగేళ్ల డ్యూయల్ మేజర్ డిగ్రీ ప్రోగ్రాములను అమలు చేసేందుకు వీలుగా ఉన్నత విద్యాసంస్థలకు అనుమతులు ఇచ్చే అంశాలను కూడా ఈ ప్రతిపాదనల్లో యూజీసీ చేర్చింది. భాగస్వామ్య విధానంలో విద్యార్థులు తాము చేరే సంస్థలో ఒక డిగ్రీ తీసుకోవడంతో పాటు సెకండ్ డిగ్రీని ఆ సంస్థతో ఒప్పందమున్న వేరే ఉన్నత విద్యాసంస్థలో పొందేందుకు వీలుగా ఆయా సంస్థలు సమన్వయంతో ముందుకు వెళ్లనున్నాయి. దీనికోసం రెగ్యులేటరీ సంస్థల నియమాలను అనుసరిస్తూ జాయింట్ సీట్ అలకేషన్ విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ డిగ్రీ కోర్సులకు ఎంపికను కూడా సంబంధిత అర్హత పరీక్షల ఆధారంగానే చేపట్టాలి. భాగస్వామ్య సంస్థలు నిర్దేశించిన కనీస అర్హత మార్కులను ఆయా విద్యార్థులు సాధిస్తేనే సెకండ్ డిగ్రీతో డ్యూయల్ డిగ్రీకి అవకాశం ఉంటుంది. క్లస్టర్లుగా కాలేజీలు ఇందుకోసం కాలేజీలను ఒక క్లస్టర్గా రూపొందించి వాటిమధ్య పరస్పర సహకారం ఉండేలా ఏర్పాట్లు చేయాలి. ప్రస్తుతం ఏదైనా ఉన్నత విద్యాసంస్థ అన్ని కోర్సులను నిర్వహించడానికి వీలైన వనరులను ఏర్పాటు చేయడం కష్టంగా మారుతోంది. దీంతో ఆ సంస్థల మల్టీ డిసిప్లినరీ కోర్సుల ఏర్పాటు, నిర్వహణ సాధ్యం కావడం లేదు. ఫలితంగా వాటిలో చేరికలు కూడా అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో క్లస్టర్ కాలేజీ భాగస్వామ్యంతో ఈ సమస్యను అధిగమించడానికి వీలు కలుగుతుంది. దీనివల్ల కాలేజీల్లో చేరికలు పెరగడంతో పాటు విద్యార్థులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని యూజీసీ పేర్కొంటోంది. భాగస్వామ్య విధానం వల్ల ఆయా సంస్థలు వనరులు సమకూర్చుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవని, అదే సమయంలో విద్యార్థులకూ మల్టీ డిసిప్లినరీ కోర్సులు అందుబాటులోకి వస్తాయని యూజీసీ అభిప్రాయపడుతోంది. న్యాక్ అక్రిడిటేషన్, ఇతర గుర్తింపులను కూడా ఆయా సంస్థలు సాధించడానికి వీలుంటుందని యూజీసీ పేర్కొంది. -
అర్హతలున్నాయి... అవగాహనే లేదు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపును తెలంగాణలో విస్తరించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసింది. త్వరలో దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు కాలేజీల డేటాను తెప్పించినట్టు, కొన్నింటిని ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్టు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో చాలా కాలేజీలకు న్యాక్ గుర్తింపు పొందగల అర్హతలున్నాయని, అయితే సరైన అవగాహన లేకపోవడంతో ఇందుకోసం దరఖాస్తు చేయలేదని అంటున్నారు. ఫలితంగా న్యాక్ గుర్తింపు కలిగిన కళాశాలల విషయంలో తెలంగాణ వెనుకబడి ఉంది. దేశంలో న్యాక్ గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థలు 21 శాతం ఉంటే, తెలంగాణలో ఇది 11 శాతానికే పరిమితమైంది. కాలేజీల్లో ఉన్నత విద్య ప్రమాణాల స్థాయిని న్యాక్ గుర్తింపు తెలియజేస్తుంది. చాలా కాలేజీలు న్యాక్ గుర్తింపును అదనపు అర్హతగా భావించడంతో ఈ మేరకు ప్రచారం సైతం చేసుకుంటాయి. ఈ కళాశాలల శాతం ఎంత పెరిగితే ఆ రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రమాణాలు అంత ఎక్కువగా ఉన్నట్టన్న మాట. ప్రమాణాలున్నా.. ప్రయత్నమే లేదు రాష్ట్రంలో ప్రస్తుతం 1,976 ఉన్నత విద్యా సంస్థలున్నాయి. వీటిల్లో కేవలం 141 మాత్రమే న్యాక్ గుర్తింపు కలిగి ఉండటం గమనార్హం. ఇందులో 35 ప్రభుత్వ సంస్థలు, 19 ఎయిడెడ్, 87 ప్రైవేటు సంస్థలున్నాయి. రాష్ట్రంలోని 24 యూనివర్శిటీలకు గాను న్యాక్ గుర్తింపు ఉన్నవి పదే. శాతవాహన, జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ సహా కొన్ని ఇప్పటికీ న్యాక్ గుర్తింపు పొందలేదు. ఈ పరిస్థితులపై ఉన్నత విద్య మండలి ఇటీవల క్షేత్రస్థాయి అధ్యయనం చేసింది. దాదాపు వందకుపైగా డిగ్రీ కాలేజీలు న్యాక్ గుర్తింపునకు అర్హత కలిగి ఉన్నట్టు గుర్తించాయి. సొంత భవనాలు, నాణ్యతతో కూడిన బోధన అందించగల ఫ్యాకల్టీ, లేబొరేటరీలు, పటిష్టమైన బోధన విధానాలు, లైబ్రరీ సదుపాయాలు, కచ్చితమైన నిర్వహణ వ్యవస్థ వీటికి ఉన్నాయి. కొన్నేళ్ళుగా అక్కడ మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. ఉపాధి అవకాశాలు పొందడంలోనూ ఈ కాలేజీ విద్యార్థుల శాతం మెరుగ్గా కన్పిస్తోంది. ఇలా న్యాక్ గుర్తింపునకు అవసరమైన అన్ని అర్హతలు, ప్రమాణాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆయా సంస్థలు గుర్తింపు కోసం దరఖాస్తు చేయలేదు. వాస్తవానికి విద్యార్థులు ఏదైనా కాలేజీలో చేరాలనుకున్నప్పుడు న్యాక్ గుర్తింపు ఉందా లేదా అని చూస్తారు. అలాగే దేశ, విదేశీ విద్యా సంస్థలు విద్యార్థుల చేరికల సమయంలో సదరు కాలేజీకి న్యాక్ గుర్తింపు ఉందా లేదా అని చూస్తాయి. అలాగే క్రమబద్ధమైన పర్యవేక్షణ, ప్రమాణాలు కొనసాగించేలా ఈ గుర్తింపు దోహదపడుతుంది. ఇలాంటి ప్రయోజనాలన్నిటిపై అవగాహన లేక, ‘నడుస్తోంది కదా..చూద్దాంలే’అన్న నిర్లిప్త ధోరణిలో చాలా కాలేజీలు ఉంటున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దరఖాస్తు చేసేలా కార్యాచరణ ఈ నేపథ్యంలోనే న్యాక్ గుర్తింపు కలిగిన కాలేజీలు, వర్సిటీల పెంపు కోసం ఉన్నత విద్యామండలి వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టనున్నారు. ఇందులో భాగంగా తొలుత.. ఇప్పటికే గుర్తింపు పొందిన 141 కాలేజీల్లో 81 కాలేజీలు న్యాక్ గుర్తింపును రెన్యువల్ చేయించుకునే దిశగా ప్రోత్సహిస్తారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 72, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 6, గ్రామీణ ప్రాంతాల్లో 63 వరకూ ఉన్నాయి. ఆ తర్వాత మౌలిక వసతులు, ఫ్యాకల్టీ పాటు, అన్ని అర్హతలున్న వందకుపైగా కాలేజీల చేత దరఖాస్తు చేయించాలని నిర్ణయించారు. దీని తర్వాత ప్రమాణాలు పెంచుకుని, న్యాక్ గుర్తింపునకు అర్హత సాధించే దిశగా కాలేజీలను ప్రోత్సహిస్తారు. ఇక ఏమాత్రం ప్రమాణాలు లేని, విద్యార్థుల చేరికలు లేని కోర్సులు, కాలేజీల మూసివేత దిశగా చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. న్యాక్ గుర్తింపు పొందేలా ఆయా సంస్థలతో ప్రత్యేకంగా సమాలోచనలు జరపాలని భావిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. -
హిజాబ్ వివాదం (Hijab Row): కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, బెంగళూరు: హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, కాలేజీలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు సీఎం బసవరాజ్ బొమ్మై ట్విటర్లో స్పందించారు. రాష్ట్రంలో శాంతిని కాపాడాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల, కళాశాల యాజమాన్యంతోపాటు రాష్ట్ర ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే మూడు రోజుల పాటు అన్ని హైస్కూల్స్, కాలేజీలను మూసివేయాలని ఆదేశించినట్లు, ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. I appeal to all the students, teachers and management of schools and colleges as well as people of karnataka to maintain peace and harmony. I have ordered closure of all high schools and colleges for next three days. All concerned are requested to cooperate. — Basavaraj S Bommai (@BSBommai) February 8, 2022 కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు హిజాబ్ వివాదంపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో భావోద్వేగాలకు తావులేదని వ్యాఖ్యానించింది. చట్ట ప్రకారం, రాజ్యాంగ బద్దంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. తమకు రాజ్యాంగమే భగవద్గీత అని తెలిపిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. చదవండి: కర్ణాటకలో ‘హిజాబ్’పై అదే రగడ ముదురుతున్న హిజాబ్ వివాదం కర్ణాటకలో హిజాబ్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై కర్ణాటకలోని రెండు జిల్లాల్లో మంగళవారం హింసాత్మకంగా మారింది. ఉడిపిలోని మహాత్మాగాంధీ మెమోరియల్ కాలేజీలో మంగళవారం కాషాయ కండువాలు ధరించిన విద్యార్థులు, హిజాబ్లు ధరించిన విద్యార్థులు పరస్పరం ఘర్షణకు దిగడంతో నిరసనలు చెలరేగాయి. హిజాబ్ ధరించి ఓ విద్యార్థిని కాలేజ్కు వస్తుండగా కాషాయ కండువాలు ధరించిన మరొక వర్గం విద్యార్థులు అడ్డుకున్నారు. యువతి తన స్కూటర్ను పార్క్ చేసి కళాశాల భవనం వైపు వెళుతుండగా.. ఆమెకు వ్యతిరేకంగా కాషాయ కండువాలు ధరించిన వర్గం జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. వీరికి ధీటుగా ఆ విద్యార్థిని ‘అల్లా హు అక్బర్’ అంటూ నినదించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. भेड़िये ! https://t.co/GnceytfDXL — Swara Bhasker (@ReallySwara) February 8, 2022 -
100 శాతం సామర్థ్యంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు
న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన జరిగిన ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాత్రి కర్ఫ్యూ సమయాన్ని గంటసేపు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ రాత్రి కర్ఫ్యూ కొనసాగనుంది. సోమవారం నుంచి విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు తిరిగి తెరచుకోనున్నాయి. అయితే పాఠశాలలు తెరవడానికి దశల వారీగా అనుమతిచ్చారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు ఫిబ్రవరి 7 నుంచి పునఃప్రారంభంచనున్నారు. నర్సరీ నుంచి 8వ తరగతి వరకు ఫిబ్రవరి 14 నుంచి వర్చువల్ బోధన కొనసాగించనున్నారు. టీకాలు వేసుకోని ఉపాధ్యాయులకు పాఠశాలలకు అనుమతిని నిరాకరించారు. చదవండి: ('సీఎం సార్ హెల్ప్ మీ'.. వెంటనే కారు ఆపి..) ఉన్నత విద్యాసంస్థలు ప్రామాణిక నిబంధనలకు లోబడి తెరవబడతాయి. 100 శాతం సామర్థ్యంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు అనుమతిచ్చారు. జిమ్ సెంటర్లు, స్విమ్మింగ్ పూల్స్, రెస్టారెంట్లు, బార్లు ప్రారంభానికి అనుమతిచ్చారు. వ్యాపార సంస్థలన్ని యథాప్రకారంగా కొనసాగనున్నాయి. -
రాత్రి కర్ఫ్యూ రద్దు.. ఫిబ్రవరి 1 నుంచి మళ్లీ బడులు: సీఎం
సాక్షి, చెన్నై: కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలను ఫిబ్రవరి ఒకటో తేది నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ గురువారం ప్రకటించారు. అయితే, ఎల్కేజీ, యూకేజీ, ప్లేస్కూళ్లను తెరిచేందుకు మాత్రం అనుమతి మంజూరు చేయలేదు. రాష్ట్రంలో కరోనా మరలా ప్రబలుతున్న కారణంగా ప్రభుత్వం గత నెల 7వ తేదీ నుంచి పలు ఆంక్షలను అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా పాఠశాలల మూత, శుక్ర, శని, ఆదివారాల్లో ప్రార్థనాలయాల్లో దర్శనాల నిలిపివేత, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ, ప్రతి ఆదివారం పూర్తి లాక్డౌన్ వంటి నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఈనేపథ్యంలో కరోనాపై సమీక్షించిన ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ నిబంధనలను సడలించారు. హోటళ్లు, అతిథి గృహాలు 50 శాతం వినియోగదారులకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: (ఎన్నికల బరిలో ‘విజయ్ మక్కల్ ఇయక్కం’) -
విద్యా సంస్థలు ఎప్పుడు తెరుద్దాం?
సాక్షి, హైదరాబాద్: కరోనా థర్డ్ వేవ్ కారణంగా మూతబడిన విద్యాసంస్థలను తిరిగి ప్రారంభిం చాలన్న డిమాండ్పై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. స్కూళ్లు, కాలేజీలను తెరిస్తే వచ్చే ఇబ్బందులపై ఆరా తీస్తోంది. ఈ మేరకు విద్యా, ఆరోగ్య శాఖల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కోరినట్టు తెలిసింది. ఆయా విభాగాల అభిప్రాయాలకు అనుగుణంగా సర్కార్ నిర్ణయం తీసుకోవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కోవిడ్ తగ్గుముఖం పడితే, తల్లిదండ్రులు తమ పిల్లలను పంపడానికి సుముఖంగా ఉంటే వచ్చే నెల 5 నుంచి స్కూళ్లను తెరవాలని ప్రభుత్వం యోచి స్తోంది. తాజా పరిస్థితిపై ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వైద్య అధికారులతో సమీక్ష జరిపినట్టు సమాచారం. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి కొనసాగు తున్నా దాని ప్రభావం స్వల్పంగానే ఉందని వైద్య అధికారులు తెలిపినట్టు తెలిసింది. థర్డ్ వేవ్ ప్రభావం తగ్గితే యథావిధిగా విద్యాసంవత్సరం ముగించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఒకవేళ సెలవులు పొడిగించాల్సి వస్తే పరీక్షల షెడ్యూల్లోనూ స్వల్ప మార్పులుండే అవకాశముందని చెబుతున్నారు. విద్యా సంస్థలు తిరిగి తెరవాల్సి వస్తే స్కూలుకు రావాలంటూ బలవంతం చేయకుండా, ప్రత్యక్ష బోధనకుతోడు ఆన్లైన్ బోధనా కొనసాగించాలని భావిస్తున్నారు. మరో రెండు రోజుల్లో విద్యాసంస్థలను తెరవడంపై స్పష్టత వచ్చే అవకాశముంది. విద్యాసంవత్సరం పొడిగించాలి: వై.శేఖర్రావు (ట్రస్మ అధ్యక్షుడు) కోవిడ్ నేపథ్యంలో సెలవుల పొడిగింపు వల్ల విద్యాబోధన కుంటుపడింది. ఆన్లైన్ విద్యాబోధన చేపట్టినా అది అన్ని స్థాయిల్లోకి వెళ్లడం కష్టంగానే ఉంది. ఇప్పటికే ఏ క్లాసులోనూ సిలబస్ పూర్తవ్వలేదు. ప్రత్యక్ష బోధన చేపట్టినా, విద్యా సంవత్సరాన్ని మే నెల వరకూ పొడిగిస్తేనే సిలబస్ పూర్తి చేయడం సాధ్యమవుతుంది. -
'వైద్య నిపుణుల సూచనలతో బడులు ప్రారంభిస్తాం'
సాక్షి, ముంబై: వైద్య నిపుణులు ఇచ్చే సూచనలు సలహాల మేరకు రాష్ట్రంలో తిరిగి బడులు ప్రారంభించే యోచనలో ఉన్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ పేర్కొన్నారు. బడుల పునఃప్రారంభంపై ఇప్పటికే ఓ ప్రతిపాదనను రూపొందించినట్లు ఆమె బుధవారం విలేకరులకు వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న కరోనా కేసుల తాజా పరిస్థితులపై ఒక నివేదిక రూపొందించినట్లు ఆయన తెలిపారు. వాటిని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు పంపించామని, త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. ముంబైతోపాటు రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరగడంతో ఫిబ్రవరి 15వ తేదీ వరకు పాఠశాలలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ, పాఠశాలలు పూర్తిగా మూసి ఉంచాలని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో అసంతృప్తి, వ్యతిరేకత వాతావరణం నెలకొంది. అంతేగాకుండా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు వైరల్ అవుతున్నాయి. శుభకార్యాలకు, మాల్స్, థియేటర్లలో 50% అనుమతిస్తున్నారు. కానీ, పాఠశాలలు తెరిస్తే విద్యార్థులకు కరోనా సోకుతుందని మూసి ఉంచడం సమంజసం కాదని, విద్యార్థులు నష్టపోతున్నారని సందేశాలు వైరల్ అవుతున్నాయి. అలాగే పాఠశాలలు పూర్తిగా మూసి ఉంచే బదులు ఒక ప్రణాళిక ప్రకారం తెరవాలని ఉపాధ్యాయులు కూడా డిమాండ్ చేస్తున్నారు. చదవండి: (ప్రముఖ క్రిమినల్ లాయర్ శ్రీకాంత్ షివాడే కన్నుమూత) రెండు నెలల కిందట కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యావేత్తలు, నిపుణుల సలహాల ప్రకారం అప్పట్లో పాఠశాలలు తెరిచామని వర్షా తెలిపారు. కానీ, గత పక్షం రోజుల కిందట కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరగడంతో మూసివేయాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం రోగుల సంఖ్య మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల సంఘటనలతో చర్చించామని, ఆ సమయంలో వారు ఒక నివేదక అందజేశారని వర్షా వెల్లడించారు. పాఠశాలలు ప్రారంభించాల్సిందేనని అనేక మంది డిమాండ్ చేశారని తెలిపారు. దీంతో రోగుల సంఖ్య ఎక్కడెక్కడ తక్కువగా ఉందో అక్కడ పాఠశాలలు తెరిచేందుకు స్థానిక అధికారులకే అధికారమివ్వాలని ప్రతిపాదించామని, ఆ మేరకు ముఖ్యమంత్రికి నివేదిక అందజేశామని పేర్కొన్నారు. పాఠశాలలు ప్రారంభించాలనే ఉద్ధేశం తమకు కూడా ఉందని, ప్రస్తుతం 15–18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా టీకా డోసు వేసే ప్రక్రియకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది కూడా రెండు టీకాలు తీసుకుని విధుల్లో చేరేలా సూచనలిస్తున్నట్లు వర్షా స్పష్టం చేశారు. లేదంటే పరిస్థితి మొదటికే వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. -
'థర్డ్వేవ్ ప్రారంభమైంది.. పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని నిర్ణయించాం'
జల్నా (ముంబై): కరోనా మహమ్మారి మూడవ వేవ్ ప్రారంభమైందని, ఇది జనవరి చివరి నాటి కి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే సోమ వారం అన్నారు. జల్నాలో సోమవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడు తూ, ప్రజలు కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. మహారాష్ట్రలో భారీగా కొత్త కేసులు నమోదవుతున్న తరుణంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘జాన్ హై తో జహాన్హై’ అన్న సామెతను అందరూ దృష్టి లో పెట్టుకోవాలని ఆయన సూచించారు. చదవండి: (ఇదే కొనసాగితే లాక్డౌన్ అమలు చేయక తప్పదు!) పెరుగుతున్న కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకునే పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని నిర్ణయించామని, ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలు మద్దతునివ్వాలని ఆయన కోరారు. మహమ్మారి తీవ్రత గు రించి సోమవారం వర్చువల్ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాతో కూడా చర్చించినట్టు తోపే చెప్పారు. కరోనా సంసిద్ధతలో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్లకు మరమ్మతులు చేస్తున్నామని, 60 ఏళ్లు దాటిన వారికి, వైద్య, ఆరోగ్య సిబ్బందికి బూస్టర్ డోస్లను వేగవంతం చేస్తున్నామని ఆయన తెలిపారు. 15–18 సంవత్సరాల మధ్య పిల్లలకు త్వరలోనే టీకాలు వేయడం పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 17 వేల ఆక్సిజన్ పడకల్లో నాలుగు శాతం మాత్రమే ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయని చెప్పారు. 14 రోజుల క్వారంటైన్ వ్యవధిని కూడా ఏడు రోజులకు కుదించినట్లు ఆయన పేర్కొన్నారు. -
హై స్కూళ్లు, కాలేజీల్లోనే సచివాలయ సిబ్బంది ద్వారా వ్యాక్సినేషన్
-
విద్యాశాఖ అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది
-
విద్యార్థుల ధర్నాలో దుండగులు: మంత్రి సురేష్
సాక్షి, విజయవాడ: అనంతపురంలో కాలేజీ ఘటనపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. విద్యార్థుల ధర్నాలో కొందరు దుండగులు చొరబడ్డారన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలీసులపై రాళ్లు రువ్వి విద్యార్థిని గాయపర్చారన్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని వివరించారు. చదవండి: అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ టీడీపీ: సజ్జల కొన్ని రాజకీయ పార్టీలు వీటిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అవాస్తవ ప్రచారానికి కొన్ని మీడియా సంస్థలు మద్దతు పలుకుతున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. విద్యార్థినిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు లాఠీచార్జ్ చేయలేదంటూ బాధిత విద్యార్థినే చెబుతోందని మంత్రి అన్నారు. దుండగులు వేసిన రాళ్ల దాడిలోనే విద్యార్థిని గాయపడిందన్నారు. రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాసంస్థల పనితీరుపై కమిటీ వేశామని.. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆదిమూలపు పేర్కొన్నారు. -
ఏపీలోని 4 కళాశాలలకు ఛాత్ర విశ్వకర్మ అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏటా అందించే ‘ఛాత్ర విశ్వకర్మ అవార్డీ స్టూ డెంట్స్ ప్రాజెక్ట్స్, ఇట్స్ అప్లికేషన్ ఫర్ సొసైటీ’ అవా ర్డులు ఏపీలోని నాలుగు కళాశాలల విద్యార్థులకు దక్కాయి. పరిశుభ్రత విభాగంలో దక్షిణ మధ్య వర్సిటీల్లో ఏపీకి చెందిన కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (డీమ్డ్ టు బి యూనివర్సిటీ)కి ‘ద క్లీన్, స్మార్ట్ క్యాంపస్(ఐకేఎస్)’అవార్డు దక్కింది. ఆదివారమిక్కడ నిర్వహించిన కార్యక్ర మంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ విజేతల ప్రతినిధులకు అవార్డు అందజేశారు. ఏపీలోని సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కాలేజ్కు చెందిన ‘శ్రామిక్స్’బృందానికి రీసైక్లింగ్ ఆర్ అప్ స్కిల్లింగ్ ఫర్ ఎ న్య్సూరింగ్ లైవ్లీహుడ్ విభాగంలో తొలిస్థానం దక్కింది. ఆదిత్య ఇన్స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మేనేజ్ మెంట్కు చెందిన ‘ఛాలెంజర్స్’ బృందానికి ఐఓటీ –బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉమెన్ ప్రొటెక్షన్ డివైజ్కు ‘జెండర్–రెస్పాన్సివ్ మెకానిజం టు కాంబాట్ డొమెస్టిక్ వయెలెన్స్’ విభాగంలో రెండోస్థానం దక్కింది. విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ‘బ్లూ లియో’ బృందానికి స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టంలో మూడో ర్యాంకు దక్కింది. ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీకి చెందిన ‘షాహుల్’బృందానికి బారియర్స్ ఇన్ యాక్సెసింగ్ అడక్వెట్ హెల్త్కేర్ సర్వీసెస్ విభాగంలో మూడో స్థానం దక్కింది. విశ్వేశ్వరయ్య, డాక్టర్ ప్రీతమ్ సింగ్ బెస్ట్ టీచర్ అవార్డు 2021ను కూడా ప్రదానం చేశారు. ఇవీ చదవండి: ఆధిపత్య పోరు: ‘టీడీపీ’లో ‘పిల్లి’ మొగ్గలు అండ్రు అరాచకాలు: కొండను తవ్వేసి.. అడవిని మింగేసి.. -
అధిక ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు
సాక్షి, అమరావతి: విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాల ప్రయోజనాల కోసమే ఇంటర్మీడియెట్ ఫస్టియర్ అడ్మిషన్లలో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టామని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. ఈ విధానానికి అందరి నుంచి మంచి స్పందన లభించిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, అన్ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి తొలిదశ అడ్మిషన్లకు ఇప్పటివరకు 2.60 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. బోర్డు ఎక్కడా కొత్తగా ఏ నిబంధననూ మార్పు చేయలేదని వివరించారు. గతంలో ఆఫ్లైన్లో జరిగే పద్ధతినే ఇప్పుడు ఆన్లైన్లోకి మార్చామని పేర్కొన్నారు. తొలివిడత ఆన్లైన్ అడ్మిషన్ల దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగిసిన నేపథ్యంలో రామకృష్ణ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆన్లైన్ అడ్మిషన్ల వల్ల తల్లిదండ్రులు, విద్యార్థులు కరోనా సమయంలో కాలేజీల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుందన్నారు. ఇంట్లో నుంచే తమకు నచ్చిన కాలేజీలో, కోరుకున్న గ్రూపులో సీటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆధార్, కొన్ని సర్టిఫికెట్ల నంబర్లను నమోదు చేసి విద్యార్థులు ఆన్లైన్ అడ్మిషన్ పొందొచ్చని చెప్పారు. ఎక్కడా ఎవరికీ ఎలాంటి ధ్రువపత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. కాలేజీ యాజమాన్యాలకు కూడా ఆన్లైన్ అడ్మిషన్లవల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. తమ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులను ఫీజులు కట్టించుకొని చేర్పించుకోవడం వరకే వాటి బాధ్యత అని స్పష్టం చేశారు. రామకృష్ణ ఇంకా ఏమన్నారంటే.. నిర్దేశిత ఫీజులనే కళాశాలలు తీసుకోవాలి.. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని ప్రైవేటు అన్ఎయిడెడ్ కాలేజీలకు ప్రభుత్వం ఇప్పటికే ఫీజులను ఖరారు చేసింది. ఆ మేరకు మాత్రమే ఆయా కాలేజీలు ఫీజులు తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా నిర్దేశిత ఫీజులను మాత్రమే చెల్లించాలి. ఏ కాలేజీ అయినా ఎక్కువ ఫీజులు డిమాండ్ చేస్తే.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. వాటిని ప్రాసిక్యూషన్ చేయించే అధికారం ఇంటర్ బోర్డుకు ఉంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ (రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ క్యాపిటేషన్ ఫీ) చట్టం–1983లోని సెక్షన్ 9, 10, 11 ప్రకారం ప్రభుత్వం గతేడాది మార్చిలో జీవో 57 ద్వారా బోర్డుకు ప్రత్యేకాధికారాలు కల్పించింది. అందరికీ అందుబాటులో సీట్లు రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్ఎయిడెడ్ సహా ఇతర యాజమాన్యాల్లోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియెట్ ఫస్టియర్లో 6 లక్షల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి సీట్లు రావన్న ఆందోళన వద్దు. సెక్షన్కు 88 మందిని అనుమతిస్తున్నాం. రిజర్వేషన్ల ప్రకారమే ప్రతి కాలేజీలో సీట్ల భర్తీ ఉంటుంది. కాబట్టి అన్ని వర్గాల వారికి సీట్లు దక్కుతాయి. గతంలో రిజర్వేషన్ల అమలు సరిగా లేనందున కొన్ని కాలేజీల్లో కొందరికి మాత్రమే అవకాశం దక్కేది. దీంతో రిజర్వుడ్ వర్గాల పిల్లలు నష్టపోవాల్సి వచ్చేది. తొలి దశ అనంతరం మిగిలిన సీట్లకు మలివిడత ఆన్లైన్ ప్రవేశాలుంటాయి. గతేడాది మొత్తం 3.20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది కూడా అంతేస్థాయిలో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నాం. విద్యార్థుల మేలుకే ఆన్లైన్ సేవలు గతంలో కొన్ని కాలేజీలు విద్యార్థులకు హాల్టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టేవి. ముఖ్యంగా కరోనా సమయంలో పిల్లలు కాలేజీల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ–హాల్టికెట్లను బోర్డు ప్రవేశపెట్టింది. బోర్డు వెబ్సైట్ నుంచి హాల్టికెట్ను డౌన్లోడ్ చేసుకొని నేరుగా పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పించాం. పరీక్ష ఫీజుల విషయంలోనూ కాలేజీలు విద్యార్థుల నుంచి అధికంగా వసూలు చేసేవి. దీంతో ఆన్లైన్లో చెల్లించే ఏర్పాటు చేయడంతో కార్పొరేట్ కాలేజీల అక్రమాలకు అడ్డుకట్ట పడింది. అలాగే విద్యార్థులు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ల(టీసీ) విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంశాన్ని బోర్డు గుర్తించింది. ఈ నేపథ్యంలో నేరుగా బోర్డు నుంచి ఈ–టీసీ జారీ చేసే ప్రక్రియపై దృష్టి సారించాం. దీని ద్వారా విద్యార్థులు నేరుగా బోర్డు వెబ్సైట్ నుంచి టీసీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
అమెరికాలో విద్యావకాశాలపై ఎడ్యుకేషన్ ఫెయిర్
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో విద్యావకాశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల కోసం అక్కడి వర్సిటీలు వర్చువల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ను నిర్వహించనున్నాయి. గుర్తింపు పొందిన వందకుపైగా యూఎస్ వర్సిటీలు, కాలేజీలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆన్లైన్ ద్వారా సంభాషించడానికి ఈ కార్యక్రమం ద్వారా ఉచితంగా అవకాశం కల్పించనున్నారు. మాస్టర్స్ లేదా పీహెచ్డీ కోర్సులపై ఈ నెల 27న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు గ్రాడ్యుయేట్ ఫెయిర్ జరగనుంది. ఇందులో పాల్గొనడానికి ( https://bit.ly/EduSAFair21EmbWeb) లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయం సూచించింది. వచ్చే నెల 3న బ్యాచిలర్స్ కోర్సులపై.. బ్యాచిలర్స్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల కోసం సెప్టెంబర్ 3న సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఎడ్యుకేషన్ ఫెయిర్ జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వెబ్ లింక్ (https://bit.ly/ UGEdUSAFair21 Emb Web) ద్వారా రిసిస్ట్రేషన్ చేసుకోవాలి. యూఎస్లోని వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే ఉన్నత విద్యాసంస్థలు ఎడ్యుకేషన్ ఫెయిర్లో పాల్గొంటాయి. అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, డాక్టొరల్ స్థాయిల్లో కోర్సులు అందిస్తున్నాయి. యూఎస్ విశ్వవిద్యాలయాలు, ఎడ్యుకేషన్ యూఎస్ఏ విభాగం సలహాదారులతో ఈ ముఖాముఖి ఉంటుంది. అమెరికాలో చదువులు, ఫండింగ్, స్కాలర్షిప్లు, ప్రాక్టికల్ ట్రైనింగ్ తదితర విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి ముఖాముఖి సాయపడుతుంది. విద్యార్థి వీసాల గురించి యూఎస్ బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ అధికార వర్గాల నుంచి విద్యార్థులకు అవసరమైన సమాచారం లభించనుంది. పూర్తి వివరాల కోసం (https://drive.google.com/drive/floders/1 dcOlvRx6 AQkZGBU9 URf1 lblqMU&pXZMm) వీడియో లింక్ను సందర్శించాలని యూఎస్ కాన్సులేట్ సూచించింది. -
తెలంగాణలో మరో 160 కాలేజీలు మూతపడినట్లే: ఇంటర్ బోర్డు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో 160 కాలేజీలు మూతపడినట్లేనని ఇంటర్ బోర్డు తెలిపింది. కాగా గతేడాది కాలేజీల గుర్తింపు కోసం 100 కాలేజీలు దరఖాస్తు చేసుకోలేదని పేర్కొంది. ఇక 2021-22కు 1520 కాలేజీలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయని, దీంతో 100 కళాశాలల గుర్తింపు లేనట్లేనని తెలిపింది. ఇదిలా ఉండగా కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి కాకుండానే ఇంటర్ బోర్డు అడ్మిషన్లు ప్రకటించింది. -
తెలంగాణ లో మళ్లీ ప్రారంభం కానున్నవిద్యాసంస్థలు
-
నైపుణ్య కాలేజీలకు వేగంగా స్థల సేకరణ
సాక్షి, అమరావతి: ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నైపుణ్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇందుకోసం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల వద్ద ఉన్న మిగులు భూములను సేకరించి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నైపుణ్య కళాశాలలను ఏర్పాటు చేయనుంది. ఒక్కో నైపుణ్య కళాశాల నిర్మాణం కోసం ఐదెకరాలు సేకరిస్తున్నట్టు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో ఎన్.బంగారురాజు చెప్పారు. 25 కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు రావడంతో జూలై నెలాఖరులోగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఒక్కో కాలేజీ నిర్మాణానికి గరిష్టంగా రూ.20 కోట్లు వ్యయం చేయడానికి అనుమతిస్తూ మే 30న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. వీటితో పాటు తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ, నాలుగు ట్రిపుల్ ఐటీలతో పాటు పులివెందులలో మరో నైపుణ్య కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. కాలేజీల్లో వసతులివి.. స్థానిక పరిశ్రమలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు తెలుసుకుని వాటికి అనుగుణంగా కోర్సులను రూపొందిస్తున్నారు. ఇందుకోసం పరిశ్రమల శాఖ చేపట్టిన సమగ్ర పారిశ్రామిక సర్వే నివేదికను ఏపీఎస్ఎస్డీసీ వినియోగించుకుంటోంది. ప్రతి నైపుణ్య కళాశాలలో ఆరు తరగతి గదులు, రెండు ల్యాబ్లు, వర్క్షాప్ నిర్వహణకు ప్రాంగణం ఉండేలా వీటిని నిర్మిస్తారు. స్థానికంగా ఉండే ఒకటి లేదా రెండు పరిశ్రమలతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కేంద్రాలను వీటిలో ఏర్పాటు చేస్తారు. ఆయా కంపెనీలకు అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టి కోర్సు పూర్తికాగానే నేరుగా ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటారు. ఈ కోర్సుల కాలపరిమితి మూడు నెలలు ఉండేలా చూస్తున్నారు. -
రేపటి నుంచి మే 31 వరకు వేసవి సెలవులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎట్టకేలకు పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు చివరి పని దినాన్ని, వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటిం చింది. ఈనెల 26వ తేదీని ఆయా విద్యా సంస్థలకు చివరి పని దినంగా పేర్కొంది. 27వ తేదీ నుంచి మే 31 వరకు వేసవి సెలవులుగా ప్రకటించింది. పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు సెలవులపై ఆదివారం ఆన్లైన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్, విద్యా శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించిన అనంతరం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇప్పటికే పదో తరగతి విద్యార్థులకు పరీక్షలను రద్దు చేయగా, తాజాగా 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి పాఠశాలలు, జూనియర్ కాలేజీల ప్రారంభంపై జూన్ 1న సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. వెనువెంటనే చివరి పని దినం, సెలవులపై ఇంటర్మీడియట్ బోరుŠడ్ కార్యదర్శి, పాఠశాల విద్య ఇంచార్జి డైరెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. పది రోజులుగా కోరుతున్న నేపథ్యంలో... రాష్ట్రంలో కరోనా కారణంగా గత ఏడాది సెప్టెంబరు 1 నుంచి ఆన్లైన్/డిజిటల్ విద్యా బోధనను ప్రారంభించిన ప్రభుత్వం గత ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10 తరగతులతోపాటు ఇంటర్మీడియట్, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనకు అనుమతించింది. అదే నెల 24వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులకు కూడా ప్రత్యక్ష బోధనకు ఓకే చెప్పింది. అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో మార్చి 24 నుంచి విద్యా సంస్థలన్నింటికీ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. ప్రత్యక్ష విద్యా బోధనను నిలిపివేసింది. అంతేకాదు మే 1 నుంచి నిర్వహించాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షలు, మే 17 నుంచి నిర్వహించాల్సిన టెన్త్ పరీక్షలపైనా ఈ నెల 15నే నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలను రద్దు చేయడంతోపాటు, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలను రద్దు చేసింది. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తమకు కూడా సెలవులు ఇవ్వాలని, పెరుగుతున్న కరోనా కేసుల వల్ల పాఠశాలలకు వెళ్లి రావాలంటే భయంగా ఉందని టీచర్లంతా వాపోయారు. తాము స్కూళ్లకు వెళ్లి చేసేదేమీ లేకపోగా, కరోనా మహమ్మారి బారిన పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు సెలవులు ఇస్తూ ఆదివారం నిర్ణయం తీసుకుంది. ఆ విద్యార్థులంతా పాస్: సబితా ఇంద్రారెడ్డి కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే టెన్త్ పరీక్షలు రద్దు చేసి, 5,46,865 మందిలో పరీక్ష ఫీజు చెల్లించిన 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇపుడు 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53,79,388 మంది విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేసినట్లు తెలిపారు. వారికి పరీక్షలేమీ ఉండవని స్పష్టంచేశారు. మొత్తంగా 59,26,253 మంది విద్యార్థులు ఉన్నట్లు వివరించారు. తరగతుల వారీగా నమోదైన విద్యార్థులు తరగతి విద్యార్థుల సంఖ్య 1 60,5,586 2 6,23,571 3 6,37,563 4 6,28,572 5 6,14,862 6 5,86,231 7 5,77,412 8 5,60,417 9 5,45,174 10 5,46,865 -
కరోనా విజృంభణ.. మార్చి 31 వరకు స్కూల్స్ బంద్!
పుణే: రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతుండటంతో కొన్ని జిల్లాల్లో పూర్తి లాక్డౌన్, మరికొన్ని జిల్లాల్లో పాక్షిక లాక్డౌన్, ఇంకొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. ఈ క్రమంలో పుణే జిల్లాలో మార్చి 31వ తేదీ వరకు పాఠశాలలు, కాలేజీలను మూసివేస్తున్నట్లు పుణే డివిజినల్ కమిషనర్ సౌరభ్ రావు తెలిపారు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు రాత్రి 10 గంటల వరకే తెరవాలని, ఫుడ్ డెలవరీలు రాత్రి 11 గంటల వరకే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో మాత్రమే నడపాలని ఆదేశించారు. 10, 12 తరగతుల బోర్డు పరీక్షల ప్రిపరేషన్స్కు ఈ ఆంక్షలు అడ్డుగారావని పేర్కొన్నారు. మరోవైపు పట్టణంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య అనవసరంగా ఎవరూ బయటకు రావొద్దని కోరారు. సామాజిక కార్యక్రమాలు, పెళ్లిళ్లు, అంత్యక్రియలు, రాజకీయ తదితర కార్యక్రమాలకు 50 మందికి మించి హాజరుకాకూడదని ఆదేశించారు. ఒకవేళ వీటిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసు కేసులు పెడతామని హెచ్చరించారు. పార్క్లు క్లోజ్.. పుణే పట్టణంలో ఉన్న అన్ని రకాల పార్కులు సాయంత్రం వెళల్లో మూసివేయాలని, ఉదయం సమయాల్లో వాకర్స్ కోసం తెరవాలని కమిషనర్ సౌరభ్ రావు ఆదేశించారు. మాల్స్, మల్లీప్లెక్స్లకు రాత్రి 11 గంటల వరకే అనుమతి ఉంటుందని తెలిపారు. అలాగే మిగిలిన విషయాలపై డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. పుణే నగరంలో కేసుల సంఖ్య, ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉన్నందున 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేయాలన్న విధాన నిర్ణయం కోరుతూ కేంద్రానికి ప్రతిపాదన పంపాలని అధికారులు యోచిస్తున్నామని ఆయన వివరించారు. ఒకవేళ పుణేకు అదనపు వ్యాక్సిన్ డోసులు కేంద్రం కేటాయించాలని నిర్ణయం తీసుకుంటే, దానికి అనుగుణంగా సిబ్బందిని సిద్ధం చేస్తామని తెలిపారు. చదవండి: (కేసులు పెరిగితే లాక్డౌన్ తప్పదు: సీఎం) నిబంధనలు పాటించకపోవడం వల్లే.. కరోనా నిబంధనలు పాటించకపోవడం వల్లే పుణే నగరంలో కేసుల సంఖ్య పెరుగుతోందని, దీని కోసం కఠిన నిబంధనలు అమలు పరుస్తామని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. కోవిడ్–19 చికిత్స కోసం జిల్లాలోని ఆస్పత్రుల్లో సరిపడినంత పడకలు ఉన్నాయని తెలిపారు. కేసులు పెరుగుతున్నందున, 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని, దీని కోసం అత్యధిక డోసులు అవసరమవుతాయని పేర్కొన్నా రు. ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని పుణే ఎంపీ గిరీశ్ బాపట్, మార్వెల్ఎంపీ శ్రీరాగ్ బర్నేలను కోరుతానని, అలాగే ఎంపీలు అమోల్ కోల్హే, సుప్రియా సూలేల వద్ద కూడా ఈ విషయాన్ని లెవనెత్తుతానని పేర్కొన్నారు. పెద్ద భవనాల్లోనే 90 శాతం కేసులు ►మొదటి 2 నెలల్లో ఎక్కువ కేసులు అక్కడి నుంచే ►మార్చి నుంచి మురికివాడల్లోనూ పెరుగుతున్న కేసులు ముంబై: నగరంలోని ఆకాశహర్మ్యాల్లో నివసిస్తున్న వారే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని నగర పాలక సంస్థ తెలిపింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కొత్తగా కరోనా సోకినవారిలో 90 శాతం మంది ఎత్తయిన భవంతుల్లో ఉంటున్నవారేనని పేర్కొంది. మిగతా 10 శాతం మంది మురికివాడలు, ఇతర ప్రాంతాలవారని వివరించింది. అయితే, ఈ నెలలో మాత్రం పరిస్థితిలో కాస్త మార్పు వచ్చిందని, ఈసారి మురికివాడల్లో ఉంటూ కోవిడ్–19 సోకుతున్న వారి సంఖ్య పెరుగుతోందని తెలిపింది. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో 23,002 మందికి కోవిడ్–19 పాజిటివ్ వచ్చిందని, ఇందులో 90 శాతం మంది పెద్దపెద్ద భవంతుల్లో నివసించేవారని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల ప్రారంభం నుంచి నగరంలో కంటైన్మెంట్ జోన్లు 170 శాతం, సీల్ చేసిన భవంతుల సంఖ్య 66.42 శాతం పెరిగినట్లు పేర్కొంది. బీఎంసీ కోవిడ్–19 డ్యాష్బోర్డు ప్రకారం మార్చి 1 నాటికి నగరంలో 10 కంటైన్మెంట్ జోన్లు, 137 సీల్ చేసిన భవంతులు ఉన్నాయని, కానీ మార్చి 10నాటికి కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 27కు, సీల్ చేసిన భవంతుల సంఖ్య 228కి పెరిగింది. ఈ జోన్ల్ల పరిధిలో నివసించే 7.46 లక్షల మందిలో 23 శాతం మంది మురికివాడల నుంచి, మిగతా 77 శాతం సీల్ చేసిన భవంతుల నుంచి ఉన్నారు. కాగా, మురికివాడల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, దీన్ని భారీ పెరుగుదల అనలేమని బీఎంసీ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. కోవిడ్ బాధితులు అన్ని మురికివాడల్లో ఉన్నారన్నారు. ఇప్పటివరకు ముంబైలో 3,38,631 మంది కరోనా సోకగా, 11,515 మంది మరణించారు. -
ప్రైమరీ స్కూళ్లపై ఏం చేద్దాం?
సాక్షి, అమరావతి: సంక్రాంతి సెలవుల అనంతరం సోమవారం నుంచి రాష్ట్రంలోని స్కూళ్లు కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. కోవిడ్ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు పాటించేలా విద్యాశాఖ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలిచ్చింది. పాఠశాలలు కోవిడ్ కారణంగా దాదాపు 5 నెలలు ఆలస్యంగా నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. స్కూళ్లలో 9, 10 తరగతులు, జూనియర్ కాలేజీల్లో 12వ తరగతి విద్యార్థులను తల్లిదండ్రుల అనుమతితో భౌతిక దూరం పాటిస్తూ స్కూళ్లు, కాలేజీలకు అనుమతించారు. ఆ తర్వాత 6, 7, 8 తరగతుల వారికీ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రాథమిక పాఠశాలలను ఈ విద్యాసంవత్సరానికి ప్రారంభించాలా? వద్దా? అన్న అంశంపై విద్యాశాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాగా, టీచర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బదిలీలను సంక్రాంతి సెలవుల్లో విద్యాశాఖ పూర్తిచేసింది. దాదాపు 76 వేల మంది టీచర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో సోమవారం నుంచి స్కూళ్లు కొందరు కొత్త టీచర్లతో ప్రారంభం కానున్నాయి. ఉదయం తరగతులు.. తర్వాత ఆన్లైన్లో పాఠశాలల నిర్వహణకు సంబంధించిన క్యాలెండర్ను ఎస్సీఈఆర్టీ ఇప్పటికే ప్రకటించింది. పదో తరగతి విద్యార్థులు రోజూ తరగతులకు హాజరుకావాలని, ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో 7, 9వ తరగతి విద్యార్థులు, ప్రతి మంగళ, గురు, శనివారాల్లో 6, 8 తరగతుల విద్యార్థులు .. గతంలో మాదిరిగానే తరగతులకు హాజరు కావాలని సూచించింది. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు స్కూళ్లు ఉంటాయి. మధ్యాహ్నం నుంచి ఆన్లైన్ బోధనను కొనసాగించాలని ఎస్సీఈఆర్టీ ఆదేశించింది. సోమవారం నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు కూడా ప్రారంభించాలని అన్ని కాలేజీలకు ఇంటర్ బోర్డు ఆదేశాలు ఇచ్చింది. మొత్తం పనిదినాలను 106కు తగ్గిస్తున్నారు. కాగా, వృత్తి విద్యాయేతర డిగ్రీ కోర్సుల ఫస్టియర్ ప్రవేశాల గడువును రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈనెల 21 వరకు పొడిగించింది. ఇక ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల ఫస్టియర్ ప్రవేశాలకు సంబంధించిన విద్యార్థులు సోమవారం కాలేజీల్లో రిపోర్టు చేయకపోతే.. సీట్లు రద్దు అవుతాయి. ట్రిపుల్ ఐటీల్లో తరగతుల ప్రారంభం నేడే.. నూజివీడు: నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 కల్లా క్యాంపస్లలో రిపోర్ట్ చేయాలని అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు సూచించారు. ఇంటర్ ఫస్టియర్ వార్షిక షెడ్యూల్ ► జనవరి 18 నుంచి మార్చి 31 వరకు ఫస్ట్ టర్మ్ ► మార్చి 25 నుంచి 31 వరకు అర్థ సంవత్సర పరీక్షలు ► ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు సెకండ్ టర్మ్ ► ఏప్రిల్/మేలో ఫైనల్ పరీక్షలు (తేదీలు ఖరారు చేయలేదు) ► అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను తరువాత ప్రకటిస్తారు. ► 2020–21 ఫస్టియర్ విద్యార్థులకు సెకండియర్ (2021–22 విద్యాసంవత్సరం) తరగతుల ప్రారంభం జూన్ 3. -
తల్లిదండ్రుల సమ్మతితోనే
సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్నప్పటికీ... విద్యార్థుల తల్లిదండ్రులు సమ్మతిస్తేనే ఆఫ్లైన్ తరగతుల హాజరుకు (ప్రత్యక్షంగా స్కూలుకు రావడానికి) అనుమతి ఉంటుంది. పిల్లల్ని బడికి పంపించొద్దని పేరెంట్స్ భావిస్తే... వారి కోసం ఆన్లైన్ తరగతులు, వీడియో పాఠాలు యథాతథంగా కొనసాగుతాయి. తల్లిదండ్రులు తమ అభీష్టం మేరకు ఆఫ్లైన్/ ఆన్లైన్ పద్ధతిలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాఠశాలల నిర్వహణ, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ మంగళవారం మార్గదర్శకాలు జారీచేశారు. గతంలో మాదిరిగా విద్యా సంస్థలన్నీ సాధారణ పనివేళల్లో కొనసాగనున్నప్పటికీ... విద్యార్థులు మాత్రం తమకు నచ్చిన విధానాన్ని ఎంచుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. ఫిజికల్గా హాజరయ్యే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం లిఖితపూర్వకంగా తమ సమ్మతి తెలపాలి. తొమ్మిదో తరగతి నుంచి పైతరగతులకు బోధించే ఉపాధ్యాయులు మాత్రం ప్రతి రోజూ పాఠశాలకు హాజరు కావాలి. తరగతి గది విస్తీర్ణాన్ని బట్టి ఆరు అడుగుల దూరం పాటిస్తూ కూర్చునేలా ఏర్పాట్లు చేయాలి. ప్రతి విద్యార్థి మాస్కు ధరించడంతో పాటు తరుచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, ఈమేరకు చర్యలు తీసుకోవాలని విద్యా సంస్థల యాజమాన్యాలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటిస్తూ విద్యా సంస్థలను నిర్వహించాలని సూచిస్తూ... సవివరంగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉన్నత పాఠశాలలతో పాటు ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ కాలేజీలన్నింటికి సంబంధించిన ఆదేశాలను ఇందులో వివరంగా ప్రస్తావించింది. పర్యవేక్షణకు డీఎల్ఈఎంసీ విద్యా సంస్థల నిర్వహణకు సంబంధించి పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాస్థాయి విద్యా పర్యవేక్షణ కమిటీ(డీఎల్ఈఎంసీ)లకు జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉంటారు. ఐటీడీఏ పీఓ, డీఎంహెచ్ఓ, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి, డీఈఓ, డీఐఈఓ, ఎంపిక చేసిన కాలేజీల ప్రిన్సిపాళ్లు, కలెక్టర్ సూచించిన వ్యక్తులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో విద్యా సంస్థల నిర్వహణకు సం బంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తారు. విద్యా సంస్థల శానిటైజేషన్, తరగతుల నిర్వహణ ఏర్పాట్లు, వైద్య ప్రణాళికలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాల్లో పలు సూచనలు చేసింది. ఈ అంశాలన్నీ జిల్లా కమిటీల ఆదేశానుసారం అమలు చేస్తారు. కేంద్రం నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ)ను పర్యవేక్షిం చేందుకు జిల్లా కలెక్టర్లు నోడల్ ఆఫీసర్లను నియమించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. మధ్యా హ్న భోజన పథకాన్ని కోవిడ్–19 జాగ్రత్తలు పాటిస్తూ అమలు చేయాలని ఆదేశించింది. సంక్షేమ మంత్రులతో ప్రత్యేక సమీక్ష రాష్ట్రంలో గురుకుల విద్యా సంస్థలు దాదాపు వెయ్యికిపైగా ఉన్నాయి. పాఠశాలలు మొదలు ఇంటర్మీడియట్, డిగ్రీ గురుకుల కాలేజీల్లో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులున్నారు. ఆయా సంక్షేమ శాఖల మంత్రులతో ప్రత్యేకంగా చర్చించి నిర్వహణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో ఈనెల 18న సంక్షేమ శాఖల మంత్రులతో తరగతులు, వసతిగృహాల నిర్వహణపై విద్యామంత్రి సబితారెడ్డి ప్రత్యేక సమీక్ష జరపనున్నారు. అలాగే 19న ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతో మంత్రి సమావేశం కానున్నారు. సిలబస్ పూర్తి ఎలా? కరోనా కారణంగా 2020–21 విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం... అందులోనూ ఆన్లైన్ తరగతులతో నెట్టుకురావడంతో విద్యార్థుల అభ్యసనపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 1నుంచి ప్రత్యక్షబోధన ప్రారంభిస్తే అకడమిక్ క్యాలెండర్ ఎలా ఉండాలనే దానిపై మంగళవారం విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ఆన్లైన్ తరగతులు ఎంతవరకు జరిగాయి... ఇంకా ఏమేరకు సిలబస్ చెప్పాల్సి ఉంది? అందుకు ఏమేరకు సమయం పడుతుంది? పాఠ్యాంశాలను కుదించాల్సి వస్తే ఏయే అధ్యాయాలను తొలగించాలి? పరీక్షలు ఎప్పుడు, ఎలా నిర్వహించాలి? అనే అంశాలపై అంతర్గత సమావేశాలు నిర్వహించుకుని శాఖల వారీగా అకడమిక్ క్యాలెండర్ను ఖరారు చేయాలని సంబంధిత ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. -
కాలేజీల్లో జీరో కరోనా
సాక్షి, అమరావతి: స్కూళ్లు ప్రారంభించి 14 రోజులు గడిచిన నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తి భయపడినంతగా లేకపోవడంతో ఒకింత ఆందోళన తగ్గింది. స్కూళ్లకు విద్యార్థులు వస్తే వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతుందని చాలా మంది వాదించారు. స్కూళ్లు తెరవద్దని అన్నారు. కానీ ఇప్పటికే విద్యా సంవత్సరం తీవ్ర జాప్యం కావడంతో ప్రభుత్వం స్కూళ్లను ప్రారంభించింది. స్కూళ్లు తెరిచినప్పటి నుంచి ప్రతి రోజూ వైద్య ఆరోగ్య శాఖ కేసులపై పర్యవేక్షిస్తూనే ఉంది. దీనిపై ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు, విద్యార్థులకు టెస్టులు చేస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ వరకు నమోదైన పాజిటివ్ కేసులు బట్టి చూస్తే చాలా తక్కువగా ఉన్నట్టు తేలింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోని స్కూళ్లలో జీరో శాతం పాజిటివిటీ ఉన్నట్లు స్పష్టమైంది. అత్యధికంగా నెల్లూరులో 0.7 శాతం కేసులు నమోదయ్యాయి. రోజువారీ రాష్ట్ర జనాభాకు చేసిన టెస్టులతో పోలిస్తే స్కూళ్ల పాజిటివిటీ రేటు చాలా తక్కువ. సగానికి పైగా జిల్లాల్లో 0.1 శాతం మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయి. లక్షణాలున్నట్టు తేలితే వైద్య సిబ్బంది వెంటనే కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. ప్రతి నిత్యం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో స్కూళ్లు, కాలేజీల్లో పర్యవేక్షణ ఉంటోంది. కళాశాలల్లో 3,767 మంది విద్యార్థులు, 913 లెక్చరర్లకు టెస్టులు చేయగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. పెరిగిన హాజరు శాతం ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ నిర్వహిస్తున్న తరగతులు ఆరోగ్యకర వాతావరణంలో నడుస్తున్నాయి. దీంతో విద్యార్థుల హాజరు శాతం రోజురోజుకూ పెరుగుతోంది. దీపావళి ముందు వరకు 10వ తరగతి విద్యార్థులు 50.74 శాతం తరగతులకు హాజరయ్యారు. 9వ తరగతి విద్యార్థులు 39.57 శాతం హాజరయ్యారు. మొత్తంగా విద్యార్థుల హాజరు శాతం 45.15కు చేరింది. జూనియర్ కళాశాలల్లో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల హాజరు 36.44 శాతం నమోదైంది. విద్యా సంస్థల్లో కోవిడ్ టెస్టుల వివరాలు సర్కారు ముందు చూపు – కోవిడ్–19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. టెస్ట్, ట్రేస్, ట్రీట్మెంట్.. పద్ధతిని అనుసరిస్తూ ఖర్చుకు వెనుకాడకుండా తొలి నుంచీ భారీ సంఖ్యలో టెస్ట్లు చేయిస్తోంది. వైరస్ సోకిన వారిని త్వరితగతిన గుర్తించి ఉచితంగా వైద్యం అందిస్తోంది. – ఇందుకోసం భారీ సంఖ్యలో కోవిడ్ కేర్ సెంటర్లను, కోవిడ్ ఆస్పత్రులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అందుకు తగినట్లు యుద్ధ ప్రాతిపదికన వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించింది. ఖరీదైన మందులను సైతం అందుబాటులోకి తెచి్చంది. మౌలిక వసతులను కలి్పంచింది. బలవర్థకమైన ఆహారాన్ని అందించింది. – ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల వైద్య రంగ ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు వ్యక్తమవడం తెలిసిందే. దీంతో రోజుకు 70 వేలు, 80 వేల టెస్ట్లు చేస్తున్నా, ప్రస్తుతం పెద్దగా కేసులు నమోదవ్వడం లేదు. – మరోవైపు ఇతర రాష్ట్రాలు తక్కువ సంఖ్యలో టెస్ట్లు చేస్తున్నా ఇంత కంటే ఎక్కువ కేసులు వస్తుండటం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తొలి నుంచీ పెద్ద సంఖ్యలో టెస్ట్లు నిర్వహించడం వల్లే వైరస్ను నియంత్రించడంలో విజయం సాధిస్తోందని వైద్య రంగ ప్రముఖులు చెబుతున్నారు. నేడు కళాశాలల్లో ఒక్క కేసు కూడా రాలేదంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించడమే కారణమంటున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రతిరోజూ కోవిడ్పై అవగాహన కల్పిస్తున్నాం. మాస్క్, శానిటైజేషన్, భౌతిక దూరం, పారిశుధ్యం విషయాల్లో కచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అన్ని జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నాం. – ఆదిమూలం సురేష్, విద్యా శాఖ మంత్రి -
నేటి నుంచి స్కూళ్లు, కాలేజీలు..
-
ఏపీ: నేటి నుంచి స్కూళ్లు, కాలేజీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. కోవిడ్–19 కారణంగా గత విద్యా సంవత్సరం మార్చి చివర్లో మూతపడ్డ విద్యాసంస్థలు 7నెలల విరామం తరువాత తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఏయే తరగతుల విద్యార్థులు ఎప్పటినుంచి హాజరు కావాలనేది స్పష్టం చేస్తూ సమగ్ర మార్గదర్శకాలతో షెడ్యూళ్లు విడుదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ అపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ప్రకారం విద్యాసంస్థల పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలకు వేర్వేరుగా అకడమిక్ క్యాలెండర్లను ప్రకటించింది. పని దినాలను సర్దుబాటు చేస్తూ.. 2020–21 విద్యా సంవత్సరంలో పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు 5 నెలల కాలం వృథా అయ్యింది. ఈ దృష్ట్యా కోల్పోయిన పని దినాలను సర్దుబాటు చేసుకుంటూ సోమవారం నుంచి దశలవారీగా తరగతులను ప్రారంభిస్తున్నారు. స్కూళ్లు, జూనియర్ కాలేజీలను ఏప్రిల్ 30 వరకు, డిగ్రీ, పీజీ తరగతులను ఆగస్టు వరకు కొనసాగించేలా అకడమిక్ క్యాలెండర్లను ప్రభుత్వం జారీ చేసింది. సిలబస్ను కుదించకుండా నిర్దేశించిన లక్ష్యాలు నెరవేరేలా ముఖ్యమైన అంశాలన్నీ బోధించేవిధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. విద్యార్థులను హైటెక్, లోటెక్, నోటెక్గా విభజించి తరగతి గదిలో నేరుగా టీచర్లు బోధన చేస్తారు. విద్యార్థులు ఇంటివద్ద నేర్చుకొనేవి, ఆన్లైన్ ద్వారా బోధించేవి అనే విధానాల్లోనూ బోధన చేయనున్నారు. ఏయే తరగతులు ఎప్పటినుంచి.. అన్ని యాజమాన్య పాఠశాలలు, కాలేజీల్లోని 9, 10, 12 తరగతుల విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. నవంబర్ 23 నుంచి అన్ని పాఠశాలల్లో 6 నుంచి 8 తరగతులు మొదలవుతాయి. డిసెంబర్ 14 నుంచి అన్ని పాఠశాలల్లో 1 నుంచి 5 క్లాసులు, నవంబర్ 16 నుంచి ఇంటర్మీడియెట్ ఫస్టియర్ తరగతులు మొదలవుతాయి. నవంబర్ నెలంతా బడులు ఒంటిపూట (ఉదయం 9 నుంచి 1.30 వరకు) మాత్రమే ఉంటాయి. మధ్యాహ్న భోజనం ముగిశాక పిల్లలను ఇళ్లకు పంపిస్తారు. తరగతి గదిలో విద్యార్థుల మధ్య 6 అడుగుల దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు ఉండాలి. ఒక్కో తరగతి గదిలో 16 మందికి మించకుండా ఉండాలి. రోజు విడిచి రోజు తరగతులకు హాజరయ్యేలా ఏర్పాట్లు. విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న స్కూళ్లలో తరగతుల నిర్వహణపై హెడ్మాస్టర్లు షెడ్యూల్ రూపొందిస్తారు. డిగ్రీ, పీజీ ప్రొఫెషనల్, నాన్ ప్రాఫెషనల్ కోర్సులకు సంబంధించి ఫస్టియర్ మినహా తక్కిన తరగతులు నవంబర్ 2 నుంచి దశల వారీగా ప్రారంభమవుతాయి. ఆ కాలేజీల్లో ఫస్టియర్ తరగతులు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం. -
నవంబర్ 2 నుంచి కళాశాలలు పునఃప్రారంభం
సాక్షి, విజయవాడ: కళాశాలలు నవంబర్ 2 నుంచి ప్రారంభమవుతాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులకి మాత్రమే ప్రస్తుతం తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రతీ విద్యార్థికి నెలలో పది రోజులు తరగతులు నిర్వహిస్తామన్నారు. మూడవ వంతు విద్యార్థులనే అనుమతిస్తామని వెల్లడించారు. ఆన్లైన్ క్లాసులు కొనసాగుతాయన్నారు. (చదవండి: ప్రైవేటు పాఠశాలలకు గట్టి షాక్..) ‘‘రెండు సెమిస్టర్లగా అకడమిక్ క్యాలెండర్ రూపొందించాం. మార్చి నెలకి మొదటి సెమిస్టర్.. ఆగస్ట్ నాటికి రెండవ సెమిస్టర్ పూర్తి చేస్తాం. అకడమిక్ క్యాలెండర్ని 180 రోజులుగా రూపొందించాం. ఈసెట్ అడ్మిషన్లు నవంబర్ 11 లోపు పూర్తి చేస్తాం. డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్లు, ఇంజనీరింగ్ అడ్మిషన్లని నవంబర్ నెలాఖరుకి పూర్తి చేసి డిసెంబర్ ఒకటి తరగతులు ప్రారంభిస్తాం. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలతో తరగతులు నిర్వహిస్తాం. కళాశాలకి వచ్చే ప్రతీ విద్యార్ధి తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. కళాశాలకి వచ్చే విద్యార్థులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని’’ ఆయన పేర్కొన్నారు. (చదవండి: గ్రూప్–1 మెయిన్స్కు 9,678 మంది) -
ఏపీ: స్కూళ్లు, కళాశాలలకు ప్రత్యేక మార్గదర్శకాలు
సాక్షి,అమరావతి: కరోనా రాష్ట్రంలో తగ్గుముఖం పడుతోందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ చెప్పారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే విద్యా సంవత్సరాన్ని చాలా నష్టపోయిన నేపథ్యంలో స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితోపాటు హెడ్మాస్టర్లు, టీచర్లనూ అప్రమత్తం చేశామని వెల్లడించారు. తల్లిదండ్రులు అనుమతిస్తేనే పిల్లలు స్కూళ్లకు రావాలన్నారు. కొద్ది రోజులపాటు మధ్యాహ్నం వరకే స్కూళ్లు ఉంటాయన్నారు. చదవండి: మొదటి నెల రోజులు హాఫ్ డే స్కూళ్లు ఆ తర్వాత పరిస్థితిని బట్టి పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరుస్తున్నామని, కోవిడ్ నేపథ్యంలో రెండ్రోజుల్లో ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్న ఇళ్ల నుంచి పిల్లలు స్కూళ్లకు వస్తుంటే ఆ ఇళ్లనూ రోజూ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పర్యవేక్షించాలన్నారు. స్కూళ్లు తెరిచాక 15 రోజుల పాటు నిశితంగా పరిశీలిస్తామని వెల్లడించారు. దీన్ని బట్టి కోవిడ్ నియంత్రణపై భవిష్యత్ ప్రణాళిక ఉంటుందన్నారు. జిల్లా స్థాయిలో స్కూళ్లల్లో పరిస్థితులపై కలెక్టర్లతో టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశామని వివరించారు. కోవిడ్ టెస్టులను మరింతగా పెంచుతామన్నారు. చదవండి: రైతుబజార్లలో రూ.40కే కిలో ఉల్లి -
ఉన్నతంగా మారుద్దాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి అన్ని రకాలుగా అండదండలు అందిస్తూ పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన తదితర పథకాల ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ను 90 శాతానికి చేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నాలుగేళ్ల ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల్లో కూడా అప్రెంటిస్షిప్ ఉంటుందని, ఈ నాలుగేళ్లలోనే 20 అదనపు క్రెడిట్స్ సాధించిన వారికి బీటెక్ ఆనర్స్ డిగ్రీ వస్తుందని సీఎం జగన్ తెలిపారు. విద్యార్థి అదే విభాగంలో ఈ క్రెడిట్స్ సాధిస్తే ఆనర్స్ అడ్వాన్స్డ్ అని వ్యవహరిస్తారు. వేరే విభాగంలో క్రెడిట్స్ సాధిస్తే ఆనర్స్ మైనర్ అని పేర్కొంటారు. యూనివర్సిటీల్లో 1,100 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం జగన్ అక్టోబర్ 15 నుంచి కాలేజీలు పునఃప్రారంభమవుతాయని ప్రకటించారు. కాలేజీలు తెరిచిన తర్వాత విద్యాదీవెన, వసతి దీవెన ఇచ్చేందుకు సన్నద్ధం కావాలని ఆర్థికశాఖ అధికారులకు సూచించారు. సెప్టెంబర్లో సెట్ల నిర్వహణ పూర్తి చేయాలని ఆదేశించారు. ఉన్నత విద్యా రంగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. కాలేజీల్లో కూడా నాడు–నేడు కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ పూర్తి చేయాలని సీఎం సూచించారు. సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. 32.4 నుంచి 90 శాతానికి పెరగాలి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన ద్వారా ఉన్నత చదువులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నందున కచ్చితంగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరగాలి. దీన్ని ఇప్పుడున్న 32.4 శాతం నుంచి 90 శాతానికి తీసుకెళ్లాలి. అడ్మిషన్ల సమయంలోనే ఐచ్ఛికం మూడేళ్ల డిగ్రీ కోర్సులో 10 నెలల అప్రెంటిస్షిప్ను చేర్చాం. దీనికి అదనంగా ఒక ఏడాది నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అంశాలపై శిక్షణ కూడా ఉంటుంది. ఇవి నేర్చుకుంటేనే డిగ్రీ ఆనర్స్గా పరిగణిస్తాం. అదనంగా ఏడాది అనేది విద్యార్థి ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. అడ్మిషన్ల సమయంలోనే సాధారణ డిగ్రీ కావాలా? ఆనర్స్ డిగ్రీ కావాలా? అన్న దానిపై ఐఛ్చికాన్ని తీసుకుంటాం. బీటెక్లో కూడా.. బీటెక్ డిగ్రీలకు సంబంధించి 4 ఏళ్లలో కూడా తప్పనిసరి అప్రెంటిస్షిప్ ఉంటుంది. అదనంగా 20 క్రెడిట్స్ సాధించిన వారికి ఆనర్స్ డిగ్రీ వస్తుంది వైద్య కళాశాలలకు రూ.6 వేల కోట్లు పాత మెడికల్ కాలేజీలను మరమ్మతు చేసి నాడు– నేడు కార్యక్రమాల కోసం రూ.6 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. ఈ ప్రభుత్వం విద్యా రంగం మీద దృష్టి పెట్టింది కాబట్టి వీటి గురించి ఆలోచిస్తోంది. ఆ దుస్థితికి కారణం... ప్రభుత్వ ఆస్పత్రుల్లో గతంలో సెల్ఫోన్ వెలుగులో ఆపరేషన్లు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎలుకలు కొరికి శిశువు చనిపోయే దుస్థితి ఎందుకు దాపురించింది? జనరేటర్లు పని చేయని పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలుగు, సంస్కత అకాడమీల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ తెలుగు, సంస్కృత అకాడమీల ప్రారంభానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అరకులో ప్రభుత్వ ఆధ్వర్యంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకారం తెలిపారు. కచ్చితమైన నిధుల కేటాయింపుతో మూడు నాలుగేళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ, కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వర్సిటీల్లో 1,100 పోస్టుల భర్తీకి ఆమోదం ► యూనివర్సిటీల్లో దాదాపు 1,110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. ► సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్చంద్ర, ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. -
అక్టోబర్ 15 నుంచి కాలేజీలను తెరుస్తాం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 15 నుంచి అన్ని కాలేజీలను తెరుస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఇప్పటివరకు పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తోన్న సెట్లను సెప్టెంబర్ 3వ వారం నుంచి నిర్వహిస్తామని వెల్లడించారు. 3, 4 ఏళ్ల డిగ్రీ కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కళాశాలల్లో నాడు- నేడు కార్యక్రమాన్ని చేపడుతామని తెలిపారు. అన్ని ప్రైవేటు కళాశాలలు ఆన్లైన్లో అడ్మిషన్లు చేపట్టాలని సూచించారు. ఈ క్రమంలో ఏవైనా కాలేజీలు అక్రమాలకు పాల్పడితే వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. (సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలల పునఃప్రారంభం) గురువారం ఆయన సచివాలయం నుంచి మాట్లాడుతూ.. ఉన్నత విద్యా సంస్థల్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ 70 నుంచి 90 శాతం పెంచాలని సూచించారు. కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ, కడపలో అర్కిటెక్చర్, తెలుగు సంస్కృత అకాడమీ, కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ, పాడేరులో గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఈ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రకాశం జిల్లాలో టీచర్ ట్రైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. (అక్టోబరు 15న తెరుచుకోనున్న కాలేజీలు: సీఎం జగన్) -
ఉన్నత విద్యపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు
-
31 వరకు విద్యాసంస్థలన్నీ మూతే: యూజీసీ
సాక్షి, హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలోని ఉన్నత విద్యా సంస్థలన్నింటిని ఈ నెల 31 వరకు బంద్ చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కార్యదర్శి రజనీశ్ జైన్ ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు ఈ నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు. యూజీసీ ఆదేశాల నేపథ్యంలో తమ పరిధిలోని అన్ని కాలేజీలు, లైబ్రరీలను ఈ నెల 31 వరకు బంద్ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆదేశాలు జారీ చేసింది. -
ఐసీఐసీఐలో కోటి వరకు విద్యారుణం
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్లో విద్యా రుణాలు(ఎడ్యుకేషన్ లోన్స్)ను వేగంగా అందించేందుకు చర్యలు చేపట్టింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే వినియోగదారులకు రూ.10లక్షల నుంచి కోటి రూపాయలు అందించే ప్రణాళికను రూపకల్పన చేసింది. ‘ఇన్స్టా ఎడ్యుకేషన్ లోన్’ పేరిట నిబంధనలు, షరతులతో కొద్ది నిమిషాల్లోనే విద్యా రుణాలను అందించనుంది. పూర్తిగా డిజిటల్ పద్దతిలో విద్యా రుణాల ప్రక్రియను చేపట్టనుంది. దేశీయ, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు, కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు బ్యాంక్ రుణాలను మంజూరు చేస్తుంది. అయితే వినియోగదారులు తమ స్థిర డిపాజిట్ల(ఫిక్సడ్ డిపాజిట్స్)లో 90శాతం బ్యాంక్ రుణాలు పొందవచ్చు అని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. వేగంగా మంజూరు చేసే రుణాల వల్ల విద్యార్థులు ఎంతో ప్రయోజనం పొందుతారని ఐసీఐసీఐ తెలిపింది. కాగా రుణాలు చెల్లించడానికి పది సంవత్సరాల కాలపరిమితిని బ్యాంక్ విధించింది. మరోవైపు ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80 ఇ ప్రకారం.. 8 సంవత్సరాల వరకు బ్యాంక్లో విద్యా రుణాలకు ఆదాయపు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. కాగా అంతర్జాతీయ సంస్థలలో ప్రవేశం పొందే విద్యార్థుల కోసం, బ్యాంక్ రుణాలు రూ. 10 లక్షల నుంచి రూ.కోటి వరకు, దేశీయ సంస్థలలో రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పొందవచ్చు.కాగా విద్యారుణాలను అప్లై చేయాలంటే..మొదటగా వినియోగదారులు ఐసీఐసీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత బ్యాంక్ సైట్లో రుణాలకు సంబంధించిన ఆఫర్ను అధ్యయనం చేయాలి. వినియోగదారులకు కావాల్సిన రుణం, చెల్లించే కాలపరిమితి, ప్రవేశం పొందిన విశ్వవిద్యాలయం పేరు తదితర వివరాలను అప్లికేషన్ ఫార్మ్లో నమోదు చేయాలి. తరువాత విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్థితో సంబంధం వంటి వివరాలను నమోదు చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాంక్కు సంబంధించిన నిబంధనలు, షరతులను అంగీకరిస్తే వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) ద్వారా బ్యాంక్ దృవీకరించిన నెంబర్ వస్తుంది. ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాక, విద్యారుణాలు పొందిన మంజూరు లేఖను బ్యాంక్ వినియోగదారులకు అందిస్తుంది. (చదవండి: ‘బోగస్’తో బ్యాంక్కు టోకరా!) -
రూ.1,210 కోట్లతో 30 నైపుణ్యాభివృద్ధి కాలేజీలు
సాక్షి, అమరావతి: నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, కంపెనీల మధ్య నిరంతరం సంబంధాలు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో రూ.1,210 కోట్లకు పైగా అంచనాలతో ఏర్పాటు చేస్తున్న 30 నైపుణ్యాభివృద్ధి కాలేజీలను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కాలేజీల నమూనాలను పరిశీ లించారు. అనంతరం సీఎం ఇచ్చిన సూచనలు, జారీ చేసిన ఆదేశాలు ఇలా ఉన్నాయి. ► సంబంధిత రంగంలో టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులు, చేర్పులను పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాన్ని మెరుగు పరచాలి. ► కాలేజీల నిర్మాణం పూర్తయ్యాక ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ చదివిన విద్యార్థుల వివరాలపై సర్వే చేయాలి. ఆ తర్వాత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలి. ఈలోగా పరిశ్రమల అవసరాలు ఏమిటో తెలుసుకోవాలి. ► సింగపూర్, జర్మనీ, అమెరికా, యూకే దేశాల్లోని పలు యూనివర్సిటీలు, సంస్థలు మనతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల వాటిని ఇందులో భాగస్వాములను చేయాలి. ఐటీఐ, పాలిటెక్నిక్ చేసిన వారికి మేలు జరిగేలా ఎన్ఏసీ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్)ని కూడా భాగస్వామిని చేయాలి. 20 రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ► మొత్తం 30 చోట్ల స్కిల్ డెవలప్మెంట్ కాలేజీల నిర్మాణ నమూనాలను అధికారులు సీఎంకు చూపించారు. ఈ 30 కాలేజీల్లో 20 రంగాలలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి శిక్షణ ఇస్తారు. ► దాదాపు 120 కోర్సుల్లో బోధన, నైపుణ్యాభి వృద్ధిలో శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొం దిస్తున్నారు. స్థానిక పరిశ్రమలు, భారీ పరి శ్రమలు, అంతర్జాతీయ పరిశ్రమలకు అవసర మైన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తారు. ► కోర్సుల్లో కియా, ఐటీసీ, టెక్ మహీంద్ర, హెచ్సీఎల్, హ్యుందాయ్, వోల్వో, బాష్ వంటి కంపెనీల భాగస్వామ్యం ఉంటుంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏపీఎస్సీహెచ్ఈ, ఐఐఐటీ బోధనా సిబ్బందితో అడ్వాన్స్డ్ కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తారు. ► సమీక్షా సమావేశంలో ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధు సూదన్ రెడ్డి, ఉన్నతాధికా రులు పాల్గొన్నారు. -
తెలంగాణ అటవీ కళాశాలకు ‘ఏ+’ కేటగిరీ
సాక్షి, హైదరాబాద్: అటవీ విద్యా బోధన, పరిశోధనలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు గాను తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్సీఆర్ఐ)ను ఏ ప్లస్ కేటగిరీ విద్యాసంస్థగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అటవీ కాలేజీలు, ప్రమాణాలు, వసతులను అధ్యయనం చేసిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఐసీఎఫ్ఆర్ఈ), తెలంగాణ కాలేజీకి అత్యంత ప్రాధాన్యత గుర్తింపునిచ్చింది. ప్రభుత్వ కృషికి తగిన ఫలితం లభించిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. అటవీశాఖ అధికారులు, కాలేజీ యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అడవులు, పర్యావరణ రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అటవీ విద్యను ప్రోత్సహించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక అటవీ కళాశాల ఏర్పాటును ప్రోత్సహించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. 2015లోనే కాలేజీ స్థాపన.. తమిళనాడు మెట్టుపలాయం అటవీ కాలేజీకి దీటుగా తీర్చిదిద్దాలన్న కేసీఆర్ ఆదేశాలతో 2015లో కాలేజీ స్థాపన.. 2016లో బీఎస్సీ ఫారెస్ట్రీ మొదటి బ్యాచ్ నాలుగేళ్ల కోర్సుతో ప్రారంభమైంది. ఈ ఏడాదే ఫైనలియర్ విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేసుకుంటున్నారు. ముందుగా దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో మొదలైన కాలేజీ.. గతేడాది డిసెంబర్లో హైదరాబాద్ శివారు ములుగులోని సొంత క్యాంపస్లోకి మారింది. అత్యంత అధునాతన సౌకర్యాలు, వసతులతో ఏర్పాటైన కొత్త క్యాంపస్ ముఖ్యమంత్రి చేతుల మీదుగానే ప్రారంభమైంది. విజయవంతంగా మొదటి బ్యాచ్ బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సును పూర్తి చేసుకుంటున్న అటవీ కళాశాల ఈ ఏడాది నుంచి రెండేళ్ల ఎంఎస్సీ ఫారెస్ట్రీతో పాటు, మూడేళ్ల పీహెచ్డీ ఫారెస్ట్రీ కోర్సులను కూడా ప్రారంభిస్తోంది. తొలినాళ్లలో ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా బీఎస్సీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగింది. ఆ తర్వాత ఎంసెట్ కౌన్సెలింగ్ ఆధారంగా ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతున్నాయి. బోధనలో ఉన్నత ప్రమాణాలు పాటించటంతో పాటు బ్రిటిష్ కొలంబియా, అబర్న్ యూనివర్సిటీలతో అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇటీవలే ఓ విద్యార్థినికి అబర్న్ యూనివర్సిటీ ఉచితంగా ఎంఎస్సీ సీటును ఆఫర్ చేసింది. తాజాగా ఏ ప్లస్ గుర్తింపు సాధించడంతో తెలంగాణ ఫారెస్ట్ కాలేజీకి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు మరింతగా వచ్చే అవకాశముంది. ప్రభుత్వం, ఇతర సంస్థల సహకారంతో అటవీ కాలేజీ విద్య, పరిశోధనా రంగాల్లో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతోంది. -
కరోనా : స్కూళ్లు, కాలేజీలు, సినిమాలు అన్నీ బంద్
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 (కరోనా వైరస్) భయాందోళన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు వరకు సినిమాహాళ్లను మూసివేయాలని ఆదేశించింది. అలాగే పరీక్షలు నిర్వహించని స్కూళ్లు, కాలేజీలను కూడా మార్చి 31 వరకు మూసి వేసేందుకు నిర్ణయించింది. కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రకటన జారీ చేశారు. ప్రధానంగా జన సమూహాలను నిలువరించే చర్యల్లో భాగంగా తాజా ఆదేశాలిచ్చింది. మరోవైపు కరోనా వైరస్ను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాగా దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య గురువారం నాటికి 73 కి చేరింది. కేరళలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. Delhi Chief Minister Arvind Kejriwal: All cinema halls to remain shut in Delhi till 31st March. Schools and colleges where exams are not being held will also remain closed. #CoronaVirus pic.twitter.com/pbuB1JNFnW — ANI (@ANI) March 12, 2020 -
ఇంజనీరింగ్ కాలేజీల్లో ‘ఏఐ’
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను (ఏఐ) ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించిన సిలబస్ను రూపొందించడంతోపాటు ఏయే కాలేజీల్లో ప్రారంభించాలో నిర్ణయించేందుకు ఉన్న త స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. సబ్జెక్టుగానే కాకుండా వీలైతే ప్రత్యేక కోర్సుగా ప్రవేశపెట్టే అంశాన్ని కూడా పరిశీలించాలని కమిటీని కోరాలని భావిస్తోంది. ఏఐని సబ్జెక్టుగా ప్రారంభిస్తే అందుకు అవసరమయ్యే అధ్యాపకులు, ల్యాబ్లు, ఇతర సదుపాయాలు, సిలబస్ రూపకల్పన, ఎన్ని క్రెడిట్స్ కేటాయించాలన్న తదితర అంశాలను కమిటీ తేల్చుతుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. ఏఐపై అవగాహన కలిగిన నిపుణులకు ఆ కమిటీలో స్థానం కల్పించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో ఏఐ సబ్జెక్టును వచ్చే ఏడాది నుంచి ప్రారంభించేందుకు తగిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఈ నెలాఖరులోగా కమిటీని ఏర్పాటు చేసి నివేదికను త్వరగా తెప్పించుకోవాలని నిర్ణయించింది. ఇంజనీరింగ్లో ఏఐని ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే జేఎన్టీయూ సెనేట్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్ర ఐటీ శాఖ కూడా ఏఐ పాలసీని రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. ప్రారంభమైన కసరత్తు.. జేఎన్టీయూ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఏఐని ప్రవేశపెట్టేలా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకునేలా మండలి కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఈ విషయాన్ని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాలని ఆయన సూచించినట్లు తెలిసింది. కోర్సుగా ప్రవేశపెడితే అన్ని ప్రైవేటు కాలేజీల్లో అమలు సాధ్యం అవుతుందా? లేదా? అనేది కమిటీ తేల్చనుంది. కోర్సును కేవలం యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లోనే ప్రవేశపెట్టడంతోపాటు ముందుకు వచ్చే ప్రైవేటు కాలేజీలకు అనుమతి ఇస్తే బాగుంటుందన్న ఆలోచనలు చేస్తోంది. అయితే నిపుణులతో కూడిన కమిటీ చేసే సిఫారసుల ఆధారంగానే ముందుకు వెళ్లాలని భావిస్తోంది. -
డిగ్రీ కాలేజీ షిఫ్టింగ్ అంత ఈజీ కాదు!
సాక్షి, హైదరాబాద్: ఒక మండలం నుంచి మరో మండలానికి ప్రైవేటు డిగ్రీ కాలేజీల షిఫ్టింగ్ ఇకపై అంత ఈజీ కాదు. సీఎం ఆమోదంతోనే ప్రైవేటు డిగ్రీ కాలేజీలను షిఫ్ట్ చేసేలా నిబంధనల్లో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మార్పుతో ఉన్నత విద్యా మండలి, విద్యాశాఖ మంత్రిపై ఒత్తిళ్లు లేకుండా చూడొచ్చని భావిస్తోంది. మండల పరిధిలో ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతానికి కాలేజీని షిఫ్ట్ చేసేందుకు ఉన్నత విద్యా మండలి అనుమతి ఇస్తుండగా, ఒక మండలం నుంచి మరో మండలానికి కాలేజీని షిఫ్ట్ చేసేందుకు విద్యాశాఖ మంత్రి అనుమతి ఇస్తున్నారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు కాలేజీని షిఫ్ట్ చేయాలంటేనే ఫైలు సీఎంకు వెళ్లేది. కానీ ఇకపై ఆ పరిస్థితి లేకుండా నిబంధనలను మార్చే కసరత్తు మొదలైంది. జీహెచ్ఎంసీలో జోన్ను పరిగణనలోకి తీసుకోవాలా? పాత మండలాలను పరిగణనలోకి తీసుకోవాలా అన్న దాన్ని ఖరారు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయించింది. -
‘కమిషన్ కోరిన సమాచారాన్ని కళాశాలలు ఇవ్వాలి’
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 21వ తేదీలోగా రాష్ట్రంలోని అన్ని కాలేజీలు అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని ఉన్నత విద్యా కమిషన్ సెక్రటరీ ఎన్. రాజశేఖర్ విద్యాసంస్థలను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా కళాశాలల్లోని ఫీజులను సమీక్షిస్తున్న నేపథ్యంలో ఇంజనీరింగ్, ఫార్మా, ఏంసీఏ, ఎంబీఏ కాలేజీలన్నింటికీ నోటీసులు పంపించామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ప్రతి కాలేజీ యాజమాన్యం కమిషన్ కోరిన సమాచారాన్ని ఇవ్వాలని, గతంలో ఫీజుల నిర్థారణపై ఆరోపణులు వచ్చాయని పేర్కొన్నారు. కొన్ని కాలేజీలకు భారీగా ఫీజుల పెంచారని, మరికొన్ని కాలేజీలకు తక్కువ ఫీజుల పేట్టారని అన్నారు. కాలేజీల్లో సదుపాయాల తనిఖీకి కోసం ప్రత్యేక బృందాలను నియమిస్తున్నామని, టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. డిసెంబర్ నాటికి కొత్త ఫీజులను నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. -
కాలేజీ చేతుల్లోకి మెడిసీన్!
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) స్థానంలో తీసుకొచ్చిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చట్టంపై వైద్య విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దీని ప్రకారం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50% సీట్ల ఫీజులను మాత్రమే ప్రభుత్వం నియంత్రిస్తుంది. మిగతా ఫీజుల నిర్ణయం కాలేజీ యాజమాన్యాలదే. అలాగే ప్రస్తుతం పీజీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ పరీక్షను రద్దు చేసి ‘నెక్ట్స్’అనే పరీక్ష పెడతామని ప్రతిపాదించింది. ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పుడే అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు కాలేజీలు.. తాజా నిర్ణయంతో మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని జూడాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మిగులుతుందని అంటున్నారు. సాక్షి, హైదరాబాద్ : నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చట్టంపై జూనియర్ డాక్టర్ల ఆందోళనలు ఉధృతమయ్యాయి. దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళన చేస్తుండగానే.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. దీంతో 1956 నాటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) స్థానంలో, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అమల్లోకి వచ్చింది. డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సెక్షన్లకు ఎటువంటి సవరణలు చేయకుండానే బిల్లు చట్ట రూపం దాల్చింది. ఈ చట్టంలో ప్రతిపాదించిన కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్, కమిషన్లో డాక్టర్లకు బదులు నాన్–డాక్టర్లకు అవకాశం కల్పించడం.. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం, ప్రైవేటు కాలేజీల్లోని 50% సీట్ల ఫీజులను యాజమాన్యాలకే కట్టబెట్టడం వంటి అంశాలను డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2017లోనూ బిల్లుపై వ్యతిరేకత ఎన్ఎంసీ బిల్లును తొలిసారి 2017 డిసెంబర్లో లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సహా దేశవ్యాప్తంగా డాక్టర్లు ఈ బిల్లును వ్యతిరేకించడంతో సెలెక్ట్ కమిటీకి పంపించారు. 16వ లోక్సభ రద్దు అవడంతో ఈ బిల్లు మురిగిపోయింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. తాజాగా చట్టంగా మారడంతో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50% సీట్ల ఫీజులను మాత్రమే ప్రభుత్వం నియంత్రిస్తుంది. మిగతా 50% సీట్ల ఫీజుల నిర్ణయం కాలేజీ యాజమాన్యాలదే. దీంతో కాలేజీలు ఇష్టానికి ఫీజులు పెంచేసే అవకాశముందని, ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పుడే అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు కాలేజీలు, తాజా నిర్ణయంతో మరింతగా రెచ్చిపోయే ప్రమాదముందని డాక్టర్లు అంటున్నారు. ఈ బిల్లుతో పేద, మధ్యతరగతి స్టూడెంట్లకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రవేశ పరీక్షల్లో మెరిట్ సాధించకపోయినా, కోట్లలో ఫీజులు కట్టే సామర్థ్యం ఉన్నవాళ్లకు ఎంబీబీఎస్ సీట్లు దక్కుతాయని చెబుతున్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరసనలు చేపట్టారు. దీనికి తోడు ఈ బిల్లులో ప్రతిపాదించిన నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ (నెక్ట్స్)పై వైద్య విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒకే ఎగ్జామ్ను 3 రకాలుగా వినియోగించాలని కేంద్రం నిర్ణయించింది. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పరీక్షగా, దేశ, విదేశాల్లో చదివిన విద్యార్థులకు ఎగ్జిట్ ఎగ్జామ్గా, పీజీ ప్రవేశాలకు ఎంట్రన్స్ ఎగ్జామ్గా ఈ పరీక్షను నిర్వహించాలని భావిస్తున్నారు. అంటే, ఇకపై ఎంబీబీఎస్ విద్యార్థులు ఈ పరీక్ష పాసైతేనే డాక్టర్గా ప్రాక్టీస్ చేసేందుకు లైసెన్స్ ఇస్తారు. ఈ నేపథ్యంలోనే నెక్ట్స్ను ఎగ్జిట్ ఎగ్జామ్గా పేర్కొంటున్నారు. ఎన్ఎంసీ అమల్లోకి వస్తే.. విదేశాల్లో చదివిన వాళ్లు కూడా ఎఫ్ఎంజీఈకి బదులు, నెక్ట్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇందులో పాసైతేనే ప్రాక్టీస్కు అర్హులవుతారు. అలాగే, ప్రస్తుతం పీజీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ విధానాన్ని రద్దు చేసి, నెక్ట్స్లో సాధించిన మార్కుల ఆధారంగానే పీజీ సీట్లు కేటాయిస్తామని బిల్లులో ప్రతిపాదించారు. దీన్నే విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ ఎన్ఎంసీ బిల్లులోని సెక్షన్ 32లో కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ అనే క్లాజ్ ఉంది. మోడ్రన్ సైంటిఫిక్ మెడికల్ ప్రొఫెషన్తో ముడిపడి ఉన్న వ్యక్తులకు ‘కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్’గా ‘లిమిటెడ్ లైసెన్స్’ఇవ్వొచ్చునని ఈ సెక్షన్లో ప్రతిపాదించారు. దీన్ని డాక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ పేరుతో స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ఫిజియో థెరపిస్టులు తదితరులకు మోడ్రన్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే అవకాశం ఇచ్చే అవకాశముంది. అయితే వీళ్లకు మోడ్రన్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసేందుకు అవకాశమిస్తే, ప్రజారోగ్యం దెబ్బతింటుందని డాక్టర్లు చెబుతున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా వైద్య విద్యార్ధులు, జూనియర్ డాక్టర్లు గళమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా, హైదరాబాద్ ధర్నాచౌక్లో గురువారం భారీ సంఖ్యలో ధర్నా నిర్వహించారు. దీనికి పలు రాజకీయ పార్టీల నాయకులు, సినీ ప్రముఖులు హాజరై సంఘీభావం తెలిపారు. కమిషన్లో నాన్–డాక్టర్స్ ప్రస్తుతం ఉన్న మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా గవర్నింగ్ బాడీలో 80% మంది డాక్టర్లు ఉంటే, 20% మంది నాన్–డాక్టర్స్ ఉంటారు. కానీ, మెడికల్ కమిషన్లో 80% స్థానాల్లో నాన్–డాక్టర్స్ను కూడా నియమించుకునే అవకాశమిచ్చారు. ఇలా నాన్–డాక్టర్స్ కీలకంగా ఉండే కమిషన్లో రాజకీయ జోక్యం పెరుగుతుందని, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల చేతుల్లోకి వైద్య విద్య వ్యవస్థ వెళ్తుందని డాక్టర్లు ఆరోపిస్తున్నారు. భారీగా పెరగనున్న ఫీజులు నేషనల్ మెడికల్ కమిషన్ చట్టంతో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఫీజుల ధరలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బ్రిడ్జ్ కోర్సు, ఎగ్జిట్ ఎగ్జామ్, ఫీజుల నియంత్రణ ఎత్తివేయడం వంటి అనేక అంశాలు మెడిసిన్ స్టూడెంట్లకు, మెడిసిన్ చదవాలనుకుంటున్న విద్యార్థులకు నష్టాన్ని కలిగిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు కాలేజీల్లోని మొత్తం సీట్ల ఫీజులను నియంత్రించే అధికారం ప్రభుత్వాలకు ఉంది. ఎన్ఎంసీ చట్టంతో ప్రైవేటులోని 50% సీట్లపై ప్రభుత్వం నియంత్రణ కోల్పోనుంది. చాలా రాష్ట్రాల్లో బీ–కేటగిరీ సీటుకు కనీసం రూ.50లక్షలు, సీ–కేటగిరీ సీటుకు కోటి రూపాయల వరకూ కాలేజీలకు చెల్లించాల్సి వస్తోంది. ఈ నియంత్రణ ఎత్తివేస్తే ఫీజులు రెండు, మూడింతలు పెరిగే ప్రమాదముంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారనుంది. -
ర్యాగింగ్ చేస్తే...
సాక్షి, రాజమహేంద్రవరం క్రైం: విద్యాలయాల్లో ర్యాగింగ్ వెర్రితలలు వేస్తోంది. కొత్తగా కళాశాలలకు వచ్చే విద్యార్థులను సీనియర్లు వేధించడం షరా మామూలుగానే మారింది. ర్యాగింగ్ పేరుతో వేధింపులకు పాల్పడకూడదని చట్టాలున్నా అవి అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో ర్యాగింగ్ మహమ్మారిని అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. విద్యాసంవత్సరం మొదలు కావడంతో ర్యాగింగ్పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ర్యాగింగ్ వల్ల కలిగే దుష్ఫలితాలను వివరిస్తున్నారు. ర్యాగింగ్ అంటే.. 1997 చట్టం ప్రకారం ర్యాగింగ్ అంటే విద్యార్థికి అవమానం, బాధ, భయం, భీతి, దిగులు, జడుపు, దురుద్దేశపూరితమైన పనులు, గాయాలకు కారణమైన, కారణం కాబోయే చర్యలు చేస్తే ర్యాగింగ్ కిందకు వస్తుంది. సెక్షన్ 4 ఏపీ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ 1997 ప్రకారం ర్యాగింగ్కు పాల్పడితే శిక్షార్హులు అవుతారు. మహిళా చట్టాలు.. ⇔ సెక్షన్ 509 ఐపీసీ: మహిళలతో మాటలతో, సైగలతో, చేష్టలతో, అవమానపరిచినా, అల్లరి పెట్టినా ఒక సంవత్సరం నుంచి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా. రెండూ పడే అవకాశం. ⇔ సెక్షన్ 294 ఐపీసీ: అశ్లీల, అభ్యంతరకరమైన ప్రవర్తన, పాటలు పాడడం, ⇔ సెక్షన్ 354 ఐపీసీ : అత్యాచారం కు ప్రయత్నించడం లేదా మర్యాదకు భగం కలిగేలా ప్రవర్తించడం ⇔ మహిళలను దురుద్దేశంతో తాకినా, కోరిక తీర్చమని అడిగినా, లైంగికపరమైన చిత్రాలు, వీడియోలు, చూపించినా మూడేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు. ⇔ మహిళలపై దాడి చేసినా లేదా బల ప్రయోగం చేసినా, అత్యాచార యత్నం చేసినా, దురుద్దేశంతో వస్త్రాలు తొలగించినా ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ⇔ ఎవరైనా మహిళ అంతరంగికమైన జీవితానికి ప్రైవేటు(లైఫ్)కు సంబందించిన దృశ్యాలను రహస్యంగా చూసినా, చిత్రీకరించినా ఏడాది నుంచి ఏడేళ్ల జైలు శిక్ష , జరిమానా విధిస్తారు. ⇔ మహిళ అభీష్టానికి వ్యతిరేకంగా ఆమెను అనుసరించినా, తాకడానికి ప్రయత్నించినా ఈమెయిల్, ఇంటర్నెట్, తదితర సాధనాల ద్వారా ఆమెను సంప్రదించినా మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ప్రొటక్షన్ ఆఫ్ చిల్ట్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్ యాక్ట్ 2012 బాలికలను లైంగికపరమైన ఉద్దేశంతో తాకినా, వేధింపులకు గురి చేసినా, దాడి చేసినా, శరీరంలోకి చొచ్చుకుపోయే ఆయుధాలు, వస్తువులు, అగ్నివంటి వాటితో దాడికి గురి చేసినా, మారణాయుధాలతో దాడి చేసినా, గాయపరిచినా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో అసభ్యంగా చిత్రీకరించినా, శరీరకంగా, మానసికంగా ఎవరైనా నేరాలను ప్రోత్సహించినా ఏడాది నుంచి యావజ్జీవ జైలు శిక్ష విధిస్తారు. బాధితులు సంప్రదించాల్సి నంబర్లు.. పోలీస్ కంట్రోల్ రూమ్ : 100, 1090, 1091 డీఎస్పీ మహిళా పోలీస్ స్టేషన్ 9490760792 ర్యాగింగ్కు పాల్పడితే.. ⇔ వేధించడం, అవమానించడం చేస్తే ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. వెయ్యి జరిమానా లేదా రెండూ విధిస్తారు. కొట్టడం, బలవంతం చేయడం, హెచ్చరించడం చేస్తే సంవత్సరం జైలు శిక్ష లేదా రూ. 2000 జరిమానా, రెండూ విధించవచ్చు. అక్రమ నిర్బంధం, అడ్డుకోవడం, గాయపరచడం చేస్తే రెండేళ్ల జైలు శిక్ష, రూ.ఐదు వేల జరిమానా లేదా రెండూ విధిస్తారు. ⇔ హత్య చేయడం, ఆత్మహత్యకు ప్రేరేపించడం చేస్తే పదేళ్ల జైలు శిక్ష రూ.50 వేలు జరిమానా విధిస్తారు. యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తాం ప్రతి కాలేజీలో, విద్యా సంస్థల్లో య్యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఆ సంస్థలో చదివే విద్యార్థులతో ఒక కమిటీ వేసి ఒకవేళ ర్యాగింగ్ లాంటి సంఘటనలు జరిగితే ఎవరి పాత్ర ఎంత ఉంది అనేది దర్యాప్తు చేస్తాం. విద్యార్థుల పట్ల ర్యాగింగ్కు పాల్పడితే కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే అవగాహన సదస్సులు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. – లతా మాధురి, అడిషనల్ ఎస్పీ, రాజమహేంద్రవరం -
23 కాలేజీలు.. 7,199 సీట్లు కట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలు, సీట్లకు కోత పడింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) గుర్తింపు ఇచ్చిన వాటిల్లోనే 23 కాలేజీలతోపాటు 7,199 సీట్లు తగ్గిపోయాయి. రాష్ట్రంలోని 168 పాలిటెక్నిక్ కాలేజీల్లో 42,100 సీట్లకు ఏఐసీటీఈ ఇటీవల అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అందులో కొన్ని కాలేజీలు సీట్లను తగ్గించుకోగా, కొన్ని కాలేజీలు ప్రవేశాలకు ముందుకు రాలేదు. మరికొన్ని కాలేజీల్లో లోపాల కారణంగా రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. ఇలా 23 కాలేజీలు, 7,199 సీట్లకు కోత పడింది. ఈసారి ప్రవేశాల కౌన్సెలింగ్లో 145 కాలేజీల్లో 34,901 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్కు అవకాశం కల్పించామని తెలిపారు. దీంతో 12,511 మంది విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించారని, అందులో 12,303 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్లను బుక్ చేసుకున్నట్లు ఆయన వివరించారు. 24 వరకు ప్రాధాన్యక్రమంలో ఆప్షన్లు.. ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని బి.శ్రీనివాస్ పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు ఈనెల 24 వరకు ప్రాధాన్య క్రమంలో కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి ఈనెల 27న సీట్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఎన్సీసీ, వికలాంగులు, సాయుధ దళాల కుటుంబాలకు చెందిన పిల్లలు/ఆంగ్లో ఇండియన్ కుటుంబాలకు చెందిన పిల్లలు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్లో మాసాబ్ట్యాంకులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఎంచుకోవాలని పేర్కొన్నారు. కులీకుతుబ్ షాహి అర్బన్ డెవలప్మెంట్ ప్రాంతం లోని విద్యార్థులు అక్కడి క్యూక్యూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న సీట్లను ఎంచుకోవచ్చని, అయితే వారు తమ రేషన్కార్డు జిరాక్స్ కాపీ తప్పక సబ్మిట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అక్కడి విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు స్లాట్ బుకింగ్లో క్యూక్యూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఎంచుకోవాలని పేర్కొన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం వెళ్లే విద్యార్థులు వెంట తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్ల వివరాలను తమ వెబ్సైట్లో (https://tspolycet. nic.in) చూడొచ్చని తెలిపారు. -
ఎయిడెడ్లో ప్రైవేటు దందా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎయిడెడ్ కాలేజీల్లో ప్రైవేటు దందా మొదలైంది. ఇప్పటివరకు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతో కొన్ని సెక్షన్లలోనే కొనసాగిన ప్రైవేటు దందా.. ఇప్పుడు ఏకంగా ఎయిడెడ్ కాలేజీలను పూర్తి ప్రైవేటు కాలేజీలుగా మార్చేందుకు తెర వెనుక అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ తతంగంలో 25 నుంచి 75 ఏళ్ల చరిత్ర గల ప్రముఖ కాలేజీలు కూడా ప్రైవేటుగా మారిపోతున్నాయి. ప్రభుత్వానికే తెలియకుండా పదుల సంఖ్యలో ఇంటర్మీడియట్, డిగ్రీ ఎయిడెడ్ కాలేజీలు ప్రైవేటు కాలేజీలుగా ఆయా శాఖలే మార్చేశాయి. ఏళ్ల చరిత్ర గల వరంగల్లోని ఓ ఎయిడెడ్ జూనియర్ కళాశాల ఆవరణలోనే కొత్త యాజమాన్యం పేరుతో ప్రైవేటు కాలేజీగా బోర్డు పెట్టారు. హైదరాబాద్ నగరం, ఇతర జిల్లాల్లోని రూ. వేల కోట్ల ఆస్తులు గల ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలను ప్రైవేటు కాలేజీలుగా కొనసాగించేందుకు కళాశాల విద్యా శాఖ అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ఇలా 18 కాలేజీలను కళాశాల విద్యాశాఖ ప్రైవేటుగా మార్చేసినట్లు సమాచారం. నియామకాలు చేపట్టకే.. ప్రభుత్వం నియామకాలను చేపట్టకపోవడంతో ఉన్న సిబ్బందితోనే ఎయిడెడ్ కాలేజీలను నడిపిస్తున్నారు. మరోపక్క ప్రైవేటు లెక్చరర్లను నియమించుకొని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను నిర్వహిస్తూ విద్యార్థుల నుంచి భారీగా ఫీజులను వసూలు చేస్తున్నారు. మరికొన్ని యాజమాన్యాలు రూ. వేల కోట్ల ఆస్తులు, భూములు, భవనాలు గల ఆయా విద్యా సంస్థల ఆస్తులపై కన్నేశాయి. వీరంతా సరిపడా లెక్చరర్లు లేరన్న సాకుతో కాలేజీలను నడపలేమంటూ వాటిని మూసేసి ఆస్తులను కొట్టేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయా యాజమాన్యాలు కళాశాల విద్యాశాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్రంలోని 18 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లోని లెక్చరర్లు, సిబ్బందిని ప్రభుత్వ కాలేజీల్లో అవసరం ఉందంటూ వాటిల్లోకి బదిలీ చేసి, అక్కడ ఎయిడెడ్ కాలేజీ అనేది లేకుండా చేసినట్లు సమాచారం. కొన్ని కాలేజీలు మాత్రం ప్రైవేటు కాలేజీలుగా కొనసాగిం చేందుకు సిద్ధం కాగా, మరికొన్ని పూర్తిగా మూతవేసి ఆస్తులను కొట్టేసే యోచనల్లో ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం సీరియస్.. ఈ తతంగం మొత్తం ప్రభుత్వానికి తెలియడంతో సీరియస్ అయ్యింది. ప్రస్తుతం కళాశాల విద్యాశాఖ ఎయిడెడ్ నుంచి ప్రైవేటుగా మార్చుతూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లోని 5 ఇంజనీరింగ్ కాలేజీలను నగర పరిసరాల్లోకి మార్చుకునేందుకు సాంకేతిక విద్యాశాఖ అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. దీంతో సదరు కాలేజీలు అఖిల భారత సాంకేతిక విద్యా మండలికి కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన ప్రభుత్వం ఆ షిఫ్టింగ్లను రద్దు చేయాలని, ఏఐసీటీఈకీ లేఖ రాయాలని సూచించినా సాంకేతిక విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదని తెలిసింది. దీంతో వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం కాలేజీలను షిఫ్టింగ్ చేసేలా సాంకేతిక విద్యాశాఖకు ఉన్న అధికారాలను రద్దు చేసినట్లు సమాచారం. ఎయిడెడ్ కాలేజీలను ప్రైవేటు కాలేజీలుగా మార్చాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఎలా మార్పు చేశారన్న దానిపై నివేదిక కోరినట్లు తెలిసింది. ఆస్తులపై దాతల వారసుల కన్ను.. ఒకప్పుడు దాతలు విద్యాదానం చేసేందుకు ఎయిడెడ్ విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ దాతల వారసులే కొంతమంది ఎయిడెడ్ ఆస్తులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా కళాశాల విద్యాశాఖ అధికారులతో కుమ్మక్కయి ఆయా కాలేజీల్లోని లెక్చరర్లు, సిబ్బందిని ముందుగా ప్రభుత్వ కాలేజీల్లోకి పంపించి, చివరకు ఎయిడెడ్ అనేది లేకుండా చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో నగదు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. -
27 కాలేజీలు.. 8,887 సీట్లు కోత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు జారీ చేసింది. కొన్ని కాలేజీలు స్వచ్ఛందంగా పూర్తిగా కోర్సులను రద్దు చేసుకోవడం, మరికొన్ని కాలేజీల్లో లోపాల కారణంగా కోర్సులను ఏఐసీటీఈ రద్దు చేయడంతో గతేడాది కంటే ఈసారి కాలేజీలు, సీట్లకు భారీగా కోత పడింది. దీంతో మొత్తంగా 8,887 సీట్లు రద్దయ్యాయి. గతేడాదితో పొల్చితే రాష్ట్రంలోని 27 కాలేజీల్లో బీటెక్ మొదటి ఏడాది ప్రవేశాలు చేపట్టే వీలు లేకుండాపోయింది. కొన్ని కాలేజీలు కొన్ని బ్రాంచీలను రద్దు చేసుకోగా, మరికొన్ని కాలేజీలు బ్రాంచీల్లో సీట్లను పెంచుకున్నాయి. ఎక్కువ కాలేజీలు పలు బ్రాంచీల్లో సీట్లను ఏకంగా రద్దు చేసుకున్నాయి. మొత్తానికి ఈసారి రాష్ట్రంలోని 201 కాలేజీల్లో 1,05,360 బీటెక్ సీట్లకు అనుమతులు జారీ చేసిన ఏఐసీటీఈ గతేడాది కంటే 8,887 సీట్లను తగ్గించింది. ఈసారి యూనివర్సిటీలు ఇచ్చేవెన్నో.. గత విద్యా సంవత్సరం (2018–19)లో రాష్ట్రంలోని 228 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,14,247 సీట్లకు ఏఐసీటీఈ అనుమతులు ఇచ్చింది. అందులో లోపాల కారణంగా జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ లు లోపాల కారణంగా భారీగా సీట్లకు కోత పెట్టాయి. కేవలం 95,235 వేల సీట్లకు అనుబంధ గుర్తింపును ఇచ్చాయి. దీంతో వాటిల్లోనే ప్రవేశాలు చేపట్టగా, అందులోనూ 67,937 వేల సీట్లే భర్తీ అయ్యాయి. ఇక 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఏఐసీటీఈ 201 కాలేజీల్లోని 1,05,360 సీట్ల భర్తీకి అనుమతులు ఇచ్చింది. అయితే అందులో యూనివర్సిటీలు ఎన్ని సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపును ఇస్తాయో తేలాల్సి ఉంది. గతేడాది 95,235 సీట్లకు పరిమితం చేసిన యూనివర్సిటీలు ఈసారి వాటిని 90 వేలకే పరిమితం చేసే పరిస్థితి కనిపిస్తోంది. లోపాల సవరణకు ముగిసిన గడువు రాష్ట్రంలోని దాదాపు 250 కాలేజీల్లో తనిఖీలు చేసిన జేఎన్టీయూ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు (ఎఫ్ఎఫ్సీ) వాటిని సవరించుకోవాలంటూ లేఖలు రాసింది. ఆ లోపాలను సవరించుకునే గడువు శనివారంతో ముగిసిపోవడంతో వాటిపై మరోసారి కాలేజీలతో చర్చించి అనుబంధ గుర్తింపును జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కూడా ఇదే పనిలో ఉన్నాయి. ఈనెల 9వ తేదీతో ఎంసెట్ ప్రవేశ పరీక్షలు ముగిశాయి. శుక్రవారం వాటికి సంబంధించి కీలను ఎంసెట్ కమిటీ విడుదల చేసింది. ఈనెల 13 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తోంది. వీలైతే వచ్చే వారంలో ఎంసెట్ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఇంటర్మీడియెట్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలను కూడా ఈనెల 15 నాటికి విడుదల చేసే అవకాశం ఉండటంతో ఈలోగా ఎంసెట్ వ్యాల్యుయేషన్ పూర్తి చేసి సిద్ధంగా ఉండాలన్న ఆలోచన చేస్తోంది. వీలైతే వచ్చే వారం, లేదా ఈనెల 25 నాటికి ఎంసెట్ ఫలితాలను వెల్లడించనుంది. అలాగే కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను కూడా ఈనెలాఖరులోగా పూర్తి చేయాలన్న ఆలోచనల్లో ఉన్నాయి. ఆ ప్రక్రియ పూర్తయితే జూన్ మొదటి వారం/రెండో వారంలో ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. కొత్త కోర్సులకు ఓకే చెప్పిన ఏఐసీటీఈ మార్కెట్లో డిమాండ్ ఉన్న కొత్త కోర్సులకు ఈసారి ఏఐసీటీఈ అనుమతులను ఇచ్చింది. కంప్యూటర్ ఇంజనీరింగ్, ఆర్టిషీయల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సు లకు అనుమతులు ఇస్తామని ఏఐసీటీఈ తమ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్బుక్లోనే స్పష్టం చేయడంతో రాష్ట్రంలోని పలు కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. దీంతో ఏఐసీటీఈ వాటికి అనుమతి ఇచ్చింది. అయితే యూనివర్సిటీలు ఆయా కోర్సుల నిర్వహణకు అనుమతి ఇస్తాయా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. వాటి నిర్వహణకు అవసరమైన సిలబస్, స్కీం, ఫ్యాకల్టీ సరిపడ ఉన్నారా? లేదా? ఎలా నిర్వహిస్తారు? అన్న అంశాలను యూనివర్సిటీలు పరిశీలించాకే తమ బోర్డ్ స్టడీస్ సమావేశంలో చర్చించాక నిర్వహణకు ఓకే చెప్పాలా? వద్దా? అన్నది తేల్చనున్నాయి. పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ సీట్లకు కోత పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ ఈసారి కాలేజీలకు, సీట్లకు ఏఐసీటీఈ కోత పెట్టింది. ఈనెల 14వ తేదీ నుంచి పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సెలింగ్ చేపట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఏఐసీటీఈ అనుమతుల జాబితాలను క్రోడీకరించింది. 2019–20 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 162 కాలేజీలకు, వాటిల్లోని 42,100 సీట్లకు ఆమోదం తెలిపింది. గతేడాది రాష్ట్రంలోని 187 కాలేజీల్లోని 47,264 సీట్లకు అనుమతులు ఇచ్చిన ఏఐసీటీఈ ఈసారి 25 కాలేజీలకు, 5164 సీట్లకు కోత విధించింది. -
ఇంటర్లో ప్రవేశాలకు కార్పొరేట్ వల..!
జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు ఇంటర్లో ప్రవేశాలకు తెరలేపాయి. పదో తరగతి ఫలితాలు వెల్లడికాకుండానే విద్యార్థులకు వల విసురుతున్నాయి. తల్లిదండ్రులకు మాయమాటలుచెబుతూ విద్యార్థులను ‘బుక్’ చేసుకుంటున్నాయి. దీనికోసం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులకు భారీగా ముడుపులు ముట్టజెప్తున్నాయి. విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు కల్పిస్తున్నా.. జిల్లా ఇంటర్మీయట్ విద్యా పర్యవేక్షణ శాఖ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. విజయనగరం అర్బన్: పదోతరగతి ఫలితాలు వెల్లడికాకుండానే ఇంటర్లో ప్రవేశాలంటూ ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు జిల్లాలో హడవుడి చేస్తున్నాయి. తమ పీఆర్వోలను పల్లె, పట్టణాల్లో పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల ఇళ్లకు పంపిస్తున్నాయి. వారి తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ప్రవేశ దరఖాస్తులను నింపిస్తున్నాయి. ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని కళాశాలలు రాయితీల పేరుతో ముందుగానే 60 శాతం ఫీజును వసూలు చేస్తున్నాయి. లేందంటే ఐడీ నంబర్రాదని భయపెడుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు 22, ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు 72 ఉన్నాయి. మొత్తం కళాశాలల్లో మొదటి సంవత్సరానికి 26 వేల మంది విద్యార్థుల ప్రవేశం జరుగుతుంది. వీటిలో ప్రభుత్వ కళాశాలలను మినహాయించి చూస్తే 16 వేల మంది ప్రైవేటు, కార్పొరేట్ కళా శాలల్లోనే చదువుతున్నారు. వీరి ప్రవేశాల కోసం బేరసారాలు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ ఫీజులు... ఐఐటీ ప్రత్యేకం పేరుతో ఎంపీసీలో ప్రవేశాలకు కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఏడాదికి రూ. 90 వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. అదే గ్రూప్లో ఏసీ క్యాంపస్ (రాష్ట్రంలో ఎక్కడి బ్రాంచ్ల్లోనైనా)లో చదువుకోదలిస్తే రూ.1.75 లక్షల వరకు ఫీజు చెల్లించాల్సిందే. సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ గ్రూప్ల్లో సివి ల్స్ ఫౌండేషన్ పేరుతో కొత్త కోర్సులను పరిచ యం చేస్తున్నాయి. సుమారు రూ. 1.75 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నా యి. సీఈసీ, ఎంఈసీ గ్రూప్తో సీఏ, సీసీటీ పేర్లు జోడించి రూ.2.25 లక్షల డిమాండ్ చేస్తున్నాయి. నిబంధనలకు పాతర... వాస్తవంగా పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాక జూన్లో ప్రవేశాలు తీసుకోవాలి. అప్పటివరకు ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. పీఆర్వోలతో నియామకాలు చేసుకోకూడదు. ఇం టర్ బోర్డు అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఈ నిబంధనలు అమలు కావడం లేదన్న వాదన విని పిస్తోంది. జిల్లాలోని పలు విద్యాసంస్థలు విచ్చల విడిగా ప్రవేశాలు చేస్తున్నా పట్టించుకునేవారే లేరని విద్యావేత్తలు చెబుతున్నారు. తిరిగొస్తే డబ్బులు గోవిందా... కార్పొరేట్ కళాశాలల్లో చేరే విద్యార్థులు చాలా మందికి అక్కడి పరిసరాలు నప్పవు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. కళాశాలను విడిచి పెట్టేందుకు సిద్ధమవుతారు. అలాంటి పరిస్థితుల్లో ఫీజులో 30 శాతం చెల్లించాల్సి వస్తోందంటూ బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. పొరపాటున మొత్తం ఫీజు ఒకేసారి చెల్లిస్తే తిరిగి తెచ్చుకునేందుకు చుక్కలు చూడాల్సిందేనంటున్నారు. పాఠశాలల నిర్వాహకులకు తాయిలాలు.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల నిర్వాహకులకు భారీ తాయిలాలు ముట్టజెప్పి అందులో చదివే విద్యార్థులను తమ కళాశాలలో చేర్పించేందుకు కొన్ని కళాశాలల యాజమాన్యాలు ముందస్తుగా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. పాఠశాలల నిర్వాహకులకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల మేర ముడుపులు, లేదా ఆ స్థాయి బహుమతులు అందించేందుకు జిల్లాలో 100కు పైగా ఉన్నతపాఠశాలలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు అదే కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి విద్యార్థుల ప్రవేశాల విషయంలో ఇచ్చిన టార్గెట్ పూర్తి చేసిన వారికే వేసవి సెలవుల్లో వేతనాలిచ్చే నిబంధనలు విధించాయి. దీంతో ఆయా కళాశాలల్లోని సిబ్బంది తీవ్రఒత్తిడితో విధులు నిర్వహిస్తున్నట్టు భోగట్టా. అన్ని చోట్లా పీఆర్వోలు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు జిల్లా కేంద్రంతోపాటు పార్వతీపురం, సాలూరు, గజపతినరం, చీపురుపల్లి తదితర ప్రాంతాల్లో పీఆర్వో (పబ్లిక్ రిలేషన్ అధికారులు)లను నియమించుకున్నాయి. ఎల్ఐసీ ఏజెంట్లు, సిబ్బంది, ఉపాధ్యాయులను కళాశాలలకు ఏజెంట్లుగా నియమించి వీరికి నెలకు రూ.8వేల వరకు ఏడాది పొడువునా జీతం రూపంలో చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. పార్ట్టైం పీఆర్వోలకు ఒక్కో విద్యార్థితో యాజమాన్యం నిర్ణయించిన ఫీజు కట్టిస్తే 10 శాతం వరకు గిట్టుబాటవుతోంది. ఆ తాయిలాల కు ఆకర్షితులైన చాలామంది పీఆర్వోలుగా చేరి వివిధ ప్రాంతాల్లో రోజుకు వంద దరఖాస్తులు కార్పొరేట్ కళాశాలలకు పంపుతున్నారు. -
కళాశాలల గుర్తింపు దరఖాస్తు గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరానికి గాను కళాశాలల గుర్తింపు, అదనపు సెక్షన్లు, సీట్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే గడువును ఇంటర్మీడియెట్ బోర్డు పెంచింది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫిబ్రవరి 12 లోపు కళాశాలల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ.అశోక్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ.3 వేల అపరాధ రుసుముతో ఫిబ్రవరి 25 వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో మార్చి 8 వరకు, రూ.10 వేల అపరాధ రుసుముతో మార్చి 20 వరకు దర ఖాస్తు చేసుకోవచ్చన్నారు. కళాశాలల ప్రాంగణాల మార్పు, సొసైటీలు, కళాశాలల పేర్ల మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా మార్చి 20 లోపు అందజేయాలని వెల్లడించారు. -
ప్రారంభమైన జేఈఈ మెయిన్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీ, ఇతర జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ పరీక్షలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలోని ఏడు ప్రధాన పట్టణాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ పేపరు–2 పరీక్షకు విద్యార్థులు హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా ఈ పరీక్షకు 1.82 లక్షల మంది హాజరు కాగా, తెలంగాణ నుంచి దాదాపు 20 వేల మంది విద్యార్థులు హాజరైనట్లు అంచనా. మరోవైపు బీటెక్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ పేపరు–1 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, వరంగల్ పట్టణాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. వీటికి దేశవ్యాప్తంగా 9.65 లక్షల మంది హాజరుకానుండగా, తెలంగాణ నుంచి దాదాపు 70 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు అంచనా. కాలేజీలు తగ్గినా సీట్ల పెరుగుదల గత ఐదేళ్లలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, బి.ఫార్మసీ, ఫార్మ్–డి, ఎంసీఏ, ఎంబీఏ, బీఈడీ, న్యాయవిద్య, ఎంటెక్, ఎం.ఫార్మసీ, బీపీఈడీ తదితర కోర్సులు నిర్వహించే కాలేజీలు వందల సంఖ్యలో తగ్గినా ఆయా కోర్సుల్లో సీట్లు మాత్రం భారీగా పెరిగాయి. 2014–15 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 3,688 కాలేజీల్లోని వివిధ కోర్సుల్లో 5,23,291 సీట్లు ఉన్నాయి. 2018–19 విద్యా సంవత్సరం వచ్చేసరికి కాలేజీల సంఖ్య 2,901కి తగ్గిపోయింది. అయితే సీట్ల సంఖ్య మాత్రం 6,52,178కి పెరిగింది. అంటే ఐదేళ్లలో 787 కాలేజీలు తగ్గినా 1,28,887 సీట్లు పెరిగాయి. ఇందులో అత్యధికంగా డిగ్రీలో సీట్లు పెరిగాయి. ఇతర కోర్సుల్లోనూ సీట్లు, కాలేజీలు తగ్గిపోయాయి. డిగ్రీ కాలేజీల సంఖ్య గత ఐదేళ్లలో తగ్గినా సీట్ల సంఖ్య 2 లక్షలు పెరి గింది. అయినా ప్రవేశాలు మాత్రం ఆశించిన మేర పెరగలేదు. ఎంటెక్, ఎం.ఫార్మసీలో మాత్రం కాలేజీలు, సీట్ల సంఖ్య భారీగా తగ్గింది. -
సీబీఐటీ, శ్రీనిధి, వాసవి, ఎంజీఐటీ.. ఫీజు మోత?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం లోని నాలుగు ప్రధాన ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులపై అదనపు ఫీజుల భారం తప్పేలా లేదు. సీబీఐటీ, శ్రీనిధి, వాసవి, ఎంజీఐటీ కాలేజీల్లో చేరిన విద్యార్థులంతా అదనపు ఫీజుల నుంచి తప్పించుకునే పరిస్థితి కన్పించట్లేదు. శ్రీనిధి, వాసవి కాలేజీల్లో ఫీజులపై హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తాజా ఉత్తర్వులతో పెంచిన ఫీజులను చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే పెరిగిన ఫీజుల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందా.. లేదా మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుందా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంలో ఇప్పటికే ఓసారి సుప్రీం కోర్టుకు వెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రశ్నగా మిగిలింది. ఒకవేళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లకపోతే ఆయా కాలేజీల్లో చేరిన 12 వేల మందికి పైగా విద్యార్థులు ఏటా రూ.40 వేల నుంచి రూ.86,500 వరకు అదనపు ఫీజు చెల్లించాల్సి వస్తుంది. అసలేం జరిగింది..: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 2016–17, 2017–18, 2018–19 విద్యా సంవత్సరాల్లో వార్షిక ఫీజులను తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) 2016లో ఖరారు చేసింది. అయితే అందులో సీబీఐటీ, ఎంజీఐటీ, శ్రీనిధి కాలేజీలకు తక్కువ పెంపును ప్రతిపాదించింది. వాసవి కాలేజీకి గతంలో ఉన్న ఫీజులో రూ.12 వేల కోత విధించి రూ.97 వేలకు పరిమితం చేసింది. దీంతో ఆయా యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. తమ వాస్తవ ఆదాయ వ్యయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టానుసారం ఏఎఫ్ఆర్సీ ఫీజులు ఖరారు చేసిందని పేర్కొంది. దీంతో వారి ఆదాయ వ్యయాలను పరిశీలించి హైకోర్టు గతేడాది ఆయా కాలేజీల ఫీజులు పెంచారు. ఏఎఫ్ఆర్సీ ముందుగా సీబీఐటీకి రూ.1,13,500 ఫీజుగా నిర్ణయిస్తే హైకోర్టు దానికి అదనంగా రూ.86500 పెంపునకు ఓకే చెప్పి రూ.2 లక్షలకు పెంచింది. ఎంజీఐటీలో రూ.1 లక్ష ఉన్న ఫీజును రూ.1.6 లక్షలకు పెంచింది. వాసవిలో రూ.97 వేల నుంచి రూ.1.6 లక్షలకు పెంచింది. శ్రీనిధిలో రూ.91 వేల నుంచి రూ.46 వేలు పెంచి రూ.1.37 లక్షలు చేసింది. అయితే వాటిని ప్రభుత్వం అమలు చేయలేదు. దానిపై యాజమాన్యాలు కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ విషయాన్ని కింది కోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం కోర్టు తేల్చిచెప్పడంతో ప్రభుత్వం హైకోర్టులో మళ్లీ అప్పీల్ దాఖలు చేసింది. అయితే అందులో శ్రీనిధి, వాసవి కాలేజీలకు సంబంధించి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాత ఫీజుల పెంపును అమలు చేయాలని చెప్పడంతో గందరగోళంలో పడింది. విద్యార్థులపై ఒత్తిళ్లు హైకోర్టు గతేడాది ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పెరిగిన ఫీజులను చెల్లించాల్సిందేనంటూ యాజమాన్యాలు తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. అదనపు ఫీజు చెల్లించని విద్యార్థులను పరీక్షలకు హాజరు కానివ్వకపోవడం వంటి చర్యలతో ఇబ్బందులకు గురిచేశాయి. దీంతో తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళనకు దిగాయి. అయినా యాజమాన్యాలు పెరిగిన ఫీజులను వసూలు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వం వాటి అమలుకు ఉత్తర్వులు జారీచేస్తే టాప్ పది వేల ర్యాంకులతో కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్థుల ఫీజులను వంద శాతం ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. కారకులెవరు? ఫీజల ఖరారు వ్యవహరంలో ఏఎఫ్ఆర్సీ నియమించిన కన్సల్టెంట్ వైఖరే ఈ వివాదానికి దారితీసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కమిటీ సభ్యుల ఆమోదం, సంతకం లేకుండానే ఆ కన్సల్టెంట్ కాలేజీల ఫీజుల ఖరారు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. భారీ మొత్తం చేతులు కూడా మారినట్లు ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. గతంలో రూ.77 వేలు దాటని కాలేజీల వార్షిక ఫీజును ఆ కన్సల్టెంట్ వ్యవహారం వల్ల రూ.లక్షకు పైగా పెంచినట్లు ఆరోపణలు వచ్చాయి. టాప్ కాలేజీల్లో ఒకటైన వాసవి కాలేజీలో వార్షిక ఫీజు కోత విధించడంపైనా విమర్శలొచ్చాయి. ఈ కాలేజీల ఫీజులను కమిటీ సభ్యుల ఆమోదం లేకుండానే జరిగిపోయినట్లు సమాచారం. ముడుపులు ఇచ్చిన వారికి పెంచి.. ఇవ్వని వారి కాలేజీల ఫీజులో కోత విధించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదీ ఆ నాలుగు కాలేజీల్లో ఫీజుల పరిస్థితి.. విద్యా సంస్థ 2013–16ఫీజు 2016–19ఫీజు అదనపుపెంపు మొత్తంఫీజు సీబీఐటీలో 1,13,300 1,13,500 86,500 2,00,000 వాసవి 1,09,300 97,000 63,000 1,60,000 శ్రీనిధి 79,900 91000 46,000 137000 ఎంజీఐటీ 82,400 1,00,000 60,000 1,60,000 -
ప్రభుత్వం కళ్లుమూసుకుని వ్యవహరిస్తోంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు బీఈడీ, డీఈడీ కాలేజీల అనుమతుల విషయంలో ప్రభుత్వం కళ్లు మూసుకుని వ్యవహరిస్తోందని హైకోర్టు ఆక్షేపించింది. ఇలాంటి కాలేజీల విషయంలో ప్రభుత్వం ఎంతో కరుణ చూపుతోందని, అందుకే ఆ కాలేజీలు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యానించింది. దీనివల్ల అంతిమంగా నష్టపోతున్నది అక్కడ చదువుతున్న విద్యార్థులే అన్నది గుర్తించాలంది. ‘కనీస ప్రమాణాలు పాటించని ఇలాంటి కాలేజీల్లో చదివిన వారు రేపు ఉపాధ్యాయులైతే సమాజానికి నష్టం. విద్యా సంస్థల ఏర్పాటే ఇప్పుడు డబ్బు సంపాదనకు దగ్గర దారిగా మారింది’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని బీఈడీ కాలేజీలైన వివేకానంద కాలేజీ, అలీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, నవ చైతన్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆజాద్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్తో పాటు ఇవే జిల్లాల్లోని ఎస్ఆర్, జీఎస్ఆర్, సలామ్ అమరావతి, ఎస్ఆర్డీ, షారోన్, మహాత్మాగాంధీ డీఈడీ కాలేజీల్లో చదివి ఇటీవల వార్షిక పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను వెల్లడించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు బీఈడీ, డీఈడీ కాలేజీల యాజమాన్యాలు తమ కాలేజీల్లో చేరని విద్యార్థులను కూడా చేరినట్లు చూపడంతో పాటు, చేరని విద్యార్థుల జాబితాకు ఆమోదముద్ర వేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ ప్రకాశం జిల్లాకు చెందిన నవలూరి మాధవరావు హైకోర్టులో రెండు పిల్లు దాఖలు చేశారు. వీటిని ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. మోసం చేస్తున్నా పట్టించుకోని అధికారులు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ ఈ మూడు జిల్లాల్లో ఒకే వ్యక్తి దాదాపు 21 బీఈడీ, డీఈడీ కాలేజీలను నిర్వహిస్తున్నారని వివరించారు. అంతేగాక ఒకే భవనంలో కనీస ప్రమాణాలు లేకుండానే నాలుగైదు కాలేజీలు నిర్వహిస్తున్నారని, అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఎస్ఆర్, జీఎస్ఆర్, సలామ్ అమరావతి, ఎస్ఆర్డీ, షారోన్, మహాత్మాగాంధీ డీఈడీ కాలేజీల్లో వాస్తవంగా 163 మంది విద్యార్థులు మాత్రమే చేరారని, అయితే 1,000 మంది చేరినట్లు తప్పుడు జాబితాను తయారు చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ధర్మాసనం తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించింది. అనుమతులు, ప్రవేశాల విషయంలో అధికారులు కళ్లుమూసుకుని ఉన్నారని, ఇదే సమయంలో ఆ కాలేజీలపై ఎక్కడ లేని కరుణ చూపిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. శక్తివంతమైన లాబీయింగ్ ద్వారానే ఇలా చేయగలుతున్నారని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తానని కాలేజీల తరఫు న్యాయవాది ఎస్.రవి పేర్కొనగా అంగీకరించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
ప్రాక్టికిల్స్..
ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ అంటేనే ప్రయోగాల కోర్సులు. రెండేళ్ల చదువు పూర్తి చేసేలోపు భౌతిక, రసాయన, జంతు, వృక్ష శాస్త్రాలకు సంబంధించిన ప్రయోగాలు పూర్తి చేయాలి. ప్రయోగశాలకు వెళ్లి నేర్చుకోవాలి. చెట్టు, పుట్ట వెంబడి తిరిగి ఆకులు, పువ్వులు, మొక్కలు సేకరించాలి. ఇంటిలో ఉన్న బొద్దింకలతో పాటు కప్పలు, ఎర్రలు (వానపాములు) పట్టుకొని శస్త్రచికిత్సలు చేయాలి.. బొమ్మలు గీయాలి... రికార్డులు రాయాలి.. అప్పుడే ప్రాక్టికల్స్కు సిద్ధమైనట్టు. లేకపోతే ఫెయిల్.. మరో ఏడాది వేచి ఉండి ప్రాక్టికల్స్ రాస్తేనే ఉత్తీర్ణత.. ఇదంతా ఒకప్పటి మాట.. మరి ఇప్పుడేం జరుగుతోందంటే.. సాక్షి, సిద్దిపేట కాలానికి అనుగుణంగా సిలబస్లో మార్పులొచ్చినా.. బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ నిబంధనలు మారలేదు. అధ్యాపకులతో పాటు విద్యార్థులు ‘రెడీమేడ్’ ప్రయోగాలకు అలవాటు పడ్డారు. దానికి అనుగుణంగా పలు కళాశాలల్లో విద్యార్థులతో ప్రాక్టికల్స్ చేయించడం మరిచిపోయారు. పరీక్షలకు వచ్చే పరిశీలకులు, డిపార్టుమెంట్ ఆఫీసర్ను మచ్చిక చేసుకొని తమ విద్యార్థులకు కావాల్సినన్ని మార్కులు వేయించే పనిలో పలు ప్రైవేట్ కళాలల యాజమాన్యాలు ఇప్పటి నుండే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుండి నిర్వహించాలని ఇంటర్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా 20 ప్రభుత్వ, 42 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, 14 మోడల్ స్కూల్స్, 12 సోషల్ వెల్ఫేర్ కళాశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రథమ సంవత్సరంలో 12,101 మంది, ద్వితీయ సంవత్సరం 12,256 మొత్తం 24,357 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ఈ ఏడాది ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరయ్యే వారిలో 4,084 మంది ఎంపీసీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ), 1,675 మంది బైపీసీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజి) ప్రాక్టికల్స్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అయితే వీరిలో ఇప్పటి వరకు సగానికి పైగా ప్రైవేట్ కళాశాలల్లో ప్రాక్టికల్స్ చేయించలేదనే ఆరోపణలున్నాయి. మేనేజ్ చేసుకోవడమే మార్గం విద్యార్థులతో ప్రాక్టికల్స్ చేయించలేదు. కానీ తమ కళాశాల విద్యార్థులకు మాత్రం స్టేట్ ర్యాంకులు రావాలి. అందరూ ఉత్తీర్ణులు కావాలి. అంటే ఒక్కటే ఒక్క మార్గం. ప్రాక్టికల్స్ పరీక్షల కోసం వచ్చే పరిశీలకులు తమకు అనువైన వారు కావాలి. అందుకోసం బోర్డు వద్దకు వెళ్లైనా అనుకూలమైన వారితో డ్యూటీ వేయించుకునే ప్రయత్నాలను పలు కళాశాలల యాజమాన్యాలు ఇప్పటికే మొదలు పెట్టినట్లు సమాచారం. అదేవిధంగా జిల్లా ఇంటర్ విద్యాధికారి నియమించే డిపార్టుమెంట్ అధికారిని కూడా తమకు అనుకూలమైన వారిని రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో విద్యార్థులకు ఏమీ తెలియకపోయినా.. నిర్దేశించిన మార్కులు వేయించుకోవచ్చనేది వారి ధీమా. అయితే ఇలా ఇంటర్లో అడ్డదారిన అధిక మార్కులు సాధించిన పలువురు విద్యార్థులు తమకున్న థియరీ పరిజ్ఞానంతో ఐఐటీ, మెడికల్, ఇంజనీరింగ్లో సీట్లు పొందినా.. అక్కడ ప్రాక్టికల్స్ చేయడం రాక, తోటి విద్యార్థుల ముందు చులకన కావడం, అవమానంగా భావిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించలేక పోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థులను యంత్రం మాదిరిగా బట్టీ పట్టించి అధిక మార్కులు తెప్పిస్తున్నారని, ప్రాక్టికల్స్లో కూడిన బోధన లేకపోవడం విచారకరమని విద్యానిపుణులు అంటున్నారు. సాధారణ పరిజ్ఞానం కరువు పలువురు విద్యార్థులకు పిప్పెట్, బ్యూరెట్, ఘటం, ఆమ్లం, క్షారం, లవణం, వెర్నియర్ కాలిపస్, స్క్రూగేజీ, లఘులోలకం, అయస్కాంతం రకాలు, విద్యుత్ ప్రవాహం అంటే ఏమిటో తెలియదు. అదేవిధంగా ఏకదళ బీజం, ద్విదళ బీజం, కేసరాలు, అండాశయం, అంతర్ నిర్మాణాల గురించి అస్సలు తెలియని వారు కూడా ఉన్నారు. అదేవిధంగా జువాలజికి సంబంధించి డిటెక్షన్ అంటే తెలియదు. స్పెసిమిన్, స్లైడ్స్ గురించి అవగాహన లేనివారు ఉన్నట్లు పలువురు అధ్యాపకులే చెప్పడం విశేషం. దీంతో ఇటువంటి పరిస్థితిలో ఉన్న విద్యార్థులు రికార్డులు, హెర్బిరియం వంటికి రెడిమేడ్గా తీసుకువచ్చినా ప్రాక్టికల్స్ ఏం చేస్తారనేది ఆశ్చర్యకరమైన విషయం. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు.. జిల్లాలోని పలు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయించడం లేదనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయంపై కళాశాలల యాజమాన్యాలకు సర్క్యులర్లు పంపించాం. ప్రరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. బోర్డు నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు తీసుకుంటాం. – నర్సింహులు, జిల్లా ఇంటర్ విద్యాధికారి -
విద్యాసంస్థల్లో డ్రగ్స్ కలకలం బాధాకరం
హైదరాబాద్ : విద్యా సంస్థల్లో డ్రగ్స్ కలకలం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలతో సంబంధమున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. దానికి తోడు క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. డ్రగ్స్ కేసు దర్యాప్తులో మీడియాతో పాటు విచారణ సంస్థలు సంయమనం పాటించాలని కోరారు. ఈ విషయంపై కఠినంగా వ్యవహరించాలని డీఈవోలకు కడియం సూచించారు. తప్పంతా విద్యా సంస్థలను నిందించడం సరికాదని కడియం శ్రీహరి అన్నారు. డ్రగ్స్ వ్యవహారంపై కాలేజీలు, విద్యా సంస్థలు కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. అలాగే పిల్లల విషయంలో తల్లిదండ్రులతో పాటు సూళ్లలో ఉపాధ్యాయులు కూడా ఓ కంట కనిపెట్టాలని ఆయన సూచించారు. -
ఆ పది కాలేజీల్లో చేరకండి
యూనివర్సిటీక్యాంపస్(చిత్తూరు): ఎస్వీయూ పరిధిలోని 10 కళాశాలలు 2017–18 విద్యా సంవత్సరానికి అఫిలియేషన్ కోసం ధరఖాస్తు చేయలేదని అటువంటి కళాశాలల్లో చేరవద్దని ఎస్వీయూ అకడమిక్ ఆడిట్ డీన్ ప్రొఫెసర్ బి.సుధీర్ తెలిపారు. అఫిలియేషన్కు ధరఖాస్తు చేయని ఆ కళాశాలలకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. అటువంటి కళాశాలల్లో చేరి నష్టపోవద్దని చెప్పారు. అఫిలియేషన్కు ధరఖాస్తు చేయని కళాశాలల జాబితా ఇలా ఉంది... రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, శ్రీ ఆది శంకర కాలేజ్ ఆప్ ఎడ్యుకేషన్, తిరుపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యోదయ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్, శ్రీ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్(తిరుపతి), సహాయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (కొట్రమంగళం), శేషాచల డిగ్రీ కళాశాల (వడమాలపేట), స్కిమ్స్ డిగ్రీ కళాశాల (తొట్టంబేడు), ఎస్వీ డిగ్రీ కళాశాల( చెర్లోపల్లి), ఉషోదయ డిగ్రీ కళాశాల( బంగారుపాలెం). -
విద్యాసంస్థలకు కేంద్ర కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం దేశంలోని కాలేజీలు, విశ్వవిద్యాలయాలు సహా ఇతర విద్యాసంస్థలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. రానున్న విద్యాసంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఫీజుల్ని నగదు రూపంలో స్వీకరించరాదని కేంద్రం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సాహమిచ్చే దిశగా ఈ ఆదేశాలిచ్చింది. ఇకపై అన్ని ద్రవ్య లావాదేవీలు డిజిటల్ మోడల్ చెల్లింపుల ద్వారా పూర్తి చేయాలని అన్ని ఉన్నత విద్యా సంస్థలనను నరేంద్ర మోదీ ప్రభుత్వం కోరింది. క్యాంపస్లోని అన్ని క్యాంటీన్లు, ఇతర వ్యాపార సంస్థలు వారి బ్యాంకు ఖాతాలను ఆధార్తో కలిపి భీమ్ యాప్ ఉపయోగించాలని సూచించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిజిటల్ విధానంలో ఫీజుల్ని చెల్లించే విధంగా మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర మానవవనరుల శాఖ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ను ఆదేశించింది. క్యాంటీన్తో పాటు హాస్టల్లో అందిస్తున్న సేవలకు చెల్లింపుల కోసం ‘భీమ్’ యాప్ను వాడేలా విద్యార్థులను ప్రోత్సహించాలని కేంద్రం సూచించింది. ఇందుకోసం యుపిసికి ఓ నోడల్ అధికారిని నియమించి, యూజీసీకి నెలవారీ రిపోర్టులు పంపాలని విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. -
అనుమతి లేని కాలేజీ హాస్టళ్లకు షోకాజ్ నోటీస్లు
– సాక్షి కథనానిక స్పందన కర్నూలు సిటీ: జిల్లాలో అనుమతి లేకుండా ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీలతో పాటు హస్టళ్లను సైతం నిర్వహిస్తున్న కాలేజీలపై గత నెల 29న ‘వసతి కిరికిరి’ అనే కథనానికి ఇంటర్మీడియేట్ బోర్డు అధికారులు స్పందించారు. ఈ మేరకు బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి వై.పరమేశ్వరరెడ్డి నారాయణ కాలేజీలకు చెందిన మూడు, శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన 4 కాలేజీలకు, మరో 13 సాధారణ కాలేజీలకు షోకాజ్ నోటీస్లు జారీ చేశారు. జిల్లాలో రావూస్ కాలేజీకి హాస్టల్ అనుమతి ఉందన్నారు. ఏడాదికి రెండు సార్లు ప్రైవేటు కాలేజీలను తనిఖీలు చేస్తామన్నారు. ఈ నెల 5వ తేదిలోపు నిర్దిష్టమైన సమాధానం ఇవ్వాలని.. లేని పక్షంలో ఆయా కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని పరమేశ్వరరెడ్డి తెలిపారు. -
కార్పొరేట్ సంస్థలపై నియంత్రణ లేదు: కోదండరాం
హైదరాబాద్: రాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలపై ప్రభుత్వానికి నియంత్రణ లేదని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. శనివారం రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ టీజేఏసీ ఆధ్వర్యంలో స్కూళ్లలో ఫీజుల దోపిడీపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు రాజకీయ అండదండలు ఉండటంతో వాటిని సర్కారు నియంత్రించ లేకుండా పోతోందన్నారు. వీటి వల్ల చిన్నా చితకా విద్యా సంస్థలు కనుమరుగై పోతున్నాయన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్య అంటేనే ర్యాంకు అనే విధంగా పరిస్థితి తయారయిందని విమర్శించారు. ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు సమగ్రమైన చట్టం చేయాలని సూచించారు. ప్రభుత్వం ఫీజుల పెంపుపై స్టడీ చేయాలనుకుంటే ముందుగా ఫీజులు పెంచరాదని అన్నారు. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం విద్యాసంస్థలను బలోపేతం చేయాలని తెలిపారు. కార్యక్రమానికి న్యాయవాది రచనా రెడ్డి, వివిధ సంఘాల నాయకులు హాజరయ్యారు. -
కళాశాలల్లో బంద్లపై నిషేధం
లక్నో: ఉద్యోగులు, ఉపాధ్యాయులు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో బంద్లు నిర్వహించడాన్ని నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్మా చట్టం కింద ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది జూన్ 30 వరకూ నిషేధం కొనసాగనుంది. ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించిన వారిని పోలీసులు ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్టు చేయోచ్చు. పబ్లిక్ ఇన్ట్రస్ట్తోనే మూడు నెలల పాటు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో నిరసన కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నట్లు హైయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేంద్ర కుమార్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లో మొత్తం 18 విశ్వవిద్యాలయాలు, దాదాపు నాలుగు వేల ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. -
మూడోరోజు 8 మ్యాచ్లు
భానుగుడి(కాకినాడ) : ఎన్టీఆర్ వైద్య విద్యాలయం ఆధ్వర్యంలో రంగరాయ మెడికల్ కళాశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న అంతర్ వైద్యకళాశాలల క్రికెట్ పోటీల్లో మూడో రోజైన బుధవారం వివిధ కళాశాలల జట్ల మధ్య 8 మ్యాచ్లు జరిగాయి. 20–20 పద్ధతిలో జరుగుతున్న ఈ పోటీలలో 8 జట్లు ఇంటిబాట పట్టాయి. రంగరాయ మెడికల్ కళాశాల పీడీ డాక్టర్ స్పర్జన్ రాజు పోటీలను పర్యవేక్షిస్తున్నారు. మూడో రోజు పోటీలను రంగరాయ ప్రిన్సిపాల్ ఆర్.మహాలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాఘవేంద్రరావు ప్రారంభించారు. మూడోరోజు విజేతలు వీరే మమత డెంటల్ కళాశాల( కర్నూలు)పై రంగరాయ వైద్య కళాశాల (కాకినాడ), నారాయణ మెడికల్ కాలేజ్ (నెల్లూరు) పై ఆశ్రం వైద్య కళాశాల( ఏలూరు), కోనసీమ మెడికల్ కళాశాల (అమలాపురం)పై కాటూరి మెడికల్ కాలేజ్ ( గుంటూరు), సీకేఎస్ తేజ డెంటల్కాలేజ్ తిరుపతిపై గుంటూరు మెడికల్ కళాశాల, నిమ్రా మెడికల్ కళాశాల (విజయవాడ)పై శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల (తిరుపతి), ప్రభుత్వ డెంటల్ కళాశాల విజయవాడపై ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల విశాఖ పట్నం, లెనోరా డెంటల్ కాలేజ్(రాజానగరం)పై ఉస్మానియా మెడికల్ కళాశాల (హైదరాబాద్)లు, రిమ్స్ కాకతీయ మెడికల్ కళాశాల వరంగల్పై రిమ్స్ కడప విజయం సాధించాయి. రేపటి నుంచి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు నిర్వహించనున్నట్లు స్పర్జన్రాజు పేర్కొన్నారు. -
అంతర్వైద్య కళాశాలల క్రికెట్ పోటీలు ప్రారంభం
తెలంగాణ, ఆంధ్రా నుంచి పాల్గొన్న 42 జట్లు భానుగుడి(కాకినాడ) : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంతర్ వైద్యకళాశాలల పురుషుల క్రికెట్ పోటీలు సోమవారం కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల క్రీడా మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలను వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు, రంగరాయమెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.మహాలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ ప్రారంభించారు. రెండు రాష్ట్రాల వైద్యకళాశాలల క్రికెట్ పోటీలను ఎన్టీఆర్ యూనివర్సిటీ నిర్వహించడం ఆనందదాయకమన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దక్షిణ భారత క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు నగదు ప్రోత్సాహం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి మాట్లాడుతూ ఈ పోటీలకు ఉభయ రాష్ట్రాలకు చెందిన 42 జట్లు పాల్గొన్నాయని రంగరాయ మెడికల్ కళాశాల అతిపెద్ద క్రీడా ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. 20–20 పద్ధతిలో జరుగుతున్న ఈ పోటీల్లో తొలిరోజు 42 జట్లకు 18 జట్లకు మాత్రమే క్రీడా పోటీలు జరిగాయి. ఇందులో గెలిచిన తొమ్మిది జట్లు క్వార్టర్ దశకు చేరాయి. క్రీడాకారులకు, పీడీలకు వసతి, భోజన సౌకర్యాన్ని రాంకోసాలో ఏర్పాటు చేశారు. అనంతరం పతకావిష్కరణ, బెలూన్లను గాలిలో వదిలి క్రీడా పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ కే స్పర్జన్రాజు,, డీఎస్పీ పల్లపు రాజు, పీడీలు, విద్యార్థులు పాల్గొన్నారు. తొలిరోజు విజేతలు వీరే.. సిద్ధార్థ మెడికల్ కళాశాల (విజయవాడ) శాంతిరామ్ మెడికల్ కళాశాల(నం«ధ్యాల)పై గెలిచారు. టీఈస్ఐఎంఎస్(కుప్పం) మమత వైద్యకళాశాల (ఖమ్మం)పై, రంగరాయ మెడికల కళాశాల(కాకినాడ) వీఎస్ఎల్ డెంటల్ కళాశాల (రాజమండ్రి)పై, ఆంధ్రా మెడికల్ కళాశాల(విశాఖ) ఫాతిమా మెడికల్ కళాశాల(కర్నూల్ )పై, డాక్టర్ పికిమ్స్(గన్నవరం) వైద్యకళాశాల ఎంఎన్ఆర్( హైదరాబాద్)పై, డాక్టర్ సుధానాగేశ్వరరావు(గన్నవరం) సెయింట్ జోషప్ డెంటల్ కళాశాల(ఏలూరు)పై, మమత డెంటల్ కళాశాల(ఖమ్మం) సిబార్ డెంటల్ కళాశాల(గుంటూరు)పై గెలిచారు. నారాయణ మెడికల్ కళాశాల(నెల్లూరు) ఏసీఎస్ఆర్ మెడికల్ కళాశాల (నెల్లూరు)పై గెలిచారు. ఆశ్రమ్ మెడికల్ కళాశాల (ఏలూరు)గాయత్రి మెడికల్ కళాశాల(విశాఖ)పై గెలిచారు. -
అంతర్వైద్య కళాశాలల క్రికెట్ పోటీలు ప్రారంభం
తెలంగాణ, ఆంధ్రా నుంచి పాల్గొన్న 42 జట్లు భానుగుడి(కాకినాడ) : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంతర్ వైద్యకళాశాలల పురుషుల క్రికెట్ పోటీలు సోమవారం కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల క్రీడా మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలను వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు, రంగరాయమెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.మహాలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ ప్రారంభించారు. రెండు రాష్ట్రాల వైద్యకళాశాలల క్రికెట్ పోటీలను ఎన్టీఆర్ యూనివర్సిటీ నిర్వహించడం ఆనందదాయకమన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దక్షిణ భారత క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు నగదు ప్రోత్సాహం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి మాట్లాడుతూ ఈ పోటీలకు ఉభయ రాష్ట్రాలకు చెందిన 42 జట్లు పాల్గొన్నాయని రంగరాయ మెడికల్ కళాశాల అతిపెద్ద క్రీడా ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. 20–20 పద్ధతిలో జరుగుతున్న ఈ పోటీల్లో తొలిరోజు 42 జట్లకు 18 జట్లకు మాత్రమే క్రీడా పోటీలు జరిగాయి. ఇందులో గెలిచిన తొమ్మిది జట్లు క్వార్టర్ దశకు చేరాయి. క్రీడాకారులకు, పీడీలకు వసతి, భోజన సౌకర్యాన్ని రాంకోసాలో ఏర్పాటు చేశారు. అనంతరం పతకావిష్కరణ, బెలూన్లను గాలిలో వదిలి క్రీడా పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ కే స్పర్జన్రాజు,, డీఎస్పీ పల్లపు రాజు, పీడీలు, విద్యార్థులు పాల్గొన్నారు. తొలిరోజు విజేతలు వీరే.. సిద్ధార్థ మెడికల్ కళాశాల (విజయవాడ) శాంతిరామ్ మెడికల్ కళాశాల(నం«ధ్యాల)పై గెలిచారు. టీఈస్ఐఎంఎస్(కుప్పం) మమత వైద్యకళాశాల (ఖమ్మం)పై, రంగరాయ మెడికల కళాశాల(కాకినాడ) వీఎస్ఎల్ డెంటల్ కళాశాల (రాజమండ్రి)పై, ఆంధ్రా మెడికల్ కళాశాల(విశాఖ) ఫాతిమా మెడికల్ కళాశాల(కర్నూల్ )పై, డాక్టర్ పికిమ్స్(గన్నవరం) వైద్యకళాశాల ఎంఎన్ఆర్( హైదరాబాద్)పై, డాక్టర్ సుధానాగేశ్వరరావు(గన్నవరం) సెయింట్ జోషప్ డెంటల్ కళాశాల(ఏలూరు)పై, మమత డెంటల్ కళాశాల(ఖమ్మం) సిబార్ డెంటల్ కళాశాల(గుంటూరు)పై గెలిచారు. నారాయణ మెడికల్ కళాశాల(నెల్లూరు) ఏసీఎస్ఆర్ మెడికల్ కళాశాల (నెల్లూరు)పై గెలిచారు. ఆశ్రమ్ మెడికల్ కళాశాల (ఏలూరు)గాయత్రి మెడికల్ కళాశాల(విశాఖ)పై గెలిచారు. -
’సర్వీస్’ దోపిడీ
– ఇంటర్ కాలేజీల నయా దందా – విద్యాపన్ను అంటూ రూ.1200 వసూలు – రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందంటూ బుకాయింపు – పరీక్షకు ముందు వసూళ్ల పర్వం సాక్షి, రాజమహేంద్రవరం : ఇంటర్ పరీక్షలకు ముందు కొన్ని కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వసూళ్ల పర్వానికి తెరతీశాయి. హాజరు శాతం తగ్గిందన్న పేరుతో పరీక్షకు ఒక్కరోజు ముందు నిబంధనలకు విరుద్ధంగా రూ.2,000 వరకు వసూలు చేసిన వైనం మంగళవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అడిగినంతా కట్టకపోతే హాల్టిక్కెట్లు ఇవ్వబోమని చెబుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు డబ్బులు కట్టేస్తున్నారు. హాజరు దోపిడీ ఇలా సాగిస్తున్న కార్పొరేట్ కాలేజీలు ‘విద్యాపన్ను’ పేరిట వసూలు చేస్తున్న విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. సర్వీస్ టాక్స్ అంటూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల నుంచి రూ.1200 చొప్పున వసూలు చేస్తున్నారు. అదీ హాల్టిక్కెట్లు ఇచ్చే ముందు ఈ తంతు కొనసాగిస్తున్నారు. ఇదేమిటీ అని అడిగిన వారికి సర్వీస్ టాక్స్ అంటూ కాలేజీ సిబ్బంది సమాధానమిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాపన్ను పేరిట రూ.1200 చెల్లించాలని చెబుతున్నారు. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులకు, కాలేజీ సిబ్బందికి వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. రాజమహేంద్రవరంలోని కొన్ని కార్పొరేటర్ కాలేజీల్లో విద్యార్థుల నుంచి సర్వీస్ టాక్స్ పేరిట రూ.1200 వసూలు చేస్తున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో హాల్టిక్కెట్లు ఇచ్చే ముందు కాలేజీ యాజమాన్యాలు ఈ విధంగా వ్యవహరిస్తుండడంతో విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటోంది. పరీక్షలకు ముందు డబ్బుల కోసం పిల్లలను ఇలా వేధించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇంటర్ రెండో ఏడాది పరీక్షలకు హాజరు కావాల్సిన తన కుమార్తెకు హాల్టిక్కెట్టు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెట్టిందని, చివరికి రూ.1200 కడితేనే గాని హాల్టిక్కెట్టు ఇవ్వలేదని రాజమహేంద్రవరం నగరానికి చెందిన విద్యార్థిని తండ్రి దివ్యాంగుడైన ఎ.తారకేశ్వరరావు వాపోయారు. ఎలాంటి పన్నూ లేదు... విద్యాపన్ను వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయలేదు. అలా ఎవరైనా వసూలు చేస్తున్నట్టయితే విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు మాకు ఫిర్యాదు చేయాలి. అలా చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఫీజుల వసూళ్లకు సంబంధించి ఏవైనా పెండింగ్ ఉంటే టీసీ ఇచ్చే సమయంలో వసూలు చేసుకోవాలని కాలేజీలకు చెప్పాం. హాల్టిక్కెట్లు ఇచ్చే సమయంలో ఈ విధంగా చేసి విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దని స్పష్టం చేశాం. – ఎ.వెంకటేష్, ఆర్ఐవో, రాజమహేంద్రవరం. -
పాఠశాలలను బాగుచేయండి
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ఎంపీ కవిత, ఎమ్మెల్యేల వినతి సానుకూలంగా స్పందించిన మంత్రి కడియం శ్రీహరి సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, రెసిడెన్షియల్ స్కూళ్ల ను పటిష్టం చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. గురువారం సచివాలయంలో కడియం శ్రీహరితో ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, షకీల్ అహ్మద్, బిగాల గణేష్, బాజిరెడ్డి గోవర్ధన్, వేముల ప్రశాంత్రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. తమ నియోజకవర్గాల్లోని పాఠశాలలు, కాలేజీల పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వారి విజ్ఞప్తిపై కడియం సానుకూలంగా స్పందించారు. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కిషన్ను పిలిచి సమస్యలపై చర్చించారు. వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా, తమ నియోజకవర్గాల పరిధిలో కొత్తగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలు, రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేయాలని వారు కడియంను కోరారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు విడుదల చేయాలని కోరారు. పాఠశాలలు, కాలేజీలకు కొత్త భవనాలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. తాము ఏ గ్రామానికి వెళ్లినా ఇంగ్లిషు మీడియం పాఠశాలలకు అనుమతులు ఇప్పించాలన్న డిమాండ్ తీవ్రంగా ఉందని ఎంపీ, ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ తప్పనిసరి చేసి కొంత వెయిటేజీ మార్కులు ఇవ్వాలని ఎంపీ కవిత కోరారు. సమస్యలు పరిష్కరిస్తాం.. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల పటిష్టత కోసం ఎంపీ, ఎమ్మెల్యేలు కలసి రావడంపై కడియం హర్షం వ్యక్తం చేశారు. తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడంలో ఎమ్మెల్యేలు తమ వంతు పాత్ర పోషించాలన్నారు. పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తామని, కాలేజీల్లో ఎన్సీసీని తప్పనిసరి చేసే అంశాన్ని ఇప్పటికే పరిశీలిస్తున్నామని కడియం చెప్పారు. -
విద్యాసంస్థల నిర్లక్ష్యం అపరిమితం!
ఏలూరు అర్బన్ : విద్యను పూర్తిస్థాయి వ్యాపారంగా మార్చేసిన ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల భద్రతను గాలికొదిలేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి బస్ ఫీజుల పేరిట వేలాది రూపాయలు వసూలు చేస్తున్నా పిల్లల రక్షణకు సరియైన చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. బస్సులలో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీఏ అధికారులు అనుమతించిన పరిమితి నిబంధనను తుంగలో తొక్కుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పైగా విద్యార్థులకు ప్రమాదం కలిగిస్తున్నా సంబంధిత ఆర్టీవో అధికారులు, ట్రాఫిక్ పోలీసులు నామమాత్రపు దాడులకే పరిమితమవుతుండడం విమర్శలకు తావిస్తోంది. గత చేదు అనుభవాలు l గతంలో పెదవేగి మండలంలోని ఒక విద్యా సంస్థ కేవలం 45 మంది విద్యార్థులను తరలించేందుకు అనుమతి ఉన్న బస్లో ఏకంగా 130 మంది చిన్నారులను తరలించేది. పలుమార్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎట్టకేలకు తల్లిదండ్రులు ధర్నాకు దిగడంతో యాజమాన్యం దిగొచ్చింది. l గత యేడాది నగరానికి చెందిన ప్రముఖ విద్యా సంస్థలు ఇదే విధంగా తమ కాలేజీలో చదువుకుంటున్న దూరప్రాంత విద్యార్థులను పరిమితికి తరలించేవారు. కేవలం 36 మంది మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి ఉన్న వ్యాన్లో వందమందికి పైగా విద్యార్థులను తరలించడం గుర్తించిన నాటి ట్రాఫిక్ డీఎస్పీ పి.భాస్కరరావు బస్ను ఆపివేశారు. అందులో ఉన్న విద్యార్థులను లెక్కించగా ఏకంగా నూట ఐదుగురు ఉన్నారు. డీఎస్పీ నిర్ఘాంతపోయారంటే పరిస్థితి ఎంద ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. l స్థానిక తంగెళ్లమూడిలో ఉన్న ప్రముఖ పాఠశాల బస్లో ఇదేవిధంగా అపరిమితంగా విద్యార్థులను ఎక్కించడంతో డ్రైవర్కు స్టీరింగ్ సైతం తిప్పే అవకాశం లేకపోయింది. దీంతో రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి బస్సు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు చనిపోయారు. l జంగారెడ్డిగూడెంకు చెందిన విద్యాసంస్థ బస్లో పరిమితికి మించి విద్యార్థులు ప్రయాణిస్తున్న సమయంలో బోల్తా కొట్టడంతో 27 మంది పిల్లలకు గాయాలయ్యాయి. ఇవిగో నిబంధనలు విద్యార్థులను తరలించే బస్లలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వ జీవో 35లో స్పష్టంగా ఉందని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ఎస్ మూర్తి ఇలా వివరించారు. l ఏదైనా ప్రమాదం సంభవిస్తే విద్యార్ధులకు ప్రాథమిక చికిత్స అందించేందుకు అవసరమైన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ బస్సులో ఉండాలి. కాలేజీ యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ఆ బాక్స్లో ఉండాల్సిన మందుల పరికరాలు ఉన్నాయా? లేవా? అనే దానిపై 30 రోజులకు ఒకసారి పరీక్షించాలి. l బస్లో మంటలు చెలరేగితే వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిలిండర్ ఉండాలి. l బస్ బోల్తా కొడితే అందులో ఉన్న చిన్నారులను రక్షించేందుకు ఎమర్జెన్సీ డోర్ ఉండాలి. l చిన్నారులు కిటికీల గుండా తలలు, చేతులు బయటపెట్టేందుకు ఆవకాశం లేకుండా కిటికీలకు మెష్లు ఏర్పాటు చేయాలి. l సీనియర్ డ్రైవర్లను నియమించాలి. అదే సమయంలో వారి నుంచి ఫిజికల్ ఫిటెనెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. 60 ఏళ్లకు పైబడిన వయసు మళ్లిన వారిని డ్రైవర్లుగా నియమించకూడదు. l చిన్నారులు బస్లోకి ఎక్కేందుకు, దిగేందుకు అనువుగా బస్ ఫుట్బోర్డు మొదటి మెట్టు నేల నుంచి 325 మి.మీల ఎత్తులో అమర్చాలి. l అన్ని బస్లలో అటెండర్లు ఉండాలి. వారు పిల్లలు దిగే సమయంలో లోపలికి ప్రవేశించే సమయంలో జాగ్రత్తగా సహకరించాలి l విద్యార్థులు తమ స్కూలు బ్యాగులను పెట్టుకునేందుకు లగేజీ స్థలం ఉండాలి. ఈ నిబంధనలను పాటించని బస్ల విద్యా సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని మూర్తి హెచ్చరించారు. -
ర్యాగింగ్తో జీవితాలు నాశనం
కర్నూలు సిటీ: సీనియర్, జూనియర్ విద్యార్థులు కళాశాలల్లో స్నేహపూరిత వాతావరణంలో విద్యను అభ్యసించాలని, ర్యాగింగ్తో జీవితాలు నాశనం చేసుకోవద్దని జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి అన్నారు. బుధవారం నగర శివారులోని జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తల్లిదండ్రులు పిల్లలను ఎంతో కష్టపడి చదివిస్తుంటారని.. భవిష్యత్తుపై ఎన్నో కలలు ఉంటాయన్నారు. అందుకు అనుగుణంగా లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదివినప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకోగలరన్నారు. సరదాల కోసం ర్యాగింగ్కు పాల్పడితే తల్లిదండ్రుల ఆశలన్నీ వమ్ము అవుతాయన్నారు. జూనియర్, సీనియర్ విద్యార్థులు అన్నదమ్ముల్లా కలిసిపోవాలన్నారు. అనంతరం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ స్వప్నరాణి మాట్లాడుతూ ర్యాంగింగ్కు పాల్పడితే చట్ట ప్రకారం కఠినంగా శిక్షలు ఉంటాయని.. అందువల్ల విద్యార్థులు కళాశాలల్లో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సోమశేఖర్, సీనియర్ న్యాయవాది నిర్మల, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సంక్రాంతి సెలవులు
పాఠశాలలకు 11 నుంచి.. జూనియర్ కాలేజీలకు 13 నుంచి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలు, ఇంటర్మీడియెట్ కోర్సు నిర్వహించే కాంపోజిట్ డిగ్రీ కాలేజీలకు ఈ నెల 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులుంటాయని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. 16వ తేదీన కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సెలవుల్లో ప్రైవేటు యాజమాన్యాలు తరగతులు నిర్వహించడానికి వీల్లేదని, నిర్వహిస్తే కాలేజీ యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలలకు ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు అకడమిక్ క్యాలెండర్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 16వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొంది. -
చదువంటే చావబాదడమేనా...?
సందర్భం మొన్న హైదరాబాద్లోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో పిల్లలను రక్తం చిందేలా బాదుతున్న వీడియో బయటపడటంతో, ఇది జాతీయ స్థాయి వార్తలకెక్కినా ఈ విషయం మన విద్యాశాఖ చెవికెక్కలేదు. పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి పాఠశాల లకు వెళ్లాలంటే, చెరసాల లకు వెళ్తున్నట్లు బిక్క మొహం వేసి భయపడు తున్నారు. ఈ పరిస్థితి నర్సరీ తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు ఉంది. ‘‘దొరకొడుకునైననూ, తొడ పాశములు పెట్టి, బుగ్గలు నులుమంది బుద్ధిరాదు’’ అన్న అభిప్రా యాన్నే ఈ కంప్యూటర్ యుగంలో సహితం మన అయ్యవార్లు తు.చ. తప్పకుండా పాటిస్తున్నట్లు ఉంది. కానీ, శాస్త్రీయ విద్యా విధానం, పిల్లల మనసు, వారి ఇష్టాయిష్టాలు ఎరిగి బోధన చేయా లనే సంస్కారాన్ని ఇంకా ఆకళింపు చేసుకోకపోవడం విద్యా వ్యవస్థ దౌర్భాగ్యంగానే చెప్పుకోవాలి. పిల్లలకు జ్ఞానం నేర్పుతున్నారా లేదా చదువు యంత్రాలను తయారు చేస్తున్నారా అన్న విషయాన్ని ఇటు గురువులు అటు తల్లిదండ్రులు తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం ఇప్పటికే మించిపోయినా ఇకనైనా ఆలోచించాలి. చదివి, సంస్కారవంతులై, సంపాదనపరులై తమ బాగోగులు చూసుకుంటారని కార్పొరేటు విద్యాలయాలకు లక్షలు గుమ్మరించి హాస్టళ్లకు పంపిస్తే, ఆ బిడ్డలు శవాలుగా తిరిగి వస్తుంటే ఆ తల్లిదండ్రుల ఆవేదనను ఎవరు అర్థం చేసుకో గలం? దేని ద్వారా ఆ లోటును భర్తీ చేయగలం? నిన్నగాక మొన్ననే వెళ్లిపోయిన సంవత్సరం 2016ను చూసుకుంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు పిల్లలను దండించిన ఘటనలు 385 కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నమోదు కాగా అందులో తీవ్రమైనవి 85 ఘటనలు, 28 ఆత్మ హత్యలు. ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు స్కూళ్లలోనే చిన్నారులపై పండితులు, వాచ్ మెన్ల అత్యాచారాలు ఎనిమిది. ఈ స్థాయిలో పిల్ల లపై దౌర్జన్యాలు జరుగుతుంటే, విద్యాశాఖ మాత్రం ఇవి అన్నీ తనకు సంబంధించిన విషయాలుగా పరిగణించకుండా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం ఆ శాఖలోని అధికారులు ఎవరిస్థాయిలో వారు, ఎంత దొరికితే అంతకు రాజీ పడుతూ, నేరాలు చేసిన పాఠశాలలకు కొమ్ముకాస్తూ, కార్పొ రేట్ విద్యా సంస్థలకు జీ హుజూర్ అంటూ నిల్చుంటున్నారు. రోజు దాదాపు అన్ని కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఇదే దిన చర్య అయినప్పటికీ, మొన్న హైదరాబా ద్లోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో పిల్లలను రక్తాలు చిందేలా బాదుతున్న వీడియో బయటప డటంతో, ఇది జాతీయ స్థాయి వార్తలకెక్కినా ఈ విషయం మన విద్యాశాఖ చెవికెక్కలేదు. ఆ విద్యా సంస్థపై శాఖాపరంగా చర్యలు తీసుకున్న దాఖ లాలు లేవు. చివరకు బాలల హక్కుల సంఘం.. నిందితుడు దొరబాబు పనిచేస్తున్న విద్యా సంస్థ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తప్ప వారిపై క్రిమినల్ కేసులు నమోదు కాలేదు. ఎల్కేజీ, యూకేజీ పిల్లలపై సహితం బడుల్లో య«థేచ్ఛగా దౌర్జన్యాలు జరుగుతుంటే బాధ్యత గల మీడియా వాటిని బహిర్గతపరుస్తున్నా, మహా రాజశ్రీ మన పోలీసు వారు ఎవరూ ఫిర్యాదు చేయ లేదు కదా అని కూర్చుంటున్నారే తప్ప, ఇది శిక్షార్హమైన నేరం, మనకు మనంగా కేసు నమోదు చేయవచ్చన్న విచక్షణతో వ్యవహరించడంలేదు సరికదా ఎవరైనా బాలల హక్కుల సంఘాలు కేసులు నమోదు చేయండి. మేము ఫిర్యాదు ఇస్తామంటే, తల్లిదండ్రులు ఫిర్యాదు చేయాలి అనే స్థాయిలో ఉన్నారు. కానీ కేసు పెట్టదగినæనేరంలో దారిన పొయ్యే దానయ్య కూడా ఫిర్యాదు చేయ వచ్చన్న చట్టాన్ని పిల్లల విషయంలో అమలు చేయడం లేదు సరికదా పిల్లల తరఫున స్కూలు యాజమాన్యం, తల్లిదండ్రులు రాజీ కుదుర్చుకున్నా రని కేసు మూసేస్తూ చట్టాలకే వక్ర భాష్యం చెబు తున్నారు. ‘‘విప్పి చెప్ప లేక వీపు బద్దలు చేయు గురువు, గురువు కాడు కొరివి గానీ..... అనే విషయాన్ని మన గురువులు, విద్యా సంస్థల నిర్వాహకులు, పిల్లల తల్లిదండ్రులు గుర్తిం చిన రోజే, చావబాదనిదే చదువు రాదు అనే రాక్షస భావనపోయి, పిల్లలు చదువులు కొనసాగించే పరిస్థితి ఉంటుంది. లేకుంటే ఈ శిక్షలు భరిం చలేక స్కూళ్లు వదిలి, ఊరువదిలి పారిపోవడమో, సీలింగ్ ఫ్యాన్లే ఉరికంబాలు అవడమో లేదా ఎదుగుతున్నా పిల్లలు అసాంఘిక శక్తులుగా తయారు అవడమో తప్పదు. అలాగే విద్యాశాఖ అధికారులు కార్పొరేటు సంస్థలకు ఊడిగం చేయడానికి మాకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిందనే భావన మానుకొని, మేము విద్యార్థుల పక్షాన నిలవాలన్నా నిజాయితీతో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే విద్యార్థులకు చదువు గరళంగా కాకుండా మధు రంగా అ నిపిస్తుంది. అచ్యుతరావు, వ్యాసకర్త రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ‘ 93910 24242 -
బ్లాక్ మనీ బడా బాబుల మాస్టర్ ప్లాన్
-
పెండింగ్లో లక్ష దరఖాస్తులు
ఉపకారవేతనాల అప్లికేషన్ల పరిశీలనలో కళాశాలల తాత్సారం సాక్షి, హైదరాబాద్: నిధుల విడుదలలో ప్రభుత్వం జాప్యానికి తోడు కళాశాల యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరి విద్యార్థులకు శాపంగా మారింది. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన దరఖాస్తులను సకాలంలో పరిశీలించకపోవడంతో వారికి లబ్ధి ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి సంక్షేమ శాఖలు విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజులను పంపిణీ చేస్తోంది. కానీ పలు కళాశాలలు గతేడాదికి సంబంధించి పూర్తిస్థాయిలో దరఖాస్తులను కూడా సంక్షేమాధికారులకు సమర్పించకపోవడంతో వారికి స్కాలర్షిప్లు అందకుండాపోయాయి. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కేటగిరీలకు చెందిన లక్షమంది విద్యార్థులు ఉపకార వేతనాలకు నోచుకోలేకపోయారు. సాధారణంగా ఈపాస్ వెబ్సైట్లో వచ్చిన స్కాలర్షిప్ దరఖాస్తును వెంటనే సంబంధిత కళాశాల యాజమాన్యం పరిశీలించి, వాటిని సంక్షేమ శాఖ అధికారికి పంపాలి. ముందుగా వచ్చిన దరఖాస్తులను సమర్పించినప్పటికీ... ఆ తరువాత వచ్చినవాటిని మాత్రం కళాశాలలు పట్టించుకోలేదు. గత విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 14.11 లక్షల మంది ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఇప్పటివరకు 12.3 లక్షల దరఖాస్తులు కాలేజీలు పరిశీలించి సంక్షేమ శాఖకు చేరవేశాయి. మరో 80 వేల దరఖాస్తులు కాలేజీ స్థాయిలోనే తిరస్కరణకు గురికాగా, 1.01 లక్షల దరఖాస్తులు మాత్రం కాలేజీల వద్ద పెండింగ్లో ఉండిపోయాయి. నిలిచిన ఈపాస్ సేవలు... ఈ విద్యాసంవత్సరంలో ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్కు ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేసింది. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సంక్షేమాధికారులకు పంపితే తప్ప కాలేజీలకు ఈ నిధులు అందే అవకాశం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఈపాస్ వెబ్సైట్లో సేవలు నిలిచిపోయాయి. దీంతో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించే వీలు లేకుండా పోయింది. రెండు వారాల్లో ఈపాస్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఆ తరువాత నిధుల లభ్యతను బట్టి వారికి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తారు. -
వర్సిటీలు, కళాశాలల్లో ఫ్రీ వైఫై: సీఎం
సాక్షి, విశాఖపట్నం: విశ్వవిద్యాలయాలతోపాటు అన్ని కళాశాలల్లో నెలరోజుల్లోనే ఫ్రీ వైఫై సౌకర్యం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇకనుంచి క్లాసుకెళ్లి మాత్రమే కాకుండా, ఎప్పుడు చదువుకోవాలనిపించినా చదువుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఉన్న 41,174 ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు విద్యాసంస్థల్లో సైతం డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేయనున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,212 పాఠశాలల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదులను గురువారం విశాఖ ఏయూ కాన్వొకేషన్ హాలు నుంచి సీఎం ప్రారంభించారు. -
ఫీజుల లెక్కల్లేవ్...!
ఇందూరు : జిల్లాలో ప్రతి సంవత్సరం వందలాది విద్యా సంస్థల్లో వేలాది మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం బోధన రుసుముల రూపంలో కోట్లాది రూపాయలను చెల్లిస్తోంది. ఈ నిధులను నేరుగా బీసీ సంక్షేమ శాఖ నుంచి విద్యార్థులు చదివే కళాశాలల బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతాయి. అయితే విద్యార్థులకు చెల్లిస్తున్న బోధన రుసుముల వివరాలను విద్యార్థుల వారీగా వినియోగపత్రాలను(యూసీ) సంబంధిత కళాశాల యాజమాన్యాలు బీసీ సంక్షేమ శాఖలో అందజేయాలి. ఈ నిబంధనలను కళాశాల యాజమాన్యాలు లెక్కచేయడం లేదు. ఇటు బీసీ సంక్షేమ అధికారులు, ఆడిట్ అధికారులు పట్టించుకోకపోవడంతో కళాశాల యాజమాన్యాలది ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. డ్రాపౌట్ విద్యార్థులను చూపిస్తూ కోట్లాది రూపాయలను జేబుల్లో వేసుకుంటున్నట్లు యూసీలు సమర్పించకపోవడంతో స్పష్టమవుతోంది. నాలుగేళ్లలో బోధన రుసుముల కింద చెల్లించిన కోట్లాది రూపాయలకు ప్రస్తుతం లెక్కలు లేకుండా పోయాయి. యూసీలను సమర్పించడంతో పాటు ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ 2013–14 సంవత్సరం నుంచి అమలవుతోంది. అయితే వినియోగపత్రాలు ఇవ్వడంలో కళాశాల యాజమాన్యాలు పారదర్శకంగా వ్యవహరించడం లేదు. ఇదే అదనుగా తీసుకొని జిల్లాలోని కొన్ని కళాశాలలు బోధన రుసుముల నిధులను పక్కదారి పట్టిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగేళ్లు రూ. 123.98 కోట్లు జిల్లాలో ప్రతి ఏటా సగటున 50 వేల మంది బీసీ విద్యార్థులకు బీసీ సంక్షేమ శాఖ నుంచి బోధన రుసుములను చెల్లిస్తోంది. గడిచిన నాలుగేళ్లలో జిల్లాకు రూ. 123.98 కోట్లు విడుదలయ్యాయి. అయితే ఇప్పటి వరకు రూ. 86.68 కోట్లు మాత్రమే కళాశాలలు వినియోగ పత్రాలు సమర్పించాయి. 2012–13 నుంచి 2014 వరకు రూ. 13.03 కోట్లకు వినియోగపత్రాలు లేకపోవడంతో వీటికి లెక్కలు లేకుండా పోయాయి. 2015–16 సంవత్సరానికి సంబంధించి బోధన రుసుములు విడుదలయి రెండు నెలలు కావస్తోంది. ఇంత వరకు ఒక్క కళాశాల కూడా వినియోగపత్రాలు సమర్పించలేదు. బీసీ సంక్షేమ అధికారులు కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆడిట్ జనరల్ అధికారులు అప్పుడప్పుడూ అభ్యంతరాలు చెబుతున్నా సిబ్బంది తమకేమీ పట్లనట్లు వ్యవహరిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం బోధన రుసుములు మంజూరు చేస్తున్నా అక్కడక్కడా కొన్ని విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా చెల్లింపులు ప్రారంభమైన తరువాత అక్రమాలకు కొంత అడ్డుకట్టపడినప్పటికీ వినియోగపత్రాలు సమర్పించడంలో కళాశాలల యాజమాన్యాలు తీవ్ర జాప్యం చేయడంతో ఈ నిధులు ఏమయ్యాయని సందేహాలు కలుగుతున్నాయి. రూ. 13.03 కోట్లు ఎక్కడ.. జిల్లాలో 2012–13 నుంచి 2014–15 వరకు రూ. 99.71 కోట్లు విడుదల కాగా రూ. 86.68 కోట్లకు వినియోగపత్రాలు వివిధ కళాశాలలు సమర్పించాయి. ఇంకా రూ. 13.03 కోట్లకు లెక్కలు లేకుండా పోయాయి. 2014–15 సంవత్సరంలో అధికంగా రూ. 12.81 కోట్లు ఉండడం విశేషం. ఈ నిధులకు వినియోగపత్రాలు సమర్పించకపోవడానికి గల కారణాలు అంతుచిక్కడం లేదు. కళాశాల యాజమాన్యాలతో బీసీ సంక్షేమ శాఖ అధికారులు కుమ్మక్కై బోధన రుసుముల నిధులను స్వాహా చేస్తున్నట్లు సమాచారం. అందుకే ప్రతి సంవత్సరం బోధన రుసుములపై కళాశాలల్లో తనిఖీలు నిర్వహించాల్సి ఉండగా నిలిపివేశారు. సకాలంలో యూసీలు సమర్పించని కళాశాలలపై ఆడిట్ విభాగం అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. తగ్గుతున్న శాతం జిల్లాలో గత నాలుగేళ్లలో విద్యార్థులకు అందుతున్న బోధన రుసుములు భారీగా తగ్గుతున్నాయి. నాలుగేళ్లలో 20,3,228 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా 17,9565 మంది విద్యార్థులకు బోధన రుసుములు మంజూరు అయ్యాయి. 2015–16లో 50,951 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా 34,668 మంది విద్యార్థులకు మాత్రమే బోధన రుసుములు మంజూరు అయ్యాయి. నాలుగేళ్లలో 23,663 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ బోధన రుసుములు అందలేదు. ఇందులో డబుల్ పీజీతో బోధన రుసుములు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. గతంలో బోధన రుసుములు ఉన్నత విద్య కోసం ఎన్నిసార్లు అయినా మంజూరు చేసేవారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్య అభ్యాసనలో ఒక్క డిగ్రీకి మాత్రమే బోధన రుసుములు అందజేస్తోంది. ఈ నిబంధన ఉన్నత విద్యను అభ్యసించే నిరుపేద విద్యార్థులకు విఘాతంగా మారింది -
ప్రైవేట్ కళాశాలల్లో విజిలెన్స్ తనిఖీలు
చర: చర్లలోని ఇంటర్, డిగ్రీ ప్రైవేట్ కళాశాలల్లో బుధవారం విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రైవేటు కళాశాలల తనిఖీల్లో భాగంగా మండలంలోని గౌతమి డిగ్రీ కళాశాల, భద్రాద్రి ఒకేషనల్ అండ్ డిగ్రీ కళాశాల, కాకతీయ ఒకేషనల్ కళాశాలల్లో తనికీ బందాలు పరిశీలించారు. కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, వసతులు, అధ్యాపకులు, తరగతి గదుల వివరాలను తనిఖీ బందాలు పరిశీలించి వివరాలు నమోదు చేశారు. తనిఖీ బందంలో విజిలెన్స్ అధికారులు అరవింద్బాబు, భానుకుమార్, అహ్మద్మియా ఉన్నారు. దుమ్ముగూడెంలో.. దుమ్ముగూడెం : మండలంలో ప్రైవేటు కళాశాలలో విజిలెన్స్ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. శ్రీకష్ణ గౌతమి డిగ్రీ కళాశాల, టెక్నో ఒకేషనల్ జూనియర్ కళాశాలలను వారు తనిఖీ చేశారు. విజిలెన్స్ అధికారి వెంకటరమణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. కళాశాలల్లో మౌలిక వసతులు, తదితర అంశాలపై తనిఖీలు నిర్వహించారు. కాగా ఈ తనిఖీ బందానికి నిర్వాహకులు వివరాలు తెలుపడానికి నిరాకరించారు. ఏఈ సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ విష్ణుమూర్తి, లెక్చరర్ శ్రీనివాస్, వరరాజులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. -
కళశాలల్లో టాస్క్ఫోర్స్ తనిఖీలు
ఆలేరు : ఆలేరులోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఎస్ఆర్, వీఆర్, ఎస్వైఎల్ఎన్ఎస్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం టాస్క్ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా పాఠశాలల్లో మౌలిక వసతులు, అధ్యాపకులు వివరాలు, తరగతి గదులను, పలు రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్వో శ్రీధర్రెడ్డి, ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
3 రోజుల పాటు డిగ్రీ కళాశాల బంద్
భువనగిరి అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం 2014–15 విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయి స్కాలర్షిప్లను రిలీజ్ చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తు సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు బంద్ పాటించాలని తెలంగాణ ప్రైవేట్æ డిగ్రీ, పీజీ కళాశాల మేనేజ్మెంట్ సంఘం జిల్లా అధ్యక్షుడు బి. సూర్యనారాయణరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం 2016–17 సంవత్సరానికి సంబంధించిన స్కాలర్షిప్ నోటిఫికేషన్ను విడుదల చేయాలని, ఈ విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ పొందని విద్యార్థులకు స్కాలర్షిప్తో కూడిన స్పాట్ అడ్మిషన్కు అవకాశం కల్పించాలన్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రస్తుతం ఉన్న ఫీజులను సమంజసంగా ఉండే విధంగా పెంచాలన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 3 రోజుల పాటు కళాశాలల బంద్ను పాటించాలని కోరారు. -
బస్సును వెంబడిస్తూ.. వేధింపులు
* బస్సులను రోజూ వెంబడిస్తూ ఆగడాలు * విద్యార్థినులకు వేధింపులు.. డ్రైౖ వర్లకు బెదిరింపులు * బరితెగించి బీరుసీసాలతో దాడి * పోలీసులకు ఫిర్యాదు చేసిన డ్రైౖ వర్లు మంగళగిరి: మంగళగిరి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విజయవాడ కళాశాలలకు విద్యార్థినులతో వెళ్లే బస్సులకు అకతాయిల బెడద ఎక్కువైంది. కళాశాలలకు వెళ్లే సమయంలోను, సాయంత్రం వచ్చే సమయంలోను కొందరు యువకులు ద్విచక్రవాహనాలతో వెంబడిస్తూ బస్సులలోని విద్యార్థినులను వేధించడమే కాక, బస్సు డ్రైౖ వర్లు ప్రశ్నిస్తే వారిపై దాడులకు దిగుతున్నట్లు డ్రై వర్లు చెబుతున్నారు. మంగళగిరి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు పదిహేను నుంచి ఇరవై బస్సులు విద్యార్థినీ, విద్యార్థులను కళాశాలలకు తీసుకువెళ్తుంటాయి. వీటిలో ప్రత్యేకంగా విద్యార్థినులు వెళ్లే బస్సులను చాలా కాలంగా కొందరు యువకులు ద్విచక్రవాహనాలతో వెంబడిస్తూ వేధిస్తున్నారు. ఛేజ్ చేసి మరీ.. సోమవారం సాయంత్రం విజయవాడ నుంచి వస్తున్న ఓ కార్పొరేట్ కళాశాల బస్సు వెంట నలుగురు యువకులు రెండు ద్విచక్రవాహనాలతో వెంబడిస్తూ వచ్చారు. బస్సు డ్రైవరు ఆపకుండా వెళ్లగా... జాతీయరహదారిపై మండలలోని ఆత్మకూరు గ్రామం సాయిబాబాగుడి వద్దకు చేరుకునే సరికి గట్టిగా అరుస్తూ వచ్చిన యువకులు తమ చేతులలోని బీర్బాటిళ్ళతో బస్సు అద్దాలను పగులగొట్టారు. దీంతో కంగారుపడ్డ డ్రైవర్ బస్సును ఆపకుండా పట్టణంలోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. దీంతో మంగళవారం బస్సుల డ్రైవర్లు అందరూ రూరల్ పోలీస్స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. డ్రైౖవర్లు పలువురు మాట్లాడుతూ తాము ఫిర్యాదు చేశామని తెలిసి యువకులు తమపై దాడులకు తెగబడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. యువకుల ఆగడాలపై కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదని సోమవారం దాడికి గురైన కళాశాల బస్సు డ్రైవర్లు వాపోయారు. ఒక్కోసారి యువకులు బస్సుల వెంట వాహనాలు నడిపే వేగంతీరు తమను ఆందోళనకు గురిచేస్తోందని, వారు రోడ్లపై చేసే అగడాలకు తాము ఎక్కడ ప్రమాదాలను కొని తెచ్చుకుంటామోననే భయం వెంటాడుతోందన్నారు. యువకుల వ్యవహారశైలి శ్రుతి మించిన కారణంగానే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. -
ఈ యూనివర్సిటీలు, కాలేజీలు నకిలీవే
ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలు, రాష్ట్రానికి చెందిన పలు కాలేజీలు తెలంగాణలో స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసి అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు నిర్వహిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని, అవి నకిలీ యూనివర్సిటీలు, కాలేజీలేనని రాష్ర్ట ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. వాటిల్లో చదివి మోసపోవద్దని పేర్కొన్నారు. ఈ కోర్సును నిర్వహించే 3 యూనివర్సిటీలు, 8 కాలేజీలకు, వాటి స్టడీసెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం కాని, వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ గుర్తింపునివ్వలేదని, యూజీసీ కూడా వాటికి గుర్తింపు ఇవ్వలేదని వెల్లడించారు. యూనివర్సిటీలు/ప్రభుత్వం/ యూజీసీ గుర్తింపు లేని కాలేజీల్లో చదివితే నష్టపోవాల్సి వస్తుందని సూచించారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, ఇతర వివరాలను యూజీసీ వెబ్సైట్లో (ugc.ac.in) పొందవచ్చని వివరించారు. ఇవీ నకిలీ యూనివర్సిటీలు, కాలేజీలు ⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, ఆగ్రా, ఉత్తరప్రదేశ్ ⇒ సంఘానియా యూనివర్సిటీ, ఝుంఝును రాజస్తాన్ ⇒ జేఎస్ యూనివర్సిటీ, ఫిరోజాబాద్, ఉత్తరప్రదేశ్ ⇒ ట్రినిటీ అగ్రికల్చర్ కాలేజీ, అంబేడ్కర్ విగ్రహం ఎదురుగా యాప్రాల్, హైదరాబాద్ ⇒ ట్రినిటీ అగ్రికల్చర్ అకాడమీ, తూముకుంట, సమ్మర్ గ్రీన్ రిసార్ట్స్ ఎదురుగా, శామీర్పేట్, రంగారెడ్డి ⇒ గ్రీన్లాండ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, సుందర్నగర్ కాలనీ, మెయిన్రోడ్ సంజీవరెడ్డి నగర్, హైదరాబాద్ ⇒ గ్రీన్ఫీల్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ , సాయినగర్ రోడ్, రాజధాని హోటల్ లేన్ ఎదురుగా, హైదరాబాద్ ⇒ తెలంగాణ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్ట్రీట్ నెంబర్-2 బిగ్ బజార్ దగ్గర తార్నాక, హైదరాబాద్ ⇒ మాగ్జిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, నంజిని ఎన్క్లేవ్, ప్రశాంత్నగర్, ఉప్పల్ పోలీసుస్టేషన్ పక్కన, ఉప్పల్ ⇒ గ్రీన్ ప్లాంట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, వివేకానందనగర్, కెనరా బ్యాంకు ఎదురుగా, కూకట్పల్లి, హైదరాబాద్ ⇒ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్, హిల్ కాలనీ, రిలయన్స్ డిజిటల్ ఎదురుగా వనస్థలిపురం, హైదరాబాద్ -
అనుబంధ కళాశాలల సమావేశం వాయిదా
ఏయూక్యాంపస్:ఆంధ్రవిశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల యాజమాన్యాలతో ఏయూ కళాశాలల అభివృద్ధి సమాఖ్య(సిడిసి) ఈ నెల 10వ తేదీన నిర్వహించ తలపెట్టిన సమావేశం వాయిదా వేసినట్లు డీన్ టి.కోటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీ ఉపకులపతి ఆచార్య నాగేశ్వరరావు ముఖ్యమంత్రి నేతత్వంలో జరిగే ఉపకులపతుల సమావేశంలో పాల్గొనవలసి ఉండటంతో సిడిసి సమావేశం వాయిదా వేస్తున్నామన్నారు. మరల ఎప్పుడు నిర్వహించేది వ్యక్తిగతంగా తెలియజేస్తామన్నారు. ఈ మార్పును గమనించి తదుపరి సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. -
కళాశాలల్లో సీఐడీ, విజిలెన్స్ విచారణ
భూపాలపల్లి : భూపాలపల్లిలోని ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలల్లో బుధవారం సీఐడీ, విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికారులు మూడు బృందాలుగా విడిపోయి మూడు జూనియర్, మూడు డిగ్రీ కళాశాలల్లో తనిఖీలు చేశారు. విద్యార్థులకు అందించిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ రికార్డులను, వసతులను పరిశీలించారు. తరగతి గదులు, క్రీడా మైదానం, ల్యాబ్ల నిర్వహణ, అధ్యాపకుల అర్హత, విద్యార్థుల హాజరు తదితర వివరాలను పరిశీలించారు. అనంతరం సీఐడీ డీఎస్పీ రవికుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించామన్నారు. తాము గుర్తించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సీఐడీ ఎస్సై రమేష్, సిబ్బంది అంజయ్య, నరేందర్, విజిలెన్స్ తహసీల్దార్ భవాని, సిబ్బంది రాఘవరెడ్డి, అహ్మద్మియా ఉన్నారు. విద్యార్థి సంఘాల ఫిర్యాదు.. అక్రమాలకు పాల్పడిన కళాశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి సంఘాల నాయకులు విజిలెన్స్ తçహసీల్దార్ భవానికి వినతిపత్రం అందజేశారు. పలు కళాశాలల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లలో అవకతవకలకు పాల్పడ్డాయని ఆరోపించారు. వినతి పత్రం అందించిన వారిలో టీజేఎస్ఎఫ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కుసుమ రామక్రిష్ణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సొత్కు ప్రవీణ్, ఎన్ఎస్యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టు కర్ణాకర్ ఉన్నారు. -
కళాశాలల్లో విజిలెన్స్ తనిఖీలు
colleges, vigilence, check గోదావరిఖని కళాశాలలు, తనిఖీ, విజిలెన్స్ గోదావరిఖనిటౌన్ : పారిశ్రామిక ప్రాంతంలోని పలు ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలలను విజిలెన్స్ అధికారులు గురువారం తనిఖీ చేశారు. మార్కండేయకాలనీలోని కృష్ణవేణి వికాస్, చైతన్య ఇతర కళాశాలలో తరగతి గదుల కొలతలు, కళాశాలలను నిర్వహించే హాజరు పట్టిక, స్కాలర్షిప్, ఇతర అంశాలను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి కళాశాల చెందినవిషయాలు తెలుసుకున్నారు. అసౌకర్యాలు లేకుండా విద్యార్థులకు అన్ని సేవలు అందే విధంగా చూడాలని కళాశాల నిర్వాహకులను కోరారు. కార్యక్రమంలో అధికారులు సత్యానారయణ, కళాశాల డైరెక్టర్ కుమార్, తిరుపతి, ప్రిన్సిపాల్ మాధవరావు తదితరులు పాల్గొన్నారు. -
కోదాడ కళాశాలల్లో విజిలెన్స్ తనిఖీలు
కోదాడ: పట్టణంలోని ఈవీరెడ్డి డిగ్రీకళాశాలలో విజిలెన్స్ ప్రత్యేక బృందం తనిఖీ చేసింది. వసతులు, ప్రయోగశాలలు, తరగతి గదులు, విద్యార్థుల హాజరు పట్టికలు, అధ్యాపకుల వివరాలను కళాశాల నిర్వాహకుల నుండి అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం కోదాడలోని సుగుణ డిగ్రీ కళాశాలను తనిఖీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. విజిలెన్స్ అధికారులతో పాటు కళాశాల కరస్పాండెంట్ గింజల రమణారెడ్డి, జీఎల్ఎన్రెడ్డి, కెపీబీవీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో టాస్క్ఫోర్స్ తనిఖీలు పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో గురువారం విద్యాశాఖ టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పాఠశాల భవనాలను పరిశీలించి ఫీజుల వివరాలను తెలుసుకుని రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల్లో లోపాలను గుర్తించినట్లు సమాచారం. ఈ లోపాలను సరిదిద్దుకోకపోతే ప్రభుత్వ గుర్తింపు రద్దవుతుందని యాజమాన్యాలను హెచ్చరించారు. తనిఖీలపై తమ నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని వారు తెలిపారు. ఈ తనిఖీలలో నడిగూడెం ఎంఈఓ సలీంషరీఫ్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అదే విధంగా పట్టణంలోని పలు ప్రైవేట్ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో గురువారం విజిలెన్స్ అధికారులతో కూడిన టాస్క్ఫోర్స్ బృందాలు తనిఖీ నిర్వహించి రికార్డులను పరిశీలించారు. -
విజిలెన్స్ అధికారుల తనిఖీ
నకిరేకల్ : నకిరేకల్లోని శ్రీ మల్లికార్జున జూనియర్, డిగ్రీ కళాశాలలో సోమవారం సాయంత్రం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా ఎస్పీ భాస్కర్రావు ఆదేశాల మేరకు తనిఖీలు చేశామని ఎన్ఫోర్స్మెంట్ తహసీల్దార్ పి. రాధా, డీసీటీఓ శ్రీమన్నారాయణ తెలిపారు. కళాశాలలో విద్యార్థుల హాజరు, సరిపడా స్టాఫ్ ఉన్నారా.. ల్యాబ్లలో తగిన పరికరాలు ఉన్నాయా... విద్యార్థుల తల్లిదండ్రులు ఉద్యోగస్తులుగా ఉండి ఫీజు రీయింబర్స్మెంట్ కింద లబ్ధిపొందుతున్నారా.. తదితర అంశాలను పరిశీలించామని తెలిపారు. వారి వెంట ఎస్ఐ పీరయ్య, కానిస్టేబుల్ పీ. వెంకట్రెడ్డి, కళాశాలల ప్రిన్సిపాల్స్ వెంకన్న, కృష్ణ ఉన్నారు. -
నైపుణ్య సాధనతోనే సుందరభవిత
ఏటా కళాశాలల్లో ప్రాంగణ ఎంపికలు తడబడుతున్న విద్యార్థులు పలు అంశాల్లో రాణించని వైనం చదువుతుండగానే ఉద్యోగం సాధించడం ఇప్పుడు సర్వసాధారణమైంది. ప్రతి కాలేజీలోనూ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. అయితే ముంగిటకు వచ్చిన అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. నైపుణ్యం లేకపోవడం, ఆంగ్లభాషపై, సబ్జెక్టుపై పట్టు లేకపోవడం ప్రధానంగా వారిని వేధిస్తున్నాయి. బాలాజీచెరువు (కాకినాడ): జిల్లాలో 32 ఇంజనీరింగ్, ఐదు ఫార్మశీ, ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు 90 వరకూ ఉన్నాయి. వీటి నుంచి ప్రతి ఏటా ఇంజనీరింగ్ లేదా డిగ్రీ పూర్తిచేసిన సుమారు పది వేలమంది పట్టభద్రులై వస్తున్నారు. ప్రముఖ కంపెనీల క్యాంపస్ డ్రైవ్లు జిల్లాలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు ప్రభుత్వ.ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు టీపీఎస్, టెక్మహీంద్ర, టాటా, ఎల్అండ్టీ, హెచ్పీ,హెటిరోడ్రగ్స్, ఫార్మశీ సంస్థలు ప్రాంగణ ఎంపికలను నిర్వహిస్తున్నాయి. వీటికి వేలాది మంది అభ్యర్థులు హాజరవుతున్నప్పటికీ కేవలం 40శాతం మంది మాత్రమే అవకాశాన్ని అందిపుచ్చుకోగలుగుతున్నారు. మిగిలిన వారు చిన్నపాటి ఉద్యోగాలకే పరిమితం కావలసి వస్తోంది.∙ ప్రణాళికతో విజయం ప్రతి విద్యార్థి మొదటి సంవత్సరం నుంచి తప్పని సరిగా ప్రణాళికలు రూపొందించు కొని ఆమేరకు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి. చాలా మంది చివరి సంవత్సరంలో ప్రిపేరవుతుంటారు. అప్పటికే సమయం మించిపోవడంతో అర్హత సాధించలేకపోతున్నారు. పుస్తక ,ప్రపం^è పరిజ్ఞానం పెంపొందించుకోవడంతో పాటు ఆంగ్లంపై పూర్తి స్ధాయిలో పట్టు సాధించాలి. అందరితో కలుపుగోలుతనంగా ఉండటంతో పాటు చర్చావేదికల్లో పాల్గొనాలి. అప్పుడే తమలో ఉన్న భయం, బిడియాన్ని తొలగించుకోగలుగుతారు. చాలా మంది అలా చేయకపోవడం వల్లే ఉద్యోగాన్ని సాధించడంలో విఫలమవుతున్నారు. కళాశాలల్లో ప్రత్యేక శిక్షకులు విద్యార్థుల్లో లోపాలను గుర్తించి ప్రాంగణ ఎంపికలకు అవసర మైన శిక్షణను కళాశాలల్లో ఇస్తున్నారు. కమ్యూనికేషన్స్ స్కిల్స్ ముఖాముఖితో విజయం సాధించేందుకు నిపుణుల సదస్సులు ఏర్పాటు చే స్తున్నారు. జేఎన్టీయూకే, పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీతో పాటు ప్రైవేట్ కళాశాలల్లో సీఆర్టీæ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నారు. అన్నింశాలపై దృష్టి సారించాలి ప్రాంగణ ఎంపికల్లో విజయం సాధించాలంటే అన్ని అంశాలపై దృష్టి సారించాలి. ఆంగ్లభాషపై పట్టులేకపోవడం, కమ్యూనికేషన్స్ స్కిల్స్ లేకపోవడంతో చాలామంది వెనుకబడిపోతున్నారు. ప్రతి సబ్జెక్టుపై ప్రాథమిక పరిజ్ఞానంతో పాటు పుస్తక పఠనానికి ప్రాధాన్యం తగ్గించి ప్రాక్టికల్స్కు ప్రాధాన్యం ఇవ్వాలి. చాలా మందికి పుస్తక పరిజ్ఞానం తప్ప ఇతర అంశాలపై పట్టు ఉండటం లేదు. ఎం.వీరభద్రయ్య, ఆచార్యులు, ఎంఎస్ఐటీకోర్సు, జేఎన్టీయూకే జిల్లాలో డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో ఎంపికైనవారు సంవత్సరం ఎంపికైనవారు 2013–14 750 2014–15 650 2015–16 480 -
ఆ విద్యార్థుల వివరాలివ్వండి
ఢాకా: గత పది రోజులుగా విద్యాలయాలకు హాజరుకాని విద్యార్థుల వివరాలు ఇవ్వాల్సిందిగా అన్ని విద్యాసంస్థలను బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. కొన్నాళ్లుగా ఎవరైనా పిల్లలు తప్పిపోయుంటే వారి వివరాలను అధికారులకు అందజేయాల్సిందిగా ప్రధానమంత్రి షేక్ హసీనా ఇటీవల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఢాకా దాడి అనంతరం పలువురు విద్యార్థులు తప్పిపోయారని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జులై 1న గుల్షన్ ప్రాంతంలో హోలే అర్టిసన్ బేకరి అండ్ రెస్టారెంట్ పై ఆరుగురు సాయుధులు దాడి చేసి 22 మందిని అతి కిరాతకంగా హతమార్చారు. ఇందులో ఐదుగురిని మట్టు పెట్టిన ఉగ్రవాదులు ఒకరిని సజీవంగా పట్టుకున్నారు. ఐదుగురు ఉన్నత విద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థులే నని దర్యాప్తులో తేలిన విషయం తెలిసిందే. -
ఈ-పాఠశాలతో కాలేజీకి గుర్తింపు!
♦ విద్యా సంస్థలకు యూజీసీ, న్యాక్, ఎన్సీఆర్టీ వంటి గుర్తింపు సేవలు ♦ అడ్మిషన్లు, పరీక్షలు, ఫలితాలు కూడా అందిస్తున్న స్టార్టప్ ♦ 400లకు పైగా విద్యా సంస్థలకు సేవలు 2 నెలల్లో యూఎస్, సింగపూర్, ♦ దక్షిణాసియాలకు విస్తరణ సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవులు ముగిసి.. స్కూళ్లు, కాలేజీలు తెరిచే సమయం వచ్చేసింది. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లాడిని కాలేజీలో చేర్పించాలంటే ముందుగా చూసేది టీచర్లెవరు? గత విద్యా సంవత్సరంలో ఎన్ని ర్యాంకులొచ్చాయి? ఎంత మంది పాసయ్యారు? కాలేజీకి ఏ గ్రేడుందని!! దీన్లో ర్యాంకులు.. మార్కులనేవి టీచర్ల బోధన, విద్యార్థుల ప్రతిభ బట్టి ఉంటాయి. మరి కాలేజీగ్రేడ్ల సంగతేంటి? అంటే యూజీసీ, న్యాక్, ఎన్బీఏ, ఏఎంబీఏ, ఎన్సీఆర్టీ వంటి సంస్థలిచ్చే గ్రేడ్లు పొందేదెలా? నిజానికి వీటి గుర్తింపు పొందాలంటే చాతాండతం పని ఉంటుంది. కళాశాల సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ (ఎస్ఎస్ఆర్) నుంచి మొదలుపెడితే ఉపాధ్యాయుల ప్రతిభ, విభాగాల సంఖ్య, ఫీజులు, గత రెండేళ్ల ఫలితాలు, బడ్జెట్, విద్యార్థుల ఫీడ్బ్యాక్, సంస్థ మాస్టర్ప్లాన్, ఆడిటర్ రిపోర్ట్ వంటి బోలెడంత సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. అందుకే చాలా విద్యా సంస్థలు వీటికి దూరంగా ఉంటాయి. దీన్నే వ్యాపార అవకాశంగా మార్చుకుంది ‘ఈ-పాఠశాల’! ఈ స్టార్టప్ అందించే సేవల వివరాలు సంస్థ కో-ఫౌండర్ సుమన్ నంది మాటల్లోనే... రూ.10 లక్షల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా 2014లో ‘ఈ-పాఠశాల’ను ఆరంభించాం. క్లౌడ్ ఆధారంగా పనిచేసే ఈఆర్పీ సొల్యూషనే మా ప్రత్యేకత. అంటే గ్రేడ్ల కోసం మాన్యువల్ ప్రాసెస్ అవసరం లేకుండా టెక్నాలజీ ద్వారా పరిష్కారం చూపిస్తామన్నమాట. అడ్మిషన్ నుంచి ఆలూమినీ వరకూ..: విద్యా సంస్థలకు గ్రేడ్లను అందించడమే కాక కళాశాల బోధనేతర సేవలు... అంటే విద్యార్థి అడ్మిషన్ నుంచి మొదలుపెడితే మెంటరింగ్, ప్రొఫైల్ మ్యాపింగ్, అకడమిక్ ప్రోగ్రెస్, ప్లేస్మెంట్, ఫీడ్బ్యాక్, అలూమినీ వరకూ ప్రతీ ఒక్కటీ చేసిపెడతాం. ఆన్లైన్లో సిలబస్, పరీక్షలు, ఫలితాలూ ప్రకటిస్తాం. బోధనేతర సేవల్లో మా ప్రత్యేకత ఏంటంటే.. కళాశాలలో అందరికీ ప్రత్యేకంగా ఒక డాష్బోర్డ్ను ఇస్తాం. అంటే ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థి ఇలా ఒక్కో బోర్డ్ ఉంటుందన్నమాట. ఇందులో ప్రిన్సిపల్ డాష్బోర్డ్లో అడ్మిషన్లు, ప్లానింగ్, ఫీజులు, హాజరు శాతం, పరీక్షలు, గుర్తింపు.. వివరాలుంటాయి. ఉపాధ్యాయుల బోర్డ్లో.. డె డ్లైన్ ఐక్యూఏసీ, రికార్డ్లు ఉంటాయి. విద్యార్థుల బోర్డ్లో పరీక్షల తేదీలు, ఫలితాలు, ఫీజులు వంటివి ఉంటాయి. తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్లు..: ప్రెడిక్టివ్ అనలిటిక్స్ విధానం ద్వారా ఒకో విద్యార్థి ఏ అంశంలో వెనకబడ్డాడో బేరీజు వేస్తాం. ఒకో విభాగంలో వాళ్ల ప్రదర్శన ఎలా ఉందో కొలతలు తీస్తాం. ఆ సమాచారాన్ని తల్లిదండ్రులు, టీచర్ల ముందు పెడతాం. దీనికి తోడు పిల్లల ప్రవర్తన, పరీక్షల టైం టేబుల్, ఇతర ముఖ్య విషయాలకు సంబంధించిన ప్రతి అంశాన్నీ ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్, ఈమెయిళ్ల రూపంలో అందిస్తాం. ధరలు రూ.50 వేల నుంచి..: ఈ-పాఠశాల ఏం చేస్తుందంటే.. ఆయా సంస్థలు వాటి ప్రమాణాలేంటి? ఉత్తమమైన గ్రేడ్లు పొందేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలో 360 డిగ్రీల్లో సూచనలిస్తాం. అంటే కళాశాల క్వాలిటీ, ఎక్కడ వసతులు బాగాలేవో.. ఏం చేయాలో సూచిస్తాం. బడ్జెట్, ఆడిటింగ్ రిపోర్టుల్లో ఉన్న తేడాలను గుర్తించి సరిదిద్దుతాం కూడా. ఇవి రూ.50 వేల నుంచి 5 లక్షల వరకు ఉంటాయి. 400లకు పైగా కాలేజీలకు..: ఇప్పటివరకు 400లకు పైగా కాలేజీలు మా సేవలు వినియోగించుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి 12 ఉన్నాయి. ఇప్పటివరకు పలువురు ప్రైవేట్ ఇన్వెస్టర్ల నుంచి రెండు రౌండ్లలో నిధులను సమీకరించాం. వీటి సాయంతో వచ్చే రెండునెలల్లో అమెరికా, సింగపూర్, దక్షిణాసియా ప్రాంతాలకు విస్తరిస్తాం. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
నాణ్యత డొల్ల!
♦ నాణ్యతా ప్రమాణాలు పరిశీలిస్తున్న బృందాలు ♦ తనిఖీల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ♦ పలు కాలేజీల్లో అధ్యాపకులూ లేని వైనం ♦ రంగంలోకి అదనంగా మరిన్ని బృందాలు ♦ ఈనెల 15న ప్రభుత్వానికి నివేదిక ♦ జిల్లాలో 420 బీటెక్, బీఫార్మసీ కాలేజీలున్నాయి. ఇప్పటికి 80 కాలేజీలను తనిఖీ చేశారు. చాలావరకు కళాశాలల యాజమాన్యాలు మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యాసంస్థలను నడపడంలేదని తేలింది. ♦ కొన్ని కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో రెండు, మూడు కాలేజీలకు ఒక అధ్యాపక బృందం పనిచేస్తున్నట్లు బయటపడింది. ♦ ప్రైవేటు విద్యాసంస్థలపై రాష్ర్ట ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. ప్రభుత్వ నియమావళి మేరకు నాణ్యతాప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా అనే అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోంది. ఈ మేరకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులను రంగంలోకి దించింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో 1,168 కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఇంటర్మీడియెట్ మొదలు ఇంజనీరింగ్, మెడికల్, పోస్టుగ్రాడ్యుయేషన్ కాలేజీలున్నాయి. కాలేజీల్లో యాజమాన్యాలు నాణ్యతాప్రమాణాలు పాటించడంలేదని, బోధన సిబ్బంది సరిగ్గా ఉండడంలేదని, కనీసం విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు కూడా అందుబాటులో ఉండడంలేదని ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. అంతేకాకుండా వేలకు వేలు ఫీజులు వెచ్చించి.. కాలేజీల్లో చేరితే అక్కడ ల్యాబరేటరీలు, కంప్యూటర్ ల్యాబ్లు కూడా ఉండడంలేద ని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యం లోనే ప్రైవేటు కళాశాలలపై దాడులు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ శాఖ దాడులు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా లో తొలి విడతగా ఇంజనీరింగ్, బీ -ఫార్మసీ కాలేజీలను ఎన్ఫోర్స్మెంట్ తనిఖీ చేసి.. రికార్డులను పరిశీలించిం ది. ఇందులో విద్యాసంస్థల డొల్లతనం బయటపడింది. నిబంధనలు గాలికి.. జిల్లావ్యాప్తంగా 420 బీటెక్, బీఫార్మసీ కాలేజీలుండగా వీటిలో గురువారం నాటికీ 80 కాలేజీలను తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో చాలావరకు కళాశాలల యాజమాన్యాలు మార్గదర్శకాలకనుగుణంగా విద్యాసంస్థలను నిర్వహించ డంలేదని తేలింది. 60మంది విద్యార్థులకు అనుగుణంగా ఫ్యాకల్టీ ఉండాలనే నిబంధన ఉన్నా పాటించడంలేదని స్పష్టమైంది. కొన్ని కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో రెండు, మూడు కాలేజీలకు ఒక అధ్యాపక ృందం పనిచేస్తున్నట్లు బయటపడింది. నిపుణులైన అధ్యాపకులుండాలనే యూజీసీ నియమావళిని కూడా బేఖాతరు చేస్తున్నట్లు తేలింది. అప్పుడప్పుడే పీజీ పూర్తిచేసిన విద్యార్థులు లెక్చరర్లుగా పనిచేస్తున్నట్లు వెలుగులో కి వచ్చింది. పలు విద్యాసంస్థల్లో మౌలిక వసతులు ముఖ్యంగా తరగతి గదులు, భవనాలు కూడా లేవని తని ఖీల్లో గుర్తించారు. మరోవైపు విద్యాసంస్థలపై దాడులను తీవ్రతరం చేసేం దుకు మరిన్ని టీమ్లను విజిలెన్స్ శాఖ రంగంలోకి దించింది. జూన్ 15 తేదీ నాటికీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించిన నేపథ్యంలో తనిఖీ లను ముమ్మరం చేయాలని నిర్ణయిం చింది. దీంతో అదనంగా మరో పది ృందాలను దాడులకు మోహరించింది. వచ్చే విద్యాసంవత్సరం నాటికీ విద్యాసంస్థలను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
'కమ్యూనిజం లో నిజం లేదు'
భారత్ మాతాకీ జై అనేది ఓ మత నినాదం కాదని.. దానర్థం ప్రజలని.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రతి ఒక్కరూ భారత్ మాతాకీ జై అనాలని సూచించారు. విజయవాడ గుణదల ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాలులో శనివారం ‘అమరవీరులకు అవమానం... జాతీయ సమైక్యత’ అనే అంశంపై జరిగిన సమావేశంలో వెంకయ్య పాల్గొని మాట్లాడారు. జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య భావ దరిద్రుడన్నారు. విద్యాలయాల్లోకి విచ్చినకర శక్తులు చొరబడి విద్య కాకుండా వామపక్ష భావజాలాన్ని రుద్దుతున్నాయన్నారు. కమ్యూనిజంలో నిజం లేదని విమర్శించారు. విదేశీ భావజాలాన్ని దేశంపై రుద్దుతోందన్నారు. కులం, మతం, ప్రాంతం ప్రాతిపదికన దేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఏబీవీపీ, బీజేపీ నాయకులు సిద్ధాంతపరంగా అంశాలపై చర్చించి ప్రజలకు వాస్తవాలు తెలిసే దిశగా కృషి చేయాలని సూచించారు. -
ఫీజులు పైపైకి
ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో భారీగా పెరగనున్న ఫీజులు * కనీసంగా 15 శాతం పెంపునకు కసరత్తు * కాలేజీల ఆదాయ వ్యయాలను బట్టి గరిష్ట ఫీజు * 2016-17 నుంచి మూడేళ్ల పాటు వసూలు చేసే ఫీజుల నిర్ణయానికి కసరత్తు * కాలేజీల ఆదాయ, వ్యయాల సమర్పణకు * 22వ తేదీతో ముగియనున్న గడువు * వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజులు భారమే సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజులు భారీగా పెరగనున్నాయి. ఇప్పటివరకు వసూలు చేస్తున్న ఫీజులపై వచ్చే విద్యా సంవత్సరం నుంచి (2016-17) కనిష్టంగా 15%, గరిష్టంగా కాలేజీ ఆదాయ వ్యయాలను బట్టి ఫీజు పెరగనుంది. 2016-17 నుంచి 2018-19 వరకు (మూడేళ్ల పాటు) వృత్తి విద్యా కాలేజీల్లో వసూలు చేసే ఫీజుల ఖరారు కోసం ‘ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ)’ ప్రస్తుతం యాజమాన్యాల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో మూడేళ్ల కింద ఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజుల గడువు ప్రస్తుత విద్యా సంవత్సరంతో ముగియనుండడంతో ఈ చర్యలు చేపట్టింది. అయితే ఏటా 5 శాతం ద్రవ్యోల్బణం ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ఫీజుల్లో కనీసం 15 శాతం పెంపు మొదటి సంవత్సరం నుంచే ఉండనుంది. ఇక కాలేజీల ఆదాయ వ్యయాలను బట్టి ఫీజు గరిష్టంగా పెరగనుంది. దీంతో మొత్తానికి ఇటు ప్రభుత్వంతోపాటు అటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులపైనా 2016-17 విద్యా సంవత్సరం నుంచి ‘ఫీజు’ భారం పడనుంది. కనీస ఫీజు తీసుకుంటున్నవాటిలోనూ పెంపు! ప్రస్తుతం రాష్ట్రంలో 266 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా టాప్, ఓ మోస్తరు కాలేజీలు మినహా మిగతా 150కి పైగా కాలేజీల్లో కనీస ఫీజు అమలవుతోంది. ఆ కాలేజీల యాజమాన్యాలు 2013-14 నుంచి 2016-17 వరకు ఫీజుల పెంపు కోసం ప్రతిపాదనలు ఇవ్వలేదు. తమ కాలేజీల్లో లోపాలున్న కారణంగా అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి... రూ. 35 వేల కనీస ఫీజు తీసుకునేందుకు అంగీకరించాయి. ప్రస్తుతం ఆయా కాలేజీలు కూడా తమ ఆదాయ వ్యయాలను బట్టి ఫీజుల పెంపును కోరేందుకు సిద్ధమవుతున్నాయి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రమాణాల పెంపు కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లోపాలున్న కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు జేఎన్టీయూహెచ్ నిరాకరించింది. దీంతో ఆయా కాలేజీల యాజమాన్యాలు నిధులు వెచ్చించి ల్యాబ్లు, కంప్యూటర్లు, లైబ్రరీ సహా ఇతర సౌకర్యాలను, ఫ్యాకల్టీని సమకూర్చుకున్నాయి. తాజాగా ఈ వ్యయాన్ని, ఆదాయ వ్యయాలను చూపి ఎక్కువ మొత్తంలో ఫీజు పెంపు కోరేందుకు ఈ కాలేజీలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు జాతీయ స్థాయి విద్యాసంస్థలైన ఎన్ఐటీ, ఐఐటీల్లో ఫీజులను కేంద్రం ఏకంగా మూడింతలు పెంచేందుకు సిద్ధమైంది. ఫ్యాకల్టీల వేతనాలు, నిర్వహణ వ్యయం పెరిగిన కారణంగా.. ఫీజులు పెంచుతున్నామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఫీజులు భారీగా పెంచాలని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు కోరుతున్నాయి. ముగుస్తున్న గడువు.. వచ్చే మూడేళ్ల పాటు వృత్తి విద్యా కాలేజీల్లో వసూలు చేయాల్సిన ఫీజుల ఖరారు కోసం... ఆయా కాలేజీల ఆదాయ వ్యయాలను సమర్పించేందుకు ఏఎఫ్ఆర్సీ నవంబర్ 23న నోటిఫికేషన్ జారీ చేసింది. నెల రోజులు గడువిచ్చినా ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. గడువు పెంచాలన్న యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు జనవరి 7వ తేదీ వరకు పొడిగించారు. ఆ తర్వాత మళ్లీ ఈనెల 22 వరకు గడువు పొడగించారు. అయితే ఇదే చివరి అవకాశమని, ఇకపై దరఖాస్తుల గడువు పొడగించేది లేదని ఏఎఫ్ఆర్సీ స్పష్టం చేసింది. ఇప్పటివరకు 20 కాలేజీల్లోపే తమ ఆదాయ వ్యయాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశాయి. గడువు ముగుస్తుండడంతో సోమవారం నుంచి కాలేజీలన్నీ దరఖాస్తులను అప్లోడ్ చేసే అవకాశం ఉంది. ఫీజుల పెంపు ఉండే కాలేజీలు, సీట్ల వివరాలు కోర్సు కాలేజీలు సీట్లు ఇంజనీరింగ్ 266 1,26,468 ఫార్మసీ 145 11,438 బీఈడీ 225 22,670 ఎంఈ/ఎంటెక్ 171 15,152 ఎం ఫార్మసీ 130 7,820 లా 17 2,850 ఎంబీఏ 347 41,796 ఎంసీఏ 49 2,966 (మెడికల్, డెంటల్, నర్సింగ్ సీట్లు వీటికి అదనం) కొన్ని ప్రధాన ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రస్తుత ఫీజులు.. విద్యా సంస్థ ఫీజు (రూ.లలో) సీబీఐటీ 1,13,300 వాసవి 1,09,300 వీఎన్ఆర్ విజ్ఞాన్జ్యోతి 97,500 ఎంజేఐటీ 82,200 ఎంవీఎస్ఆర్ 83,100 శ్రీనిధి 79,000 గోకరాజు రంగరాజు 75,200 కాకతీయ ఇనిస్టిట్యూట్(కిట్స్) 85,600 -
చెన్నై పై వాయుగుండం ప్రభావం
-
మోదీ నియోజకవర్గంలో విద్యాసంస్థలు బంద్
లక్నో: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వం వహిస్తోన్న నియోజకవర్గం వారణాసిలో ఏర్పడిన ఘర్షణ వాతావరణ ప్రభావం అక్కడి పాఠశాలలు, కాలేజీలు, ఇతర సంస్థలపై తీవ్రంగా పడింది. రెండో రోజు కూడా అవి తెరుచుకోలేదు. ఎప్పుడు ఎటునుంచి ఘర్షణ మొదలవుతుందో, రాళ్లు పడతాయో, తుపాకీ పేలుతుందో తెలియని ఆందోళనతో ఆయా సంస్థల యాజమాన్యాలు వాటిని తెరవలేదు. వారణాసిలో హిందూత్వ ప్రతినిధులు, పోలీసులకు మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. హిందూత్వ సంస్థల ప్రతినిధులపై సెప్టెంబర్ 22న జరిగిన లాఠీ చార్జిని నిరసిస్తూ సోమవారం ఉదయం నిర్వహించిన ర్యాలీ.. చివరికి హింసాయుతంగా మారడంతోపాటు పోలీసు బలగాలపై రాళ్లదాడికి ఆందోళనకారులు పాల్పడ్డారు. పదుల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు నిప్పుపెట్టారు. కొద్ది నిమిషాల్లోనే అల్లర్లు మరిన్ని ప్రాంతాలకు పాకాయి. దీంతో కర్ఫ్యూ కూడా విధించారు. ఆ ప్రభావం ఇప్పటికీ కనిపిస్తుండటంతో మంగళవారం కూడా వారణాసిలో అలాంటి పరిస్థితే కొనసాగుతోంది. గణేశ్ విగ్రహాలను గంగా నదిలో నిమజ్జనం చేసే విషయంలో ప్రభుత్వాధికారులకు, మండపాల నిర్వాహకులకు మధ్య తలెత్తిన విబేధాలే ప్రస్తుత అల్లర్లకు మూల కారణం. -
ప్రవేశాలివ్వనప్పుడు కాలేజీలెందుకు?
- మైనారిటీ విద్యా సంస్థలనుద్దేశించి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: మైనారిటీ విద్యార్థులకు ప్రవేశాలు ఇవ్వలేనప్పుడు కాలేజీలు మూసివేసుకోవడం మంచిదని మైనారిటీ విద్యా సంస్థలను ఉద్దేశించి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానిం చింది. మైనారిటీల కోసమంటూ ప్రభుత్వం నుంచి రాయితీలు పొంది కాలేజీలు ఏర్పాటు చేస్తున్న మైనారిటీ విద్యాసంస్థలు చివరకు మైనారిటీయేతరులతో సీట్లు భర్తీ చేస్తుండటం తమకు విస్మయం కలిగిస్తోందని హైకోర్టు తెలి పింది. ఇలా చేయడం మైనారిటీ విద్యార్థులకు అన్యాయం చేయడమేనని స్పష్టం చేసింది. ఈ కేసులో ఎంబీఏ కన్వీనర్ వాదనలు విన్న తరువాతనే ఉత్తర్వులిస్తామంటూ కన్వీనర్కు నోటీసులు జారీ చేస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక చీఫ్ జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరానికి తమకు ఎంబీఏ కోర్సుకు జేఎన్టీయూ, హైదరాబాద్ అనుమతిని ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ ఖాదర్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వేసిన పిటిషన్ను మంగళవారం విచారించింది. -
నగరంలో.. ఆట..పాట..
-
'ర్యాగింగ్పై ఉక్కుపాదం'
తాడేపల్లిగూడెం: కళాశాలల్లో ర్యాగింగ్కు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. తాడేపల్లిగూడెంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ర్యాగింగ్ నిరోధానికి కళాశాలల్లో బయట వ్యక్తుల ప్రమేయం లేకుండా చూసేందుకు ప్రతి విద్యార్థికి బార్ కోడింగ్, గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. కుల, మత సంఘాలకు సంబంధించి ఎలాంటి ప్రచార బోర్డులను అనుమతించేది లేదన్నారు. గతంలో విద్యాభివృద్ధికి 10 శాతానికి మించి బడ్జెట్ ఉండేది కాదని, ప్రస్తుత ప్రభుత్వం బడ్జెట్ను 17 శాతానికి పెంచి రాష్ట్రాన్ని 'ఎడ్యుకేషన్ హబ్'గా మార్చేందుకు కృషి చేస్తోందని చెప్పారు. విద్యతోపాటు పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించే విద్యాబోధన అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనికోసం బీవీ పట్టాభిరామ్, చాగంటి కోటేశ్వరరావు వంటి వారితో విద్యాసంస్థల్లో అవగాహన తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుందన్నారు. అన్ని కళాశాలల్లో వైఫై సౌకర్యంతోపాటు బయోమెట్రిక్ పద్ధతి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉత్తమ విద్యాబోధన అందించే చర్యల్లో భాగంగా విద్యార్థులకు 75 శాతం హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేస్తామన్నారు. ఆయన వెంట రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఉన్నారు. -
డైట్సెట్కు తగ్గిన ఆదరణ
గతేడాది లక్షన్నర.. ఈసారి 87 వేల దరఖాస్తులే సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కాలేజీలు, జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో (డైట్) ప్రవేశాల కోసం ఈసారి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. గత ఏడాది తెలంగాణ జిల్లాల నుంచి లక్షన్నర మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఈసారి ఆ సంఖ్య 87 వేలకు పడిపోయింది. ప్రవేశాల నోటిఫికేషన్ జారీలో ఆలస్యం కావడమే ఇందుకు కారణంగా అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో డీఈఈసెట్ నిర్వహణ, నోటిఫికేషన్ జారీకి అవసరమైన చట్ట సవరణ చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్లే విద్యార్థులు ఇతర డిగ్రీ కోర్సుల్లో చేరిపోయినట్లు సమాచారం. డైట్, డీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష డీఈఈసెట్-2015 నోటిఫికేషన్ను ఈనెల 5వ తేదీన జారీ చేసిన విద్యాశాఖ 8వ తేదీ నుంచి విద్యార్థులు ఫీజులు చెల్లించేలా, 9వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు పంపేలా చర్యలు చేపట్టింది. సోమవారం వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు, మంగళవారం దరఖాస్తులు అందించేందుకు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం వరకు 87 వేల దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే నెల 9న డీఈఈసెట్ నిర్వహించి, ఫలితాలు, ర్యాంకులను వచ్చే నెల 22న ప్రకటించనున్నట్లు తెలిపాయి. అందుబాటులోకి రానున్న 15 వేల సీట్లు రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్లు, ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో దాదాపు 15 వేల సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం జిల్లాల్లోని ప్రభుత్వ కాలేజీల్లో ఒక్కో కాలేజీలో 100 చొప్పున వేయి సీట్లు ఉండగా, 272 ప్రైవేటు కాలేజీల్లో 50 చొప్పున 13,600 సీట్లు ఉన్నాయి. అయితే కొన్ని ప్రైవేటు కాలేజీల్లోనూ 100 వరకు సీట్లకు అనుమతి తెచ్చుకున్నాయి. దీంతో ఈసారి డీఎడ్లో 15 వేల వరకు సీట్లు అందుబాటులోకి రానున్నాయి. -
ఇక్కడ నిల్లు... అక్కడ ఫుల్లు!
బాహుబలి చిత్రం రిలీజ్ ఎఫెక్ట్ కళాశాలలపై పడింది. శుక్రవారం ఆ సినిమాను జోగిపేట థియేటర్లో కూడా రిలీజ్ చేయడంతో స్థానిక, ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాలలు విద్యార్థులు లేక బోసిపోయాయి. తరగతి గదుల్లో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులే కనిపించారు. శుక్రవారం ఉదయం నుంచి రోడ్లపై విద్యార్థులు ఎవరూ కనిపించలేదు. ఉదయం 6 గంటలకే షో ప్రారంభించడంతో వారంతా ఉదయం నుంచే థియేటర్ల వద్ద బారులు తీరారు. -
ర్యాగింగ్కు అడ్డుకట్ట పడేనా?
అదో పైచాచిక క్రీడ.. సైకోయిజం..ఇలా ఎన్ని పేర్లు పెట్టినా ర్యాగింగ్కు సరిపోవు. ఎందుకంటే తోబుట్టువుల్లా కలసి మెలసి ఉండాల్సిన విద్యార్థులు జూనియర్లు..సీనియర్లు అన్న తేడా చూపి, ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్నారు. ఈ విష సంస్కృతికి అడ్డుకట్ట వేయాల్సిన ఆవశ్యకత ఉంది. కళాశాలల యాజమాన్యాలు ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. త్వరలో ఐసెట్, ఎంటెక్, బీఈడీ, ఎంబీబీఎస్ తదితర కోర్సులకు కౌన్సెలింగ్ జరగనుంది. ఈ క్రమంలో అక్కడడక్కడ ర్యాగింగ్ జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ర్యాగింగ్పై ప్రత్యేక కథనం. యూనివర్సిటీ క్యాంపస్: వృత్తి విద్యా కళాశాలల్లో ర్యాగింగ్ అధికంగా జరుగుతోంది. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, ర్యాగింగ్ను తీవ్రంగా పరిగణిస్తూ కఠిన చట్టాలు అమలు పరుస్తున్నా యి. ర్యాగింగ్ నిరోధం కోసం రాష్ట్ర ప్రభుత్వం 1997లో ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. విద్యార్థులు కళాశాలలో చేరే సమయంలోనే తాము ఎలాంటి ర్యాగింగ్ కార్యకలాపాలకు పాల్పడబోమని హామీ పత్రాలను కళాశాల యా జమాన్యాలు తీసుకుంటున్నాయి. అయినా ఈ విష సంస్కృతికి పూర్తిగా అడ్డుకట్ట పడలేదు. కళాశాల యాజమాన్యాలు దీని నిరోధానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సివుంది. విద్యార్థులకు కౌన్సెలింగ్ విద్యార్థుల్లో మానసిక పరివర్తన కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కమిటీలో సభ్యురాలుగా ఉన్నాను. అన్ని కళాశాలలో సందర్శిస్తూ ర్యాగింగ్ నిరోధక చర్యలను తీసుకుంటున్నాం. మహిళా యూనివర్సిటీ, పద్మావతి డిగ్రీ కళాశాల విద్యార్థులకు పలుమార్లు అవగాహన సదస్సులునిర్వహించాం. - సీహెచ్. అంజూయాదవ్, సీఐ, వెస్ట్ పోలీస్ స్టేషన్ రహస్య నిఘా విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధానికి ప్రత్యేక బృందాలను నియమించి నిఘా ఏర్పాటు చేశాం. ర్యాగింగ్ బాధితులు సమాచారం ఇవ్వడానికి వీలుగా అన్నిచోట్లా పోలీస్ అధికారుల ఫోన్నంబర్లను అందుబాటులో ఉంచాం. ర్యాగింగ్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. - ఎం. శ్రీనివాసులు, సీఐ, క్యాంపస్ పోలీస్ స్టేషన్ అవగాహన సూచికలు క్యాంపస్లో ర్యాగింగ్పై అవగాహన కల్పిస్తూ సూచికలు ఏర్పాటు చేశాం. ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాలు, శిక్షలపై అవగాహన కల్పిస్తున్నాం. అధ్యాపకులు, సీనియర్, జూనియర్ విద్యార్థులతో నిరోధక కమిటీ వేశాం. వారి మధ్య సమన్వయం కోసం ప్రారంభంలోనే స్పోర్ట్స్ మీట్ పెడుతున్నాం. - ఎస్. రవీంద్రనాథ్, పరిపాలనాధికారి, సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల జూనియర్లకు ప్రత్యేక హాస్టల్ శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ నిరోధ చర్యల్లో భాగంగా జూనియర్లకు ప్రత్యేక హాస్టల్ వసతి కల్పిస్తున్నాం. స్వర్ణముఖి హాస్టల్ను పూర్తిగా జూనియర్లకే కేటాయించాం. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు విద్యార్థులపై ప్రత్యేక నిఘా ఉంటుంది. అడ్మిషన్ సమయంలో అండర్టేకింగ్ తీసుకుంటున్నాం.-సీ ఈశ్వర్రెడ్డి, శ్రీపద్మావతి మహిళా వర్సిటీ, ఇంజినీరింగ్ కళాశాల డెరైక్టర్ ఇలా చేయాలి... - ర్యాగింగ్ నిరోధానికి కళాశాలలు, ప్రత్యేక బాధ్యత వహించాలి. - కళాశాలలో చేరే సమయంలో అండర్ టేకింగ్ తీసుకోవాలి. - సీనియర్లు, జూనియర్లు కలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. వారికి విడివిడిగా హాస్టల్ వసతి కల్పించాలి. - సదస్సుల ద్వారా చట్టాలపై అవగాహన కల్పించాలి. చట్టాలు ఏమి చెబుతున్నాయంటే... - జూనియర్లను టీజ్ చేయడం, అవమానిం చడం చేస్తే ఏడాది జైలు, రూ.వెయ్యి జరి మానా. - దాడి చేసి గాయపరిస్తే ఏడాది జైలు, రూ.2 వేల జరిమానా. - బలవంతంగా నిరోధించడం, గాయపరచ డం చేస్తే 2ఏళ్లు జైలు, రూ.5 వేల జరిమానా - జూనియర్లను అపహరించడం, లైంగికం గా వేధిస్తే ఐదు సంవత్సరాల జైలు, 10 వేలు జరిమానా. - ఆత్మహత్యకు కార ణం అయితే 10 ఏళ్లు జైలుశిక్ష, రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు జరిమానా. -
బలవంతపు చదువులు.. బలిపీఠాలు
- విద్యలో ఒత్తిడే కారణం.. - ర్యాంకులు, మార్కుల పైనే దృష్టి - పక్కవారితో పోల్చడంతో ఆత్మనూన్యతా భావం - విద్యార్థి ఆసక్తిని గమనించకపోవడం - కళాశాలలు సైతం ర్యాంకులకే ప్రాధాన్యమివ్వడం - తల్లిదండ్రులు బాధ్యులే నంటున్న నిపుణులు లబ్బీపేట : మా అబ్బాయి ఐఐటీలో చదవాలి...ఆమ్మాయి డాక్టర్ కావాలనేది తల్లిదండ్రుల ఆకాంక్ష. అందుకు నర్సరీ నుంచి ఆ ఫౌండేషన్ వున్న స్కూల్స్లో చేర్చించి వేలాది రూపాయలు ఫీజులు చెల్లిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ పిల్లలో అభిరుచులు మారుతున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకుని తల్లిదండ్రులు, తమ ఆలోచనలను వారిపై రుద్దుతున్నారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు నిపుణులు చెపుతున్నారు. రెండు రోజుల కిందట అనంతపురంలో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య.. రెండు నెలల కిందట హైదరాబాద్లో సీఏ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యలే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. నగరంలో సైతం ప్రతిఏటా కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఆత్మహత్యలకు పాల్పడటం చూస్తున్నాం. అందుకు మానసిక విశ్లేషకులు, విద్యావేత్తలు పలు కారణాలను చెపుతున్నారు. ఆత్మహత్యలు నివారించేందుకు మానసిక విశ్లేషకులు, విద్యావేత్తలు పలు సూచనలు చేస్తున్నారు. అసలేం జరుగుతోంది.. విద్యార్థులకు ఆహ్లాదంతో కూడిన విద్యావిధానం అందుబాటులో ఉండాలి. రోజూ 7 నుంచి 8 గంటలు మాత్రమే చదువుకు కేటాయించాలి. అలాకాకుండా రోజుకు 13-14 గంటల పాటు చదవడం వలన తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నట్లు నిపుణులు చెపుతున్నారు. ఎక్కువ సమయం పనిచేయడం వలన మెదడు తీవ్ర ఒత్తిడికి లోనవడంతో చదువుపై ఆసక్తి తగ్గుతుంది. దీంతో జ్ఞాపకశక్తి తగ్గడం, నిద్ర చాలక ఇబ్బందులతో బాడీలో సిస్టమ్ రీయాక్టివేట్ కాదని మానసిక నిపుణులు చెపుతున్నారు. మనస్సు, శరీరం ఉత్సాహభరతమైన స్థితిని పొందలేదని, దీంతో పరీక్షలంటే భయం, ఆందోళన మొదలవుతుంది. ఒకవైపు తల్లిదండ్రులు తమపై ఎన్నో ఆశలతో వేలాది రూపాయలు వెచ్చించి చదివిస్తుంటే, ఆ మేరకు రాణించలేక, న్యాయం చేయలేక పోతున్నామనే భావన వుంటుంది. కొంతమంది ఈ స్థితిని తట్టుకోలేక ఆత్మనూన్యతతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు చెపుతున్నారు. కాలేజీ యాజమాన్యం ఏం చేయాలి... పోటీ ప్రపంచంలో విద్యార్థులపై ఒత్తిడి వుండాలి కానీ, అది మితిమీరి ఉండకూడదు. ఒత్తిడిని తట్టుకునే శక్తిసామర్థ్యాలు పిల్లల్లో పెంపొందించాలి. అందులో భాగంగా చదువులో పాటు పేపర్స్ చదవడం, కొద్దిసేపు టీవీ చూడటం, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనేలా చూడాలి. ఇలాంటి వాటి వలన పిల్లల్లో ఒత్తిడి పాజిటివ్గా మారి చదువులో వచ్చిన అలసటకు ఉపశమనం లభిస్తుంది. మోటివేషన్ క్లాసెస్ పెట్టాలి, ప్రతి కాలేజీలో సైకాలజిస్ట్ను కన్సల్టెంట్గా ఉంచడం ద్వారా పిల్లలు ఏమైనా తేడాతో ప్రవర్తిస్తున్నారో గుర్తించవచ్చు. ఒత్తిడికి గురవుతున్న వారిని గుర్తించి సకాలంలో కౌన్సెలింగ్ ఇప్పించాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి.. ముందుగా పిల్లల ఆసక్తిని అడిగి తెలుసుకోవాలి. వారు ఏ సబ్జెక్ట్లో రాణిస్తామంటే అందులోనే చేర్చాలి. పిల్లలు తల్లిదండ్రుల వద్దనే వుండేలా చూడటం మంచిది. హాస్టల్లో ఉన్నప్పుడు వారానికో, పదిరోజులకో ఒకసారి వెళ్లి వారితో మాట్లాడాలి. పిల్లల్ని అప్పుడప్పుడు ఇంటికి తీసుకెళ్తూ ఉండాలి. పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చినప్పుడు, ఇతరులతో పోల్చి మాట్లాడకుండా, వారిని పాజిటివ్గా ప్రోత్సహించాలి. మరోసారి ట్రై చేయి ఇంకా మంచి మార్కులు సాధిస్తావు అనే ధోరణిలో మాట్లాడాలి. విజ్ఞానం కోసమే విద్య మార్కులు, ర్యాంకుల కోసం కాదు..విజ్ఞానం కోసమే విద్య అనే విషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అంతేకాని పిల్లలకు ర్యాంకు రాలేదని తల్లిదండ్రులు డిప్రెషన్లో మాట్లాడుతుంటే పిల్లలు ఆత్మనూన్యతకు గురవుతుంటారు. పిల్లలను అభినందించడం నేర్చుకోవాలి. పక్క పిల్లలతో పోలుస్తూ అవమానంగా మాట్లాడకూడదు. నీవు పనికరావు అనే మాట ఎప్పుడూ వాడకూడదు. విద్యార్థులు సైతం ఆత్మహత్య పరిష్కారం కాదు..జీవితం ఎంతో విలువైనదని తెలుసుకోవాలి. ఒత్తిడిని జయించి, మార్కులు పొందేందుకు పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. విద్యార్థులు ఒత్తిడికి గురయ్యే సమయంలో తమ అభిప్రాయాలను స్నేహితులతో పంచుకుంటారు. తనకు చదువుపై ధ్యాస ఉండటం లేదని, ఈ జీవితం వ్యర్థం అంటూ మాట్లాడేవారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వగలిగితే వారి విలువైన జీవితాలను నిలబెట్టవచ్చు. డాక్టర్ టీఎస్ రావు, మానసిక విశ్లేషకులు తరగతి గదులకే పరిమితం కాకూడదు విద్యార్థులను నిరంతరం తరగతి గదులకే పరిమితం చేయడం ద్వారా వారిలో స్ట్రెస్ మరింత పెరిగిపోతోంది. వారిని యంత్రాలుగానే తయారుచేస్తున్నారు. అయితే బోధనాంశాన్ని ఇస్తే, విద్యార్థి శోధించి సాధించేలా తీర్చిదిద్దాలి. అందుకు విద్యా విధానంలో మార్పు రావాల్సిన అవసరం వుంది. అందుకు ఉపాధ్యాయులతో పాటు, తల్లిదండ్రుల్లో సైతం మార్పు అనివార్యం. తల్లిదండ్రులు ర్యాంకులు, మార్కులే ముఖ్యం కాదనే విషయం తెలుసుకోవాలి. ఆటపాటలతో మానసికంగా, శారీరకంగా మానసికోల్లాసాన్ని కలిగించే విద్యావిధానం అవసరం. అందుకు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం వుంది. - బి రవిప్రసాద్, విద్యావేత్త -
ఈసారి అమలు చేయలేం!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, పీజీ కోర్సుల్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) 2015-16 విద్యా సంవత్సరంలో అమలు చేయడం సాధ్యం కాదని రాష్ట్రంలోని వర్సీటీలు స్పష్టం చేశాయి. ఫ్యాకల్టీ, సదుపాయాలు లేకుండా సీబీసీఎస్ను అమలు చేయలేమని చేతులెత్తేశాయి. సీబీసీఎస్కు అనుగుణంగా సిలబస్ విభజన సులభమే అయినా.. 60 శాతానికిపైగా ఖాళీలు ఉండడంతో అమలు చేయడమెలాగని ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయాన్నే ఉన్నత విద్యా మండలి వర్గాలకు తెలియజేశాయి. అంతేగాకుండా అనుబంధ కా లేజీలపై నియంత్రణ సరిగ్గా లేని పరిస్థితుల్లో సీబీసీఎస్ను ఎలా అమలు చేస్తామని పేర్కొంటున్నాయి. అనుసంధానమెప్పుడు? సాధారణంగా అన్ని కాలేజీల్లో అన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉండవు. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) విధానంలో ఇష్టమైన సబ్జెక్టును ఎంచుకుని, చదువుకోవాలంటే ఆయా కోర్సులు అందుబాటులో ఉండే కాలేజీల మధ్య అనుసంధానం అవసరం. కానీ ఇలాంటి వ్యవస్థను యూనివర్సిటీలు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. యూనివర్సిటీల్లో సరిపడా సిబ్బంది లేకపోవడమే దీనికి కారణం. అసలు రెగ్యులర్ కోర్సులను బోధించే ఫ్యాకల్టీనే యూనివర్సిటీల్లో లేనపుడు సీబీసీఎస్ ఎలా సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాత కోర్సుల్లో సీబీసీఎస్ అమలు చేయాలని భావించినా.. ఫ్యాకల్టీ లేకుండా, పక్కాగా ల్యాబ్ సదుపాయాలు లేకుండా అమలు చేయడం సాధ్యం కాదని వర్సిటీల వర్గాలు తేల్చిచెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారికి సీబీసీఎస్ అమలు నుంచి మినహాయింపు ఇవ్వాలని... ఇందుకోసం యూజీసీ నుంచి అనుమతి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. మరోవైపు యూజీసీ మాత్రం ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీసీఎస్ అమలు చేయాల్సిందేనని ఇప్పటికే స్పష్టం చేసింది. అంతేకాదు తాము సూచించిన సిలబస్లో 30 శాతం వరకు మాత్రమే మార్పులు చేసుకోవచ్చని, అదికూడా సిలబస్ పరిధిలోనే చేసుకోవాలని స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా 2015-16లోనే సీబీసీఎస్ అమలు చేస్తామని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కూడా యూజీసీకి తెలియజేసింది. కానీ ఫ్యాకల్టీ, వసతులు లేకుండా కుదరదని వర్సిటీలు చెబుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయగలమని పేర్కొంటున్నాయి. సీబీసీఎస్ అమలు చేయాలంటే దరఖాస్తు నమూనాలోనూ మార్పు చేయాల్సి ఉంటుందని.. కాని ఇప్పటికే డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కాలేజీలు, వర్సిటీలు పాత పద్ధతిలోనే దరఖాస్తులను ఆహ్వానించాయని స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోవడం కూడా గందరగోళానికి కారణం అవుతోంది. -
మా కాలేజీ జాడేదీ?
పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాల దరఖాస్తుల ప్రక్రియ ప్రహసనంగా మారింది. ఈ నెల 30తో గడువు ముగియనుంది. కానీ ఇప్పటికి వందలాది కాలేజీలు ఈపాస్ వెబ్సైట్లో కనిపించకపోవడంతో ఆయా కాలేజీల విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. జిల్లావ్యాప్తంగా 1,207 కాలేజీలున్నాయి. ఇందులో ఇంటర్ కాలేజీలు మిన హాయిస్తే 904 డిగ్రీ, వృత్తివిద్యా కాలేజీలు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 3.2లక్షల మంది విద్యార్థులున్నాయి. విద్యాసంవత్సరం మధ్యలోనే ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తులు స్వీకరించాల్సిఉండగా.. సర్కారు నిర్లక్ష్యంతో ఈ ప్రక్రియలో జాప్యం జరిగింది. ఈ క్రమంలో తక్కువ వ్యవధి ఉండడంతో అనేక కాలేజీలు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఫలితంగా ఆయా కాలేజీలు ఈపాస్ వెబ్సైట్లో కనిపించక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో ఇంటర్మీడియెట్ కాలేజీలు మినహాయిస్తే.. 904 కాలేజీలు కొనసాగుతున్నాయి. వీటిలో 750 కాలేజీలు ఇప్పటికే వివరాలు సమర్పించి రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే పూర్తిస్థాయి వివరాలు ఇవ్వకపోవడంతో పలు కాలేజీలను అధికారులు తిరస్కరించారు. ఈ క్రమంలో జిల్లాలో కేవలం 422 కాలేజీలకు మాత్రమే ఆమోదముద్ర పడడంతో అవి మాత్రమే ఈపాస్ వెబ్సైట్లో కనిపిస్తున్నాయి. మిగతా 482 కాలేజీలు ఈ పాస్లో జాడలేకపోవడంతో అందులో చదువుతున్న విద్యార్థులు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తుకు దూరమయ్యారు. కొత్త విధానంతో.. కాలేజీల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. గతంలో జిల్లాస్థాయిలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు రిజిస్ట్రేషన్ దరఖాస్తులు అందించేవారు. వాటిని వెరిఫై చేసిన అనంతరం ఈ పాస్లో నమోదుకు ఆమోదించేవారు. కానీ 2014-15 విద్యాసంవత్సరానికి సంబంధించి.. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ వద్ద కాకుండా నేరుగా సంబంధిత యూనివర్సిటీల్లోనే రిజిస్ట్రేషన్ చేయించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లాలోని 904 కాలేజీలే ఉస్మానియా, జేఎన్టీయూ, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ తదితర 17 వర్సిటీల్లో సంబంధిత వాటిలో రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంది. ఈ క్రమంలో పరిశీలన మరింత పకడ్బందీ కావడంతో పలు కాలేజీలు రిజిస్ట్రేషన్కు అర్హత సాధించలేక పోయారు. గడువు పెంచితేనే ఫలితం.. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి ఈనెల 30వరకు గడువుంది. అయితే సగానికిపైగా కాలేజీలు రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడంతో విద్యార్థులు దరఖాస్తుకు దూరమయ్యారు. అసలే విద్యాసంవత్సరం ముగియడం.. ఆపై ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుకు మరో నాలుగు రోజుల్లో గడువు ముగియనుండడంతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గడువు పెంచకుంటే వారికి ఉపకార ఫలితాలు శాశ్వతంగా దూరమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో గడువు పెంచాల్సిందేనని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
నాణ్యత పాటించే కాలేజీలకే మనుగడ
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హైదరాబాద్: రాష్ట్రంలో నాణ్యతా ప్రమాణాలు, నిబంధనలు పాటించే కాలేజీలకే మనుగడ ఉంటుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలను మూసేయడం తమ ఉద్దేశం కాదని, నాణ్యత ప్రమాణాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 288 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1.70 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా ఎంసెట్లో కేవలం 70 వేల మందే క్వాలిఫై అవుతున్నారని చెప్పారు. ఏఐసీటీఈ, జేఎన్టీయూహెచ్ నిబంధనలను పాటించే కాలేజీలే ఉంటాయని, నాణ్యత పాటించని కాలేజీలెందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో వర్సిటీల కోసం చట్టాన్ని రూపొందిస్తున్నామని, దీనికి 2-3 నెలల సమయం పడుతుందని తెలిపారు. సమస్యల్లోనూ ఫలితాలివ్వడం అభినందనీయం: చుక్కా రామయ్య కొత్తగా ఏర్పడిన తెలంగాణ ఇంటర్ బోర్డులో అనేక సమస్యలు, ఉద్యోగుల కొరత ఉన్నప్పటికీ పట్టుదలతో పనిచేసి, పకడ్బందీగా పరీక్షలను నిర్వహించి ఫలితాలివ్వడం అభినందనీయమని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య పేర్కొన్నారు. ప్రభుత్వ కాలేజీల ఫలితాలు కూడా బాగున్నాయని, అయితే ఇంకా పక్కాగా చర్యలు చేపట్టాలని బుధవారం ఆయన పేర్కొన్నారు. -
విద్యార్థులకు ‘ఉపకారం’ చేయరా..!
కడప రూరల్ : జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారులకు వింత సమస్య ఎదురైంది. మహాప్రభో ఉపకార వేతనాల కోసం విద్యార్థుల దరఖాస్తులను పంపండి.. నిధులు మంజూరు చేస్తామని మొత్తుకుంటున్నా ఆయా కళాశాలలు స్పందించడం లేదు. దీంతో ఆ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అందని 5458 ఎస్సీ విద్యార్థుల దరఖాస్తులు 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫీజులు, స్కాలర్షిప్పుల కోసం రెన్యూవల్ విద్యార్థులు 9766, ఫ్రెషర్స్ విద్యార్థులు 7845, మొత్తం 17611 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 12153 మందికి ఉపకార వేతనాలు మంజూరు చేశారు. అయితే ఇంకా కాలేజీ స్థాయిలో 1514 మంది విద్యార్థుల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 839 మంది దరఖాస్తులు ఆధార్కు వేలిముద్రలను కళాశాల యాజమాన్యాలు తీసుకుని పంపాల్సి ఉంది. అలాగే 2945 మంది దరఖాస్తులను ఆన్లైన్లో పొందుపరిచారు. అయితే, అందుకు సంబంధించిన హార్డ్ కాపీలను సోషల్ వెల్ఫేర్కు పంపలేదు. మొత్తం కలిపి 5458 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఉపకార వేతనాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 577 కళాశాలల్లో ఎస్సీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆ కళాశాలల నుంచి ఈ 5458 దరఖాస్తులు రావాల్సి ఉంది. ఇంతవరకు ఆ దరఖాస్తులు రాకపోవడంతో సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకు ఉపకార వేతనాలను మంజూరు చేయలేక పోతోంది. కళాశాల నిర్లక్ష్యం కారణంగానే ఆ శాఖకు దరఖాస్తులు అందడం లేదని తెలుస్తోంది. కళాశాల యాజమాన్యాలే బాధ్యత వహించాలి 2014-15లో ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేశాము. అయితే, 5458 మంది దరఖాస్తులు కళాశాల స్థాయిలో పెండింగ్లో ఉన్నందున వారికి నిధులు మంజూరు చేయలేక పోతున్నాము. కళాశాల యాజమాన్యాలు ఆ వివరాలు పంపకపోతే విద్యార్థులు ఉపకార వేతనాలు పొందడం ఆలస్యం అవుతుంది. అందుకు కళాశాల యాజమాన్యాలే బాధ్యత వహించాలి. ఇందుకు సంబంధించి ఈనెల 11వ తేది ఉదయం కడప మహిళా డిగ్రీ కళాశాలలో, సాయంత్రం ప్రొద్దుటూరులోని వైఎస్సార్ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపాళ్లతో సమావేశం ఏర్పాటు చేశాము. - పీఎస్ఏ ప్రసాద్, జాయింట్ డెరైక్టర్, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ, కడప. -
ముందుగానే వేసవి సెలవులు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలకు ఈసారి వేసవి సెలవులను ముందుగానే ప్రకటించాలని ప్రభుత్వ వర్గాలు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు ఉన్న షెడ్యూలు ప్రకారం పాఠశాలలకు ఏప్రిల్ 23 చివరి పనిదినం కాగా జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. అయితే దీనివల్ల రాష్ట్ర అవతరణదిన వేడుకలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడుతుందని, అందుకే ఏప్రిల్ 12 నుంచి మే చివరి వరకు వేసవి సెలవులను ఇవ్వాలని, జూన్ 1న పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. -
ఇక పాఠశాలల్లో బయోమెట్రిక్ సిస్టమ్
విద్యార్థుల ఆధార్తో అనుసంధానం మొదటి విడతలో ఐదు జిల్లాల ఎంపిక అందులో ఒకటి చిత్తూరు చిత్తూరు: అన్ని ప్రభుత్వ,ప్రయివేటు పాఠశాలలు,కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పాఠశాలల్లో బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సర్వర్లతో వీటిని అనుసంధానం చేయనున్నారు. దీని ద్వారా పాఠశాలలకు చెందిన మొత్తం సమాచారం అందుబాటులోకి రానుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి బయోమెట్రిక్ పరికరాలను అమరుస్తారు. 200 మంది లోపు విద్యార్థులకు ఒకటి చొప్పున ఈ పరికరాలను అమర్చనున్నారు. ఇందుకోసం మొదటి విడతలో చిత్తూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, గుంటూరుతోపాటు మొత్తం ఐదు జిల్లాలను ఎంపిక చేశారు. ఈ జిల్లాల్లో తొలుత బయోమెట్రిక్ విధానానికి ఆధార్ అనుసంధానం పూర్తిచేసి దీన్ని అమలుచేయనున్నారు. తరువాత మిగిలిన జిల్లాల్లోనూ బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేస్తారు. ఈ విధానంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, పాఠశాలలకు మంజూరవుతున్న నిధులు, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, దుస్తుల పంపిణీ, చదువు మానేసిన సమాచారంతోపాటు సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ వివరాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు మార్గం సుగమం కానుంది. రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించిన ఆధార్కార్డు నంబర్ సేకరణ ప్రక్రియ చాలా రోజుల క్రితమే ప్రారంభమైంది. విద్యాశాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 5,98,676 మంది విద్యార్థులు ఉన్నారు. ఉన్నత చదువులకు సంబంధించి విద్యార్థులను కలిపితే 10లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 97 శాతం ఆధార్ ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే ఆధార్ అనుసంధానం పూర్తిచేసి బయోమెట్రిక్ అమలు చేయనున్నారు. -
కాసుల మేళా
శాతవాహ న యూనివర్సిటీ: ఉన్నత విద్య అభ్యసించి, మంచి ఉద్యోగం సంపాదించి భవిష్యత్కు బాటలు వేసుకోవాలనుకొనే విద్యార్థుల ఆశలతో కొన్ని కళాశాలలు చెలగాటమాడుతున్నాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్ విధానం విపరీతమైన ప్రాచుర్యం పొందడంతో ప్రస్తుతం అన్ని డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు క్యాంపస్ రిక్రూట్మెంట్స్ను కాసుల మేళాగా మార్చుకుంటున్నాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్ అంటే ఉద్యోగం కోసమే అనే మాటను అనేక కళాశాలలు మార్చేశాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్ చేయడమే ఒక స్టేటస్ సింబల్గా భావిస్తున్నాయి. తమ ప్రచారం కోసం, అడ్మిషన్లు పెంచుకోవడానికి ఈ దీనిని ఒక అవకాశంగా వినియోగించుకుంటున్నాయి. మరోవైపు క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఉద్యోగాలు విద్యార్థుల పాలిట ఎండమావిలా తయారయ్యాయి. చదువు కొనసాగిస్తున్న సమయంలోనే ఉద్యోగం తమను వెతుక్కుంటూ వస్తుందన్న ఆశలతో వారు క్యాంపస్ రిక్రూట్మెంట్కు హాజరవుతున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలు, పేరుమోసిన కంపెనీల్లో ఉద్యోగం అవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ కష్టాలు గట్టెక్కినట్లేనని భావిస్తున్నారు. తీరా ఇంటర్వ్యూలకు హాజరై, ఉద్యోగాల్లో చేరితే గానీ క్యాంపస్ రిక్రూట్మెంట్లు మేడిపండు చందమేననే చేదు నిజం తెలియడం లేదు. ఆర్భాటం ఎక్కువ.. అంతా డొల్ల జిల్లాలోని చాలా కళాశాలల్లో నిర్వహించే క్యాంపస్ రిక్రూట్మెంట్లలో వారు చేస్తున్న ప్రచారానికి వాస్తవానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఎంపిక కోసం హైదరాబాద్, ముంబయి. బెంగళూర్లలోని అనేక ప్రముఖ కంపెనీలు వస్తున్నాయని, ఐదు వందల వర కు పోస్టులున్నాయని ఆర్భాటంగా ప్రకటనలు, ప్రచారాలు చేసి కళాశాలలు విద్యార్థులకు గాలం వేస్తున్నాయి. క్యాంపస్ మేళాకు వచ్చేసరికి కంపెనీ పేరును బూతద్దం పెట్టి వెతికినా ప్రముఖ కంపెనీల జాబితాలో కనిపించకపోవడంతో విద్యార్థులు మోసపోయామని గొల్లుమంటున్నారు. పైగా క్యాంపస్ రిక్రూట్మెంట్లలో అధికంగా ఇప్పిస్తున్న ఉద్యోగాలను చూస్తే కాల్సెంటర్లలో చిన్నచిన్న ఉద్యోగాలు మాత్రమే ఉంటున్నాయి. ఇవన్నీ చూస్తే రిక్రూట్మెంట్లో ఆర్భాటం ఎక్కువ.. అంతా డొల్ల అనే విమర్శలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ పేరుతో ఫీజులు వసూలు ఏ కళాశాలలో రిక్రూట్మెంట్ అయినా కళాశాలల ప్రచారార్భాటంతో ఒక్కో మేళాకు దాదాపు వేలాది మందికి విద్యార్థులు హాజరవుతున్నారు. కొంతమంది దూర ప్రాంతాల నుంచి కూడా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వస్తున్నారు. క్యాంపస్ మేళాకు హాజరయ్యే ప్రతి విద్యార్థి నుంచి రూ.100 నుంచి రూ.200 వరకు రిజిస్ట్రేషన్ ఫీజు రూపేణా కళాశాలలు వసూలు చేస్తున్నాయి. ఉద్యోగం వచ్చినా రాకపోయినా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉండడతో ఒక్క మేళా నిర్వహిస్తే రూ.లక్ష నుంచి రూ.2లక్షల దాకా గిట్టుబాటవుతున్నాయి. కంపెనీలను నగరాల నుంచి తీసుకురావడానికి కళాశాలలు దళారులను వాడుకుంటూ వారికి కొంత కమీషన్ చెల్లిస్తున్నాయి. అటు రాయితీలు.. ఇటు మోసాలు.. పలు కంపెనీలు ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో రాయితీలు, సెజ్ల పేరిట నామమాత్రపు ధరలకే ప్రభుత్వ భూములు పొందుతుంటాయి. ప్రభుత్వం నుంచి ఇలాంటి సదుపాయాలు అందుకుంటున్నందున కొంతమంది విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటామని సదరు కంపెనీలు సర్కారుతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. అందులో భాగంగానే క్యాంపస్ రిక్రూట్మెంట్లు నిర్వహిస్తున్నాయి. కంపెనీ ఒప్పందంలో పేర్కొన్నామనే కారణంతో క్యాంపస్ రిక్రూట్మెంట్లకు వస్తున్న చాలా కంపెనీలు తమకు కావాల్సిన అర్హతలు సదరు విద్యార్థుల వద్ద లేవనే సాకుతో ఉద్యోగాలు ఇవ్వడం లేదు. అడ్మిషన్లు పెంచుకోవడానికి కళాశాలలు, తూతూమంత్రంగా కంపెనీలు, డబ్బులు దండుకోవడానికి దళారులు నిర్వహిస్తున్న క్యాంపస్ రిక్రూట్మెంట్లలో చివరకు విద్యార్థులు మోసపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగానికి ఎంపికైన వారి నుంచే రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయాలని, మొదటి జీతం పేరిట కోతలు పెట్టడం ఆపాలని, మోసాలను అరికట్టాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. కానీ కళాశాలల యాజమాన్యాలు ఇవేమీ పట్టించుకోకుండా విద్యార్థులు చెల్లించే రిజిస్ట్రేషన్ ఫీజు కంపెనీ వారికే వెళ్తుందని, దానిలో విద్యాసంస్థలకు వచ్చేది లేదని నమ్మబలకడమే కాకుండా, విద్యార్థులకు ఉద్యోగాలను అందించడానికి అనేక రకాల వ్యయప్రయసాలు ఎదుర్కొంటున్నామని మొసలికన్నీరు కార్చుతున్నాయి. అందుకే అభ్యర్థులూ తస్మాత్ జాగ్రత్త. -
పట్టభద్రుల జాడేదీ..?
* ఓటరుగా నమోదుకు ఆసక్తి చూపని గ్రాడ్యుయేట్లు * కాలేజీలు, బ్యాంకులు, ఇతర సంస్థలకు లేఖలు రాసిన ఎన్నికల సంఘం నల్లగొండ: పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం నామమాత్రంగానే కొనసాగుతోంది. వచ్చే ఏడాది మార్చితో ముగియనున్న నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించేదుకుగాను గత నెల 26 నుంచి కొత్తగా పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఓటరుగా నమోదుకు ఈ నెల 16వ తేదీ చివరి గడువు. అయితే రాజకీయపార్టీలు గడువు పెంచాలంటూ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. ఓటరు నమోదు ప్రారంభమైననాటినుంచి ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే మూడు జిల్లాల్లో కలిపి కేవలం 9,415 దరఖాస్తులు మాత్రమే అధికారులకు చేరాయి. వీటిలో నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 4,784 దరఖాస్తులు రాగా, ఆ తర్వాతిస్థానంలో ఖమ్మం, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. మన జిల్లాలో ఓటరు నమోదు తీరును పరిశీలిస్తే...పట్టణాల్లోనే ఎక్కువ శాతం దరఖాస్తులు వచ్చాయి. మండలాల్లో ఓటరుగా నమోదు చేసుకునేందుకు గ్రాడ్యుయేట్లు అంతగా ఆసక్తి చూపడం లేదు. అత్యధికంగా నల్లగొండ పట్టణంలో 650 దరఖాస్తులు వచ్చాయి. సూర్యాపేట 398, మిర్యాలగూడ 375, భువనగిరి 317, కోదాడ 159, హుజూర్నగర్ 135, దేవరకొండ 105 దరఖాస్తులు వచ్చాయి. ఇక మండలాల్లో అత్యధికంగా మునగాల 106, నార్కట్పల్లి 95, తుంగతుర్తి 98, అత్యల్పంగా డిండి మండలంలో 16, గుండాల 15, శాలిగౌరారం మండలంలో 15 దరఖాస్తులు వచ్చాయి. నగరాల్లోనే నివాసం... మారుమూల మండలాలు, హైదరాబాద్కు సమీపంలో ఉన్న మండలాల్లో ఓటరు నమోదు ఆశించిన స్థాయిలో కావడం లేదు. ఉద్యోగం, వ్యాపారం, చదువులరీత్యా ఎక్కువ శాతం గ్రాడ్యుయేట్లు నగరాల్లోనే ఉంటున్నారు. దీంతో ఓటరు నమోదు శాతం పెరగడం లేదు. అయితే ఎన్నికల సంఘం దీనిని దృష్టిలో పెట్టుకుని కాలేజీలు, బ్యాంకులు, ఇతర సంస్థలకు లేఖలు రాసింది. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న గ్రాడ్యుయేట్లు అయిన ఉద్యోగులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు వీలుగాని పక్షంలో ...అందరి దరఖాస్తులను ఒక్కరే తీసుకుని సంబంధిత త హసీల్దారు కార్యాలయంలో లేదా రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సమర్పించే అవకాశం కల్పించారు. పోటీపోటీగా ప్రచారం.. ఓటరు నమోదు షెడ్యూల్ కంటే ముందుగానే గ్రాడ్యుయేట్ అసోసియేషన్ సంఘాలు ఓటరు నమోదుకు తెరతీశాయి. ప్రచారం నిర్వహించడంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. అధికారికంగా అభ్యర్థి పేరు ఖరారు కాకపోయినప్పటికీ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్రెడ్డి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి రామ్మోహన్రావు పేరును ప్రకటించారు. ఇటీవలే ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా సమావేశమయ్యాయి. కానీ ఓటరు నమోదు కార్యక్రమంలో ఈ రెండు పార్టీలు సమష్టిగా పనిచేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇతర రాజకీయపక్షాలు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. ఓటరు నమోదు గడువు ముగింపు దగ్గరపడుతున్న తరుణంలో ఈ పార్టీల అభ్యర్థుల పేర్లు ఖరారు కాకపోవడం పట్ల రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అదీగాక ఇదే పద్ధతిలో ఓటరు నమోదు కొనసాగితే రాజకీయ పార్టీలకు ఇబ్బందులు తప్పవు. -
బ్రేక్ఫాస్ట్ షో : ఇంకెన్నాళ్ళీ ర్యాగింగ్..?!
-
కాలేజీల్లో ర్యాగింగ్పై యూజీసీ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీలు, వాటి పరిధిలోని కాలేజీల్లో ర్యాగింగ్పై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీవ్రంగా స్పందించింది. కాలేజీల ఆవరణలో ర్యాగింగ్ నిరోధానికి, ర్యాగింగ్కు పాల్పడే వారిని గుర్తించి కఠినంగా శిక్షించేందుకు అవసరమైన పక్కా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లోని యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లకు ఆదేశాలు జారీ చేసింది. ర్యాగింగ్ నిరోధానికి గతంలో జారీ చేసిన నిబంధనలకు సవరణలు చేసింది. ప్రతి విద్యార్థి ర్యాగింగ్ నిరోధానికి కట్టుబడి ఉంటామని ప్రతి విద్యార్థి, వారి తల్లిదండ్రులు ఆన్లైన్లో విద్యాసంస్థలకు ప్రతి విద్యా సంవత్సరం అండర్టేకింగ్ ఇచ్చేలా కచ్చితమైన చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఇటీవల రాష్ట్రంలోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో (ఇఫ్లూ) విద్యార్థినిపై రేప్ జరగడం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ ర్యాగింగ్ నిరోధానికి కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది. యూజీసీ ఆదేశాలను పక్కాగా అమలు చేసేలా విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. -
విద్యార్థుల పాట్లు
ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుకు 10న ఆఖరు సమయం లేకపోవడంతో మీ సేవ, రెవెన్యూ కార్యాలయాల వద్ద పడిగాపులు 80 వేల మందికి 21 వేల మంది విద్యార్థులే రెన్యువల్ ఓ వైపు కళాశాలల్లో వేలకు వేలు ఫీజులు.. మరో వైపు తీవ్ర కరువు.. ఆర్థిక ఇబ్బందుల నడుమ పేద విద్యార్థుల చదువు ఫీజు రీయింబర్స్మెంట్తో గట్టెక్కుతోంది. అయితే ప్రభుత్వ నిర్ణయం వీరి పాలిట శాపంగా మారుతోంది. రీయింబర్స్మెంట్ రెన్యువల్కు కేవలం 14 రోజులు మాత్రమే గడువు ఇచ్చారు. ఈ లోపు జన్మభూమి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు అందక పడరాని పాట్లు పడుతున్నారు. తిరుపతి తుడా: ఫీజు రీయింబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 10న చివరి తేదీ కావడంతో విద్యార్థులు కుల, ఆదాయ, నేటివిటీ సర్టిఫికెట్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మీ సేవ, రెవెన్యూ కార్యాలయాల్లో పడిగాపులు కాస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్కు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అక్టోబర్ 28 నుంచి ఈనెల 10వ తేదీ వరకు కేవలం 14 రోజులు మాత్రమే గడువు ఇచ్చింది. కుల ధ్రువీకరణ పత్రం పొందాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీ సేవలో ఆన్లైన్లో రశీదు పొందిన తరువాత 15 రోజుల సమయం పడుతుంది. రీయింబర్స్మెంట్ తేదీల ప్రతిపాదనలను గత నెల 27న అన్ని కళాశాలలకు పంపించారు. ‘ఈ పాస్’ లాగిన్లో అందుబాటులో ఉంచారు. కళాశాలల యజమానులు రీయింబర్స్ మెంట్ తేదీలను నోటీస్ బోర్డులో ఉంచడంతో పాటు తరగతి గదులకు పంపాల్సిఉంది. నూటికి తొంభై శాతం కళాశాలలు ఈ నోటీసులను సరైన సమయంలో విద్యార్థుల దృష్టికి తీసుకెళ్లలేదనే ఆరోపణలు ఉన్నా యి. రీయింబర్స్మెంట్ తేదీలపై విద్యార్థులకు సమాచారం లేకపోవడంతో ఇప్పటి వరకు 80 వేల మందికి గాను, 21వేల మంది విద్యార్థులు మాత్రమే రెన్యువల్కు నమోదు చేసుకున్నారు. చివరి తేదీకి మూడు రోజు లు గడువు ఉన్నా శని, ఆదివారాలు సెలవు కావడం తో ఇక సోమవారం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉం టుంది. దీంతో విద్యార్థులు రెవెన్యూ కార్యాలయాల నుంచి సర్టిఫికెట్లు అందక, ఫీజు రీయింబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకోలేక కంటతడి పెడుతున్నారు. రీయింబర్స్మెంట్కు రెన్యువల్ గడువును పెంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల పడిగాపులు నిబంధనల ప్రకారం మీ సేవలో కుల ధ్రువీకరణకు-15 రోజులు, ఆదాయం, నేటివిటీ, ఇంటిగ్రేట్ సర్టిఫికెట్లకు-10 రోజులు సమయం పడుతుంది. రీయింబర్స్మెంట్ తేదీ ప్రకారం కేవలం 14 రోజులు గడువిచ్చారు. విద్యార్థులు తెలుసుకుని వాటికి దరఖాస్తు చేసుకునే లోపు 10 రోజులు పట్టింది. మిగిలిన నాలుగు రోజుల్లో ధ్రువీకరణ పత్రాలు పొందడానికి వీలు కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు జన్మభూమి రావడంతో రె వెన్యూ అధికారులు కార్యక్రమాలకే పరిమితమయ్యారు. తిరుపతి అర్బన్ రెవెన్యూలో ఇందుకోసం ప్రత్యేకంగా ఇద్దరిని ఏర్పాటు చేసినా ఫలితం లేకుం డా పోయింది. -
ఫీజు దోపిడీ
మహబూబ్నగర్ విద్యావిభాగం: బీఈడీ కాలేజీలు సిండికేటుగా మారి విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు దండుకుంటున్నారు. కన్వీనర్ కోటాలో సీటు దక్కినా తాము చెప్పినంత చెల్లించాల్సిందేనంటూ భీష్మించాయి. ఈ ఫీజు చెల్లించే ఆర్థికస్తోమత లేక సగంమంది విద్యార్థులు కాలేజీల్లో చేరలేదు. ఈ విషయంపై అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 40 బీఈడీ కళాశాలల యాజమాన్యాలు సిండికేట్గా మారాయి. యూనివర్సిటీల పరిధిలో ఉన్న కళాశాలల్లో వసతులు, పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ట్యూషన్ ఫీజు నిర్ణయించింది. ట్యూషన్ ఫీజు *13,500, స్పషల్ ఫీజు *3000 కలిపి *16,500 వరకు మాత్రమే ఫీజు తీసుకోవాలని నిబంధనలు విధించింది. కౌన్సెలింగ్ ద్వారా కన్వీనర్ కోటాలో సీటు వచ్చిన విద్యార్థులకు స్పెషల్ ఫీజు మాత్రమే తీసుకొని జాయిన్ చేసుకోవాలని ఆదేశాలున్నాయి. అయితే, మొత్తం ఫీజు చెల్లించాలని యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొన్ని కళాశాలల యాజమాన్యాలు 30వేల వరకు వసూలు చేస్తున్నారు. స్పెషల్ ఫీజుతో అండర్టేకింగ్ తీసుకొని విద్యార్థులను అడ్మిషన్ చేసుకోవాలని కళాశాలల యాజమాన్యాలకు చెప్పినావినడం లేదు. ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన అలాట్మెంట్ లెటర్లో కూడా ఫాస్ట్ పథకం వర్తిస్తుందని పేర్కొన్నా కళాశాలల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. కన్వీనర్ కోటా కింద సాధించిన విద్యార్థులు కళాశాలల చుట్టూ తిరిగి వేసారిన సగం మంది విద్యార్థులు కాలేజీల్లో చేరలేదు. కాలేజీల్లో చేరేందుకు బుధవారం గడువు ముగుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో తమ అడ్మిషన్ల పరిస్థితేంటని వారు ఆందోళన చెందుతున్నారు. స్పందించని పీయూ అధికారులు.. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పీయూ అధికారుల దృష్టికి సమస్యను తీసుకుపోయినా పట్టించుకున్న పాపాన పోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు కళాశాలల యాజమాన్యాలతో కుమ్మక్కు కావడం వల్లే ఇలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. విద్యార్థుల నుంచి *16,500 ఫీజు వసూలు చేయాలని వీసీ చెప్పారంటూ ఓ కళాశాల ప్రిన్సిపాల్ చెప్పుకుంటున్నా పట్టించుకోవడం లేదు. -
ఫీజుకు బూజు
ఫీజు బకాయి రూ.44.80 కోట్లు కర్నూలు(అృర్బన్): కొత్త ప్రభుత్వం కొలువుదీరి వంద రోజులు పూర్తయినా ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలపై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. గత ఏడాదికి సంబంధించిన ఫీజుల విషయంలోనూ చొరవ చూపకపోవడంతో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. కళాశాలలు పునఃప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన దాదాపు 41,442 మంది విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల రూపంలో రూ.44.80 కోట్లు బకాయి పడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి దాటవేస్తుండటం పట్ల విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, మెడికల్, ఇంజనీరింగ్ తదితర ఉన్నత చదువులతో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్, బీఎడ్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఉపకార వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. రెన్యూవల్ విద్యార్థులతో పాటు ఈ ఏడాది వివిధ కోర్సుల్లో చేరిన ఫ్రెష్ విద్యార్థులదీ అదే పరిస్థితి. జిల్లాలోని పలు కళాశాలల ప్రిన్సిపాళ్లు విద్యార్థులకు సంబంధించిన హార్డ్ కాపీలను పంపడంలో జాప్యం కూడా అర్హులైన విద్యార్థులకు శాపంగా మారుతోంది. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, బడ్జెట్ విడుదల తదితర విషయాల్లో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కూడా ఫీజుల విషయంలో ప్రభావం చూపుతోంది. నిధుల విడుదలలో అలసత్వం కారణంగా ఆయా కోర్సులు పూర్తి చేసినప్పటికీ కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు అందించేందుకు సుముఖత చూపని పరిస్థితి నెలకొంది. మరికొన్ని యాజమాన్యాలు రెన్యూవల్ విద్యార్థులను ఫీజులు చెల్లించాలని.. ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీ ఫీజులు తిరిగిస్తామని నమ్మబలుకుతున్నట్లు తెలుస్తోంది. 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించి 3,550 మంది ఎస్సీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, మెయింటెనెన్స్ ఆఫ్ ట్యూషన్ ఫీజెస్ కింద రూ.4 కోట్ల బకాయి ఉంది. కాగా 1,030 మంది ఎస్సీ విద్యార్థులకు సంబంధించిన హార్డ్ కాపీలను పంపడంలో జిల్లాలోని వివిధ కళాశాలలు జాప్యం చేస్తున్నాయి. అదేవిధంగా 2012-13 ఏడాదికి సంబంధించి కూడా ప్రభుత్వం రూ.2 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. జిల్లాలోని వివిధ కళాశాలల నుంచి 2013-14 విద్యా సంవత్సరానికి దాదాపు 600 మంది గిరిజన వర్గాలకు చెందిన విద్యార్థుల హార్డ్ కాపీలు నేటికీ అందకపోవడంతో అవసరమైన బడ్జెట్ ఉన్నా.. రూ.80 లక్షలను మంజూరు చేయలేని పరిస్థితి. జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న మైనార్టీ విద్యార్థులకు కూడా ఫీజును చెల్లించాల్సి ఉంది. 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించి 13,834 మంది విద్యార్థులకు రూ.16 కోట్ల బకాయి ఉండటం గమనార్హం. బీసీ, ఈబీసీలకు రూ.24 కోట్ల బకాయి 17,573 మంది బీసీ విద్యార్థులకు 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.14 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్.. 5,985 మంది ఈబీసీ విద్యార్థులకు ఫీజు కింద రూ.10 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అలాగే 2012-13 సంవత్సరానికి సంబంధించి 770 మంది బీసీ విద్యార్థుల ఫీజుకు రూ.85 లక్షలు, 120 మంది ఈబీసీ విద్యార్థుల ఫీజుకు రూ.35 లక్షలు కూడా ప్రభుత్వం బకాయి పడింది. బీసీ, ఈబీసీ విద్యార్థులకు సంబంధించి అనేక కళాశాలలు హార్డ్కాపీలను సకాలంలో అందించకపోవడం కూడా ఫీజు విడుదల జాప్యానికి కారణంగా తెలుస్తోంది. -
మూతపడనున్న ఇంజనీరింగ్ కాలేజీలు
-
ఫీజు బకాయిలు చెల్లించాల్సిందే..
రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీల నేతల డిమాండ్ హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కళాశాలల యాజమాన్యాలకు చెల్లించాల్సిందేనని వివిధ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టినా తాము సహకరిస్తామని, అయితే, పాత బకాయిలను మాత్రం వెంటనే విడుదల చేయాలన్నారు. హైదరాబాద్లో శనివారం తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీలు, వృత్తి విద్యా కాలేజీల యాజమాన్యాల సంఘం వివిధ పార్టీల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఇందులో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీసీఐ, సీపీఎం, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో ఫీజు బ కాయిలను చెల్లించడంతోపాటు కౌన్సెలింగ్ను త్వరగా ప్రారంభించాలని అన్నిపార్టీలు కోరాయి. మానవతా దృక్పథంలో ఫీజులను చెల్లించాలని, తప్పులకు పాల్పడే కాలేజీలపై చర్యలు తీసుకోవాలని సూచించాయి. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్, ఎమ్మెల్సీ రామునాయక్, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు, కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జగన్నాథరావు, సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ప్రజా సంఘాల నాయకులు సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రావారికి ఆపాలనుకునే క్రమంలో పెడుతున్న నిబంధనలు, 1956 స్థానికత వంటి వాటితో తెలంగాణలోని నిరుపేదలకే అన్యాయం జరుగుతుందని నేతలు పేర్కొన్నారు. ఈ సమస్యలపై సీఎం దృష్టిసారించాలన్నారు. రేపు అడ్మిషన్స్ కమిటీల సమావేశం హైదరాబాద్: ఇంజనీరింగ్ తదితర వృత్తివిద్యాకోర్సుల్లో ప్రవేశాలకు ఏర్పాటైన సెట్స్ కమిటీల సమావేశం ఈనెల 28న నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులు హాజరుకానున్నారు. ప్రవేశాల ప్రక్రియపై భవిష్యత్తు కార్యాచరణను ఈ సందర్భంగా నిర్ణయించే అవకాశం ఉంది. -
మొబైల్స్ వల్లే అత్యాచారాలు.. వేధింపులు!
స్కూళ్లు, కాలేజీల్లో వాటిని నిషేధించాలి కర్ణాటక సర్కారుకు శాసనసభా కమిటీ వివాదాస్పద సిఫారసు బెంగళూరు: అత్యాచారాలు, లైంగిక వేధింపులను నియంత్రించాలంటే పాఠశాలలు, కళాశాలకు విద్యార్థులు మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా నిషేధం విధించాలని కర్ణాటక శాసనసభా కమిటీ సిఫారసు చేయడం వివాదాస్పదమైంది. స్కూళ్లు, కాలేజీల్లో మొబైల్స్పై నిషేధం విధించేలా విద్యా శాఖకు ఆదేశాలు జారీ చేయాలని స్త్రీ, శిశు సంక్షేమంపై ఏర్పాటైన శాసనసభా కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ నివేదికను సమర్పించింది. శకుంతలా శెట్టి నేతృత్వంలోని ఈ కమిటీ ఇచ్చిన నివేదిక శుక్రవారం అసెంబ్లీ ముందుకొచ్చింది. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే బాలికలపై రేప్, అదృశ్యం కేసులను పరిశీలించగా.. దీనికి మొబైల్ ఫోన్లే కారణమని వెల్లడైందని శకుంతలా శెట్టి సమర్థించుకున్నారు. ముగ్గురు అత్యాచార బాధిత బాలికలను ప్రశ్నించామని, మిస్డ్కాల్తో మొదలైన పరిచయాలు రేప్లకు దారి తీసినట్టు గుర్తించామని చెప్పారు. అందువల్లే స్కూళ్లు, కాలేజీల్లో మొబైల్స్పై నిషేధం విధించాలన్నారు. మహిళలపై వేధింపులకు సంబంధించి స్కూళ్లు, కాలేజీల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని, పోలీసుల పనితీరును మెరుగు కోసం పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రతి స్టేషన్లో 20 శాతం మంది మహిళా పోలీసులను నియమించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. 7. -
అత్యాచారాలకు మొబైల్ ఫోన్లే కారణం:శాసనసభా కమిటీ
బెంగళూరు: అత్యాచారాలు, లైంగిక వేధింపులను నియంత్రించాలంటే పాఠశాలలు, కళాశాలకు విద్యార్థులు మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా నిషేధం విధించాలని కర్ణాటక శాసనసభా కమిటీ సిఫారసు చేయడం వివాదాస్పదమైంది. స్కూళ్లు, కాలేజీల్లో మొబైల్స్పై నిషేధం విధించేలా విద్యా శాఖకు ఆదేశాలు జారీ చేయాలని స్త్రీ, శిశు సంక్షేమంపై ఏర్పాటైన శాసనసభా కమిటీ కర్ణాటక ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ ఓ నివేదికను సమర్పించింది. శకుంతలా శెట్టి నేతత్వంలోని 23 మంది సభ్యుల కమిటీ సమర్పించిన ఈ నివేదిక శుక్రవారం అసెంబ్లీ ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరుగుతున్నాయని, ఈ తరహా ఘటనల వల్ల ప్రపంచం ముందు మన దేశం తలదించుకోవాల్సి వస్తోందని కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే బాలికలపై అత్యాచారాలు, అదృశ్యం కేసులను పరిశీలించగా, దీనికి మొబైల్ ఫోన్లే కారణమని వెల్లడైందని శకుంతలా శెట్టి సమర్థించుకున్నారు. అత్యాచారాలకు గురైన ఇద్దరు, ముగ్గురు బాలికలను తాము ప్రశ్నించామని, మిస్డ్ కాల్తో మొదలైన పరిచయాలు అత్యాచారాలకు దారి తీసినట్లుగుర్తించామని చెప్పారు. అందువల్లే స్కూళ్లు, కాలేజీల్లో మొబైల్స్పై నిషేధం విధించాలని సూచించామన్నారు. మహిళలపై వేధింపులకు సంబంధించి స్కూళ్లు, కాలేజీల్లో తరచుగా సెమినార్లు, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని, పోలీసుల పనితీరును మెరుగు పరిచేందుకు పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రతి స్టేషన్లో 20 శాతం మంది మహిళా పోలీసులను నియమించాలని, మరిన్ని మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కూడా ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. -
విద్యార్థులకు ఆర్టీసీ వరాలు
రాయితీతో బస్పాస్లు జారీ చేస్తున్న అధికారులు నిజామాబాద్ నాగారం: పాఠశాలలు, కళాశాలలు పున:ప్రారంభమయ్యాయి.. విద్యార్థులంతా బడిబట పట్టారు.. తమ గ్రామం నుంచి ఇతర ప్రాంతానికి వెళ్లి చదువుకునే వి ద్యార్థులకు ప్రయాణం భారంగా మారకుండా వారికి అవసరమైన బస్సుపాస్లు జారీ చేసేందుకు ఆర్టీసీ రం గం సిద్ధం చేసింది. జిల్లాలోని అన్ని ప్రధాన బస్టాండ్లో బస్సు పాస్లు ఇస్తున్నారు. నిజామాబాద్-1, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, డిపోలతోపాటు, ప్రధాన బస్టాండ్లో సైతం ఈ బస్సు పాస్లు జారీ చేస్తున్నారు. రూ.20తో బస్పాస్లు.. 12 ఏళ్లలోపు లేదా 7వ తరగతి వరకు చదివే విద్యార్థులు(బాలురు) వారి గ్రామం నుంచి పాఠశాల వరకు 20కిలో మీటర్లలోపు ఉంటే బస్ పాస్లు జారీ చేస్తారు. 12 జూన్ నుంచి ఏప్రిల్ 24, 2015 వరకు ఈ పాస్ చెల్లుబాటు అవుతుంది. దీనికోసం విద్యార్థులు రూ.20 చెల్లిస్తే సరిపోతుంది. 18 ఏళ్లలోపు లేదా పదో తరగతి చదివే విద్యార్థినులకు(బాలికలు) వారి గ్రామం నుంచి పాఠశాల వరకు 20కిలోమీటర్లలోపు బస్ పాస్లు జారీ చేస్తారు. 12 జూన్ 2014 నుంచి ఏప్రిల్ 24 2015 వరకు ఈ పాస్ చెల్లుబాటు అవుతుంది. ఈ ఉచిత బస్పాస్లు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మా త్రమే జారీ చేస్తారు. కావాల్సిన పత్రాలు.. విద్యార్థులు ప్రభుత్వపరంగా గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు సంబంధించిన ధ్రవీకరణ పత్రాలను సంబంధిత ప్రధానోపాధ్యయుడు, ప్రిన్సిపల్తో ధ్రువీకరించి దరఖాస్తులు సమర్పించాలి. * విద్యార్థి ప్రవేశ నంబరు, పేరు, బ్రాంచ్, చదువుతున్న తరగతి వంటి వివరాలు పొందుపర్చాలి. * రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలతో ఎవరికి అవసరమైతే వారే స్వయంగా బస్పాస్ కేంద్రానికి రావాలి. * జిల్లాలో ఏ డిపో పరిధిలోని విద్యార్థులకు ఆ డిపో పరిధిలోనే పాస్లు జారీ చేస్తారు. కళాశాలలకు నేరు గా వచ్చి ఆర్టీసీ అధికారులే బస్సుపాస్లు అందిస్తున్నారు. * ఆదివారం, సెలవురోజుల్లో బస్పాస్లు జారీ చేయరు. రాయితీ బస్పాస్ల ధరలు.. ఈ పాస్ పొందాలంటే 35 కిలోమీటర్లలోపు విద్యా సంస్థ ఉండాలి. ఇందుకోసం ధ్రువీకరణ పత్రాలతోపాటు, బస్పాస్ ఫారం కోసం రూ.15 చెల్లించాలి. వీటిని ప్రతినెల పునరుద్ధరణ చేయించుకోవాలి. అలాగే దీంతోపాటు 3 నెలల రాయితీ పాస్లు ఒకేసారి తీసుకుని 3 నెలలు రాయితీపై ప్రయాణించవచ్చు. వాటి వివరాలు... -
విద్యార్థుల వీరంగం
క్రమంతప్పకుండా కాలేజీలకు వెళ్లి విద్యాబుద్దులు నేర్చుకోవాల్సిన విద్యార్థులు బస్డే పేరుతో వీరంగం సృష్టించారు. రాళ్లు కర్రలతో దాడులకు పాల్పడి పలువురిని గాయపరిచారు. మరో సంఘటనలో బస్సును దారిమళ్లించి ప్రయాణికులను భయాందోళనలకు గురిచేశారు. - బస్సులపై రాళ్ల వర్షం - పలువురికి గాయాలు - శృతిమించుతున్న బస్డే చెన్నై, సాక్షి ప్రతినిధి: నగరంలోని కళాశాలల విద్యార్థులు బస్డే పేరుతో కొంతకాలంగా విశృంఖలత్వాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారింది. బస్డే అమలులో భాగంగా బస్సు డ్రైవర్లను భయపెట్టి నెమ్మదిగా నడిపించడం, దారిమళ్లించడం వంటి చర్యలకు దిగుతున్నారు. వారిని ఎదిరించిన డ్రైవర్, కండక్టర్లను దుర్భాషలాడడంతోపాటు దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 12.45 నిమిషాలకు ఎంఎండీఏ రోడ్డు- ప్యారిస్ బస్సు (12జీ) కీల్పాక్ మీదుగా వెళుతుండగా కీల్కాక్ వైద్య కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో బస్సు ఎక్కారు. ఫుట్బోర్డుపై నిల్చుని పాటలు పాడుతూ సాగారు. బస్సును తాబేలు వేగంతో నడపాలని ఆదేశించారు. ఈ బస్సు పూందమల్లి రోడ్డులోని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం దాటగానే విద్యార్థులు హద్దుమీరారు. కొందరు బస్టాప్పైకి ఎక్కి నృత్యాలు చేశారు. మరికొందరు డ్రైవర్ సీటు వద్ద నిలబడి ఫొటోలు దిగారు. ఇంకో విద్యార్థి డ్రైవర్ను అతని సీటు నుంచి లేపి తాను నడిపే ప్రయత్నం చేశాడు. వారి చేష్టలకు భీతిల్లిన ప్రయాణికులు రహస్యంగా ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రాకను గమనించిన విద్యార్థులు పరుగులు తీశారు. డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులు ఎవ్వరూ వారిపై ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు కాలేదు. విద్యార్థుల మధ్య పరస్పరం దాడులు రెండు కాలేజీలకు చెందిన విద్యార్థులు శుక్రవారం పరస్పరం దాడులకు పాల్పడి బస్సులోని ప్రయూణికులను భయభ్రాంతులకు గురిచేశారు. పెరంబూరు - తిరువేర్కాడు (29ఈ) బస్సు ప్రయాణికులతో వెళుతుండగా మార్గమధ్యంలో పచ్చపాస్ కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఎక్కారు. బస్సులోపల స్థలం ఉన్నా ఫుట్బోర్డుపై ప్రయాణించారు. ఈ బస్సుకు ఎదురుగా మరో కాలేజీ విద్యార్థులతో అన్నాసమాధి- పెరంబూరు (29ఏ) బస్సు ఓట్టేరి బ్రిడ్జి వద్ద తారసపడింది. 29ఈ బస్సు ఫుట్బోర్డుపై ప్రయాణిస్తున్న విద్యార్థులను మరో బస్సులోని విద్యార్థులు దుడ్డుకర్రలతో కొట్టారు. బస్సుపై రాళ్లు రువ్వారు. దెబ్బలకు తాళలేక విద్యార్థులు బస్సులోపలికి వెళ్లిపోయారు. వారి దాడులతో రెండు బస్సుల్లోని ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఈ గందరగోళాన్ని గమనించిన డ్రైవర్ బస్సును నిలిపివేయడంతో దాడులకు పాల్పడిన వారు పరారయ్యూరు. రాళ్ల వర్షంతో సుమారు గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. ఈ దాడుల్లో బస్సులోని మహిళా ప్రయాణికులు రోషిణి, విజయభారతి, విద్యార్థులు భూపేష్, రామ్కుమార్ గాయపడ్డారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాజీ అనే విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
కృష్ణానదిపై బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు
కంచికచర్ల రూరల్ : కృష్ణానదీపై ఆరు ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. కంచికచర్లలో ఓ కార్యక్రమానికి ఆదివారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపేందుకు చెవిటికల్లు, అమరావతి మధ్యన నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. బందర్ పోర్టు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. పశ్చిమ కృష్ణాలో పరిశ్రమలు, కళాశాలల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. విజయవాడను తీర్చిదిద్దేందుకు అవసరమైన మేరకు కృషి చేస్తున్నామని చెప్పారు. కంచిచర్లలో తాగునీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వివాదాలకు పోకుండా ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు నాయకులు కృషి చేయాలన్నారు. కంచికచర్ల సమీపంలో హత్యకు గురైన యార్లగడ్డ విజయ్ కేసులో నిందితుల్ని గుర్తించి తక్షణమే అదుపులోకి తీసుకోవాలని నందిగామ డీఎస్పీ హుస్సేన్ను ఫోన్లో మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కోగంటి వెంకటసత్యనారాయణ, నాయకులు ఎన్. నరసింహారావు, లక్ష్మీనారాయణ, గుత్తా వెంకటరత్నం, వేమా వెంకట్రావ్ పాల్గొన్నారు. పరామర్శ కంచికచర్లలో సీపీఎం సీనియర్ నాయకుడు దొడ్డపనేని రామారావు సతీమణి కమల (76) అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె భౌతికకాయాన్ని మంత్రి సందర్శించి నివాళులర్పించారు. హత్యకు గురైన తెలుగుదేశం కార్యకర్త యార్లగడ్డ విజయ్ తల్లిదండ్రులు సాంబశివరావు, ప్రభావతిలను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. -
విహారయాత్రలకు తీసుకెళ్తే కాలేజీల గుర్తింపు రద్దు
జేఎన్టీయూ రిజిస్ట్రార్ రమణరావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థులను విహార యాత్రలకు తీసుకెళ్లకుండా అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు తెలిపారు. యూనివర్సిటీ అనుమతి లేకుండా విహారయాత్రలకు తీసుకెళ్తే కాలేజీ గుర్తింపును రద్దు చేసేలా నిబంధనలను రూపొందిస్తామని చెప్పారు. ఇంజనీరింగ్ విద్యార్థులను కాలేజీలు పారిశ్రామిక శిక్షణ కోసం పంపాలే తప్ప విహార యాత్రలకు కాదన్నారు. ఒకవేళ విహారయాత్రలకు తీసుకెళ్లాలంటే.. యూనివర్సిటీ అనుమతి తీసుకోవాలని చెప్పారు. అవసరమైన జాగ్రత్తలతో పాటు విద్యార్థుల రక్షణకు భరోసా ఇచ్చినపుడే యూనివర్సిటీ ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దీనిపై కమిటీ వేసి తగిన మార్గదర్శకాలను రూపొందిస్తామన్నారు. హెచ్ఆర్సీలో ఫిర్యాదు నగరానికి చెందిన వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్లో గల్లంతైన ఘటనపై బాలల హక్కుల సంఘం హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసింది. సోమవారం సంఘం కార్యదర్శి అనురాధ ఆధ్వర్యంలో హెచ్ఆర్సీ సభ్యులు పెద పేరిరెడ్డిని కలసి విన్నవించారు. విద్యార్థుల యాత్రపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.