colleges
-
అన్ని కాలేజీలకు ఒకే ఫీజు సరికాదు
సాక్షి, అమరావతి: పీజీ మెడికల్, డెంటల్ కోర్సులకు రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కాలేజీలని్నంటిలో ఏకీకృత ఫీజు సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీహెచ్ఈఆర్ఎంసీ) సిఫారసుల మేరకు 2020–21 నుంచి 2022–23 విద్యా సంవత్సరాలకు ఫీజును ఖరారు చేస్తూ ప్రభుత్వం 2020 మే 29న జారీ చేసిన జీవో 56ను రద్దు చేసింది.ఈ జీవో చట్టం ముందు నిలబడదని స్పష్టం చేసింది. ఏపీహెచ్ఈఆర్ఎంసీ అన్నీ మెడికల్, డెంటల్ కాలేజీలను ఒకే గాటన కట్టి, ఏకీకృత ఫీజు నిర్ణయించడం చట్ట విరుద్ధమన్న కాలేజీల వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఆ కాలేజీలు ప్రతిపాదించిన ఫీజుల వివరాలను పరిగణనలోకి తీసుకుని తిరిగి ఫీజు ఖరారు చేయాలని, ఆపైన రెండు నెలల్లో ఆదేశాలు జారీ చేయాలని కమిషన్ను ఆదేశించింది.ఒకవేళ ప్రతిపాదించిన ఫీజుతో కాలేజీలు విభేదిస్తే, ఆ కాలేజీ యాజమాన్యం అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే తగిన ఉత్తర్వులు జారీ చేయాలంది. కమిషన్ ఫీజులను పెంచితే, పెంచిన మేర బ్యాలెన్స్ మొత్తాలను అభ్యర్థుల నుంచి వారిచి్చన హామీ మేరకు కాలేజీలు వసూలు చేసుకోవచ్చని చెప్పింది. అదనపు ఫీజు వసూలులో నిర్ణయం అంతిమంగా కాలేజీలదేనని స్పష్టం చేసింది. జీవో 56ను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం ఈ ఏడాది సెప్టెంబర్లో విచారణ జరిపి, తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం తీర్పు వెలువరించింది.ఏకీకృత ఫీజు వల్ల కొన్ని లాభపడుతూ ఉండొచ్చు..ఏకీకృత ఫీజు విద్యార్థుల ప్రయోజనాలకు కూడా విరుద్ధం కావొచ్చునని హైకోర్టు తీర్పులో పేర్కొంది. తక్కువ ఫీజు ఉంటే మరింత ఎక్కువ చెల్లించాలని విద్యార్థులను కాలేజీలు బలవంతం చేయవచ్చునని తెలిపింది. ఏకీకృత ఫీజు వల్ల తగిన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధనా సిబ్బంది లేని కాలేజీలు లాభపడే అవకాశం ఉందని పేర్కొంది. మంచి సదుపాయాలు, నాణ్యమైన బోధనా సిబ్బంది కల్పిస్తున్న కాలేజీలకు ఇది నష్టం కలిగించవచ్చని తెలిపింది. ఇటువంటి కాలేజీలు ఎక్కువ ఫీజులు కోరడంలో తప్పులేదని తెలిపింది.ఫీజుల ఖరారుకు ముందు కాలేజీలు సమర్పించిన ఆదాయ, వ్యయాలు, మౌలిక సదుపాయాల వివరాలని్నంటినీ కమిషన్ పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదంది. ఆచరణ సాధ్యం కాని ఫీజును నిర్ణయించడం వల్ల ప్రత్యేక వృత్తి విద్యా కోర్సులు అందించే విద్యా సంస్థలు మూతపడతాయని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఆయా కాలేజీల నాణ్యత, సమర్థత, ఉత్పాదకతపైనా ప్రభావం చూపుతుందని తెలిపింది. -
ఢిల్లీలో ఆంక్షలు సడలించేందుకు ‘సుప్రీం’ నిరాకరణ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం కట్టడికి అమలు చేస్తున్న గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 ఆంక్షలను సడలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది. తమ ఆదేశాలు లేకుండా ఆంక్షలు తొలగించవద్దని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. దీనిపై గురువారం ని ర్ణయం తీసుకుంటామని తెలిపింది.ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఢిల్లీలో పాఠశాలలు, కళాశాలలు తెరిచే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. విద్యార్ధులు ఇంట్లో ఉండటం వల్ల కాలుష్య సమస్య తీరదని అభిప్రాయపడింది. ‘పెద్ద సంఖ్యలో విద్యార్థులకు తమ ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు లేవు, అందువల్ల ఇంట్లో కూర్చున్న పిల్లలకు, పాఠశాలకు వెళ్లే పిల్లలకు తేడా ఉండదు. అంతేగాక ఆన్లైన్ క్లాస్లలో పాల్గొనడానికి అందరి విద్యార్థులకు సౌకర్యాలు లేవు. ఇలాగే ఆన్లైన్ తరగతులు కొనసాగితే వారు వెనకబడిపోతారు. పాఠశాలలు, అంగన్వాడీలు మూసివేయడం వల్ల చాలా మంది విద్యార్ధులు మధ్యాహ్న భోజన సౌకర్యం కోల్పోతున్నారు. ’ అని జస్టిస్ ఎఎస్ ఓకా, జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. చదవండి: షిండేనే మహారాష్ట్ర సీఎం!ఈ మేరకు ఢిల్లీలో విద్యాసంస్థలు తెరిచే అంశాన్ని పరిశీలించాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్కు సూచించింది. అదే విధంగా 1 నుంచి 10,11, 12 తరగతులకు శారీరక తరగతులపై నిషేధం కొనసాగించడంతోపాటు ఫిజికల్ క్లాసుల నిర్వహణపై రేపటిలోగా (మంగళవార) నిర్ణయం చెప్పాలని సీఏక్యూఎమ్ను(CAQM) ఆదేశించింది.ఇక ఢిల్లీ పోలీసులపై సుప్రీంకోర్టు కొరడా ఝుళిపించింది. కాలుష్యాన్ని నివారించడంలో ఆంక్షలను సరిగా అమలు చేయకపోవడంపై సిటీ పోలీస్ కమిషనర్పై మండిపడింది. వాహనాల నియంత్రణకు చెక్పోస్టులు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేని వాహనాలను అనుమతించిన అధికారులపై సీరియస్ అయ్యింది. ఆదేశాలు అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.యాక్షన్ ప్లాన్-4 అమలు సమాజంలో అనేక వర్గాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని సుప్రీం ఆవేదన వ్యక్తం చేసింది. నిర్మాణరంగంలో కార్మికులు, దినసరి కూలీలు పనులు కోల్పోయారని తెలిపింది. 12 సెక్షన్ ప్రకారం శ్రామికులు ఇబ్బంది పడకుండా ఉండేలా వివిధ అధికారులకు ఆదేశాలు జారీ చేసేందుకు సీఏక్యూఎమ్కు అన్ని అధికారాలు ఉన్నాయి. కావున వారిందరికీ ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM)కి సూచించింది. -
తెలంగాణ వ్యాప్తంగా కాలేజీల సమ్మె! ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు డిమాండ్
-
బెంగళూరులో మూడు కాలేజీలకు బాంబు బెదిరింపులు
బెంగళూరు: బెంగళూరులో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి.బెంగళూరులోని మూడు ప్రముఖ కాలేజీలకు శుక్రవారం బాంబు బెదిరింపు మెయిల్స్ రావటంతో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. బీఎంఎస్ కాలేజీ, ఎంఎస్ రామయ్య కాలేజీ, బీఐటీ కాలేజీలకు బాంబు బెదిరింపులు రావటంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.Bengaluru Bomb Threat: Major Colleges, Including BIT, BMSCE and MSRIT Receive Bomb Threats; Probe Launchedhttps://t.co/BjoVZwox4e#Bengaluru #BIT #BombThreat— LatestLY (@latestly) October 4, 2024క్రెడిట్స్: LatestLYసమాచారం అందిన వెంటనే ఆయా కాలేజీల్లో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ , ఇతర సంబంధిత బృందాలు సెర్చ్ చేస్తున్నాయి. అవి నిజమైన బెదిరింపులా లేదా ఉత్తుత్తి బెదిరింపులా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఈ బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపులకు సంబంధించి.. హనుమంతనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.చదవండి: యూపీలో దారుణం.. నలుగురి కుటుంబ సభ్యుల హత్య -
38 కాలేజీల్లో జాబ్ గ్యారంటీ కోర్సులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కచ్చితమైన ఉపాధి కల్పించే ప్రయత్నాల్లో భాగంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ)రంగాల్లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణీత కాలేజీల్లో ప్రస్తుత 2024–25 విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా జాబ్ గ్యారంటీ కోర్సులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. రెగ్యులర్ డిగ్రీతోపాటు మినీ డిగ్రీ కోర్సుగా ‘బీఎఫ్ఎస్ఐ’ నైపుణ్య శిక్షణను అందించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 38 కాలేజీల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ఉన్నత విద్యామండలి గుర్తించిన 18 ఇంజనీరింగ్ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో చదువుతున్న 10వేల మంది విద్యార్థులకు శిక్షణ అందనుంది. ఈ కాలేజీల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్తో.. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ‘బీఎఫ్ఎస్ఐ’ కోర్సులు అందేవిధంగా కాలేజీలను ఎంపిక చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జాబ్ డిమాండ్ ఉన్న బీఎఫ్ఎస్ఐ సంస్థలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దేందుకు ఈ కోర్సు ఉపయోగపడనుంది. ఖరీదైన ఈ కోర్సును డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచితంగా అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా శిక్షణను అందుకోనున్న 10 వేల మంది విద్యార్థుల వివరాలతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ను రూపొందిస్తోంది. విద్యార్థుల బయోడేటాతోపాటు చదువుతున్న కాలేజీ, వారి విద్యార్హతలు, సాంకేతిక కోర్సుల అనుభవం వివరాలన్నీ అందులో పొందుపరుస్తారు. బీఎఫ్ఎస్ఐ రంగంలో పేరొందిన కంపెనీలు తమకు అవసరమైన ఉద్యోగులను ఎంపిక చేసుకునేందుకు ఈ పోర్టల్ వారధిగా పనిచేయనుంది. ఆ కంపెనీలు ఈ పోర్టల్లో ఉన్న విద్యార్థులతో నేరుగా వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ నైపుణ్యాలతో డిగ్రీ, ఇంజనీరింగ్లో కోర్సులు చేసిన విద్యార్థులకు ఉద్యోగ భరోసా దక్కనుంది. జాబితాలోని నాన్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే.. పింగళి ప్రభుత్వ మహిళా కాలేజీ– వడ్డేపల్లి, హన్మకొండ ఎస్ఆర్–బీజీఎన్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ– ఖమ్మం నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల– నల్గొండ ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, హైదరాబాద్ భవన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, హైదరాబాద్ ప్రభుత్వ సిటీ కాలేజీ, హైదరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సిద్దిపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, బేగంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఖైరతాబాద్ ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజీ, నాంపల్లి నిజాం కాలేజీ, హైదరాబాద్ ఆర్బీవీఆర్ఆర్ డిగ్రీ కాలేజీ, హైదరాబాద్ సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కాలేజీ, మెహదీపట్నం, హైదరాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా డిగ్రీ కాలేజీ, హైదరాబాద్ సెయింట్ పియస్ ఎక్స్ మహిళా డిగ్రీ కాలేజీ, నాచారం హైదరాబాద్ తారా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సంగారెడ్డి ఎంవీఎస్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, మహబూబ్నగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కరీంనగర్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, కోఠి, హైదరాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ, నిజామాబాద్ జాబితాలోని ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే.. బీవీఆర్ఐటీ హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీ (జేఎన్టీయూహెచ్) జి.నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (జేఎన్టీయూహెచ్) గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్– టెక్నాలజీ కాలేజీ (జేఎన్టీయూహెచ్) జేబి ఇంజనీరింగ్– టెక్నాలజీ కాలేజీ (జేఎన్టీయూహెచ్) జేఎన్టీయూ కూకట్పల్లి ప్రధాన క్యాంపస్ (జేఎన్టీయూహెచ్) కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జేఎన్టీయూహెచ్) మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జేఎన్టీయూహెచ్) వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ (జేఎన్టీయూహెచ్) వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్–టెక్నాలజీ (జేఎన్టీయూహెచ్) కిట్స్ వరంగల్ (కాకతీయ వర్సిటీ) చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఓయూ) మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీ (ఓయూ) మాటూరి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజీ (ఓయూ) మెథడిస్ట్ ఇంజనీరింగ్– టెక్నాలజీ కాలేజీ (ఓయూ) ఉస్మానియా వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ (ఓయూ) స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్– టెక్నాలజీ కాలేజీ (ఓయూ) ఆర్జీయూకేటీ బాసర (ఆర్జీయూకేటీ) బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నర్సాపూర్ (జేఎన్టీయూహెచ్) -
ప్రైవేట్ పై చంద్రబాబు మోజు
-
Rajasthan: బంద్తో విద్యాసంస్థల మూసివేత.. ఇంటర్నెట్ నిలిపివేత
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి ఈరోజు (బుధవారం) భారత్ బంద్కు పిలుపునిచ్చింది. బంద్ ప్రభావం రాజస్థాన్లోని విద్యాసంస్థలపై కనిపించింది.బంద్ పిలుపు నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. చిత్తోర్గఢ్ జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా భరత్పూర్లో భారత్ బంద్ దృష్ట్యా ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో స్థానికులు పలు ఇబ్బందులు పడుతున్నారు.భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పోలీసు బలగాలను మోహరించారు. చిత్తోర్గఢ్లో షెడ్యూల్డ్ కులాలు- తెగల మహార్యాలీ నిర్వహిస్తున్నారు.ఈ ర్యాలీ సందర్భంగా వీరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పిస్తారు. రాజస్థాన్లోని వివిధ విశ్వవిద్యాలయాలలో బుధవారం జరగాల్సిన పలు పరీక్షలను వాయిదా వేశారు. -
కాలేజీల్లో డ్రగ్స్ కట్టడికి క్లబ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ రక్కసిని అరికట్టడం, డ్రగ్స్ ముప్పును నివారించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. ఈ రెండు సమస్యలను పరిష్కరించేందుకు 24/7 పనిచేసే టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తేనుంది. వారం పది రోజుల్లో ఈ టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెస్తామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం ప్రకటించారు.ఎక్కడ ఇలాంటి తప్పులు జరిగినా విద్యార్థులు నిర్భయంగా ఈ నంబర్కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో శనివారం మాసాబ్ట్యాంక్లోని జేఎన్ఏఎఫ్ఏయూ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వారి వారి జీవితాలతోపాటు దేశాన్ని సైతం నాశనం చేస్తుందన్నారు. పాఠశాల స్థాయిలో డ్రగ్స్ను అరికట్టేందుకు ప్రహరీ క్లబ్లను ఏర్పాటుచేశామని, కాలేజీల్లో సైతం ఇలాంటి క్లబ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.పటిష్టమైన వ్యవస్థ: డీజీపీ జితేందర్తెలంగాణను డ్రగ్ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. రాష్ట్రంలో ర్యాగింగ్ను ఇప్పటికే నిషేధించామని, ర్యాగింగ్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైపుణ్యాలు తగ్గుతున్నాయని అన్నారు. దీనికి పరిష్కారంగానే ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటుచేసి, స్కిల్స్ కోర్సులను ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు.నగరాల్లోని వర్సిటీలు, కాలేజీలే కాకుండా మారుమూల ప్రాంతాల్లోని చిన్న కాలేజీల వరకు డ్రగ్స్ చేరాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. డ్రగ్స్తో కుటుంబాలు సైతం ఆర్థికంగా చితికిపోతున్నాయని పేర్కొన్నారు. కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన మాట్లాడుతూ.. యాంటీనార్కోటిక్స్ బ్యూరో తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదన్నారు. మన యువతను నాశనం చేయాలని కొంతమంది దుష్టులు కంకణం కట్టుకున్నారని, డ్రగ్స్ అనే యాసిడ్ను పిల్లలపై ప్రయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.యాంటీనార్కోటిక్స్ బ్యూరో డైర్టెర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ డ్రగ్స్ సంబంధిత సమాచారాన్ని 87126 71111 నంబర్కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. ర్యాగింగ్కు సంబంధించి ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిలో ఆరుగురు వైద్యులపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటరమణ, ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు డిగ్రీ కాలేజీలపై ‘న్యాక్’ పిడుగు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు ఇప్పటివరకు లేకున్నా ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చేవి. న్యాక్ను కేవలం నాణ్యత ప్రమాణాలకు సూచిక గానే పరిగణించేవి. రాష్ట్రంలో 1100 కాలేజీల్లో, కేవలం ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు కలిపి 200 కాలేజీలకే న్యాక్ గుర్తింపు ఉంది. కానీ ఇక మీదట ప్రతీ కాలేజీ న్యాక్ పరిధిలోకి రావాల్సిందే. ఇది ఉంటేనే అనుబంధ గుర్తింపు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలనే ప్రతిపాదన న్యాక్ తీసు కొస్తోంది. రాష్ట్రంలోని న్యాక్ గుర్తింపు ఉన్న (న్యాక్ కాలేజీలు), న్యాక్ గుర్తింపు లేని కాలేజీలు (నాన్–న్యాక్ కాలేజీలు)గా విభజి స్తారు. నాన్ న్యాక్ కాలేజీలకు క్రమంగా అను మతి ఇవ్వకూడదనే నిబంధన తేవాలనే యోచ నలో ఉన్నారు. ఈ మేరకు ఇటీవల బెంగళూరు కేంద్రంగా న్యాక్ విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించింది. దక్షిణ భారత రాష్ట్రాల ఉన్నత విద్య మండళ్ళ చైర్మన్లను, పలువురు విద్యారంగ నిపుణులను ఈ సమావేశాలకు ఆహ్వానించింది. న్యాక్ నిబంధనలను మరింత సరళతరం చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరించింది. కొత్త నిబంధనలపై రాష్ట్రాల స్థాయిలో అవగా హన కల్పించాలని కోరింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమవ్వాలని సూచించింది.90 శాతం కాలేజీలకు ఇబ్బందే!మౌలిక సదుపాయాల పెంపు, ఫ్యాకల్టీ, ఫలితాలు, ఉపాధి అవకాశాలు, సొంత బిల్డింగ్ ఉందా? వంటి అంశాలకు న్యాక్ బృందం మార్కులు ఇస్తుంది. దీని ఆధారంగానే గ్రేడ్ను కేటాయిస్తుంది. ఎక్కువగా కార్పొరేట్ కళాశాలలు మాత్రమే ఈ ర్యాంకులు పొందుతున్నాయి. కాగా, ఇప్పటి వరకూ న్యాక్ బృందాలు కళాశాలలను స్వయంగా పరిశీలించిన తర్వాతే గుర్తింపు ఇచ్చేవి. అలా కాకుండా ఆన్లైన్లోనూ పరిశీలించి అనుమతులు ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే న్యాక్ నిబంధనలు అమలు చేయాలంటే 90 శాతం కళాశాలలు ఇబ్బందిపడే అవకాశం ఉంది. కార్పొరేట్ కళాశాలలు మాత్రమే దీనివల్ల విస్తరిస్తాయనే విమర్శలొస్తున్నాయి. దాంతో న్యాక్ నిబంధనల్లో కొంత సడలింపు ఇవ్వాలని మండళ్ళ చైర్మన్లు ప్రతిపాదిస్తున్నారు. నాణ్యత లక్ష్యంగా సడలింపులు న్యాక్ నిబంధనల్లో సమూల మార్పులు చేసేందుకు న్యాక్ కౌన్సిల్ ప్రతిపాదించింది. దీనిపై విస్తృత స్థాయి చర్చ జరిగింది. గుర్తింపు ప్రక్రియను మరింత సరళీకృతం చేయడమే దీని ఉద్దేశం. అన్ని కాలేజీలను న్యాక్ గుర్తింపు పరిధిలోకి తేవడం, నాణ్యత పెంచడమే లక్ష్యం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్య మండలి చైర్మన్)అలాగైతే ఇబ్బందేన్యాక్ నిబంధనల పేరుతో చిన్నకాలేజీల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో నిరుద్యోగులు పెట్టుకున్న కాలేజీలు ఇప్పటికే అనేక ఇబ్బందుల్లో ఉన్నాయి. ఎన్నో కాలేజీలు మూతపడ్డాయి. న్యాక్ గుర్తింపును ఐచ్ఛికంగానే పరిగణించాలి. – గౌరీ సతీశ్, అధ్యక్షుడు, రాష్ట్ర ప్రైవేటు పీజీ, డిగ్రీ కాలేజీ యాజమాన్య సంఘంమూడు కేటగిరీల ఏర్పాటుఇక మీదట విద్యా సంస్థలను 3 కేటగిరీలుగా విభజించాలని న్యాక్ భావిస్తోంది. విశ్వవిద్యాలయాలు, అటాన మస్ కాలేజీలు, అనుబంధ కాలేజీలు అనే 3 విభాగాలను గుర్తిస్తారు. కాగా, విశ్వవిద్యాలయాలు ఇప్పటికే అన్ని వసతులతో ఉంటాయి. అటానమస్ కాలేజీలూ నిధులు సమకూర్చుకోవడంలో వెనుకాడవు. కానీ అనుబంధ గుర్తింపు ఉన్న కాలేజీల్లో ఫ్యాకల్టీ, మౌలిక వసతుల ఇబ్బంది ఉందన్న వాదనలున్నాయి. -
కాలేజీల్లో మోరల్ పోలీసింగ్
సాక్షి, హైదరాబాద్: కళాశాలల్లో మోరల్ పోలీసింగ్ను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. అన్ని ఇంటరీ్మడియెట్, డిగ్రీ కళాశాలల్లో కేరళ మాదిరిగా మోరల్ పోలీసింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. సమాజంలో ఉండే సమస్యలను మనమే గుర్తించి పరిష్కరిస్తే.. దుష్ఫలితాలను నివారించుకోవచ్చన్నారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులను వలంటరీ పోలీసింగ్కు కోసం వినియోగించుకోవాలని సూచించారు.శనివారం జేఎన్టీయూలో వలంటరీ పోలీసింగ్ వ్యవస్థపై నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సమాజంలో పెడధోరణులు పెరగడానికి సాంకేతికత ఓ కారణమన్నారు. పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా పెడితే.. చాలావరకు సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఉమ్మడి కుటుంబాలు చిన్నారుల మానసిక దృఢత్వానికి తోడ్పతాయని, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడమే చిన్నారుల మానసిక బలహీనతలకు కారణమని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం.. డ్రగ్స్ నిర్మూలనపై సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. మత్తు పదార్థాలతో జరిగే నష్టాల గురించి పాఠశాలలు, కళాశాలల్లో పాఠ్యాంశంగా బోధించడంతోపాటు నైతిక పోలీసింగ్ను నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించే వ్యవస్థ ఉండాలని నిర్వాహకులకు సూచించినట్లు తెలిపారు. బడులు, కళాశాలల్లో ఎన్ఎస్ఎస్ వలంటీర్స్ అవసరం ఎంతో ఉందని తెలిపారు. వారితో పోలీసులకు సమాచారం చేరవేసే వ్యవస్థను తయారు చేసుకుంటే.. తెలంగాణను డ్రగ్స్రహిత రాష్ట్రంగా మార్చవచ్చని చెప్పారు. డ్రగ్స్పై ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందంటూ ‘మీ అన్నగా పిలుపునిస్తున్నా... డ్రగ్స్ నిర్మూలనకు సహకరించండి’అని విజ్ఞప్తి చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేలా నిర్ణయాలు తమ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని నిర్ణయించిందని, అందుకోసం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్టేడియం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. భవిష్యత్లో క్రీడాకారులను ప్రోత్సహించేలా నిర్ణయాలు ఉంటాయన్నారు. ప్రజాప్రతినిధి అనేది అత్యంత పవిత్రమైన బాధ్యతని, ప్రజా సమస్యలపై ఫోకస్గా పనిచేయడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. సమస్యలకు భయపడి పారిపోకుండా, పోరాడాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీకైనా, బిల్ గేట్స్కైనా, రేవంత్ రెడ్డికైనా ఉండేది రోజుకు 24 గంటలేనని, రోజుకు 16 గంటలు మీరు ఎంత ఫోకస్గా పనిచేస్తే అంత బాగా మీ లక్ష్యాలను చేరుకోవచ్చని సూచించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు డీజీపీ డాక్టర్ జితేందర్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు. -
కాలేజీలో చేరగానే మెసేజ్
సాక్షి, హైదరాబాద్ : పైవేట్ కాలేజీల ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఇంటర్బోర్డు ఈసారి సరికొత్త విధానం అందుబాటులోకి తీసుకురానుంది. విద్యార్థి ఏ కాలేజీలో చేరినా, వెంటనే అతని వ్యక్తిగత మొబైల్కు మెసేజ్ వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఉన్నతాధికారులు చర్చించారు. ఇందుకు అవసరమైన సాఫ్ట్వేర్ రూపకల్పన చేసేందుకు ప్రయతి్నస్తున్నారు. అయితే కాలేజీలో చేరిన వెంటనే వివరాలు హైదరాబాద్లోని కేంద్ర కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. అప్పుడే ఈ మెసేజ్ పంపే వీలుంది. దీనికి ప్రైవేట్ కాలేజీలు ఇష్టపడే అవకాశం లేదు. కొన్ని నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్ కాలేజీలు దీనివల్ల నష్టం జరుగతుందని భావిస్తున్నాయి. ప్రయోజనం ఏమిటి? ఇప్పటి వరకూ ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులను ఒక బ్రాంచ్లో చేర్చుకొని, వేరొక చోట కూర్చోబెట్టి బోధన చేస్తున్నాయి. ఉదాహరణకు మాదాపూర్ బ్రాంచ్లో ఓ విద్యార్థి అడ్మిషన్ తీసుకుంటాడు. కానీ అతని క్లాసులు వనస్థలిపురం బ్రాంచ్లో జరగుతాయి. పరీక్ష కేంద్రం సమీపంలో వేయాల్సి ఉంటుంది. కాబట్టి పరీక్షకు దరఖాస్తు చేసే ప్రాంతాన్నే కొలమానంగా తీసుకుంటారు. దీనివల్ల దూరంగా ఉండే ప్రాంతంలో పరీక్ష కేంద్రం ఉంటుంది.అదీగాక అంతర్గత పరీక్ష నిర్వహించి, బాగా మార్కులొచ్చే వారిని వేరు చేసి చదివిస్తున్నారు. మార్కులు తక్కువగా ఉండే వారి పట్ల ఏమాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదు. ఈ బ్రాంచ్ల్లో నైపుణ్యం లేని అధ్యాపకులను తక్కువ వేతనాలకు నియమిస్తున్నారు. ఈ విధానాన్ని అడ్డుకోవడానికి మెసేజ్ విధానం దోహదపడుతుందని ఓ అధికారి తెలిపారు. తనకు వచ్చే మెసేజ్లో అన్ని వివరాలు ఉంటాయి..కాబట్టి వెంటనే అదే కాలేజీలో చదివేలా తల్లిదండ్రులు జాగ్రత్త పడతారని, అన్ని కేటగిరీల విద్యార్థులు ఒకే క్యాంపస్లో చదువుకునే వీలుందని అధికారులు భావిస్తున్నారు. సహకారం అందేనా? మెసేజ్ విధానంపై కాలేజీ యాజమాన్యాలు పెదవి విరుస్తున్నాయి. అడ్మిషన్ల వివరాలు గడువులోగా ఇంటర్ బోర్డుకు పంపే వీలుందని, కానీ మెసేజ్ సిస్టం తీసుకొస్తే ప్రతీ రోజు వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని యాజమాన్యాలు అంటున్నాయి. దీనివల్ల క్లరికల్ పని ఎక్కువగా ఉంటుందని, తనిఖీల పేరుతో అధికారులు వేధించే వీలుందని చెబుతున్నారు. ఈ విధానాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. -
కాలేజ్కి కూడా వెళ్లలేదు..కానీ ఏడాదికి ఏకంగా రూ. 10 కోట్లు..!
ఓ వ్యక్తి కాలేజ్ చదువు కూడా చదవకుండా కోట్లు గడిస్తున్నాడంటే నమ్ముతారా..!. ఏ వ్యాపారం చేసో అనుకుంటే పొరబడ్డట్లే. ఎందుకంటే..అతడు చక్కగా పెద్ద కార్పోరేట్ కంపెనీలో అప్రెంటీస్గా మొదలు పెట్టి..ఏకంగా కంపెనీ పార్ట్నర్గా పనిచేసే స్థాయికి చేరకున్నాడు. ఎలాంటి గ్రాడ్యుయేషన్ చదువులు చదవకుండా.. ఎలా అతడికి సాధ్యం అయ్యింది? అతడి సక్సెస్ సీక్రెట్ ఏంటంటే.. యూకేకి చెందిన న్యూటన్(30) యూవివర్సిటి విద్య కూడా చదవలేదు. కానీ డెలాయిట్ కంపెనీలో పార్టనర్గా పనిచేస్తున్నాడు. అతడి వార్షిక వేతనం సుమారుగా రూ. 10 కోట్లు పైనే ఉంటుందట. ఇదంతా ఎలా సాధ్యం అనే కదా..!. అతడి కెరీర్ జర్నీ 12 ఏళ్ల క్రితం డెలాయిట్ కంపెనీలో బ్రైట్స్టార్ట్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్లో చేరడంతో మొదలయ్యింది. అలా కంపెనీ పార్ట్నర్గా పనిచేసే స్తాయికి ఎదిగిపోయాడు. అది కాలేజ్డ్రాపౌట్స్ కోసం ఏర్పాటు చేసిన డెలాయిట్ బ్రైట్ స్టార్ అప్రెంటీస్ ప్రోగ్రామ్ అతడి తలరాతనే మార్చిందని చెప్పొచ్చు. నూటన్ పెరిగిందంతా డోరెట్స్లోనే. తన తండ్రి 16 ఏళ్ల వయసులో పాఠశాల చదువును విడిచిపెట్టి ఆర్మీలో చేరిపోయాడు. తన అమ్మ పబ్లోనూ, ట్రావెలింగ్ ఏజెన్సీలోనూ పనిచేసేది. దీంతో తల్లిదండ్రుల ప్రంపంచానికి దూరంగా పెరిగాడు న్యూటన్. ఆర్థిక పరిస్థితి వల్లే కదా తాను ఈ పరిస్థితిని ఎదుర్కొంటోంది అని భావించి సంపాదన మార్గాల గురించి తీవ్రంగా అన్వేషించడం ప్రారంభించేవాడు. తీరిక దొరికితే అందుకోసమే వెతికేవాడు. ఐతే అనుకోకుండా విశ్వవిధ్యాలయంలో గణితం అధ్యయనం చేసేందుకు సీటు లభించింది. ఇలా అతడి కుటుంబంలో విశ్వవిద్యాలయంలో సీటు పొందిన ఏకైక వ్యక్తి కూడా న్యూటనే. కానీ అందులో చేరలేదు. సంపాదన మార్గాల మీదే అతడి ధ్యాసంతా. అందుకోసం రెండు మూడు చిన్నా చితకా ఉద్యోగాలు కూడా చేసేవాడు. అంతేగాదు స్కూల్ చదువుతో డబ్బులు వచ్చే స్కీములు ఏం ఉన్నాయా అని చూసేవాడు. ఆ కారణాల రీత్యా అతడు చదువాలనే దానిపై దృష్టి కేంద్రీకరించ లేదు. ఆ అన్వేషణలో భాగంగానే న్యూటన్ డెలాయిట్ బ్రైట్స్టార్ట్ అప్రెంటిస్ ప్రోగ్రామ్లో చేరాడు. ఐతే ఇది విద్యార్థులు కళాశాలలో చేరి చదువుకునేలా చేసేందుకు ఏర్పాటు చేసిన ఉపాది మార్గం ఇది. దీన్ని కాలేజ్ యూనివర్సిటీలే ఏర్పాటు చేశాయి. అయితే ఇదంతా న్యూటన్కి నచ్చక ఒకింత అసహనం అనిపించినా, డబ్బు సంపాదించే మార్గం దొరికిందన్న ఉద్దేశ్యంతో అందులో జాయిన్ అయ్యాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ కంపెనీ పార్ట్నర్గా క్వాలిఫైడ్ అకౌంటెంట్ అండ్ ఆడిటర్గా విధులు నిర్వర్తించే రేంజ్కి చేరాడు. నిజానికి డెలాయిట్ కంపెనీ రిక్రూట్మెంట్ కోసం ఈ బ్రైట్స్టార్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా విద్యార్థుల ఉపాది పొందుతూ కాలేజ్ చదువును చదువుకునేలా ప్రోత్సహిస్తుంది. అంతేగాక ఈ ప్రోగ్రాం ద్వారా వారిలో దాగున్న టాంటెంట్ బయటకి వెలికితీస్తుంది. పైగా సామాజికంగా ఆర్థిక నేపథ్యం సరిగా లేని వ్యక్తులకు ఈ ప్రోగ్రాం ఒక గొప్ప వరం. అంతేగాదు కెరీర్లో మంచిగా సెటిల్ అవడానికి ఉపకరించే గొప్ప ఉపాధి మార్గం ఇది. ఇక్కడ న్యూటన్ సంపాదన ధ్యాస కళాశాలకు వెళ్లనీయకుండా చేసినా..ఉద్యోగంలో ఉన్నతంగా ఎదిగేలా చేసి ఈ స్థాయికి తీసుకురావడం విశేషం. ఇక్కడ డిగ్రీలు, పీహెచ్డీలు కాదు ముఖ్యం. సంపాదించాలనే కసి పట్టుదల అన్ని నేర్చుకునేలా, ఎదిగిలే చేస్తుందనడానికి న్యూటనే స్ఫూర్తి కదూ..!. (చదవండి: ఆర్బీఐ మాజీ గవర్నర్కే పాఠాలు బోధించిన వ్యక్తి..కోట్ల ఆస్తులను..!) -
విద్యార్థులే కానీ... వేసవి సెలవులు లేవు
వేసవి వస్తే విద్యార్థులు రిలాక్స్ అవుతారు. వేసవి సెలవులను ఆస్వాదిస్తారు. కానీ.. ఈ విద్యార్థులకు మాత్రం వేసవి సెలవులు లేవు. కాలేజీలకు వెళుతున్నారు. ఎందుకంటే వీళ్లు రియల్ స్టూడెంట్స్ కాదు.. రీల్ స్టూడెంట్స్. కొందరు స్టార్స్ ప్రస్తుతం స్టూడెంట్స్గా నటిస్తున్నారు. షూటింగ్ సెట్స్లో క్లాసులకు హాజరు అవుతున్నవారు కొందరైతే.. ప్రిపరేషన్ స్టూడెంట్స్ మరికొందరు. ఈ విద్యార్థుల గురించి తెలుసుకుందాం. ► కెరీర్లో పలు చిత్రాల్లో కాలేజ్ స్టూడెంట్గా నటించారు హీరో సూర్య. కానీ ఐదు పదుల వయసుకి చేరువ అవుతున్న టైమ్లో కూడా కాలేజ్కి వెళ్లెందుకు రెడీ అవుతున్నారు. ‘సూరరై ΄ోట్రు’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర కాంబినేషన్లో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. స్టూడెంట్ నుంచి గ్యాంగ్స్టర్గా మారే ఓ వ్యక్తి జీవితం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందట. స్టూడెంట్ రోల్ కోసం ప్రస్తుతం సూర్య బరువు తగ్గుతున్నారని సమాచారం. 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. ►కాలేజీ స్టూడెంట్ రోల్ హీరోయిన్ రష్మికా మందన్నాకు బాగా కలిసి వస్తుందని చె΄÷్పచ్చు. ఆ మాటకొస్తే... నటిగా రష్మికా మందన్నా కెరీర్ మొదలైంది కన్నడ హిట్ క్యాంపస్ డ్రామా ‘కిర్రిక్ పార్టీ’ సినిమాతోనే. అంతేకాదు...రష్మికా మందన్నా తెలుగు ఎంట్రీ మూవీ ‘ఛలో’లోనూ, రెండో మూవీ ‘గీత గోవిందం’లోనూ ఆమెది కాలేజీ స్టూడెంట్ రోల్. ఇలా కాలేజీ స్టూడెంట్గా రష్మికా మందన్నా చేసిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్. తాజాగా ఈ కోవలో రష్మికా మందన్నా చేస్తున్న చిత్రం ‘ది గాళ్ఫ్రెండ్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా పీజీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ రోల్లో కనిపిస్తారని తెలిసింది. ఆమె బాయ్ ఫ్రెండ్గా దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. ఓ కాలేజీ స్టూడెంట్ తన ప్రేమను నెగ్గించుకునే క్రమంలో పడిన సంఘర్షణ నేపథ్యంతో ఈ సినిమా ఉంటుందట. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ‘చి..ల..సౌ’తో దర్శకుడిగా తొలి సినిమాతోనే హిట్ కొట్టిన రాహుల్ రవీంద్రన్ ‘ది గాళ్ ఫ్రెండ్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజయ్యే చాన్స్ ఉంది. ► కాలేజీలో ఓ ఫెయిల్యూర్ స్టూడెంట్గా తెరపై శ్రీ విష్ణు కనిపించిన ప్రతిసారీ ఆయనకు మంచి పేరు వచ్చింది. ‘నీదీ నాది ఒకే కథ’, ‘బ్రోచేవారెవరురా’ వంటి సినిమాల్లో శ్రీ విష్ణు స్టూడెంట్గా నటించారు. మళ్లీ ఈ తరహా పాత్రలో శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. శ్రీవిష్ణుతో పాటు ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్, ప్రియదర్శి ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఓ యూనివర్సిటీలోని ముగ్గురు పీహెచ్డీ స్కాలర్స్ జీవితాలు ఓ ఘటనతో సడన్గా ఏ విధంగా మలుపు తిరిగాయి? అనే కోణంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమా ఫస్టాఫ్లో కాలేజీ సీన్స్ ఉంటాయి. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో వి సెల్యూలాయిడ్, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. స్టూడెంట్గా ఇన్నాళ్లూ సెట్లో బిజీగా ఉన్న శ్రీవిష్ణు ఇప్పుడు ఈ చిత్రం ప్రమోషన్స్తో బిజీగా ఉంటున్నారు. ► ‘ఏవండీ.. (మృణాల్ ఠాకూర్).. రామచంద్రా.. (చిన్న వాయిస్తో విజయ్ దేవరకొండ).. నేను కాలేజ్కి వెళ్లాలి.. కొంచెం దించేస్తారా? (మృణాల్ ఠాకూర్),.. ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా..’ (విజయ్ దేవరకొండ)...‘ఫ్యామిలీస్టార్’ సినిమాలోని డైలాగ్ ఇది. సో.. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కొన్ని సన్నివేశాల్లో కాలేజ్కి వెళతారని కన్ఫార్మ్ చేసుకోవచ్చు. ‘గీత గోవిందం’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో రూ΄÷ందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది. బాలీలో ఓ పాట చిత్రీకరిస్తే ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ► ‘ఇగై’ సినిమా కోసం లా పాయింట్స్ చెబుతున్నారు అంజలి. ఎందుకంటే ఈ సినిమాలో అంజలి లా స్టూడెంట్. అశోక్ వేలాయుదం దర్శకత్వంలో రూ΄÷ందుతున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు అంజలి. చిత్రీకరణ ్రపారంభమైంది. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ నటీనటులే కాక.. మరికొందరు కూడా కాలేజీ స్టూడెంట్ రోల్స్ చేస్తున్నారు. -
ఉన్నత విద్యకు ‘స్కిల్’ జత
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో నైపుణ్యం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి కోర్సులను కాలేజీలు, యూనివర్సిటీలు అందుబాటులోకి తెచ్చేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంగీకారం తెలిపింది. తాజా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రస్తావించింది. విధాన పరమైన నిర్ణయాన్ని ప్రకటించినప్పటీకీ పెద్దగా నిధులు కేటాయించక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటం లేదన్నది భారత పారిశ్రామిక వేత్తల అభిప్రాయం. సీఐఐ, ఎఫ్ఐఐ, నాస్కామ్ వంటి సంస్థల అధ్యయనంలోనూ ఇదే వెల్లడైంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక భాగస్వామ్యంతో ఈ కోర్సులను ముందుకు తీసుకెళ్ళాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కన్పిస్తోంది. తక్షణ అవసరం ఇదే..: దేశంలో ఇంజనీరింగ్ పూర్తి చేసే విద్యార్థుల్లో కేవలం 8 శాతం మంది మాత్రమే నైపుణ్యం (స్కిల్)తో బయటకు వస్తున్నారు. మిగతా వాళ్ళలో కొంతమంది స్కిల్ కోసం ప్రత్యేక కోర్సులు నేర్చుకుంటున్నారు. అయితే వాళ్లలో కోర్సు నేర్చుకునే నాటికే కొత్త నైపుణ్యాలు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో మళ్ళీ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటే తప్ప మంచి వేతనంతో ఉద్యోగం లభించే అవకాశం కన్పించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే విశ్వవిద్యాలయాలకు యూజీసీ తక్షణ మార్పులను సూచించింది. నైపుణ్యాభివృద్ధి మండళ్లు స్వల్ప వ్యవధి కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి అక్కర్లేదని కూడా తెలిపింది. కాకపోతే పారిశ్రామిక భాగస్వామ్యం తప్పనిసరి. అప్పుడే విద్యార్థి అనుభవ పూర్వకంగా నైపుణ్యం సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణత సాధించి డిగ్రీ, బీటెక్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు 3–6 నెలల వ్యవధిలో 27 రకాల నైపుణ్య కోర్సులను యూజీసీ సూచిస్తోంది. వీటికి 12 నుంచి 30 క్రెడిట్స్ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమీక్ష జరిపింది. ఏయే కోర్సులు అందుబాటులోకి తేవచ్చు అనే విషయాన్ని ప్రభుత్వానికి ఉన్నతాధికారులు వివరించారు. ఇవీ స్కిల్ కోర్సులు అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే కాలంలో మొత్తం 27 స్కిల్ కోర్సులను నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులకే అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో ఏఐ అండ్ ఎంఎల్, రోబోటిక్స్, ఐవోటీ, ఇండ్రస్టియల్ ఐవోటీ, స్మార్ట్ సిటీస్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వీఆర్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్, 5 జీ కనెక్టివిటీ, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, ఎల్రక్టానిక్స్ సిస్టమ్ డిజైన్, వీఎస్ఎస్ఐ డిజైన్స్, కంప్యూటర్ భాషలో ప్రాథమిక అవగాహన, మెకానికల్ టూలింగ్, మొబైల్ కమ్యూనికేషన్ లాంటి ప్రధానమైన కోర్సులున్నాయి. తెలంగాణలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల భాగస్వామ్యంతో ఐవోటీ, ఏఐఎంఎల్ సహా ఇతర కంప్యూటర్ కోర్సుల్లో స్వల్పకాలిక కోర్పులు నిర్వహించవచ్చని అధికారులు అంటున్నారు. సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలసిస్ వంటి వాటికి విస్తృత అవకాశాలున్నాయని భావిస్తున్నారు. తొలి దశలో ప్రైవేటు యూనివర్సిటీలు మాత్రమే ఈ దిశగా ముందుకు వెళ్ళే వీలుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని డీమ్డ్ వర్సిటీలు ఈ దిశగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి. స్కిల్తో ఉద్యోగం సులభం డిగ్రీతో పాటు నైపుణ్యం ఉంటే ఉద్యోగం లభించడమే కాదు.. అందులో రాణించడం కూడా సులభం. కంపెనీలు ఇలాంటి అర్హతలే కోరుకుంటున్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే నాటికి ఏదైనా ఒక రంగంలో నైపుణ్యం అవసరం. ఈ దిశగా ప్రభుత్వం, వర్సిటీలు అడుగులు వేయడం అభినందనీయం. – శ్రీరాం వెంకటేష్ (ఉన్నత విద్య మండలి కార్యదర్శి) -
జనవరి 22న ఉత్తర ప్రదేశ్లో విద్యాసంస్థలకు సెలవు
లక్నో: జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెలవు ప్రకటించారు. ఈనెల 22నన అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం దృష్టా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రామజన్మభూమి ఆలయంలో శ్రీరామ్లల్లా 'ప్రాణ-ప్రతిష్ఠ' కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను సీఎం ఆదిత్యనాథ్ పరిశీలించారు. అదే విధంగా జనవరి 22న రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండవని సీఎం తెలిపారు. ఆ రోజు అన్ని ప్రభుత్వ భవనాలను సుందరంగా అలంకరించాలని, బాణాసంచా కాల్చి వేడుకలు జరుపుకోవాలని సీఎం ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. కాగా అయోధ్యలో జనవరి 22న నూతన రామాలయ ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఘనమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి నాలుగు వేల మంది సాధువులను, 2,200 మంది ఇతర అతిథులను ఆహ్వానించారు. కాశీ విశ్వనాథుని ఆలయం, మాతా వైష్ణో దేవి ఆలయ ప్రతినిధులు, ఇస్రో శాస్త్రవేత్తల పేర్లు ఆహ్వానితుల జాబితాలో ఉన్నాయి. సినీ పరిశ్రమ, వ్యాపార, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పంపారు. చదవండి: మాల్దీవుల వివాదం.. ప్రధాని మోదీకి మద్దతుగా శరద్ పవార్ -
ఆన్లైన్ డిగ్రీ కోర్సులతో జాగ్రత్త: యూజీసీ
న్యూఢిల్లీ: విదేశీ యూనివర్సిటీల సహకారంతో కాలేజీలు, ఎడ్టెక్ కంపెనీలు అందించే డిగ్రీల కు తమ గుర్తింపు లేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) స్పష్టం చేసింది. ఇటువంటి డిగ్రీలకు ఏమాత్రం విలువ లేదని, ఆయా కోర్సుల్లో చేరవద్దని విద్యార్థులను హెచ్చరించింది. విదేశీ వర్సిటీలు, విద్యా సంస్థలతో కొన్ని ఉన్నత విద్యా సంస్థలు, కాలేజీలు పొందే అనుబంధ గుర్తింపు, ఒప్పందాలను తాము అనుమతించడం లేదని యూజీసీ సెక్రటరీ మనీశ్ జోషి చెప్పారు. ఆయా సంస్థలు ఇచ్చే డిగ్రీలు, డిప్లొమాలకు ఎటువంటి విలువా ఉండదని వివరించారు. -
టోకెన్లతోనే సరి
సాక్షి, హైదరాబాద్: టోకెన్లు ఇచ్చి ఏడాది అవుతున్నా..పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు మాత్రం విడుదల కాలేదు. గతే డాది అక్టోబర్లో ఆయా బిల్లులకు సంబంధించి ఆర్థికశాఖ పోర్టల్లో జనరేట్ అయ్యి టోకెన్ నంబర్లు కూడా జారీ అయ్యాయి. నిధులు విడుదల కాకపోవడంతో ఇటు విద్యార్థులు..అటు ప్రైవేట్ కాలేజీ యాజమన్యాలు లబోదిబోమంటున్నాయి. దరఖాస్తు నుంచి ట్రెజరీ వరకు ఇలా... పోస్టుమెట్రిక్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన, కోర్సు కొనసాగిస్తున్న విద్యార్థులు ఈపాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయడం..వాటిని కాలేజీస్థాయిలో యాజమాన్యాలు పరిశీలించి సంక్షేమశాఖలకు సమర్పించడం... సంక్షేమశాఖల అధికా రులు ఆయా దరఖాస్తులను మరోమారు పరిశీలించి ఆమోదం తెలపడం.. ఆ తర్వాత అర్హులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలకు ఖజానా శాఖకు సిఫార్సు చేయడం అంతా ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది. కాలేజీ యాజమాన్యాలు ఒక్కో విద్యార్థికి సంబంధించిన ఫైలు కాకుండా ఒక కోర్సు చదువుతున్న విద్యార్థులందరి ఫైళ్లు కలిపి ఒక బిల్లుగా తయారు చేసి ఖజానాశాఖకు సమర్పిస్తాయి. అవన్నీ రెండేళ్ల కిందటివే... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్నాయి. 2019–20, 2020–21 విద్యా సంవత్సరాలకు సంబంధించి పలు బిల్లులు గతేడాది అక్టోబర్ నాటికి ఖజానా శాఖకు సమర్పించాయి. నాలుగు సంక్షేమ శాఖలకు సంబంధించి రూ.1115 కోట్లు వరకు బిల్లులున్నాయి. ఇందులో సాగానికిపైగా బీసీ సంక్షేమ శాఖకు సంబంధించినవే. సంక్షేమ శాఖలు సమర్పించిన బిల్లులను ఖజానా అధికారులు పరిశీలించి టోకెన్లు జనరేట్ చేస్తారు. అయితే ఇప్పటివరకు ఆర్థిఖశాఖ పోర్టల్లో ఆ బిల్లులకు ఆమోదం దక్కలేదు. ఏడాది కాలంగా ఇవన్నీ పెండింగ్లో ఉండడంతో ఒకవైపు విద్యార్థులు, మరోవైపు కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉపకారవేతన నిధులు విద్యార్థి బ్యాంకు ఖాతాలో, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కాలేజీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాక జాప్యం జరుగుతుండడంతో కాలేజీ యాజమాన్యాలు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రతినిధులు రాష్ట్ర సంక్షేమశాఖ ఉన్నతాధికారులు, ఆర్థికశాఖ అధికారులను ప్రత్యేకంగా కలిసి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా, నిధుల విడుదలపై ప్రభుత్వం స్పందించలేదు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులతో కాలేజీల నిర్వహణపై చేతులెత్తేయాల్సి వస్తోందంటూ తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌరి సతీశ్ ‘సాక్షి’తో అన్నారు. -
జగనన్న ఆరోగ్య సురక్షతో అందరికీ రక్ష
సాక్షి, అమరావతి: జగనన్న ఆరోగ్య సురక్ష పథకం రాష్ట్ర ప్రజలందరికీ రక్ష అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90 శాతం కుటుంబాలు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. దీనిని బట్టి తమ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంత బలోపేతం చేసిందో, ఏ స్థాయిలో వైద్య సేవలు అందిస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం ద్వారా ఇప్పటివరకు 2.30 కోట్ల ఓపీలు నమోదయ్యాయని చెప్పారు. ఇది ఒక చరిత్రగా అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.8,500 కోట్ల ఖర్చుతో కొత్తగా 17 మెడికల్ కళాశాలలు నిర్మిస్తోందని, వీటిలో ఐదింటిని సీఎం జగన్ శుక్రవారం పారంభించారని గుర్తు చేశారు. వచ్చే రెండేళ్లలో మిగిలిన 12 కళాశాలలను కూడా పూర్తిచేసి ప్రారంభిస్తామన్నారు. సంక్షేమ రాడార్ నుంచి తప్పించుకోకుండా.. జగనన్న సంక్షేమ రాడార్ నుంచి ఎవరూ తప్పించుకోకూడదనే లక్ష్యంతో ఆరోగ్య సురక్ష కార్యక్రమం రూపుదిద్దుకుందని మంత్రి రజని చెప్పారు. మొదటి దశలో వలంటీర్ల ఇంటింట సర్వే ఈ నెల 15న ప్రారంభమైందని, స్థానిక ప్రజా ప్రతినిధులు, వలంటీర్లు, ఎన్ఎస్ఎస్, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు తొలి దశలో గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నట్టు మంత్రి చెప్పారు. సీహెచ్వో లేదా ఏఎన్ఎం ఆ ఇంటికి ఎప్పుడు వస్తారనే విషయాన్ని వలంటీర్లు సమాచారం ఇస్తారన్నారు. రెండో దశలో సీహెచ్వో, ఏఎన్ఎంలు ప్రజల ఇళ్లకే వెళ్లి అందించే సేవలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయన్నారు. ప్రజల అంగీకారం మేరకు బీపీ, మధుమేహం, హిమోగ్లోబిన్ వంటి ఏడు రకాల పరీక్షలను ఇంటివద్దే చేస్తారన్నారు. మూడో దశలో వలంటీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సేవాభావం గల వ్యక్తుల బృందాలు మరోసారి ఇంటింటికీ వెళ్లి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించే తేదీ, అందించే సేవలను వివరిస్తారన్నారు. నాలుగో దశలో ఈ నెల 30న వైద్య శిబిరాలు మొదలుపెట్టి.. 45 రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించినట్టు మంత్రి రజిని వివరించారు. శిబిరాల్లో రోగులను పరీక్షించి, అవసరమైన వారికి మందులు ఇస్తారని, చికిత్స అవసరమైతే వారిని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రిఫర్ చేస్తారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో, తహసీల్దార్, పీహెచ్సీల వైద్యాధికారులు.. పట్టణాల్లో మునిసిపల్ కమిషనర్లు, మునిసిపల్ ఆరోగ్య అధికారులు, యూపీహెచ్సీల వైద్యాధికారులు వైద్య శిబిరాల బాధ్యత తీసుకుంటారన్నారు. ఐదో దశలో ఆ గ్రామానికి చెందిన ఫ్యామిలీ డాక్టర్, సీహెచ్వో, ఏఎన్ఎంలు రిఫరల్ కేసులకు సంబంధించిన రోగులకు ఫాలోఅప్ వైద్యం అందిస్తారన్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో రోగులకు సరైన వైద్యం అందిందా లేదా.. రోగం పూర్తిగా అదుపులోకి వచ్చిందా లేదా పరిశీలిస్తారని వివరించారు. నిఫా వైరస్పై అప్రమత్తం నిఫా వైరస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి రజని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. నకిలీ మందుల విషయంలో కఠినంగా ఉన్నామని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పీజీ సీట్ల విషయంలో నకిలీ ఎల్వోపీలపై విచారణ కొనసాగుతోందని, ఇది పూర్తిగా ఎన్ఎంసీ పరిధిలోని అంశం అవడంతో వారి ద్వారా విచారణ కోరినట్టు పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కార్యదర్శి మంజుల, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్, డీహెచ్ రామిరెడ్డి పాల్గొన్నారు. -
తెలంగాణలో ఒకే రోజు 9 మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈ రోజు మరుపురానిదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఒకే రోజు 9 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏడాదికి 10 వేల మంది డాక్టర్లు తయారవుతున్నారని అన్నారు. ప్రగతి భవన్ వేదికగా ఆన్లైన్లో ఈ కార్యక్రమం జరిగింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, భూపాలపల్లి, కుమరంభీమ్, సిరిసిల్ల,నిర్మల్, వికారాబాద్, జనగాం జిల్లాల్లో నూతనంగా మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. వచ్చే ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ కలను సాధిస్తున్నామని అన్నారు. బోధన కాలేజీలే కాకుండా అనుబంధ ఆస్పత్రులను కూడా నెలకొల్పినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. దీంతో 50 వేల పడకల్ని ఆక్సిజన్ బెడ్లుగా తయారు చేశామని స్పష్టం చేశారు. ప్రస్తుతం 500 టన్నుల ఆక్సిజన్ను రాష్ట్రంలో ఉత్పత్తి చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణను ఎగతాళి చేసినవాళ్లకు ఇదో మంచి ఉదాహరణ అని అన్నారు. దేశంలో వైద్య రంగంలో మూడో స్థానంలో తెలంగాణ ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలో మరణాల రేటు కూడా తగ్గించామని చెప్పారు. కొత్తగా ప్రారంభించిన వాటితో కలిపి రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య నాలుగు రెట్లకు పెరిగింది. రాష్ట్రంలో మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 21కి చేరింది. కొత్త కాలేజీలతో కలిపి తెలంగాణలో మెడికల్ సీట్ల సంఖ్య 8,515కు పెరిగింది. ఇదీ చదవండి: తెలంగాణలో ప్రారంభమైన టెట్ పరీక్ష -
15న ఆ 9 చోట్ల భారీ ర్యాలీలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15న ఏకకాలంలో తొమ్మిది జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయా జిల్లా కేంద్రాల్లో కనీసం 15 వేల నుంచి 20 వేల మందితో భారీ ర్యాలీలు నిర్వహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభం నేపథ్యంలో శుక్రవారం మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీ రామారావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 15న జనగామ, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలలో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్నాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఈ నెల 15న ఏదో ఒక చోట కొత్త మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారని, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు కామా రెడ్డిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని కేటీఆర్ తెలిపారు. దేశంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. మంత్రి హరీశ్ మాట్లాడుతూ ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లను కలిగి ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. -
ప్రాణం మీదకొస్తున్న ‘ప్యాకేజీ’ చదువులు!
చదువు.. తెలివి ముందుగా ‘ప్యాకేజీ ’ చదువుల ఇంజనీర్ కథ .. ఓ వ్యక్తి బాగా చదువుకున్నాడు. ఇంజనీర్ అయ్యాడు. బాగా సంపాదిస్తున్నాడు. కారు కొనుక్కున్నాడు. డ్రైవర్ను కూడా పెట్టుకున్నాడు. ఫంక్షన్ ఉండడంతో ఓ రోజు ఊరెళ్లాల్సి వచ్చింది. కానీ, డ్రైవర్ సెలవు పెట్టాడు. దానితో తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఊరికి బయలు దేరాడు. దాదాపుగా ఊరిదాకా వెళ్లాడు. కానీ అంతలోనే కారు టైరు పంక్చరయ్యింది. మార్చడానికి ఎప్పటిలా డ్రైవర్ లేడు. చేసేదేంలేక తానే టైర్ మార్చే ప్రయత్నం చేయసాగాడు. కష్టపడి టైర్ విప్పాడు. దురదృష్టం మనవాడిని వెన్నాడుతూనే ఉంది. స్టెప్నీ టైర్ తీసిపెట్టి బిగించే టైమ్లో కాలు తాకి విప్పిపెట్టిన నట్లు పక్కనే ఉన్న మురికి కాల్వలో పడ్డాయి. ఉసూరుమన్నాడు. దిగి తీద్దామంటే బురద... అంటితే ఫంక్షన్కు అటెండ్ కావడం ఎలా? కర్రలు గట్రాలతో రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఏదీ వర్కవుట్ కాలేదు... తలపట్టుకుని అలాగే కూర్చున్నాడు. అరగంట గడిచింది. ఆ దారిలో పశువులను తోలుకుంటూ ఓ ఆసామి వస్తున్నాడు అతన్ని పిలిచి తన బాధంతా చెప్పి ఎలాగైనా ఆ న ట్లు తీసివ్వాలని రిక్వెస్ట్ చేశాడు. దానికి ఎంత డబ్బయినా ఇస్తానని చెప్పాడు. కొంచెంసేపు ఆ ఇంజనీర్వైపు కారువైపు అలాగే చూసి నవ్వుతూ ఇలా అన్నాడు. ‘‘బాబూ!, డబ్బుల విషయం అలా ఉంచు. నేను దిగి తీసివ్వడానికి అభ్యంతరం ఏమీ లేదు. కానీ, అందులో దిగాకా నేను మళ్లీ ఇంటికి వెళ్లి బురద కడుక్కుని రావాలి. నువ్వు కూడా దానిలో దిగలేవు. అందుకని నేనో ఉపాయం చెబుతా.. మిగతా చక్రాలవి ఒక్కో నట్టు తీసి ఈ టైరుకు బిగిద్దాం. కారు నడవడానికి ఢోకా ఉండదు. నువ్వు హాయిగా వెళ్లొచ్చు. ఓ పది కిలోమీటర్ల దూరంలో మెకానిక్ షాపు ఉంది. అక్కడకి వెళ్లి నట్లు వేయించుకుని వెళ్లు. నీకు డబ్బు ఖర్చు, నాకు బురదా తప్పుతాయి. ఆ ఐడియాకు ఆ మెకానికల్ ఇంజనీర్ అవాక్కయ్యాడు. ఈ మాత్రం ఆలోచన రాక అరగంట నుంచి ఇబ్బంది పడ్డానే అనుకున్నాడు.. చదువు మెకానికల్ అయిపోయి, ఉద్యోగానికి మాత్రమే, అందునా ప్యాకేజీలకు మాత్రమే పనికి వచ్చే చదువుతో తయారైన బుర్ర నుంచి ఇలాంటి పదునైన ఆలోచన రావడం కష్టమే..చావుల చదువు.. ఓ సీలింగ్ ఫ్యాన్.. మేధో బుర్రలకు తట్టిన గొప్ప ఐడియా. సీలింగ్ ఫ్యాన్కు దానికి ఆధారంగా ఉండే రాడ్కు మధ్య ఓ స్ప్రింగ్ను బిగిస్తారు. ఈ ఫ్యాన్లకు 20 కిలోల కన్నా ఎక్కువ బరువు వేలాడితే వెంటనే స్ప్రింగ్ సాగుతుంది. దానితో ఫ్యాను సీలింగ్ నుంచి కిందకు దిగుతుంది. స్ప్రింగ్ సాగగానే సైరన్కూడా మోగుతుంది. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే ఇవి ఇప్పుడు రాజస్థాన్లోని కోటా పట్టణంలోని హాస్టళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. కోటాలోని ఐఐటీ కోచింగ్ సెంటర్లలో చదివే విద్యార్థులు ఫ్యాన్లకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నారని.. వాటిని ఆపాలని ప్రయత్నం. వీటితో పాటు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకోకుండా భవనాల వెలుపలా, బాల్కనీల్లో సూసైడ్ ప్రూఫ్ వలలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి 150 కిలోల బరువు మోయగలవు. ఎవరైనా విద్యార్థులు భవనంపై నుంచి దూకినా గాయాలు కావు. పరిష్కారం ఇదేనా.. అన్న చర్చ పక్కన పెడితే.. విద్యావ్యవస్థ సిగ్గు పడాల్సిన సందర్భం ఇది. చదువు ఏమి ఇస్తది.. జ్ఞానం ఇస్తది.. బతుకుకు భరోసా ఇస్తది. చావు నిస్తదా.. చదువు ఎంత గొప్పదయితే అంత చావునిస్తదా. చదువు ఎందుకంత గొప్పదయ్యింది. మంచి జ్ఞానాన్ని, జీవితంపై భరోసాను కాదు మంచి జీతాన్ని ఇస్తదని, మంచి ప్యాకేజీలను ఇస్తదని ఆశ.. దానివల్ల విద్యార్థులపై ఒత్తిడి. పదిహేను లక్షలమందితో పోటీపడి 12 వేల మంది గెలుచుకునే క్రీడ. ఇందులో బలయ్యేది.. ఎక్కువగా తక్కువ స్థోమత ఉన్న కుటుంబంలోంచి వచ్చిన పిల్లలేనట. ఉన్న ఎకరమో, అరెకరమో అమ్మి, లేదా ఆర్థిక స్థోమత లేక అప్పోసప్పో చేసి తల్లిదండ్రులు పిల్లల బాగుకోసం చదువులకు పంపితే..అది ఇంకా పిల్లలపై ఒత్తిడి పెంచుతోంది. అసలే తీవ్రమైన పోటీ.. ఎడ తెరిపిలేకుండా శిక్షణ, ఆ చదువులు అబ్బుతాయా లేదా అన్న విచక్షణ లేకుండా.. మంచి ప్యాకేజీలో స్థిరపడాలన్న తల్లిదండ్రుల ఆకాంక్ష,, వెరసి చదువులు స్ప్రింగ్ ఫ్యాన్లు, సూసైడ్ ప్రూఫ్ నెట్ దాకా వచ్చాయి. .... ఇంతా కష్టపడి చదివిన ఐఐటీ డిగ్రీలు అవి నేర్పిన వృత్తిలోనే స్థిర పడుతున్నారా... ఏది దొరికితే ఆ ఉద్యోగం చేస్తున్నారు.. మనం పైన సరదాగా చెప్పుకున్న మెకానికల్, ప్యాకేజీ చదువులయిపోయాయి. మనసుకు పట్టినా పట్టకపోయినా.. మెకానికల్గా చదువుకుని బయటపడ్డవాళ్లు బతికిపోతున్నారు.. లేని వాళ్లు చితికి పోతున్నారు. చదవేస్తే... తెల్లారితే చాలు.. ఎక్కడో ఓ చోట.. ఎవరో ఓ విద్యార్థి ఆత్మహత్య వార్త వింటున్నాం. చదువుల ఒత్తిడి.. పరీక్షల్లో పాస్ కాకపోతే ఎలాగనే ఆవేదన.. తల్లిదండ్రులు, స్నేహితుల ముందు పరువుపోతుందనే ఆందోళన.. విద్యా సంస్థల్లో అధ్యాపకులు, సిబ్బంది వేధింపులు.. ఇలాంటివన్నీ కలసి విద్యార్థుల ఆత్మ‘హత్య’లకు కారణమవుతున్నాయి. కుటుంబ, వ్యక్తిగత కారణాలూ వీటికి తోడవుతున్నాయి. కొన్నేళ్లుగా ఈ సమస్య మరింతగా పెరుగుతూ వస్తోంది. జూనియర్ కాలేజీల నుంచి మొదలుకుని మెడికల్ కాలేజీలు, ప్రఖ్యాత ఐఐటీల వరకు అన్నిచోట్లా విద్యార్థుల బలవన్మరణాలు జరుగుతున్నాయి. దేశంలో 2017– 2021 మధ్య ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయి. అదే ఒక్క విద్యార్థులనే పరిగణనలోకి తీసుకుంటే 32 శాతం పెరిగాయి. 2017లో 9,905 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడితే.. 2021లో ఈ సంఖ్య 13 వేలకుపైనే. దేశంలో సగటున రోజుకు 35 మంది.. అంటే ప్రతి రెండు గంటల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇందులోనూ పురుష విద్యార్థుల బలవన్మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా 2020లో విద్యార్థుల ఆత్మహత్యల్లో ఒక్కసారిగా 21శాతం పెరుగుదల నమోదైనట్టు గుర్తించారు. దేశంలోనే టాప్ విద్యాసంస్థలు అయిన ఐఐటీలు, ఐఐఎంలు, నిట్లు, సెంట్రల్ యూనివర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి. 2018 నుంచి 2023 ఏప్రిల్ మధ్య వీటిలో 103 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతుంటే.. ఛత్తీస్గఢ్, గుజరాత్, కేరళ, తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతూ వస్తున్నాయి. వయసుపరంగా చూస్తే.. 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వారి ఆత్మహత్యలు బాగా పెరిగాయి. ఈ ఏజ్వారు 2017 కల్లా 45,217 మంది బలవన్మరణానికి పాల్పడగా.. 2021 నాటికి ఈ సంఖ్య 56,543కు చేరుకుంది. అయితే విద్యార్థులు స్కూల్ చదువు పూర్తిచేసి కాలేజీల్లో చేరినప్పుడు.. ఒక్కసారిగా మారిపోతున్న విద్యా వాతావరణం, కాలేజీ చదువుకు అయ్యే ఖర్చు, విద్యార్థుల సామాజిక–సాంస్కృతిక–ఆర్థిక స్థాయిల్లో భేదాలతో ఒత్తిడి వంటివి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇవి వారి కుటుంబాల్లో సమస్యలకు కారణమై.. ‘కుటుంబ సమస్యల’తో బలవన్మరణాలు జరుగుతున్నాయని అంటున్నారు. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన ‘భారత్లో ప్రమాద మరణాలు, ఆత్మహత్యల నివేదిక (ఏడీఎస్ఐ)’లోని అధికారిక లెక్కలే ఇవి. ఇంకా నమోదుకాని ఆత్మహత్యలు మరెన్నో. సరికొత్త చలపతి, రచయిత -
అదనంగా 1,410 ఇంజనీరింగ్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం నుంచే మరో 1,410 ఇంజనీరింగ్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ఆఖరి నిమిషంలో ఈ సీట్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఎంసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా మార్చారు. ♦ మహబూబాబాద్, ఖమ్మం జిల్లా పాలేరులో కొత్తగా రెండు ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రభుత్వం అనుమతించింది. ఇవి జేఎన్టీయూహెచ్ పరిధిలో నడుస్తాయి. వాస్తవానికి ఈ రెండు కాలేజీల్లో ఒక్కోదాంట్లో 300 వరకూ సీట్లు మంజూరయ్యాయి. ఈ ఏడాది మాత్రం సీఎస్ఈ, ఈసీఈ, సీఎస్ఈ–ఎంఎల్ కోర్సులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. ఒక్కో బ్రాంచ్లో 60 చొప్పున, ఒక్కో కాలేజీలో 180 సీట్లు అందుబాటులోకి వస్తాయి. రెండు కాలేజీల్లో కలిపి 360 సీట్లు ఉంటాయి. ♦ ఘట్కేసర్లోని కొమ్మూరు ప్రతాప్రెడ్డి ఎంబీఏ కాలేజీకి కూడా ఇంజనీరింగ్ కోర్సులకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఈ కాలేజీలో ఆరు బ్రాంచ్లకు కలిపి 360 సీట్లు అదనంగా వస్తాయి. ♦ హైదరాబాద్లోని టీఆర్ఆర్ పాలిటెక్నిక్ కాలేజీని అప్గ్రేడ్ చేశారు. దీంతో 300 సీట్లు అదనంగా రాబోతున్నాయి. ♦ ఇవి కాకుండా మరో మూడుకాలేజీలకు అదనంగా సీట్లు ఇవ్వడానికి అనుమతి లభించింది. దీనికి జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపు రావాల్సి ఉంది. ♦ ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. అన్నీ కలిపి 1,410 సీట్లు అదనంగా రాబోతున్నాయని ఉన్నత విద్యామండలి పేర్కొంది. పెరిగిన సీట్లూ కంప్యూటర్ కోర్సుల్లోనే కొత్తగా పెరిగే 1,410 సీట్లల్లో ఎక్కువగా కంప్యూటర్ కోర్సులే ఉన్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 83,766 సీట్లు కన్వీనర్ కోటా కింద ఉంటే, 58 వేల వరకూ కంప్యూటర్ సంబంధిత బ్రాంచ్ల్లోనే ఉన్నాయి. మూడు విడతలుగా సీట్ల భర్తీ చేపట్టినా, ఇంకా 3,034 సీట్లు కంప్యూటర్ కోర్సుల్లో మిగిలాయి. తాజాగా మరో 900 వరకూ కొత్త సీట్లు కలుపుకుంటే, దాదాపు 4 వేల సీట్లు మిగిలే అవకాశం ఉంది. ప్రత్యేక కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా.. ఆఖరిదశలో అనుమతులు, కొత్త సీట్లు రావడంతో వాటి భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ తేదీలు మార్చారు. వాస్తవానికి ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ మొదలు పెట్టి, 23న సీట్ల కేటాయింపు చేపట్టాలని భావించారు. ఈ తేదీల్లో మార్పులు చేస్తూ సాంకేతిక విద్యా శాఖ కొత్త షెడ్యూల్ ఇచ్చింది. 18వ తేదీ స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ (కొత్తవారు) 17–22 తేదీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు 26న సీట్ల కేటాయింపు 26–28 తేదీల్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ 27–29 తేదీల్లో కాలేజీలో రిపోరి్టంగ్ -
వాతావరణ శాఖ హెచ్చరికలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
సాక్షి, బెంగళూరు: వారం నుంచి వదలని వానలతో కర్ణాటకలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో రేపు (జులై 26న) రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్టు విద్యాశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కేరళలోనూ వానలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈక్రమంలోనే అతి భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వయనాడ్, కోజీకోడ్, కన్నూర్, మళప్పురం జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు మూసి ఉంచాలని రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని విద్యాసంస్థలు ఇప్పటికే సెలవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. (షాకింగ్ వీడియో.. గ్రేటర్ నోయిడాలో నీట మునిగిన 200కు పైగా కార్లు) తెరిపినివ్వని వర్షం కారణంగా కాసర్గాడ్ జిల్లాలోని వెళ్లరికుందు, హోస్దుర్గ్ తాలుకాలు జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు కూడా సెలవులు ఇస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, వానలు, వరదల కారణంగా కేరళలలో ముగ్గురు ప్రాణాలు విడిచినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇడుక్కి, వయనాడ్, కాసర్గాడ్ జిల్లాలో సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. పలు చోట్ల చెట్లు కూలి ఇళ్లు ధ్వంసమయ్యాయని, భారీ వృక్షాలు ఉన్న చోట్ల జనం జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. కాగా, జులై 27 వరకు దక్షిణ భారతానికి భారీగా వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఏపీలో ఐదురోజులపాటు భారీ వర్షాలు..రేపు.. ఎల్లుండి ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు) -
స్కిల్ కాలేజీలతో పరిశ్రమల అనుసంధానం
సాక్షి, అమరావతి: స్కిల్ కాలేజీలు, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానం చేసి ఆయా కంపెనీలకు అవసరమైన కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం విజయవాడలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో నైపుణ్యశాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 15కల్లా పరిశ్రమలతో అనుసంధాన ప్రక్రియను పూర్తిచేయాలని నిర్దేశించారు. స్కిల్హబ్లలో శిక్షణ కోసం ఇప్పటివరకు 15,559 మంది నమోదు చేసుకున్నట్లు నైపుణ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్కుమార్ మంత్రికి వివరించారు. ఇప్పటి వరకు మొత్తం 3,636 మందికి ఉపాధి అవకాశాలు అందించినట్లు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ వినోద్కుమార్ చెప్పారు. స్కిల్ కాలేజీలు, స్కిల్హబ్లకు సంబంధించి కొత్త విధానంలో బ్రాండింగ్ చేయాలని మంత్రి బుగ్గన సూచించారు. చదవండి: ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా?.. కేసీఆర్ ఏమంటారో! -
కాలేజీలు, వర్సిటీల్లో..చదువు... సంపాదన
సాక్షి, అమరావతి: యూనివర్సిటీలు, కాలేజీలు, ఉన్నత విద్యాసంస్థల్లో ‘ఎర్న్ వైల్ లెర్న్’ (చదువుతూ సంపాదన–ఈడబ్ల్యూఎల్) పథకాన్ని త్వరలో ప్రవేశపెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. దీనికి సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలను సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలకు పంపింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులను చదువుల్లో ముందుకు తీసుకెళ్లడంతోపాటు వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు ఈ పథకాన్ని యూజీసీ రూపొందించింది. ఈ వర్గాల విద్యార్థులు తమ విద్యను కొనసాగిస్తూనే కొంత సంపాదించుకునేందుకు వీలుగా ‘చదువుతూనే సంపాదన’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దీనిని విజయవంతంగా అమలుచేయడం ద్వారా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు పార్ట్టైమ్ ఎంగేజ్మెంట్ అవకాశాలను అందించాలని అన్ని ఉన్నత విద్యాసంస్థలకు యూజీసీ ప్రతిపాదించింది. ప్రతి గంటకు నిర్ణీత మొత్తాన్ని చెల్లించాలని, గరిష్టంగా వారానికి 20 గంటలపాటు నెలలో 20 రోజులు ఈ పార్ట్టైమ్ వర్క్లు వారికి అప్పగించాలని యూజీసీ పేర్కొంది. రోజూ తరగతిలో బోధనాభ్యసన ప్రక్రియలు పూర్తయిన తర్వాతే ఈ పార్ట్టైమ్ సేవలను విద్యార్థులకు కల్పించాలని తెలిపింది. ‘చదువుతూ సంపాదన’ అనే ఈ పథకం ద్వారా ఈ వర్గాల విద్యార్థులు వారి చదువులకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి వీలవుతుందని, అదే సమయంలో వారు ఉపాధి మార్గాలను మెరుగుపర్చుకునేలా నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందించుకోగలుగుతారని యూజీసీ అభిప్రాయపడింది. ఈ ‘ఎర్న్ వైల్ లెర్న్’ పథకం బలహీనవర్గాలకు చెందిన విద్యార్థుల చదువుల్లో ఆర్థిక కష్టాలను తగ్గించడంతో పాటు విద్యార్థుల్లో కష్టపడి సంపాదించే తత్వాన్ని పెంపొందిస్తుంది. చదువుల్లో విద్యార్థులను మరింత మెరుగుపరుస్తుంది. విద్య నాణ్యత పెరగడంతోపాటు వారిలో సానుకూల దృక్పథాన్ని అభివృద్ధి చేస్తుంది’.. అని యూజీసీ తన ముసాయిదా ప్రతిపాదనల్లో పేర్కొంది. అంతేకాక.. వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి, సాంకేతిక నైపుణ్యాల మెరుగుకు తోడ్పాటునందిస్తుందని, తద్వారా ఈ వర్గాల విద్యార్థుల్లో సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతాయని యూజీసీ అభిప్రాయపడింది. ‘విద్యార్థులు వృత్తిపరమైన పనులను త్వరగా చేపట్టడంలో ఈ కార్యక్రమం సహాయపడుతుంది. పార్టుటైమ్ పనుల కేటాయింపు ఇలా.. సామాజికంగా, ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు విద్యాసంస్థల్లో ఎలాంటి పార్ట్టైమ్ ఉపాధి కార్యక్రమాలు కలి్పంచాలో కూడా యూజీసీ సూచించింది. ఇందుకు సంబంధించిన జాబితాను రూపొందించింది. ఇందులో.. ♦ రీసెర్చ్ ప్రాజెక్టులతో కూడిన అసిస్టెంట్షిప్, లైబ్రరీ అసైన్మెంట్లు, కంప్యూటర్ సర్విసెస్, డేటాఎంట్రీ, లేబొరేటరీ అసిస్టెంట్లు తదితరాలతో పాటు ఆయా సంస్థలు ఇతర అంశాల్లోనూ పార్ట్టైమ్ జాబ్లను కలి్పంచాలని యూజీసీ పేర్కొంది. ♦ ఇందుకు సంబంధించి ఆయా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రత్యేక సెల్లను ఏర్పాటుచేయాలని తెలిపింది. ♦ సంస్థ డీన్ లేదా డిపార్ట్మెంటల్ హెడ్ తదితరులతో చర్చించి అర్హులైన విద్యార్థులను గుర్తించిన అనంతరం ఉన్నతాధికారుల ఆమోదంతో విద్యార్థులకు తగ్గ పనులను అప్పగించాలని వివరించింది. ♦ ప్రతి అకడమిక్ సెషన్లోనూ ఈ విద్యార్థులను గుర్తించి పూల్గా ఏర్పరచి వీసీ, లేదా ప్రిన్సిపాళ్ల ఆమోదంతో పార్ట్టైమ్ పనులు కేటాయించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ♦ జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా ఈ మార్గదర్శకాలు రూపొందించారు. ♦ సామాజిక–ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి ఇది ఎంతో ఉత్తమమైన కార్యక్రమమని యూజీసీ వివరించింది. ♦ మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు, చిన్నచిన్న పట్టణాల నుంచి వచ్చిన పిల్లలు, దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడ్డ వారికి ఈ కార్యక్రమం ద్వారా ప్రాధాన్యమివ్వాలని తెలిపింది. బ్రిడ్జి కోర్సుల నిర్వహణ ఇక ఉన్నత విద్యాసంస్థల్లో చేరే ఈ విద్యార్థులకు తొలి ఏడాదిలోనే బ్రిడ్జి కోర్సులను నిర్వహించాలని యూజీసీ పేర్కొంది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఈ విద్యార్థులు సంబంధిత కోర్సుల్లోని అంశాలకు సంబంధించి పూర్వపు పరిజ్ఞానాన్ని పూర్తిగా నేర్చుకునే పరిస్థితుల్లేక వెనుకబడి ఉంటారని, ఆ లోపాన్ని పూరించేందుకు ఈ కోర్సులు ఎంతగానో తోడ్పడతాయని తెలిపింది. ఇతర విద్యార్థులతో సమాన స్థాయికి వీరు చేరుకునేందుకు ఇవి అవకాశం కలి్పస్తాయని తెలిపింది. సెమిస్టర్ ప్రోగ్రామ్ ప్రారంభానికి ముందు ఏటా వీటిని నిర్వహించాలని సూచించింది. -
అటువంటి కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ గ్రాంట్తో నడిచే కాలేజీ కార్యకలాపాలు సక్రమంగా సాగనప్పుడు, ఆస్తుల దుర్వినియోగం జరిగినప్పుడు ఆ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం తప్పు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా నర్సరావుపేటలోని శ్రీ త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన ఎన్బీటీ అండ్ ఎన్వీసీ కాలేజీ యాజమాన్య బాధ్యతలను, ఆస్తులను టేకోవర్ చేస్తూ 2017లో జారీ చేసిన జీవో 17ను హైకోర్టు సమర్ధించింది. ఆ జీవోను సవాలు చేస్తూ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎన్బీటీ అండ్ ఎన్వీసీ కాలేజీ సెక్రటరీ, కరస్పాండెంట్ నల్లా రామచంద్ర ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఆ విద్యా సంస్థ సెక్రటరీ కాలేజీ కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించకపోవడంతో కళాశాలలో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది లేని పరిస్థితి నెలకొందని, దీంతో పేద, అణగారిన వర్గాల ప్రజలకు విద్యనందించాలన్న లక్ష్యం నెరవేరకుండా పోయిందని హైకోర్టు తెలిపింది.ఈ పరిస్థితుల్లో విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వమే ఆ కాలేజీని టేకోవర్ చేసిందని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు ఇటీవల తీర్పు వెలువరించారు. కోడెల వల్లే మా కాలేజీకి ఈ దుస్థితి కళాశాలను ప్రభుత్వం టేకోవర్ చేయడాన్ని సవాలు చేస్తూ నల్లా రామచంద్రప్రసాద్ 2017లో దాఖలు చేసిన వ్యాజ్యంలో అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ను ప్రతివాదిగా చేర్చి, ఆయనపై పలు ఆరోపణలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ గంగారావు తుది విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది డి.కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ.. స్థానిక రాజకీయ కారణాలతో అప్పటి స్పీకర్ తమ కాలేజీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకున్నారని, యాజమాన్యంలో చీలికలు తెచ్చారని తెలిపారు. తమ కాలేజీలోని బోధన, బోధనేతర సిబ్బందిని ఇతర కాలేజీలకు బదిలీ చేయించి, కాలేజీలో విద్యార్థులు లేకుండా చేశారన్నారు. అంతిమంగా కాలేజీని నడపలేని స్థితికి కోడెల తీసుకొచ్చారని తెలిపారు. ఆ తరువాత తమ వివరణను పరిగణనలోకి తీసుకోకుండానే కాలేజీని టేకోవర్ చేస్తూ ప్రభుత్వం 2017లో జీవో జారీ చేసిందన్నారు. ఉన్నత విద్యా శాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అంతర్గత వివాదాల వల్ల కాలేజీ కార్యకలాపాలు సక్రమంగా సాగడంలేదని, నిధుల దుర్వినియోగం కూడా జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. విచారణ జరిపిన కమిటీ ఆ కాలేజీని టేకోవర్ చేయాలని సిఫారసు చేసిందన్నారు. పిటిషనర్కు షోకాజ్ నోటీసు ఇచ్చి, వివరణ కోరామని తెలిపారు. వివరణను పరిగణనలోకి తీసుకున్న తరువాతే కాలేజీని టేకోవర్ చేస్తూ జీవో ఇచ్చినట్లు తెలిపారు. -
వీళ్ల తెలివి తగలెయ్య! కళాశాల టాయిలెట్లో సీసీ కెమెరా.. ఆ తర్వాత
ప్రపంచంలో రకరకాల దొంగలను మనం చూస్తూనే ఉంటాం. వీరిలో కొందరు విలువైన వస్తువులను దోచుకోగా, మరికొందరు తక్కువ విలువైన వస్తువులను దోచుకుంటుంటారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని ఓ దొంగ కళాశాలలోని కుళాయిలను తరచూ మాయం చేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన కాలేజీ సెక్యూరిటీ టీమ్ దొంగలను పట్టుకునేందుకు తీసుకున్న చర్యల కారణంగా విద్యార్థులు నిరసనకు దిగారు. అసలు అక్కడ ఏం జరిగిందంటే.. సీసీకెమెరా.. పొరపాటు జరిగింది. అజంగఢ్లోని డీఏవీ పీజీ కళాశాల విద్యార్థులు 'తోటి చోర్' (నీటి కుళాయి దొంగ)ను పట్టుకునేందుకు ప్లాన్ చేశారు. అందుకోసం కళాశాలలోని పలు చోట్ల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో టాయిలెట్ల వెలుపల కూడా ఒక కెమెరాను ఏర్పాటు చేశారు. దీంతో మండిపడ్డ విద్యార్థులు కళాశాల యాజమాన్యం తీరుపై మండిపడుతూ నిరసనకు దిగారు. ఈ పరిణామాలపై యాజమాన్యం స్పందిస్తూ.. క్యాంపస్లో నిత్యం నీటి కుళాయిలు చోరీకి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని నివారించేందుకు కుళాయిలపై నిఘా ఉంచాలనుకున్నాం. అందులో భాగంగానే సీసీటీవీ కెమరాలు ఏర్పాటు చేశాం. అయితే, పొరపాటున టాయిలెట్వైపు ఒక కెమెరా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దాన్ని తీసివేసి మరో చోట మళ్లీ ఇన్స్టాల్ చేయమని ఆర్డర్ కూడా జారీ చేసినట్లు చెప్పింది. కళాశాల ప్రిన్సిపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. బాత్రూం దగ్గర సీసీటీవీ కెమెరా ఒకటి ఏర్పాటు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే దిద్దుబాటు చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పారు. మరో వైపు కళాశాల అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళనకు దిగిన విద్యార్థులు వారి నిరసనను విరమించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: యువతకు మంచి భవిష్యత్ను అందించాలనే ఆలోచనలను ఆచరణలో పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.100 కోట్లతో 3 పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్ గౌర్ సోమవారం గెజిట్ విడుదల చేశారు. ఈ వివరాలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల, అనంతపురం జిల్లా గుంతకల్, వైఎస్సార్ జిల్లా మైదుకూరుల్లో పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ కాలేజీలు అందుబాటులోకి వస్తే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్, మెటలర్జికల్ విభాగాల్లో డిప్లొమా కోర్సుల కోసం సుదూర ప్రాంతాలు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ యువతకు మరింత వెసులుబాటు ఉంటుందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ మరింత మెరుగుపడి విద్య పూర్తవగానే ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని తెలిపారు. మంజూరైన 3 పాలిటెక్నిక్ కాలేజీల్లో ఒకదాన్ని రూ.30 కోట్లతో తన నియోజకవర్గం డోన్ పరిధిలోని బేతంచెర్లలో ఏర్పాటు చేస్తుండటం పట్ల సీఎం వైఎస్ జగన్కు బుగ్గన రాజేంద్రనాథ్ కృతజ్ఞతలు తెలియజేశారు. 3 కాలేజీలను వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికే కేటాయించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. చదవండి: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్ -
టెర్రస్పై ఇన్స్టాగ్రామ్ రీల్ చిత్రీకరిస్తుండగా..కిందపడి విద్యార్థి మృతి
ఇన్స్టాగ్రామ్ రీల్ చిత్రిస్తుండగా టెర్రస్పై నుంచి కిందపడి విద్యార్థి మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన చత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..బిలాస్పూర్ పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ కళాశాలలో బీఎస్సీ ఫస్ట్ ఈయర్ చదువుతున్న 20 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి ఇన్స్టాగ్రామ్ రీల్ షూట్ చేసేందుకు టెర్రస్పైకి ఎక్కాడు. ఐతే వీడియో చిత్రీకరించే సమయంలో ప్రమాదవశాత్తు విద్యార్థి టెర్రస్ పైనుంచి కిందపడి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని అశుతోష్ సోవోగా గుర్తించారు పోలీసులు. అతను తన ఐదుగురు స్నేహితులతో కలిసి ఇన్స్టాగ్రాం రీల్ చేయడానిక ప్లాన్ చేసినట్లు తెలిపారు. ఐతే అశుతోష్ కాలేజ్ టెర్రస్ సరిహద్దు గోడను దూకి కిటికి స్లాబ్పైకి ఎక్కుతుండగా ప్రమాదం జరిగిందన్నారు. అదే సమయంలో స్నేహితులు మొబైల్లో చిత్రికరిస్తుండటంలో మునిపోవడంతో.. ఈ అనుహ్య ప్రమాదాన్ని గుర్తించకపోవడంతో అతన్ని రక్షించలేకపోయారని పోలీసులు తెలిపారు. మృతుడు 20 అడుగుల ఎత్తు నుంచి పడిపోయాడని తెలిపారు. ఈ మేరకు పోలీసులు ప్రమాదవశాత్తు మృతి చెందిన కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఐతే అందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇలాంటి రిస్క్లు తీసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంతకీ ఆ ఈ వీడియోలో వారు ఏం చెప్పాలనుకున్నారంటే..సావో అనే వ్యక్తి కిటికీ స్లాబ్పైకి దూకడం వీడియోలో కనిపిస్తుంది. నేను ఇక్కడి నుంచి దూకితే తిరిగి రాలేను అను చెబుతాడు. అప్పుడే అతని స్నేహితుడు నువ్వు రాగలవు అని చెబుతున్నట్లు వీడియోలో వినపడుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే పట్టు తప్పి అశుతోష్ కిందపడిపోయాడు. అతని స్నేహితులు అశుతోష్ని రక్షించలేకపోయారు. ఇలాంటి రిస్క్లతో కూడిన రీల్ని చిత్రీకరించేటప్పుడూ పలు జాగ్రత్తుల తీసుకోవడం ముఖ్యమని పోలీసులు చెబుతున్నారు. (చదవండి: చైనాతో పరిస్థితి డేంజర్గానే ఉంది! జైశంకర్) -
స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిలపై నిషేధంపై తాలిబన్ల కీలక ప్రకటన
కాబూల్: అఫ్గానిస్తాన్లో అమ్మాయిలు హైస్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో చదవుకోకుండా తాలిబన్ ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ చర్యను ప్రపంచదేశాలు తీవ్రంగా తప్పుబట్టాయి. తాజాగా ఇందుకు సంబంధించి తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. విద్యాసంస్థల్లో అమ్మాయిలపై విధించిన నిషేధం శాశ్వతం కాదని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ఇది కొంతకాలం వాయిదా మాత్రమే పడినట్లు పేర్కొన్నారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో అమ్మాయిలకు అనువైన వాతావరణం కల్పించిన తర్వాత వాళ్లు మళ్లీ చదువుకుంటారని పేర్కొన్నారు. మహిళా విద్యకు తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే ఇది ఎప్పటివరకు పూర్తవుతుందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. అఫ్గాన్లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరాచక పాలన కొనసాగుతోంది. ముఖ్యంగా మహిళల హక్కులను వారు కాలరాస్తున్నారు. మగ తోడు లేకుండా, హిజాబ్ ధరించకుండా మహిళలు బయటకు వెళ్లొద్దని నిబంధన తీసుకొచ్చారు. అలాగే ఆరో తరగతి తర్వాత అమ్మాయిల, అబ్బాయిలు కలిసి చదువుకోవడాన్ని తాలిబన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యాసంస్థల్లో అమ్మాయిలపై డిసెంబర్లో నిషేధం విధించారు. చదవండి: కరోనా పరీక్షలు.. దక్షిణ కొరియా, జపాన్పై చైనా ప్రతీకార చర్యలు.. -
2024 నాటికి అన్ని కాలేజీలకు నాక్ గుర్తింపు!
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం... అన్ని కళాశాలల్లో ప్రమాణాల పెంపునకు సైతం అనేక చర్యలు చేపట్టింది. 2024 నాటికి డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు అన్ని ఉన్నత విద్యాసంస్థలకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) గుర్తింపును తప్పనిసరి చేసింది. నాక్తో పాటు ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్లోనూ రాష్ట్ర విద్యాసంస్థలు స్థానం సంపాదించేలా చర్యలు చేపట్టింది. కాలేజీలకు నాక్ గుర్తింపు రావడంలో సహకారం అందించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో ప్రత్యేకంగా క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ను ఏర్పాటు చేయించింది. దీని ద్వారా అన్ని కాలేజీలు నాక్ ‘ఎ’ గ్రేడ్తో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకులు సాధించేలా కార్యాచరణ చేపట్టింది. క్వాలిటీ అస్యూరెన్స్ సెల్లో వర్సిటీలు, స్వయంప్రతిపత్తి పొందిన కాలేజీలు, పరిశ్రమల ప్రముఖులతోపాటు ఉన్నత విద్యాశాఖ నుంచి సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సెల్ ద్వారా ఇప్పటికే కాలేజీలు నాక్ గుర్తింపు సాధించేలా మార్గనిర్దేశం చేస్తోంది. విద్యా ప్రమాణాల పెంపు, నాక్ గుర్తింపునకు అవసరమైన వనరుల కల్పన, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్కు అవసరమయ్యే అంశాల్లో కాలేజీలను ముందుకు తీసుకువెళ్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో క్వాలిటీ లీడర్లుగా 164 ఇంజనీరింగ్, డిగ్రీ, ఫార్మసీ కాలేజీలు, వర్సిటీలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కాలేజీలు నాక్ గుర్తింపు సాధించేలా సహకారం అందిస్తున్నారు. ప్రమాణాల పెంపునకు అత్యధిక ప్రాధాన్యం.. తొలి అడుగుగా నాక్ ‘బీ’ కేటగిరీలో ఉన్న కాలేజీలను గుర్తించి.. వాటి ద్వారా అసలు నాక్ గుర్తింపు లేని కాలేజీలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే 72 నాక్ గుర్తింపు ఉన్న కాలేజీలను, 13 వర్సిటీలను గుర్తించి వాటిని క్యూ (క్వాలిటీ) మెంటార్లుగా ఏర్పాటు చేశారు. వీటితోపాటు మరో 117 కాలేజీలను కూడా క్వాలిటీ మెంటార్లుగా గుర్తించి 346 కాలేజీలు నాక్ గుర్తింపు సాధించేలా వాటిని అనుసంధానించారు. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాములు, శిక్షణ, ఈ–కంటెంట్ ప్రిపరేషన్ తదితర అంశాల్లో ఆయా కాలేజీలకు సహాయమందిస్తున్నారు. ఉద్యోగాలు కొల్లగొట్టేలా ఉచిత శిక్షణ.. ప్రభుత్వం అన్ని కోర్సుల్లో ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు విద్యార్థులకు సర్టిఫికేషన్ కోర్సులను ఉచితంగా అందిస్తోంది. ఇంటర్న్షిప్ కోసం కాలేజీలను పరిశ్రమలతో అనుసంధానించారు. మైక్రోసాఫ్ట్, సిస్కో, సేల్స్ఫోర్స్, ఏడబ్ల్యూఎస్ వంటి సంస్థల ద్వారా లక్ష మందికి వర్చువల్ ఇంటర్న్షిప్నకు చర్యలు చేపట్టారు. ఐసీఐసీఐ, విప్రో, ఐబీఎం, ఎడెల్వైస్, హీరో, హోండా, మారుతి సుజికీ వంటి సంస్థల్లో ఫుల్స్టేక్, హెచ్ఆర్, మార్కెటింగ్, సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్ వంటి అంశాల్లో 50 వేల మందికి వర్చువల్ ఇంటర్న్షిప్ను అందిస్తున్నారు. -
తగని వసతులు లేని చదువులా?
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తమ బతుకులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మారతాయని ఆశించి ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ ప్రజలు పాల్గొన్నారు. అయితే ఈ ఉద్యమంలో ప్రత్యేక పాత్ర పోషించింది మాత్రం అణగారిన కులాల ప్రజలు. అలాగే విద్యార్థుల పాత్రా మరువ రానిది. అయితే ఉద్యమంలో కేవలం యూనివర్సిటీల విద్యార్థులు మాత్రమే పాల్గొన్నట్లు చెబుతూ ఇతర విద్యార్థుల పాత్రను ప్రస్తావించరు చాలామంది. తెలంగాణలోని స్కూల్స్, జూనియర్ కాలేజీలు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివేవారూ సొంత రాష్ట్ర సాధనలో స్వార్థంలేని కృషి చేశారు. స్వరాష్ట్రం సిద్ధించినా పాఠశాలల పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉందని చెప్పడానికే విద్యార్థుల త్యాగాలను ఇప్పుడు గుర్తు చేయవలసి వస్తున్నది. ఇటీవల కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన యూడీఐఎస్ఏ 2021– 22 నివేదిక మన పాఠశాలలు మౌలిక వసతుల లేమితో కునారిల్లుతున్న సంగ తిని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు కలిపి సుమారు 43,083 ఉన్నాయి. అందులో మొత్తం 69,15,241 విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సుమారు 3,20,894 ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఈ లెక్కల వల్ల సగటున ఒక పాఠశాలకు కేవలం 7గురు టీచర్స్ మాత్రమే ఉన్నారన్న ఆందోళనకరమైన సంగతి స్పష్టమవుతున్నది. రాష్ట్రంలో కేవలం 31,716 పాఠశాలలకే పిల్లలు ఆటలు ఆడుకునే మైదానాలు ఉన్నాయి. కేవలం 772 బడులలో మాత్రమే డిజిటల్ లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ వరల్డ్ అని ఉపన్యాసాలు దంచుతున్నాయి కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. మన విద్యార్థులకు కావాల్సిన టాయిలెట్స్ విషయానికి వస్తే... కేవలం 33,428 పాఠశాలల్లో మాత్రమే బాలికలకు అత్యవసరమైన టాయిలెట్స్ సదుపాయాలు ఉన్నాయి. సుమారు 10 వేల పాఠశాలల్లో కనీసం టాయిలెట్స్ లేవు. మగపిల్లలకు కేవలం 29,137 పాఠశాలల్లో టాయిలెట్స్ సదుపాయాలు ఉన్నాయి. తాగునీరు అందుబాటులో లేని పాఠశాలలు 6 వేలకు పైగా ఉన్నాయి. మొన్నటి వరకు కరోనా వ్యాధి కారణంగా మన పిల్లలు ఆన్లైన్లో అరకొర విద్యాభ్యాసాన్ని కొన సాగించారు. అయితే అందులో కూసింత ఆర్థికంగా బలంగా ఉన్నవారు మంచి వసతులతోనే చదువుకున్నారు. అయితే ప్రధానంగా నష్ట పోయింది మాత్రం ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యను కొనసాగిస్తున్న అణగారిన గ్రామీణ, పట్టణ పేదల పిల్లలే. వీరికి కంప్యూటర్లు, వైఫైవ్ లేదా ఇంటర్నెట్ వంటివి అందుబాటులో లేకపోవడం వల్లనే నష్టపోయారు. టాయిలెట్, స్కూల్ లైబ్రరీలు, పిల్లలు ఆడే మైదానాలు, సరిపడా టీచర్స్, స్కూల్లో ఆన్లైన్ సదుపాయం, డిజిటల్ లైబ్రరీలు, ఇతర సరి పడా నైపుణ్యాలు నేర్పే పరికరాలు లేకుంటే ఏ విధంగా మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో నెట్టుకురాగలరు? ప్రత్యామ్నాయ వసతులు లేకపోతే కరోనా వంటి మహమ్మారులు ప్రబలిన కాలంలో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఆన్లైన్ క్లాసులను ఎలా ఉప యోగించుకోగలరు? ఒక పక్క చిన్న చిన్న ఉప ఎన్ని కల్లోనూ పార్టీలు వందల, వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి గెలవడానికి ప్రయత్నిస్తున్నాయి కానీ... అవే పార్టీలు అధికారంలో ఉన్నా దేశానికి ఎంతో అవసరమైన విద్యకు బడ్జెట్ను తగిన మొత్తంలో కేటాయించక పోవడం విషాదం. ఇప్పటికీ వేలాది పాఠశాలల్లో ఆడపిల్లలకు మరుగు దొడ్లు లేవంటే బాలికా విద్య పట్ల మన ప్రభుత్వాల చిత్తశుద్ధి ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కనీస మరుగుదొడ్లు లేని పాఠశాలల వల్లే అనేకమంది తల్లి దండ్రులు ఆడపిల్లలను బడులకు పంపించడం లేదనే కఠోర వాస్తవం ప్రభుత్వాలకు తెలియదా? ‘బంగారు తెలంగాణ’, ‘వెండి తెలంగాణ’ అనే కబుర్లు మాని... తెలంగాణ ప్రభుత్వం అన్ని విద్యా సంస్థల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలి. ఆరు వేల ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం తాగడానికి ఇప్పటికీ మంచి నీటి వసతి లేదంటే పిల్లలు ఎలా చదువుకోవాలి? మౌలిక సదుపాయాల కల్పన జరిగినప్పుడే స్వరాష్ట్రం కొరకు విద్యార్థులు చేసిన త్యాగాలకు ఫలితం దక్కేలా చేసినట్లు అవుతుంది. అశోక్ ధనావత్, వ్యాసకర్త ఎం.ఏ. డెవలప్మెంట్ స్టడీస్ విద్యార్థి ది హేగ్, నెదర్లాండ్స్ -
కళాశాలల త‘ఖరారు’..!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు అత్యంత కీలకమైనవి ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన పథకాలే. ఇవి అమలు చేయాలంటే సదరు కాలేజీ తప్పకుండా ఈపాస్ వెబ్ పోర్టల్లో ధ్రువీకరణ చేయించుకోవాలి. ఇందుకోసం సంబంధిత కాలేజీల యాజమాన్యాలు ఈపాస్ పోర్టల్లో కాలేజీ గుర్తింపు పత్రాలు, ఏటా సంబంధిత బోర్డు/ యూనివర్సిటీ ద్వారా పొందిన అఫిలియేషన్ పత్రాలను అప్లోడ్ చేయాలి. వాటిని పరిశీలించిన అధికారులు సదరు కాలేజీని ధృవీకరించి అందులో చదువుతున్న విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను వర్తింపజేస్తారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 4,833 ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కాలేజీలుండగా.. వీటిలో ఇప్పటి వరకు పోర్టల్లో సంక్షేమాధికారులు ధ్రువీకరించిన కాలేజీలు 2,843 మాత్రమే. ధృవీకరణ పొందిన వాటిలో 2,626 జూనియర్ కాలేజీలుండగా.. మరో 150 ఐటీఐలున్నాయి. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కాలేజీల కేటగిరీలో ఇప్పటివరకు ధ్రువీకరణ పొందినవి కేవలం 67 కాలేజీలు మాత్రమే ఉండడం గమనార్హం. జాప్యం ప్రభావం విద్యార్థులపైనే... కాలేజీ యాజమాన్యాలు ఈపాస్లో ధ్రువీకరణ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. కానీ చాలా కాలేజీలు ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తున్నాయి. కొన్ని కాలేజీలు మొక్కుబడిగా ఈపాస్ పోర్టల్లో వివరాలు సమర్పించి చేతులు దులుపుకుంటున్నాయి. అఫిలియేషన్, గుర్తింపు పత్రాలను పూర్తిస్థాయిలో అప్లోడ్ చేయకుండానే సబ్మిట్ చేస్తున్నట్లు సంక్షేమ శాఖల అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో పూర్తిస్థాయి పత్రాలు సమర్పించిన కాలేజీలను మాత్రమే కన్ఫర్మ్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలు వెబ్సైట్లో ధ్రువీకరణ పొందగా... డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలు మాత్రం అత్యంత వెనుకబడ్డాయి. ►డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 117 కాలేజీలుండగా... వీటిలో కేవలం రెండు కాలేజీలు మాత్రమే పోర్టల్లో ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసుకున్నాయి. ►జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలో 200 కాలేజీల్లో ఒక్క కాలేజీ కూడా పోర్టల్లో కన్ఫర్మ్ కాలేదు. ►డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో 30 కాలేజీలు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో 111 కాలేజీలు, పాలమూరు యూనివర్సిటీ పరిధిలో 99 కాలేజీలు, శాతవాహన యూనివర్సిటీ పరిధిలో 115 కాలేజీలు, తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో 79 కాలేజీలు, టీఎస్ పారామెడికల్ బోర్డు పరిధిలో 142 కాలేజీలుండగా వీటిలో ఇప్పటివరకు ఒక్క కాలేజీకి కూడా ధ్రువీకరణ దక్కలేదు. ►ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 535 కాలేజీలుండగా... కేవలం 8 కాలేజీలు మాత్రమే పోర్టల్లో కన్ఫర్మ్ అయ్యాయి. ►కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో 115 కాలేజీలుండగా... ఒక్క కాలేజీ మాత్రమే కన్ఫర్మ్ అయ్యింది. ►డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ పరిధిలో 215 ఐటీఐల్లో 150 ఖరారు కాగా మిగతావి పెండింగ్లో ఉన్నాయి. -
TS: ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం.. యాక్షన్ ప్లాన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో గుణాత్మక మార్పులకు ఉన్నత విద్యామండలి శ్రీకారం చుడుతోంది. వచ్చే ఏడాది నుంచి డిమాండ్ మేరకే కోర్సులు, సీట్లను అనుమతించాలని నిర్ణయించింది. విద్యార్థుల డిమాండ్ను బట్టి బ్రాంచ్లను మార్చుకునేందుకు అవకాశం ఇవ్వనుంది. జీరో అడ్మిషన్లున్న కోర్సులు, కాలేజీలను రద్దు చేసే ప్రతిపాదనను కఠినంగా అమలు చేసే యోచనలో ఉంది. చదవండి: టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ 'మరో ప్రస్థానం' ఈ మేరకు రూపొందించిన యాక్షన్ ప్లాన్కు మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ ఇప్పటికే సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఈ ఏడాది నుంచే సంస్కరణలకు ఉన్నత విద్యామండలి తెర తీసింది. ప్రవేశాలు, డిమాండ్ లేని కాలేజీల్లో దాదాపు లక్ష సీట్లను ఫ్రీజ్ చేసింది. కాలేజీల అభ్యర్థన మేరకు ఈ ఏడాది తిరిగి అనుమతించినా, వచ్చే సంవత్సరం కచ్చితంగా అమలు చేయాలని భావిస్తున్నారు. కోర్సుల హేతుబద్దీకరణ రాష్ట్రంలో 4.60 లక్షల డిగ్రీ సీట్లున్నాయి. కానీ, ఏటా 2 నుంచి 2.5 లక్షల సీట్లే భర్తీ అవుతున్నాయి. కొన్ని కాలేజీల్లో జీరో ప్రవేశాలుంటే, మరికొన్నింటిలో 15 శాతంలోపే ఉంటున్నాయి. ఇలాంటి కాలేజీల్లోని విద్యార్థులు ఇతర కాలేజీల్లోకి వెళ్లేందుకు ఉన్నత విద్యామండలి అనుమతివ్వాలని నిర్ణయించింది. విద్యార్థుల సంఖ్యకు మించి సీట్లున్న కాలేజీల మూడేళ్ల డేటాను తెప్పించి, వీటిని హేతుబద్దీకరించాలని భావిస్తోంది. ఉదాహరణకు ఒక కాలేజీలో 240 సీట్లు ఉంటే, 110 మందే విద్యార్థులు చేరినప్పుడు 180 సీట్లకే అనుబంధ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతీ సెక్షన్కు 60 మంది విద్యార్థుల చొప్పున మూడు సెక్షన్లకు అనుమతించి, ఒక సెక్షన్ను ఎత్తివేస్తారు. మూడేళ్లలో 60 సీట్లు కూడా నిండని కాలేజీల్లో 120 సీట్లు ఉంటే, వాటిని 60 సీట్లకే పరిమితం చేస్తారు. కోర్సుల మార్పిడి ఇలా.. దోస్త్ ప్రవేశాల డేటాను ప్రామాణికంగా తీసుకుని కోర్సుల మారి్పడి చేపట్టాలని నిర్ణయించారు. మూడేళ్లలో ఒక కాలేజీకి విద్యార్థులు ఏ కోర్సుకు ఎక్కువగా దరఖాస్తు చేస్తున్నారో చూస్తారు. అతి తక్కువ దరఖాస్తులు వచ్చిన కోర్సుల్లోని సీట్లను తగ్గించుకుని, ఎక్కువ మంది దరఖాస్తు చేసే కోర్సుల్లో సీట్లు, సెక్షన్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలని భావించారు. గత కొన్నేళ్లుగా విద్యార్థులు బీఏ కోర్సుల్లో 20 వేలకు మించి దరఖాస్తు చేయడం లేదు. బీఎస్సీ డేటా సైన్స్, కంప్యూటర్ అనుబంధ కోర్సులకు ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి. ఈ లెక్కన కొన్ని సంప్రదాయ కోర్సులు గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. మార్పులు అవసరం ఏటా ఇంటర్ ఉత్తీర్ణులు 3.60 లక్షలుంటే, డిగ్రీ సీట్లు 4.60 లక్షల వరకూ ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని డిమాండ్–నిష్పత్తి విధానం అమలు దిశగా అడుగులేస్తున్నాం. కోర్సులు, కాలేజీల హేతుబద్ధీకరణ చేపట్టాలని భావిస్తున్నాం. విద్యార్థులు ఇష్టపడే, ఉపాధి అవకాశాలు ఉండే కోర్సుల్లో సీట్లు పెంచడమే ఈ సంస్కరణల ఉద్దేశం. –ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ నష్టం లేకుండా చూడాలి ఇంజనీరింగ్ ప్రవేశాల తర్వాతే విద్యార్థులు డిగ్రీలో చేరడంపై నిర్ణయం తీసుకుంటారు. అందుకే ఈ ఏడాది దోస్త్ ప్రవేశాలు మందకొడిగా ఉన్నాయి. లక్ష సీట్లు ఫ్రీజ్ చేయడం సరికాదని అధికారులకు చెప్పాం. వాళ్లు ఒప్పుకున్నారు. ఏ సంవత్సరమైనా ఒక్కో కోర్సులో ప్రవేశాలు ఒక్కో రకంగా ఉంటాయి. పెరగడం, తగ్గడం సహజం. వీటిని దృష్టలో పెట్టుకుని కాలేజీలకు నష్టం జరగకుండా సంస్కరణలు చేపట్టాలి. – ఎకల్దేవి పరమేశ్వర్, ప్రైవేటు డిగ్రీ కాలేజీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ఇంజినీరింగ్ కాలేజీల ‘లీలలు’.. షోకాజ్ నోటీసులు జారీ!
అనంతపురం: ఇంజినీరింగ్ కళాశాలలు మాయ చేస్తున్నాయి. నిజనిర్ధారణ కమిటీ తనిఖీల్లో అధ్యాపకులు ద్విపాత్రాభినయం బయటపడింది. ఒక్కో అధ్యాపకుడి పేరు రెండు కళాశాలల్లో నమోదు కావడం నివ్వెరపరుస్తోంది. ఇంజినీరింగ్ విద్యలో నాణ్యత ప్రమాణాలకు జేఎన్టీయూ (ఏ) యాజమాన్యం పెద్ద పీట వేస్తోంది. నిబంధనలు విస్మరిస్తూ, నామమాత్రంగా నడుపుతున్న కళాశాలలపై కన్నెర్ర చేస్తోంది. బోధన ప్రమాణాలు పాటించకపోవడంతో పాటు తక్కువ అడ్మిషన్లతో నెట్టుకొస్తున్న 30 ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు చేయడం యూనివర్సిటీ చరిత్రలో ప్రథమం. అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో వసతులు, విద్యార్థి – అధ్యాపక నిష్పత్తి, క్యాంపస్ పరిస్థితి, ఆటస్థలం, గ్రంథాలయ సదుపాయం, ల్యాబ్ తదితర అంశాలను యూనివర్సిటీ ఏటా నిజనిర్ధారణ కమిటీల ద్వారా పరిశీలిస్తోంది. ఏ కళాశాలకు ఎన్ని సీట్లు కేటాయించాలనే దానికి కమిటీ నివేదికే ప్రామాణికం. నివ్వెరపోయే వాస్తవాలు.. జేఎన్టీయూ అనంతపురం పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల గారడీని నిజనిర్ధారణ కమిటీ తమ పరిశీలనలో బహిర్గతం చేసింది. ఒకే కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుడి పేరు మరో ఇంజినీరింగ్ కళాశాలలోనూ నమోదైనట్లు గుర్తించింది. ఇలాంటివి 40 ఇంజినీరింగ్ కళాశాలల్లో బయటపడ్డాయి. ఒక అధ్యాపకుడు రెండు చోట్ల ఎలా పని చేస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆయా కళాశాలలకు షోకాజ్లు జారీ చేసింది. కొన్ని సబ్జెక్టుల్లో పీహెచ్డీ పూర్తి చేసిన అభ్యర్థుల కొరత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఒకరి పేరునే రెండు, మూడు కళాశాలల్లో పనిచేస్తున్నట్లు ఆయా యాజమాన్యాలు చూపించాయి. మరో వైపు కొన్ని కళాశాలల్లో ఫ్యాకల్టీ నియమించుకోకుండా అర్హులైన అధ్యాపకుల పేర్లను మాత్రమే చూపించాయి. పది రోజుల్లో సరైన వివరణ ఇవ్వాలని షోకాజ్లో పేర్కొంది. -
ఇంజనీరింగ్ విద్య పల్లెకు దూరం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ చేయాలంటే ఇక రాజధానికే చేరాలా? సొంతూళ్లలో ఉండి చదువుకోవడం సాధ్యం కాదా? సాంకేతిక విద్యారంగ నిపుణులు లేవనెత్తే సందేహాలివి. నిజమే! ఇంజనీరింగ్ కాలేజీలు శరవేగంగా మూతపడుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చేరువగా ఉండే కాలేజీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలేజీలు మాత్రమే పోటీ ప్రపంచంలో పడుతూ లేస్తూ నిలబడుతున్నాయి. రాష్ట్రంలో 2014లో 249 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, ఇప్పుడు వీటి సంఖ్య 175కు తగ్గింది. అంటే 2014 నుంచి ఇప్పటివరకు ఎనిమిదేళ్లలో 74 కాలేజీలు మూతపడ్డాయి. ఇందులో 54 కళాశాలలు గ్రామీణ ప్రాంతాలకు చేరువలో జిల్లా కేంద్రంలో ఉండేవే. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న కాలేజీల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని కాలేజీల మనుగడే కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రధాన బ్రాంచీల్లోనే పూర్తిగా సీట్లు నిండని కళాశాలలు 15 వరకూ జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ కొన్ని కాలేజీల్లో భారీగా సీట్లు మిగిలిపోతున్నాయి. హైదరాబాద్ బాట పట్టడం వల్లేనా?: టెన్త్ వరకూ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నా... తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హాస్టల్లో ఉండి ఇంటర్ చదివేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఎంసెట్, జేఈఈ మెయిన్స్ సహా పలు పోటీ పరీక్షలకు రాజధానిలో కోచింగ్ తీసుకోవడం తేలికని భావిస్తున్నారు. ఇంజనీరింగ్ తర్వాత ఉపాధే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. దీంతో అవసరమైన అనుబంధ కోర్సులు చేసేందుకు హైదరాబాద్లోనే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. పలు కంపెనీలు క్యాంపస్ నియామకాలను హైదరాబాద్ పరిసర కాలేజీల్లోనే నిర్వహిస్తున్నాయనే ప్రచారం ఉంది. కంప్యూటర్ కోర్సులూ కారణమే.. గత ఐదేళ్లుగా సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సుల కన్నా, కంప్యూటర్ సైన్స్, కొత్తగా వచ్చిన దాని అనుబంధ కోర్సులకే విద్యార్థులు ప్రాధాన్యమిస్తున్నారు. గత ఏడాది సీఎస్ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల్లో 38,796 సీట్లు ఉంటే, 37,073 సీట్లు భర్తీ అయ్యాయి. ఆ తర్వాత స్థానంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 13,935 సీట్లకు 12,308 సీట్లు, సివిల్లో 6 వేల సీట్లకు 3 వేలే భర్తీ అయ్యాయి. ఈఈఈలో ఉన్న 7 వేల సీట్లల్లో 4 వేలు, మెకానికల్లో 5,800 సీట్లుంటే 2,550 మాత్రమే భర్తీ అయ్యాయి. దీన్నిబట్టి చూస్తే.. సివిల్, మెకానికల్లో చేరే వారి సంఖ్య తగ్గింది. మారిన ట్రెండ్కు అనుగుణంగా కొత్త కోర్సులను నిర్వహించడం గ్రామీణ కాలేజీలకు సాధ్యం కావడం లేదు. నల్లగొండ జిల్లాలో ఒకప్పుడు 48 కాలేజీలుంటే, ఇప్పుడు 11కు పరిమితమయ్యాయి. ఖమ్మం జిల్లాలో 28 ఉంటే, ఇప్పుడు 8 మి గిలాయి. మహబూబ్నగర్ జిల్లాలో 11లో రెండు మాత్రమే ఉన్నాయి. ప్రతీ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. నిర్వహణ కష్టం.. కాలానుగుణంగా వస్తున్న మార్పులతో గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీలకు నిర్వహణ కష్టంగానే ఉంది. మంచి ఫ్యాకల్టీ హైదరాబాద్ విడిచి వెళ్లే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో భవిష్యత్ ప్రయోజనాల కోసం విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు హైదరాబాద్నే ఎంచుకుంటున్నారు. ఇది గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీలకు గడ్డు పరిస్థితి తెస్తోంది. –ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, వీసీ, జేఎన్టీయూహెచ్ క్షేత్రస్థాయిలో మార్పులు అవసరం గ్రామీణ ప్రాంత ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంచాలి. సంప్రదాయ సివిల్, మెకానికల్ కోర్సులకు ఆధునిక సాంకేతికత జోడించి కొత్తదనం వచ్చేలా చూడాలి. వీటితో ఉపాధి ఉంటుందనే నమ్మకం కలిగించాలి. లేకపోతే ఇంజనీరింగ్ విద్య మరింత భారమయ్యే అవకాశం ఉంది. –అయినేని సంతోష్కుమార్, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
‘న్యాక్’కు దూరంగా కాలేజీలు!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యా ప్రమాణాలకు కొలమానమైన ‘నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)’గుర్తింపును అన్ని కాలేజీలకు తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను కూడా సిద్ధం చేస్తోంది. న్యాక్ గుర్తింపు లేని కాలేజీలకు యూనివర్సిటీల నుంచి అనుబంధ గుర్తింపు ఇవ్వకుండా కట్టడి చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా న్యాక్ గుర్తింపు ఉన్న కాలేజీలు, యూనివర్సిటీల జాబితా పెంచాలని ఉన్నత విద్యామండలి ప్రయ త్నం చేస్తున్నా పెద్దగా స్పందన కన్పించడం లేదు. సదస్సుకు కూడా రాకుండా.. న్యాక్ బెంగళూరు కేంద్రం ఉన్నతాధికారులతో రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలకు అవగాహన కల్పించాలని ఉన్నత విద్య మండలి భావించింది. దీనిపై ఈ నెల 20న సదస్సు నిర్వహించేందుకు సిద్ధమైంది. కానీ రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలు న్యాక్ గుర్తింపు ఏమోగానీ, కనీసం సదస్సులో పాల్గొనేందుకు కూడా విముఖత చూపినట్టు తెలిసింది. అనుకున్న మేర కాలేజీలు పాల్గొనేందుకు సుముఖత చూపకపోవడంతో న్యాక్ ప్రధాన కార్యాలయం ఆధికారులు సదస్సును వాయిదా వేశారు. నజరానా ఇస్తామన్నా.. న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే కాలేజీలకు రూ.లక్షల్లో నజరానా ఇస్తామని కూడా ఉన్నత విద్యా మండలి గతంలో ప్రకటించింది. అయినా ఒక్క కాలేజీ కూడా ముందుకు రాలేదు. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. అవి గుర్తింపు కోసం దరఖాస్తు చేయాలంటే ప్రమాణాలు పెంచుకోక తప్పదు. అంతగా ఆదాయం లేని తాము ప్రమాణాల కోసం ఎందుకు ఖర్చు చేయాలనే ఆలోచనతో అవి వెనుకడుగు వేస్తున్నాయి. ‘న్యాక్’ గ్రేడ్ ఉంటే విలువ దేశంలోని విద్యాసంస్థల్లో అంతర్జాతీయ స్థాయి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేసేందుకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)ను అమల్లోకి తెచ్చారు. వివిధ రంగాల్లోని ప్రముఖులతో ఏర్పడే న్యాక్ కమిటీల ఆధ్వర్యంలో విద్యా ప్రమాణాలను అంచనా వేస్తారు. న్యాక్ ప్రధానంగా ఏడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. పాఠ్య ప్రణాళిక రూపకల్పన, అమలు; విద్యాబోధన స్థాయి; పరిశోధన దిశగా పురోగతి; మౌలిక సదుపాయాలు; విద్యార్థి పురోగతి; ఆ సంస్థకు ఉన్న విశ్వసనీయత; అత్యుత్తమమైన ప్రమాణాల అమలు తదితర అంశాలను పరిశీలించి.. సదరు కాలేజీలు, యూనివర్సిటీలకు మార్కులు, గ్రేడ్లు ఇస్తుంది. ఈ గ్రేడ్ల ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు అందే అవకాశం కూడా ఉంటుంది. గుర్తింపు తప్పనిసరి అవ్వొచ్చు ఉన్నత విద్యా రంగంలో ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు న్యాక్ గుర్తింపు ఉంటేనే ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించాయి. కాకపోతే ఇది అమలు చేయడానికి కొంత సమయం ఇచ్చాయి. రాష్ట్రంలోనూ న్యాక్ గుర్తింపు కోసం ఉన్నత విద్యా మండలి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కాలేజీలను ప్రోత్సహించి, చేయూతనివ్వాలని చూస్తోంది. ఈ ప్రక్రియను భవిష్యత్లో మరింత ముందుకు తీసుకెళ్తాం. న్యాక్ గుర్తింపు పొందడం తప్పనిసరి కావొచ్చు కూడా.. – వి.వెంకటరమణ, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ -
మల్టీ డిసిప్లినరీ అటానమస్ సంస్థలుగా కాలేజీలు
యూనివర్సిటీల తరహాలో దేశంలోని అన్ని కాలేజీలు మల్టీ డిసిప్లినరీ (బహుశాస్త్ర మిశ్రిత) అటానమస్ సంస్థలుగా ప్రగతి సాధించేలా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ముసాయిదా ప్రతిపాదనలను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలు మల్టీ డిసిప్లినరీ సంస్థలుగా ఉన్నందున దేశంలోని కాలేజీలు కూడా ఆ స్థాయికి చేరేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలను రూపొందించింది. వీటిపై మార్చి 20లోగా దేశంలోని నిపుణులు, ఇతర స్టేక్ హోల్డర్లు తమ అభిప్రాయాలు వెల్లడించాలని యూజీసీ పేర్కొంది. పరిశోధనలు చేయించడంతో పాటు, ఉన్నత ప్రమాణాలతో కూడిన బోధన, డిగ్రీలను ప్రదానం చేసే అటానమస్ సంస్థలుగా కాలేజీలు రూపుదాల్చేలా చర్యలు చేపట్టనుంది. పారిశ్రామిక భాగస్వామ్యం, రీసెర్చ్ ప్రాజెక్టులు తదితర కార్యక్రమాల ద్వారా ఆయా సంస్థలు యూనివర్సిటీల స్థాయికి చేరుకోవడమే ఈ ముసాయిదా ప్రతిపాదనల లక్ష్యమని యూజీసీ వివరించింది. – సాక్షి, అమరావతి 2035 నాటికి అన్ని కాలేజీలూ స్వయం ప్రతిపత్తితో ఎదిగేలా.. 2035 నాటికి అన్ని కాలేజీలు స్వయం ప్రతిపత్తితో డిగ్రీలను ప్రదానం చేసే సంస్థలుగా ఎదిగేలా చేయాలన్నది వీటి ఉద్దేశం. 2030 నాటికి ప్రతి జిల్లాలో కనీసం ఒక్కటైనా పెద్ద సంస్థ ఈ విధమైన స్వయం ప్రతిపత్తి కలిగిన స్థాయికి ఎదగాలని యూజీసీ నిర్దేశించింది. అలాగే నాలుగేళ్ల డ్యూయల్ మేజర్ డిగ్రీ ప్రోగ్రాములను అమలు చేసేందుకు వీలుగా ఉన్నత విద్యాసంస్థలకు అనుమతులు ఇచ్చే అంశాలను కూడా ఈ ప్రతిపాదనల్లో యూజీసీ చేర్చింది. భాగస్వామ్య విధానంలో విద్యార్థులు తాము చేరే సంస్థలో ఒక డిగ్రీ తీసుకోవడంతో పాటు సెకండ్ డిగ్రీని ఆ సంస్థతో ఒప్పందమున్న వేరే ఉన్నత విద్యాసంస్థలో పొందేందుకు వీలుగా ఆయా సంస్థలు సమన్వయంతో ముందుకు వెళ్లనున్నాయి. దీనికోసం రెగ్యులేటరీ సంస్థల నియమాలను అనుసరిస్తూ జాయింట్ సీట్ అలకేషన్ విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ డిగ్రీ కోర్సులకు ఎంపికను కూడా సంబంధిత అర్హత పరీక్షల ఆధారంగానే చేపట్టాలి. భాగస్వామ్య సంస్థలు నిర్దేశించిన కనీస అర్హత మార్కులను ఆయా విద్యార్థులు సాధిస్తేనే సెకండ్ డిగ్రీతో డ్యూయల్ డిగ్రీకి అవకాశం ఉంటుంది. క్లస్టర్లుగా కాలేజీలు ఇందుకోసం కాలేజీలను ఒక క్లస్టర్గా రూపొందించి వాటిమధ్య పరస్పర సహకారం ఉండేలా ఏర్పాట్లు చేయాలి. ప్రస్తుతం ఏదైనా ఉన్నత విద్యాసంస్థ అన్ని కోర్సులను నిర్వహించడానికి వీలైన వనరులను ఏర్పాటు చేయడం కష్టంగా మారుతోంది. దీంతో ఆ సంస్థల మల్టీ డిసిప్లినరీ కోర్సుల ఏర్పాటు, నిర్వహణ సాధ్యం కావడం లేదు. ఫలితంగా వాటిలో చేరికలు కూడా అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో క్లస్టర్ కాలేజీ భాగస్వామ్యంతో ఈ సమస్యను అధిగమించడానికి వీలు కలుగుతుంది. దీనివల్ల కాలేజీల్లో చేరికలు పెరగడంతో పాటు విద్యార్థులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని యూజీసీ పేర్కొంటోంది. భాగస్వామ్య విధానం వల్ల ఆయా సంస్థలు వనరులు సమకూర్చుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవని, అదే సమయంలో విద్యార్థులకూ మల్టీ డిసిప్లినరీ కోర్సులు అందుబాటులోకి వస్తాయని యూజీసీ అభిప్రాయపడుతోంది. న్యాక్ అక్రిడిటేషన్, ఇతర గుర్తింపులను కూడా ఆయా సంస్థలు సాధించడానికి వీలుంటుందని యూజీసీ పేర్కొంది. -
అర్హతలున్నాయి... అవగాహనే లేదు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపును తెలంగాణలో విస్తరించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసింది. త్వరలో దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు కాలేజీల డేటాను తెప్పించినట్టు, కొన్నింటిని ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్టు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో చాలా కాలేజీలకు న్యాక్ గుర్తింపు పొందగల అర్హతలున్నాయని, అయితే సరైన అవగాహన లేకపోవడంతో ఇందుకోసం దరఖాస్తు చేయలేదని అంటున్నారు. ఫలితంగా న్యాక్ గుర్తింపు కలిగిన కళాశాలల విషయంలో తెలంగాణ వెనుకబడి ఉంది. దేశంలో న్యాక్ గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థలు 21 శాతం ఉంటే, తెలంగాణలో ఇది 11 శాతానికే పరిమితమైంది. కాలేజీల్లో ఉన్నత విద్య ప్రమాణాల స్థాయిని న్యాక్ గుర్తింపు తెలియజేస్తుంది. చాలా కాలేజీలు న్యాక్ గుర్తింపును అదనపు అర్హతగా భావించడంతో ఈ మేరకు ప్రచారం సైతం చేసుకుంటాయి. ఈ కళాశాలల శాతం ఎంత పెరిగితే ఆ రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రమాణాలు అంత ఎక్కువగా ఉన్నట్టన్న మాట. ప్రమాణాలున్నా.. ప్రయత్నమే లేదు రాష్ట్రంలో ప్రస్తుతం 1,976 ఉన్నత విద్యా సంస్థలున్నాయి. వీటిల్లో కేవలం 141 మాత్రమే న్యాక్ గుర్తింపు కలిగి ఉండటం గమనార్హం. ఇందులో 35 ప్రభుత్వ సంస్థలు, 19 ఎయిడెడ్, 87 ప్రైవేటు సంస్థలున్నాయి. రాష్ట్రంలోని 24 యూనివర్శిటీలకు గాను న్యాక్ గుర్తింపు ఉన్నవి పదే. శాతవాహన, జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ సహా కొన్ని ఇప్పటికీ న్యాక్ గుర్తింపు పొందలేదు. ఈ పరిస్థితులపై ఉన్నత విద్య మండలి ఇటీవల క్షేత్రస్థాయి అధ్యయనం చేసింది. దాదాపు వందకుపైగా డిగ్రీ కాలేజీలు న్యాక్ గుర్తింపునకు అర్హత కలిగి ఉన్నట్టు గుర్తించాయి. సొంత భవనాలు, నాణ్యతతో కూడిన బోధన అందించగల ఫ్యాకల్టీ, లేబొరేటరీలు, పటిష్టమైన బోధన విధానాలు, లైబ్రరీ సదుపాయాలు, కచ్చితమైన నిర్వహణ వ్యవస్థ వీటికి ఉన్నాయి. కొన్నేళ్ళుగా అక్కడ మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. ఉపాధి అవకాశాలు పొందడంలోనూ ఈ కాలేజీ విద్యార్థుల శాతం మెరుగ్గా కన్పిస్తోంది. ఇలా న్యాక్ గుర్తింపునకు అవసరమైన అన్ని అర్హతలు, ప్రమాణాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆయా సంస్థలు గుర్తింపు కోసం దరఖాస్తు చేయలేదు. వాస్తవానికి విద్యార్థులు ఏదైనా కాలేజీలో చేరాలనుకున్నప్పుడు న్యాక్ గుర్తింపు ఉందా లేదా అని చూస్తారు. అలాగే దేశ, విదేశీ విద్యా సంస్థలు విద్యార్థుల చేరికల సమయంలో సదరు కాలేజీకి న్యాక్ గుర్తింపు ఉందా లేదా అని చూస్తాయి. అలాగే క్రమబద్ధమైన పర్యవేక్షణ, ప్రమాణాలు కొనసాగించేలా ఈ గుర్తింపు దోహదపడుతుంది. ఇలాంటి ప్రయోజనాలన్నిటిపై అవగాహన లేక, ‘నడుస్తోంది కదా..చూద్దాంలే’అన్న నిర్లిప్త ధోరణిలో చాలా కాలేజీలు ఉంటున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దరఖాస్తు చేసేలా కార్యాచరణ ఈ నేపథ్యంలోనే న్యాక్ గుర్తింపు కలిగిన కాలేజీలు, వర్సిటీల పెంపు కోసం ఉన్నత విద్యామండలి వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టనున్నారు. ఇందులో భాగంగా తొలుత.. ఇప్పటికే గుర్తింపు పొందిన 141 కాలేజీల్లో 81 కాలేజీలు న్యాక్ గుర్తింపును రెన్యువల్ చేయించుకునే దిశగా ప్రోత్సహిస్తారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 72, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 6, గ్రామీణ ప్రాంతాల్లో 63 వరకూ ఉన్నాయి. ఆ తర్వాత మౌలిక వసతులు, ఫ్యాకల్టీ పాటు, అన్ని అర్హతలున్న వందకుపైగా కాలేజీల చేత దరఖాస్తు చేయించాలని నిర్ణయించారు. దీని తర్వాత ప్రమాణాలు పెంచుకుని, న్యాక్ గుర్తింపునకు అర్హత సాధించే దిశగా కాలేజీలను ప్రోత్సహిస్తారు. ఇక ఏమాత్రం ప్రమాణాలు లేని, విద్యార్థుల చేరికలు లేని కోర్సులు, కాలేజీల మూసివేత దిశగా చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. న్యాక్ గుర్తింపు పొందేలా ఆయా సంస్థలతో ప్రత్యేకంగా సమాలోచనలు జరపాలని భావిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. -
హిజాబ్ వివాదం (Hijab Row): కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, బెంగళూరు: హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, కాలేజీలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు సీఎం బసవరాజ్ బొమ్మై ట్విటర్లో స్పందించారు. రాష్ట్రంలో శాంతిని కాపాడాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల, కళాశాల యాజమాన్యంతోపాటు రాష్ట్ర ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే మూడు రోజుల పాటు అన్ని హైస్కూల్స్, కాలేజీలను మూసివేయాలని ఆదేశించినట్లు, ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. I appeal to all the students, teachers and management of schools and colleges as well as people of karnataka to maintain peace and harmony. I have ordered closure of all high schools and colleges for next three days. All concerned are requested to cooperate. — Basavaraj S Bommai (@BSBommai) February 8, 2022 కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు హిజాబ్ వివాదంపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో భావోద్వేగాలకు తావులేదని వ్యాఖ్యానించింది. చట్ట ప్రకారం, రాజ్యాంగ బద్దంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. తమకు రాజ్యాంగమే భగవద్గీత అని తెలిపిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. చదవండి: కర్ణాటకలో ‘హిజాబ్’పై అదే రగడ ముదురుతున్న హిజాబ్ వివాదం కర్ణాటకలో హిజాబ్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై కర్ణాటకలోని రెండు జిల్లాల్లో మంగళవారం హింసాత్మకంగా మారింది. ఉడిపిలోని మహాత్మాగాంధీ మెమోరియల్ కాలేజీలో మంగళవారం కాషాయ కండువాలు ధరించిన విద్యార్థులు, హిజాబ్లు ధరించిన విద్యార్థులు పరస్పరం ఘర్షణకు దిగడంతో నిరసనలు చెలరేగాయి. హిజాబ్ ధరించి ఓ విద్యార్థిని కాలేజ్కు వస్తుండగా కాషాయ కండువాలు ధరించిన మరొక వర్గం విద్యార్థులు అడ్డుకున్నారు. యువతి తన స్కూటర్ను పార్క్ చేసి కళాశాల భవనం వైపు వెళుతుండగా.. ఆమెకు వ్యతిరేకంగా కాషాయ కండువాలు ధరించిన వర్గం జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. వీరికి ధీటుగా ఆ విద్యార్థిని ‘అల్లా హు అక్బర్’ అంటూ నినదించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. भेड़िये ! https://t.co/GnceytfDXL — Swara Bhasker (@ReallySwara) February 8, 2022 -
100 శాతం సామర్థ్యంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు
న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన జరిగిన ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాత్రి కర్ఫ్యూ సమయాన్ని గంటసేపు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ రాత్రి కర్ఫ్యూ కొనసాగనుంది. సోమవారం నుంచి విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు తిరిగి తెరచుకోనున్నాయి. అయితే పాఠశాలలు తెరవడానికి దశల వారీగా అనుమతిచ్చారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు ఫిబ్రవరి 7 నుంచి పునఃప్రారంభంచనున్నారు. నర్సరీ నుంచి 8వ తరగతి వరకు ఫిబ్రవరి 14 నుంచి వర్చువల్ బోధన కొనసాగించనున్నారు. టీకాలు వేసుకోని ఉపాధ్యాయులకు పాఠశాలలకు అనుమతిని నిరాకరించారు. చదవండి: ('సీఎం సార్ హెల్ప్ మీ'.. వెంటనే కారు ఆపి..) ఉన్నత విద్యాసంస్థలు ప్రామాణిక నిబంధనలకు లోబడి తెరవబడతాయి. 100 శాతం సామర్థ్యంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు అనుమతిచ్చారు. జిమ్ సెంటర్లు, స్విమ్మింగ్ పూల్స్, రెస్టారెంట్లు, బార్లు ప్రారంభానికి అనుమతిచ్చారు. వ్యాపార సంస్థలన్ని యథాప్రకారంగా కొనసాగనున్నాయి. -
రాత్రి కర్ఫ్యూ రద్దు.. ఫిబ్రవరి 1 నుంచి మళ్లీ బడులు: సీఎం
సాక్షి, చెన్నై: కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలను ఫిబ్రవరి ఒకటో తేది నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ గురువారం ప్రకటించారు. అయితే, ఎల్కేజీ, యూకేజీ, ప్లేస్కూళ్లను తెరిచేందుకు మాత్రం అనుమతి మంజూరు చేయలేదు. రాష్ట్రంలో కరోనా మరలా ప్రబలుతున్న కారణంగా ప్రభుత్వం గత నెల 7వ తేదీ నుంచి పలు ఆంక్షలను అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా పాఠశాలల మూత, శుక్ర, శని, ఆదివారాల్లో ప్రార్థనాలయాల్లో దర్శనాల నిలిపివేత, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ, ప్రతి ఆదివారం పూర్తి లాక్డౌన్ వంటి నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఈనేపథ్యంలో కరోనాపై సమీక్షించిన ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ నిబంధనలను సడలించారు. హోటళ్లు, అతిథి గృహాలు 50 శాతం వినియోగదారులకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: (ఎన్నికల బరిలో ‘విజయ్ మక్కల్ ఇయక్కం’) -
విద్యా సంస్థలు ఎప్పుడు తెరుద్దాం?
సాక్షి, హైదరాబాద్: కరోనా థర్డ్ వేవ్ కారణంగా మూతబడిన విద్యాసంస్థలను తిరిగి ప్రారంభిం చాలన్న డిమాండ్పై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. స్కూళ్లు, కాలేజీలను తెరిస్తే వచ్చే ఇబ్బందులపై ఆరా తీస్తోంది. ఈ మేరకు విద్యా, ఆరోగ్య శాఖల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కోరినట్టు తెలిసింది. ఆయా విభాగాల అభిప్రాయాలకు అనుగుణంగా సర్కార్ నిర్ణయం తీసుకోవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కోవిడ్ తగ్గుముఖం పడితే, తల్లిదండ్రులు తమ పిల్లలను పంపడానికి సుముఖంగా ఉంటే వచ్చే నెల 5 నుంచి స్కూళ్లను తెరవాలని ప్రభుత్వం యోచి స్తోంది. తాజా పరిస్థితిపై ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వైద్య అధికారులతో సమీక్ష జరిపినట్టు సమాచారం. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి కొనసాగు తున్నా దాని ప్రభావం స్వల్పంగానే ఉందని వైద్య అధికారులు తెలిపినట్టు తెలిసింది. థర్డ్ వేవ్ ప్రభావం తగ్గితే యథావిధిగా విద్యాసంవత్సరం ముగించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఒకవేళ సెలవులు పొడిగించాల్సి వస్తే పరీక్షల షెడ్యూల్లోనూ స్వల్ప మార్పులుండే అవకాశముందని చెబుతున్నారు. విద్యా సంస్థలు తిరిగి తెరవాల్సి వస్తే స్కూలుకు రావాలంటూ బలవంతం చేయకుండా, ప్రత్యక్ష బోధనకుతోడు ఆన్లైన్ బోధనా కొనసాగించాలని భావిస్తున్నారు. మరో రెండు రోజుల్లో విద్యాసంస్థలను తెరవడంపై స్పష్టత వచ్చే అవకాశముంది. విద్యాసంవత్సరం పొడిగించాలి: వై.శేఖర్రావు (ట్రస్మ అధ్యక్షుడు) కోవిడ్ నేపథ్యంలో సెలవుల పొడిగింపు వల్ల విద్యాబోధన కుంటుపడింది. ఆన్లైన్ విద్యాబోధన చేపట్టినా అది అన్ని స్థాయిల్లోకి వెళ్లడం కష్టంగానే ఉంది. ఇప్పటికే ఏ క్లాసులోనూ సిలబస్ పూర్తవ్వలేదు. ప్రత్యక్ష బోధన చేపట్టినా, విద్యా సంవత్సరాన్ని మే నెల వరకూ పొడిగిస్తేనే సిలబస్ పూర్తి చేయడం సాధ్యమవుతుంది. -
'వైద్య నిపుణుల సూచనలతో బడులు ప్రారంభిస్తాం'
సాక్షి, ముంబై: వైద్య నిపుణులు ఇచ్చే సూచనలు సలహాల మేరకు రాష్ట్రంలో తిరిగి బడులు ప్రారంభించే యోచనలో ఉన్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ పేర్కొన్నారు. బడుల పునఃప్రారంభంపై ఇప్పటికే ఓ ప్రతిపాదనను రూపొందించినట్లు ఆమె బుధవారం విలేకరులకు వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న కరోనా కేసుల తాజా పరిస్థితులపై ఒక నివేదిక రూపొందించినట్లు ఆయన తెలిపారు. వాటిని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు పంపించామని, త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. ముంబైతోపాటు రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరగడంతో ఫిబ్రవరి 15వ తేదీ వరకు పాఠశాలలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ, పాఠశాలలు పూర్తిగా మూసి ఉంచాలని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో అసంతృప్తి, వ్యతిరేకత వాతావరణం నెలకొంది. అంతేగాకుండా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు వైరల్ అవుతున్నాయి. శుభకార్యాలకు, మాల్స్, థియేటర్లలో 50% అనుమతిస్తున్నారు. కానీ, పాఠశాలలు తెరిస్తే విద్యార్థులకు కరోనా సోకుతుందని మూసి ఉంచడం సమంజసం కాదని, విద్యార్థులు నష్టపోతున్నారని సందేశాలు వైరల్ అవుతున్నాయి. అలాగే పాఠశాలలు పూర్తిగా మూసి ఉంచే బదులు ఒక ప్రణాళిక ప్రకారం తెరవాలని ఉపాధ్యాయులు కూడా డిమాండ్ చేస్తున్నారు. చదవండి: (ప్రముఖ క్రిమినల్ లాయర్ శ్రీకాంత్ షివాడే కన్నుమూత) రెండు నెలల కిందట కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యావేత్తలు, నిపుణుల సలహాల ప్రకారం అప్పట్లో పాఠశాలలు తెరిచామని వర్షా తెలిపారు. కానీ, గత పక్షం రోజుల కిందట కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరగడంతో మూసివేయాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం రోగుల సంఖ్య మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల సంఘటనలతో చర్చించామని, ఆ సమయంలో వారు ఒక నివేదక అందజేశారని వర్షా వెల్లడించారు. పాఠశాలలు ప్రారంభించాల్సిందేనని అనేక మంది డిమాండ్ చేశారని తెలిపారు. దీంతో రోగుల సంఖ్య ఎక్కడెక్కడ తక్కువగా ఉందో అక్కడ పాఠశాలలు తెరిచేందుకు స్థానిక అధికారులకే అధికారమివ్వాలని ప్రతిపాదించామని, ఆ మేరకు ముఖ్యమంత్రికి నివేదిక అందజేశామని పేర్కొన్నారు. పాఠశాలలు ప్రారంభించాలనే ఉద్ధేశం తమకు కూడా ఉందని, ప్రస్తుతం 15–18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా టీకా డోసు వేసే ప్రక్రియకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది కూడా రెండు టీకాలు తీసుకుని విధుల్లో చేరేలా సూచనలిస్తున్నట్లు వర్షా స్పష్టం చేశారు. లేదంటే పరిస్థితి మొదటికే వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. -
'థర్డ్వేవ్ ప్రారంభమైంది.. పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని నిర్ణయించాం'
జల్నా (ముంబై): కరోనా మహమ్మారి మూడవ వేవ్ ప్రారంభమైందని, ఇది జనవరి చివరి నాటి కి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే సోమ వారం అన్నారు. జల్నాలో సోమవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడు తూ, ప్రజలు కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. మహారాష్ట్రలో భారీగా కొత్త కేసులు నమోదవుతున్న తరుణంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘జాన్ హై తో జహాన్హై’ అన్న సామెతను అందరూ దృష్టి లో పెట్టుకోవాలని ఆయన సూచించారు. చదవండి: (ఇదే కొనసాగితే లాక్డౌన్ అమలు చేయక తప్పదు!) పెరుగుతున్న కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకునే పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని నిర్ణయించామని, ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలు మద్దతునివ్వాలని ఆయన కోరారు. మహమ్మారి తీవ్రత గు రించి సోమవారం వర్చువల్ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాతో కూడా చర్చించినట్టు తోపే చెప్పారు. కరోనా సంసిద్ధతలో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్లకు మరమ్మతులు చేస్తున్నామని, 60 ఏళ్లు దాటిన వారికి, వైద్య, ఆరోగ్య సిబ్బందికి బూస్టర్ డోస్లను వేగవంతం చేస్తున్నామని ఆయన తెలిపారు. 15–18 సంవత్సరాల మధ్య పిల్లలకు త్వరలోనే టీకాలు వేయడం పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 17 వేల ఆక్సిజన్ పడకల్లో నాలుగు శాతం మాత్రమే ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయని చెప్పారు. 14 రోజుల క్వారంటైన్ వ్యవధిని కూడా ఏడు రోజులకు కుదించినట్లు ఆయన పేర్కొన్నారు. -
హై స్కూళ్లు, కాలేజీల్లోనే సచివాలయ సిబ్బంది ద్వారా వ్యాక్సినేషన్
-
విద్యాశాఖ అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది
-
విద్యార్థుల ధర్నాలో దుండగులు: మంత్రి సురేష్
సాక్షి, విజయవాడ: అనంతపురంలో కాలేజీ ఘటనపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. విద్యార్థుల ధర్నాలో కొందరు దుండగులు చొరబడ్డారన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలీసులపై రాళ్లు రువ్వి విద్యార్థిని గాయపర్చారన్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని వివరించారు. చదవండి: అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ టీడీపీ: సజ్జల కొన్ని రాజకీయ పార్టీలు వీటిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అవాస్తవ ప్రచారానికి కొన్ని మీడియా సంస్థలు మద్దతు పలుకుతున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. విద్యార్థినిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు లాఠీచార్జ్ చేయలేదంటూ బాధిత విద్యార్థినే చెబుతోందని మంత్రి అన్నారు. దుండగులు వేసిన రాళ్ల దాడిలోనే విద్యార్థిని గాయపడిందన్నారు. రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాసంస్థల పనితీరుపై కమిటీ వేశామని.. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆదిమూలపు పేర్కొన్నారు. -
ఏపీలోని 4 కళాశాలలకు ఛాత్ర విశ్వకర్మ అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏటా అందించే ‘ఛాత్ర విశ్వకర్మ అవార్డీ స్టూ డెంట్స్ ప్రాజెక్ట్స్, ఇట్స్ అప్లికేషన్ ఫర్ సొసైటీ’ అవా ర్డులు ఏపీలోని నాలుగు కళాశాలల విద్యార్థులకు దక్కాయి. పరిశుభ్రత విభాగంలో దక్షిణ మధ్య వర్సిటీల్లో ఏపీకి చెందిన కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (డీమ్డ్ టు బి యూనివర్సిటీ)కి ‘ద క్లీన్, స్మార్ట్ క్యాంపస్(ఐకేఎస్)’అవార్డు దక్కింది. ఆదివారమిక్కడ నిర్వహించిన కార్యక్ర మంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ విజేతల ప్రతినిధులకు అవార్డు అందజేశారు. ఏపీలోని సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కాలేజ్కు చెందిన ‘శ్రామిక్స్’బృందానికి రీసైక్లింగ్ ఆర్ అప్ స్కిల్లింగ్ ఫర్ ఎ న్య్సూరింగ్ లైవ్లీహుడ్ విభాగంలో తొలిస్థానం దక్కింది. ఆదిత్య ఇన్స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మేనేజ్ మెంట్కు చెందిన ‘ఛాలెంజర్స్’ బృందానికి ఐఓటీ –బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉమెన్ ప్రొటెక్షన్ డివైజ్కు ‘జెండర్–రెస్పాన్సివ్ మెకానిజం టు కాంబాట్ డొమెస్టిక్ వయెలెన్స్’ విభాగంలో రెండోస్థానం దక్కింది. విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ‘బ్లూ లియో’ బృందానికి స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టంలో మూడో ర్యాంకు దక్కింది. ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీకి చెందిన ‘షాహుల్’బృందానికి బారియర్స్ ఇన్ యాక్సెసింగ్ అడక్వెట్ హెల్త్కేర్ సర్వీసెస్ విభాగంలో మూడో స్థానం దక్కింది. విశ్వేశ్వరయ్య, డాక్టర్ ప్రీతమ్ సింగ్ బెస్ట్ టీచర్ అవార్డు 2021ను కూడా ప్రదానం చేశారు. ఇవీ చదవండి: ఆధిపత్య పోరు: ‘టీడీపీ’లో ‘పిల్లి’ మొగ్గలు అండ్రు అరాచకాలు: కొండను తవ్వేసి.. అడవిని మింగేసి.. -
అధిక ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు
సాక్షి, అమరావతి: విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాల ప్రయోజనాల కోసమే ఇంటర్మీడియెట్ ఫస్టియర్ అడ్మిషన్లలో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టామని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. ఈ విధానానికి అందరి నుంచి మంచి స్పందన లభించిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, అన్ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి తొలిదశ అడ్మిషన్లకు ఇప్పటివరకు 2.60 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. బోర్డు ఎక్కడా కొత్తగా ఏ నిబంధననూ మార్పు చేయలేదని వివరించారు. గతంలో ఆఫ్లైన్లో జరిగే పద్ధతినే ఇప్పుడు ఆన్లైన్లోకి మార్చామని పేర్కొన్నారు. తొలివిడత ఆన్లైన్ అడ్మిషన్ల దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగిసిన నేపథ్యంలో రామకృష్ణ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆన్లైన్ అడ్మిషన్ల వల్ల తల్లిదండ్రులు, విద్యార్థులు కరోనా సమయంలో కాలేజీల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుందన్నారు. ఇంట్లో నుంచే తమకు నచ్చిన కాలేజీలో, కోరుకున్న గ్రూపులో సీటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆధార్, కొన్ని సర్టిఫికెట్ల నంబర్లను నమోదు చేసి విద్యార్థులు ఆన్లైన్ అడ్మిషన్ పొందొచ్చని చెప్పారు. ఎక్కడా ఎవరికీ ఎలాంటి ధ్రువపత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. కాలేజీ యాజమాన్యాలకు కూడా ఆన్లైన్ అడ్మిషన్లవల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. తమ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులను ఫీజులు కట్టించుకొని చేర్పించుకోవడం వరకే వాటి బాధ్యత అని స్పష్టం చేశారు. రామకృష్ణ ఇంకా ఏమన్నారంటే.. నిర్దేశిత ఫీజులనే కళాశాలలు తీసుకోవాలి.. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని ప్రైవేటు అన్ఎయిడెడ్ కాలేజీలకు ప్రభుత్వం ఇప్పటికే ఫీజులను ఖరారు చేసింది. ఆ మేరకు మాత్రమే ఆయా కాలేజీలు ఫీజులు తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా నిర్దేశిత ఫీజులను మాత్రమే చెల్లించాలి. ఏ కాలేజీ అయినా ఎక్కువ ఫీజులు డిమాండ్ చేస్తే.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. వాటిని ప్రాసిక్యూషన్ చేయించే అధికారం ఇంటర్ బోర్డుకు ఉంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ (రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ క్యాపిటేషన్ ఫీ) చట్టం–1983లోని సెక్షన్ 9, 10, 11 ప్రకారం ప్రభుత్వం గతేడాది మార్చిలో జీవో 57 ద్వారా బోర్డుకు ప్రత్యేకాధికారాలు కల్పించింది. అందరికీ అందుబాటులో సీట్లు రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్ఎయిడెడ్ సహా ఇతర యాజమాన్యాల్లోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియెట్ ఫస్టియర్లో 6 లక్షల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి సీట్లు రావన్న ఆందోళన వద్దు. సెక్షన్కు 88 మందిని అనుమతిస్తున్నాం. రిజర్వేషన్ల ప్రకారమే ప్రతి కాలేజీలో సీట్ల భర్తీ ఉంటుంది. కాబట్టి అన్ని వర్గాల వారికి సీట్లు దక్కుతాయి. గతంలో రిజర్వేషన్ల అమలు సరిగా లేనందున కొన్ని కాలేజీల్లో కొందరికి మాత్రమే అవకాశం దక్కేది. దీంతో రిజర్వుడ్ వర్గాల పిల్లలు నష్టపోవాల్సి వచ్చేది. తొలి దశ అనంతరం మిగిలిన సీట్లకు మలివిడత ఆన్లైన్ ప్రవేశాలుంటాయి. గతేడాది మొత్తం 3.20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది కూడా అంతేస్థాయిలో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నాం. విద్యార్థుల మేలుకే ఆన్లైన్ సేవలు గతంలో కొన్ని కాలేజీలు విద్యార్థులకు హాల్టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టేవి. ముఖ్యంగా కరోనా సమయంలో పిల్లలు కాలేజీల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ–హాల్టికెట్లను బోర్డు ప్రవేశపెట్టింది. బోర్డు వెబ్సైట్ నుంచి హాల్టికెట్ను డౌన్లోడ్ చేసుకొని నేరుగా పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పించాం. పరీక్ష ఫీజుల విషయంలోనూ కాలేజీలు విద్యార్థుల నుంచి అధికంగా వసూలు చేసేవి. దీంతో ఆన్లైన్లో చెల్లించే ఏర్పాటు చేయడంతో కార్పొరేట్ కాలేజీల అక్రమాలకు అడ్డుకట్ట పడింది. అలాగే విద్యార్థులు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ల(టీసీ) విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంశాన్ని బోర్డు గుర్తించింది. ఈ నేపథ్యంలో నేరుగా బోర్డు నుంచి ఈ–టీసీ జారీ చేసే ప్రక్రియపై దృష్టి సారించాం. దీని ద్వారా విద్యార్థులు నేరుగా బోర్డు వెబ్సైట్ నుంచి టీసీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
అమెరికాలో విద్యావకాశాలపై ఎడ్యుకేషన్ ఫెయిర్
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో విద్యావకాశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల కోసం అక్కడి వర్సిటీలు వర్చువల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ను నిర్వహించనున్నాయి. గుర్తింపు పొందిన వందకుపైగా యూఎస్ వర్సిటీలు, కాలేజీలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆన్లైన్ ద్వారా సంభాషించడానికి ఈ కార్యక్రమం ద్వారా ఉచితంగా అవకాశం కల్పించనున్నారు. మాస్టర్స్ లేదా పీహెచ్డీ కోర్సులపై ఈ నెల 27న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు గ్రాడ్యుయేట్ ఫెయిర్ జరగనుంది. ఇందులో పాల్గొనడానికి ( https://bit.ly/EduSAFair21EmbWeb) లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయం సూచించింది. వచ్చే నెల 3న బ్యాచిలర్స్ కోర్సులపై.. బ్యాచిలర్స్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల కోసం సెప్టెంబర్ 3న సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఎడ్యుకేషన్ ఫెయిర్ జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వెబ్ లింక్ (https://bit.ly/ UGEdUSAFair21 Emb Web) ద్వారా రిసిస్ట్రేషన్ చేసుకోవాలి. యూఎస్లోని వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే ఉన్నత విద్యాసంస్థలు ఎడ్యుకేషన్ ఫెయిర్లో పాల్గొంటాయి. అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, డాక్టొరల్ స్థాయిల్లో కోర్సులు అందిస్తున్నాయి. యూఎస్ విశ్వవిద్యాలయాలు, ఎడ్యుకేషన్ యూఎస్ఏ విభాగం సలహాదారులతో ఈ ముఖాముఖి ఉంటుంది. అమెరికాలో చదువులు, ఫండింగ్, స్కాలర్షిప్లు, ప్రాక్టికల్ ట్రైనింగ్ తదితర విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి ముఖాముఖి సాయపడుతుంది. విద్యార్థి వీసాల గురించి యూఎస్ బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ అధికార వర్గాల నుంచి విద్యార్థులకు అవసరమైన సమాచారం లభించనుంది. పూర్తి వివరాల కోసం (https://drive.google.com/drive/floders/1 dcOlvRx6 AQkZGBU9 URf1 lblqMU&pXZMm) వీడియో లింక్ను సందర్శించాలని యూఎస్ కాన్సులేట్ సూచించింది. -
తెలంగాణలో మరో 160 కాలేజీలు మూతపడినట్లే: ఇంటర్ బోర్డు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో 160 కాలేజీలు మూతపడినట్లేనని ఇంటర్ బోర్డు తెలిపింది. కాగా గతేడాది కాలేజీల గుర్తింపు కోసం 100 కాలేజీలు దరఖాస్తు చేసుకోలేదని పేర్కొంది. ఇక 2021-22కు 1520 కాలేజీలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయని, దీంతో 100 కళాశాలల గుర్తింపు లేనట్లేనని తెలిపింది. ఇదిలా ఉండగా కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి కాకుండానే ఇంటర్ బోర్డు అడ్మిషన్లు ప్రకటించింది. -
తెలంగాణ లో మళ్లీ ప్రారంభం కానున్నవిద్యాసంస్థలు
-
నైపుణ్య కాలేజీలకు వేగంగా స్థల సేకరణ
సాక్షి, అమరావతి: ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నైపుణ్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇందుకోసం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల వద్ద ఉన్న మిగులు భూములను సేకరించి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నైపుణ్య కళాశాలలను ఏర్పాటు చేయనుంది. ఒక్కో నైపుణ్య కళాశాల నిర్మాణం కోసం ఐదెకరాలు సేకరిస్తున్నట్టు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో ఎన్.బంగారురాజు చెప్పారు. 25 కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు రావడంతో జూలై నెలాఖరులోగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఒక్కో కాలేజీ నిర్మాణానికి గరిష్టంగా రూ.20 కోట్లు వ్యయం చేయడానికి అనుమతిస్తూ మే 30న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. వీటితో పాటు తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ, నాలుగు ట్రిపుల్ ఐటీలతో పాటు పులివెందులలో మరో నైపుణ్య కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. కాలేజీల్లో వసతులివి.. స్థానిక పరిశ్రమలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు తెలుసుకుని వాటికి అనుగుణంగా కోర్సులను రూపొందిస్తున్నారు. ఇందుకోసం పరిశ్రమల శాఖ చేపట్టిన సమగ్ర పారిశ్రామిక సర్వే నివేదికను ఏపీఎస్ఎస్డీసీ వినియోగించుకుంటోంది. ప్రతి నైపుణ్య కళాశాలలో ఆరు తరగతి గదులు, రెండు ల్యాబ్లు, వర్క్షాప్ నిర్వహణకు ప్రాంగణం ఉండేలా వీటిని నిర్మిస్తారు. స్థానికంగా ఉండే ఒకటి లేదా రెండు పరిశ్రమలతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కేంద్రాలను వీటిలో ఏర్పాటు చేస్తారు. ఆయా కంపెనీలకు అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టి కోర్సు పూర్తికాగానే నేరుగా ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటారు. ఈ కోర్సుల కాలపరిమితి మూడు నెలలు ఉండేలా చూస్తున్నారు. -
రేపటి నుంచి మే 31 వరకు వేసవి సెలవులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎట్టకేలకు పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు చివరి పని దినాన్ని, వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటిం చింది. ఈనెల 26వ తేదీని ఆయా విద్యా సంస్థలకు చివరి పని దినంగా పేర్కొంది. 27వ తేదీ నుంచి మే 31 వరకు వేసవి సెలవులుగా ప్రకటించింది. పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు సెలవులపై ఆదివారం ఆన్లైన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్, విద్యా శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించిన అనంతరం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇప్పటికే పదో తరగతి విద్యార్థులకు పరీక్షలను రద్దు చేయగా, తాజాగా 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి పాఠశాలలు, జూనియర్ కాలేజీల ప్రారంభంపై జూన్ 1న సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. వెనువెంటనే చివరి పని దినం, సెలవులపై ఇంటర్మీడియట్ బోరుŠడ్ కార్యదర్శి, పాఠశాల విద్య ఇంచార్జి డైరెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. పది రోజులుగా కోరుతున్న నేపథ్యంలో... రాష్ట్రంలో కరోనా కారణంగా గత ఏడాది సెప్టెంబరు 1 నుంచి ఆన్లైన్/డిజిటల్ విద్యా బోధనను ప్రారంభించిన ప్రభుత్వం గత ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10 తరగతులతోపాటు ఇంటర్మీడియట్, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనకు అనుమతించింది. అదే నెల 24వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులకు కూడా ప్రత్యక్ష బోధనకు ఓకే చెప్పింది. అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో మార్చి 24 నుంచి విద్యా సంస్థలన్నింటికీ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. ప్రత్యక్ష విద్యా బోధనను నిలిపివేసింది. అంతేకాదు మే 1 నుంచి నిర్వహించాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షలు, మే 17 నుంచి నిర్వహించాల్సిన టెన్త్ పరీక్షలపైనా ఈ నెల 15నే నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలను రద్దు చేయడంతోపాటు, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలను రద్దు చేసింది. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తమకు కూడా సెలవులు ఇవ్వాలని, పెరుగుతున్న కరోనా కేసుల వల్ల పాఠశాలలకు వెళ్లి రావాలంటే భయంగా ఉందని టీచర్లంతా వాపోయారు. తాము స్కూళ్లకు వెళ్లి చేసేదేమీ లేకపోగా, కరోనా మహమ్మారి బారిన పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు సెలవులు ఇస్తూ ఆదివారం నిర్ణయం తీసుకుంది. ఆ విద్యార్థులంతా పాస్: సబితా ఇంద్రారెడ్డి కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే టెన్త్ పరీక్షలు రద్దు చేసి, 5,46,865 మందిలో పరీక్ష ఫీజు చెల్లించిన 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇపుడు 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53,79,388 మంది విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేసినట్లు తెలిపారు. వారికి పరీక్షలేమీ ఉండవని స్పష్టంచేశారు. మొత్తంగా 59,26,253 మంది విద్యార్థులు ఉన్నట్లు వివరించారు. తరగతుల వారీగా నమోదైన విద్యార్థులు తరగతి విద్యార్థుల సంఖ్య 1 60,5,586 2 6,23,571 3 6,37,563 4 6,28,572 5 6,14,862 6 5,86,231 7 5,77,412 8 5,60,417 9 5,45,174 10 5,46,865 -
కరోనా విజృంభణ.. మార్చి 31 వరకు స్కూల్స్ బంద్!
పుణే: రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతుండటంతో కొన్ని జిల్లాల్లో పూర్తి లాక్డౌన్, మరికొన్ని జిల్లాల్లో పాక్షిక లాక్డౌన్, ఇంకొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. ఈ క్రమంలో పుణే జిల్లాలో మార్చి 31వ తేదీ వరకు పాఠశాలలు, కాలేజీలను మూసివేస్తున్నట్లు పుణే డివిజినల్ కమిషనర్ సౌరభ్ రావు తెలిపారు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు రాత్రి 10 గంటల వరకే తెరవాలని, ఫుడ్ డెలవరీలు రాత్రి 11 గంటల వరకే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో మాత్రమే నడపాలని ఆదేశించారు. 10, 12 తరగతుల బోర్డు పరీక్షల ప్రిపరేషన్స్కు ఈ ఆంక్షలు అడ్డుగారావని పేర్కొన్నారు. మరోవైపు పట్టణంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య అనవసరంగా ఎవరూ బయటకు రావొద్దని కోరారు. సామాజిక కార్యక్రమాలు, పెళ్లిళ్లు, అంత్యక్రియలు, రాజకీయ తదితర కార్యక్రమాలకు 50 మందికి మించి హాజరుకాకూడదని ఆదేశించారు. ఒకవేళ వీటిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసు కేసులు పెడతామని హెచ్చరించారు. పార్క్లు క్లోజ్.. పుణే పట్టణంలో ఉన్న అన్ని రకాల పార్కులు సాయంత్రం వెళల్లో మూసివేయాలని, ఉదయం సమయాల్లో వాకర్స్ కోసం తెరవాలని కమిషనర్ సౌరభ్ రావు ఆదేశించారు. మాల్స్, మల్లీప్లెక్స్లకు రాత్రి 11 గంటల వరకే అనుమతి ఉంటుందని తెలిపారు. అలాగే మిగిలిన విషయాలపై డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. పుణే నగరంలో కేసుల సంఖ్య, ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉన్నందున 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేయాలన్న విధాన నిర్ణయం కోరుతూ కేంద్రానికి ప్రతిపాదన పంపాలని అధికారులు యోచిస్తున్నామని ఆయన వివరించారు. ఒకవేళ పుణేకు అదనపు వ్యాక్సిన్ డోసులు కేంద్రం కేటాయించాలని నిర్ణయం తీసుకుంటే, దానికి అనుగుణంగా సిబ్బందిని సిద్ధం చేస్తామని తెలిపారు. చదవండి: (కేసులు పెరిగితే లాక్డౌన్ తప్పదు: సీఎం) నిబంధనలు పాటించకపోవడం వల్లే.. కరోనా నిబంధనలు పాటించకపోవడం వల్లే పుణే నగరంలో కేసుల సంఖ్య పెరుగుతోందని, దీని కోసం కఠిన నిబంధనలు అమలు పరుస్తామని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. కోవిడ్–19 చికిత్స కోసం జిల్లాలోని ఆస్పత్రుల్లో సరిపడినంత పడకలు ఉన్నాయని తెలిపారు. కేసులు పెరుగుతున్నందున, 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని, దీని కోసం అత్యధిక డోసులు అవసరమవుతాయని పేర్కొన్నా రు. ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని పుణే ఎంపీ గిరీశ్ బాపట్, మార్వెల్ఎంపీ శ్రీరాగ్ బర్నేలను కోరుతానని, అలాగే ఎంపీలు అమోల్ కోల్హే, సుప్రియా సూలేల వద్ద కూడా ఈ విషయాన్ని లెవనెత్తుతానని పేర్కొన్నారు. పెద్ద భవనాల్లోనే 90 శాతం కేసులు ►మొదటి 2 నెలల్లో ఎక్కువ కేసులు అక్కడి నుంచే ►మార్చి నుంచి మురికివాడల్లోనూ పెరుగుతున్న కేసులు ముంబై: నగరంలోని ఆకాశహర్మ్యాల్లో నివసిస్తున్న వారే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని నగర పాలక సంస్థ తెలిపింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కొత్తగా కరోనా సోకినవారిలో 90 శాతం మంది ఎత్తయిన భవంతుల్లో ఉంటున్నవారేనని పేర్కొంది. మిగతా 10 శాతం మంది మురికివాడలు, ఇతర ప్రాంతాలవారని వివరించింది. అయితే, ఈ నెలలో మాత్రం పరిస్థితిలో కాస్త మార్పు వచ్చిందని, ఈసారి మురికివాడల్లో ఉంటూ కోవిడ్–19 సోకుతున్న వారి సంఖ్య పెరుగుతోందని తెలిపింది. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో 23,002 మందికి కోవిడ్–19 పాజిటివ్ వచ్చిందని, ఇందులో 90 శాతం మంది పెద్దపెద్ద భవంతుల్లో నివసించేవారని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల ప్రారంభం నుంచి నగరంలో కంటైన్మెంట్ జోన్లు 170 శాతం, సీల్ చేసిన భవంతుల సంఖ్య 66.42 శాతం పెరిగినట్లు పేర్కొంది. బీఎంసీ కోవిడ్–19 డ్యాష్బోర్డు ప్రకారం మార్చి 1 నాటికి నగరంలో 10 కంటైన్మెంట్ జోన్లు, 137 సీల్ చేసిన భవంతులు ఉన్నాయని, కానీ మార్చి 10నాటికి కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 27కు, సీల్ చేసిన భవంతుల సంఖ్య 228కి పెరిగింది. ఈ జోన్ల్ల పరిధిలో నివసించే 7.46 లక్షల మందిలో 23 శాతం మంది మురికివాడల నుంచి, మిగతా 77 శాతం సీల్ చేసిన భవంతుల నుంచి ఉన్నారు. కాగా, మురికివాడల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, దీన్ని భారీ పెరుగుదల అనలేమని బీఎంసీ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. కోవిడ్ బాధితులు అన్ని మురికివాడల్లో ఉన్నారన్నారు. ఇప్పటివరకు ముంబైలో 3,38,631 మంది కరోనా సోకగా, 11,515 మంది మరణించారు. -
ప్రైమరీ స్కూళ్లపై ఏం చేద్దాం?
సాక్షి, అమరావతి: సంక్రాంతి సెలవుల అనంతరం సోమవారం నుంచి రాష్ట్రంలోని స్కూళ్లు కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. కోవిడ్ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు పాటించేలా విద్యాశాఖ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలిచ్చింది. పాఠశాలలు కోవిడ్ కారణంగా దాదాపు 5 నెలలు ఆలస్యంగా నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. స్కూళ్లలో 9, 10 తరగతులు, జూనియర్ కాలేజీల్లో 12వ తరగతి విద్యార్థులను తల్లిదండ్రుల అనుమతితో భౌతిక దూరం పాటిస్తూ స్కూళ్లు, కాలేజీలకు అనుమతించారు. ఆ తర్వాత 6, 7, 8 తరగతుల వారికీ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రాథమిక పాఠశాలలను ఈ విద్యాసంవత్సరానికి ప్రారంభించాలా? వద్దా? అన్న అంశంపై విద్యాశాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాగా, టీచర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బదిలీలను సంక్రాంతి సెలవుల్లో విద్యాశాఖ పూర్తిచేసింది. దాదాపు 76 వేల మంది టీచర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో సోమవారం నుంచి స్కూళ్లు కొందరు కొత్త టీచర్లతో ప్రారంభం కానున్నాయి. ఉదయం తరగతులు.. తర్వాత ఆన్లైన్లో పాఠశాలల నిర్వహణకు సంబంధించిన క్యాలెండర్ను ఎస్సీఈఆర్టీ ఇప్పటికే ప్రకటించింది. పదో తరగతి విద్యార్థులు రోజూ తరగతులకు హాజరుకావాలని, ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో 7, 9వ తరగతి విద్యార్థులు, ప్రతి మంగళ, గురు, శనివారాల్లో 6, 8 తరగతుల విద్యార్థులు .. గతంలో మాదిరిగానే తరగతులకు హాజరు కావాలని సూచించింది. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు స్కూళ్లు ఉంటాయి. మధ్యాహ్నం నుంచి ఆన్లైన్ బోధనను కొనసాగించాలని ఎస్సీఈఆర్టీ ఆదేశించింది. సోమవారం నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు కూడా ప్రారంభించాలని అన్ని కాలేజీలకు ఇంటర్ బోర్డు ఆదేశాలు ఇచ్చింది. మొత్తం పనిదినాలను 106కు తగ్గిస్తున్నారు. కాగా, వృత్తి విద్యాయేతర డిగ్రీ కోర్సుల ఫస్టియర్ ప్రవేశాల గడువును రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈనెల 21 వరకు పొడిగించింది. ఇక ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల ఫస్టియర్ ప్రవేశాలకు సంబంధించిన విద్యార్థులు సోమవారం కాలేజీల్లో రిపోర్టు చేయకపోతే.. సీట్లు రద్దు అవుతాయి. ట్రిపుల్ ఐటీల్లో తరగతుల ప్రారంభం నేడే.. నూజివీడు: నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 కల్లా క్యాంపస్లలో రిపోర్ట్ చేయాలని అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు సూచించారు. ఇంటర్ ఫస్టియర్ వార్షిక షెడ్యూల్ ► జనవరి 18 నుంచి మార్చి 31 వరకు ఫస్ట్ టర్మ్ ► మార్చి 25 నుంచి 31 వరకు అర్థ సంవత్సర పరీక్షలు ► ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు సెకండ్ టర్మ్ ► ఏప్రిల్/మేలో ఫైనల్ పరీక్షలు (తేదీలు ఖరారు చేయలేదు) ► అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను తరువాత ప్రకటిస్తారు. ► 2020–21 ఫస్టియర్ విద్యార్థులకు సెకండియర్ (2021–22 విద్యాసంవత్సరం) తరగతుల ప్రారంభం జూన్ 3. -
తల్లిదండ్రుల సమ్మతితోనే
సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్నప్పటికీ... విద్యార్థుల తల్లిదండ్రులు సమ్మతిస్తేనే ఆఫ్లైన్ తరగతుల హాజరుకు (ప్రత్యక్షంగా స్కూలుకు రావడానికి) అనుమతి ఉంటుంది. పిల్లల్ని బడికి పంపించొద్దని పేరెంట్స్ భావిస్తే... వారి కోసం ఆన్లైన్ తరగతులు, వీడియో పాఠాలు యథాతథంగా కొనసాగుతాయి. తల్లిదండ్రులు తమ అభీష్టం మేరకు ఆఫ్లైన్/ ఆన్లైన్ పద్ధతిలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాఠశాలల నిర్వహణ, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ మంగళవారం మార్గదర్శకాలు జారీచేశారు. గతంలో మాదిరిగా విద్యా సంస్థలన్నీ సాధారణ పనివేళల్లో కొనసాగనున్నప్పటికీ... విద్యార్థులు మాత్రం తమకు నచ్చిన విధానాన్ని ఎంచుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. ఫిజికల్గా హాజరయ్యే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం లిఖితపూర్వకంగా తమ సమ్మతి తెలపాలి. తొమ్మిదో తరగతి నుంచి పైతరగతులకు బోధించే ఉపాధ్యాయులు మాత్రం ప్రతి రోజూ పాఠశాలకు హాజరు కావాలి. తరగతి గది విస్తీర్ణాన్ని బట్టి ఆరు అడుగుల దూరం పాటిస్తూ కూర్చునేలా ఏర్పాట్లు చేయాలి. ప్రతి విద్యార్థి మాస్కు ధరించడంతో పాటు తరుచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, ఈమేరకు చర్యలు తీసుకోవాలని విద్యా సంస్థల యాజమాన్యాలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటిస్తూ విద్యా సంస్థలను నిర్వహించాలని సూచిస్తూ... సవివరంగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉన్నత పాఠశాలలతో పాటు ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ కాలేజీలన్నింటికి సంబంధించిన ఆదేశాలను ఇందులో వివరంగా ప్రస్తావించింది. పర్యవేక్షణకు డీఎల్ఈఎంసీ విద్యా సంస్థల నిర్వహణకు సంబంధించి పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాస్థాయి విద్యా పర్యవేక్షణ కమిటీ(డీఎల్ఈఎంసీ)లకు జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉంటారు. ఐటీడీఏ పీఓ, డీఎంహెచ్ఓ, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి, డీఈఓ, డీఐఈఓ, ఎంపిక చేసిన కాలేజీల ప్రిన్సిపాళ్లు, కలెక్టర్ సూచించిన వ్యక్తులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో విద్యా సంస్థల నిర్వహణకు సం బంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తారు. విద్యా సంస్థల శానిటైజేషన్, తరగతుల నిర్వహణ ఏర్పాట్లు, వైద్య ప్రణాళికలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాల్లో పలు సూచనలు చేసింది. ఈ అంశాలన్నీ జిల్లా కమిటీల ఆదేశానుసారం అమలు చేస్తారు. కేంద్రం నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ)ను పర్యవేక్షిం చేందుకు జిల్లా కలెక్టర్లు నోడల్ ఆఫీసర్లను నియమించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. మధ్యా హ్న భోజన పథకాన్ని కోవిడ్–19 జాగ్రత్తలు పాటిస్తూ అమలు చేయాలని ఆదేశించింది. సంక్షేమ మంత్రులతో ప్రత్యేక సమీక్ష రాష్ట్రంలో గురుకుల విద్యా సంస్థలు దాదాపు వెయ్యికిపైగా ఉన్నాయి. పాఠశాలలు మొదలు ఇంటర్మీడియట్, డిగ్రీ గురుకుల కాలేజీల్లో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులున్నారు. ఆయా సంక్షేమ శాఖల మంత్రులతో ప్రత్యేకంగా చర్చించి నిర్వహణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో ఈనెల 18న సంక్షేమ శాఖల మంత్రులతో తరగతులు, వసతిగృహాల నిర్వహణపై విద్యామంత్రి సబితారెడ్డి ప్రత్యేక సమీక్ష జరపనున్నారు. అలాగే 19న ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతో మంత్రి సమావేశం కానున్నారు. సిలబస్ పూర్తి ఎలా? కరోనా కారణంగా 2020–21 విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం... అందులోనూ ఆన్లైన్ తరగతులతో నెట్టుకురావడంతో విద్యార్థుల అభ్యసనపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 1నుంచి ప్రత్యక్షబోధన ప్రారంభిస్తే అకడమిక్ క్యాలెండర్ ఎలా ఉండాలనే దానిపై మంగళవారం విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ఆన్లైన్ తరగతులు ఎంతవరకు జరిగాయి... ఇంకా ఏమేరకు సిలబస్ చెప్పాల్సి ఉంది? అందుకు ఏమేరకు సమయం పడుతుంది? పాఠ్యాంశాలను కుదించాల్సి వస్తే ఏయే అధ్యాయాలను తొలగించాలి? పరీక్షలు ఎప్పుడు, ఎలా నిర్వహించాలి? అనే అంశాలపై అంతర్గత సమావేశాలు నిర్వహించుకుని శాఖల వారీగా అకడమిక్ క్యాలెండర్ను ఖరారు చేయాలని సంబంధిత ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. -
కాలేజీల్లో జీరో కరోనా
సాక్షి, అమరావతి: స్కూళ్లు ప్రారంభించి 14 రోజులు గడిచిన నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తి భయపడినంతగా లేకపోవడంతో ఒకింత ఆందోళన తగ్గింది. స్కూళ్లకు విద్యార్థులు వస్తే వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతుందని చాలా మంది వాదించారు. స్కూళ్లు తెరవద్దని అన్నారు. కానీ ఇప్పటికే విద్యా సంవత్సరం తీవ్ర జాప్యం కావడంతో ప్రభుత్వం స్కూళ్లను ప్రారంభించింది. స్కూళ్లు తెరిచినప్పటి నుంచి ప్రతి రోజూ వైద్య ఆరోగ్య శాఖ కేసులపై పర్యవేక్షిస్తూనే ఉంది. దీనిపై ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు, విద్యార్థులకు టెస్టులు చేస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ వరకు నమోదైన పాజిటివ్ కేసులు బట్టి చూస్తే చాలా తక్కువగా ఉన్నట్టు తేలింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోని స్కూళ్లలో జీరో శాతం పాజిటివిటీ ఉన్నట్లు స్పష్టమైంది. అత్యధికంగా నెల్లూరులో 0.7 శాతం కేసులు నమోదయ్యాయి. రోజువారీ రాష్ట్ర జనాభాకు చేసిన టెస్టులతో పోలిస్తే స్కూళ్ల పాజిటివిటీ రేటు చాలా తక్కువ. సగానికి పైగా జిల్లాల్లో 0.1 శాతం మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయి. లక్షణాలున్నట్టు తేలితే వైద్య సిబ్బంది వెంటనే కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. ప్రతి నిత్యం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో స్కూళ్లు, కాలేజీల్లో పర్యవేక్షణ ఉంటోంది. కళాశాలల్లో 3,767 మంది విద్యార్థులు, 913 లెక్చరర్లకు టెస్టులు చేయగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. పెరిగిన హాజరు శాతం ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ నిర్వహిస్తున్న తరగతులు ఆరోగ్యకర వాతావరణంలో నడుస్తున్నాయి. దీంతో విద్యార్థుల హాజరు శాతం రోజురోజుకూ పెరుగుతోంది. దీపావళి ముందు వరకు 10వ తరగతి విద్యార్థులు 50.74 శాతం తరగతులకు హాజరయ్యారు. 9వ తరగతి విద్యార్థులు 39.57 శాతం హాజరయ్యారు. మొత్తంగా విద్యార్థుల హాజరు శాతం 45.15కు చేరింది. జూనియర్ కళాశాలల్లో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల హాజరు 36.44 శాతం నమోదైంది. విద్యా సంస్థల్లో కోవిడ్ టెస్టుల వివరాలు సర్కారు ముందు చూపు – కోవిడ్–19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. టెస్ట్, ట్రేస్, ట్రీట్మెంట్.. పద్ధతిని అనుసరిస్తూ ఖర్చుకు వెనుకాడకుండా తొలి నుంచీ భారీ సంఖ్యలో టెస్ట్లు చేయిస్తోంది. వైరస్ సోకిన వారిని త్వరితగతిన గుర్తించి ఉచితంగా వైద్యం అందిస్తోంది. – ఇందుకోసం భారీ సంఖ్యలో కోవిడ్ కేర్ సెంటర్లను, కోవిడ్ ఆస్పత్రులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అందుకు తగినట్లు యుద్ధ ప్రాతిపదికన వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించింది. ఖరీదైన మందులను సైతం అందుబాటులోకి తెచి్చంది. మౌలిక వసతులను కలి్పంచింది. బలవర్థకమైన ఆహారాన్ని అందించింది. – ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల వైద్య రంగ ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు వ్యక్తమవడం తెలిసిందే. దీంతో రోజుకు 70 వేలు, 80 వేల టెస్ట్లు చేస్తున్నా, ప్రస్తుతం పెద్దగా కేసులు నమోదవ్వడం లేదు. – మరోవైపు ఇతర రాష్ట్రాలు తక్కువ సంఖ్యలో టెస్ట్లు చేస్తున్నా ఇంత కంటే ఎక్కువ కేసులు వస్తుండటం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తొలి నుంచీ పెద్ద సంఖ్యలో టెస్ట్లు నిర్వహించడం వల్లే వైరస్ను నియంత్రించడంలో విజయం సాధిస్తోందని వైద్య రంగ ప్రముఖులు చెబుతున్నారు. నేడు కళాశాలల్లో ఒక్క కేసు కూడా రాలేదంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించడమే కారణమంటున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రతిరోజూ కోవిడ్పై అవగాహన కల్పిస్తున్నాం. మాస్క్, శానిటైజేషన్, భౌతిక దూరం, పారిశుధ్యం విషయాల్లో కచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అన్ని జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నాం. – ఆదిమూలం సురేష్, విద్యా శాఖ మంత్రి -
నేటి నుంచి స్కూళ్లు, కాలేజీలు..
-
ఏపీ: నేటి నుంచి స్కూళ్లు, కాలేజీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. కోవిడ్–19 కారణంగా గత విద్యా సంవత్సరం మార్చి చివర్లో మూతపడ్డ విద్యాసంస్థలు 7నెలల విరామం తరువాత తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఏయే తరగతుల విద్యార్థులు ఎప్పటినుంచి హాజరు కావాలనేది స్పష్టం చేస్తూ సమగ్ర మార్గదర్శకాలతో షెడ్యూళ్లు విడుదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ అపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ప్రకారం విద్యాసంస్థల పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలకు వేర్వేరుగా అకడమిక్ క్యాలెండర్లను ప్రకటించింది. పని దినాలను సర్దుబాటు చేస్తూ.. 2020–21 విద్యా సంవత్సరంలో పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు 5 నెలల కాలం వృథా అయ్యింది. ఈ దృష్ట్యా కోల్పోయిన పని దినాలను సర్దుబాటు చేసుకుంటూ సోమవారం నుంచి దశలవారీగా తరగతులను ప్రారంభిస్తున్నారు. స్కూళ్లు, జూనియర్ కాలేజీలను ఏప్రిల్ 30 వరకు, డిగ్రీ, పీజీ తరగతులను ఆగస్టు వరకు కొనసాగించేలా అకడమిక్ క్యాలెండర్లను ప్రభుత్వం జారీ చేసింది. సిలబస్ను కుదించకుండా నిర్దేశించిన లక్ష్యాలు నెరవేరేలా ముఖ్యమైన అంశాలన్నీ బోధించేవిధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. విద్యార్థులను హైటెక్, లోటెక్, నోటెక్గా విభజించి తరగతి గదిలో నేరుగా టీచర్లు బోధన చేస్తారు. విద్యార్థులు ఇంటివద్ద నేర్చుకొనేవి, ఆన్లైన్ ద్వారా బోధించేవి అనే విధానాల్లోనూ బోధన చేయనున్నారు. ఏయే తరగతులు ఎప్పటినుంచి.. అన్ని యాజమాన్య పాఠశాలలు, కాలేజీల్లోని 9, 10, 12 తరగతుల విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. నవంబర్ 23 నుంచి అన్ని పాఠశాలల్లో 6 నుంచి 8 తరగతులు మొదలవుతాయి. డిసెంబర్ 14 నుంచి అన్ని పాఠశాలల్లో 1 నుంచి 5 క్లాసులు, నవంబర్ 16 నుంచి ఇంటర్మీడియెట్ ఫస్టియర్ తరగతులు మొదలవుతాయి. నవంబర్ నెలంతా బడులు ఒంటిపూట (ఉదయం 9 నుంచి 1.30 వరకు) మాత్రమే ఉంటాయి. మధ్యాహ్న భోజనం ముగిశాక పిల్లలను ఇళ్లకు పంపిస్తారు. తరగతి గదిలో విద్యార్థుల మధ్య 6 అడుగుల దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు ఉండాలి. ఒక్కో తరగతి గదిలో 16 మందికి మించకుండా ఉండాలి. రోజు విడిచి రోజు తరగతులకు హాజరయ్యేలా ఏర్పాట్లు. విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న స్కూళ్లలో తరగతుల నిర్వహణపై హెడ్మాస్టర్లు షెడ్యూల్ రూపొందిస్తారు. డిగ్రీ, పీజీ ప్రొఫెషనల్, నాన్ ప్రాఫెషనల్ కోర్సులకు సంబంధించి ఫస్టియర్ మినహా తక్కిన తరగతులు నవంబర్ 2 నుంచి దశల వారీగా ప్రారంభమవుతాయి. ఆ కాలేజీల్లో ఫస్టియర్ తరగతులు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం. -
నవంబర్ 2 నుంచి కళాశాలలు పునఃప్రారంభం
సాక్షి, విజయవాడ: కళాశాలలు నవంబర్ 2 నుంచి ప్రారంభమవుతాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులకి మాత్రమే ప్రస్తుతం తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రతీ విద్యార్థికి నెలలో పది రోజులు తరగతులు నిర్వహిస్తామన్నారు. మూడవ వంతు విద్యార్థులనే అనుమతిస్తామని వెల్లడించారు. ఆన్లైన్ క్లాసులు కొనసాగుతాయన్నారు. (చదవండి: ప్రైవేటు పాఠశాలలకు గట్టి షాక్..) ‘‘రెండు సెమిస్టర్లగా అకడమిక్ క్యాలెండర్ రూపొందించాం. మార్చి నెలకి మొదటి సెమిస్టర్.. ఆగస్ట్ నాటికి రెండవ సెమిస్టర్ పూర్తి చేస్తాం. అకడమిక్ క్యాలెండర్ని 180 రోజులుగా రూపొందించాం. ఈసెట్ అడ్మిషన్లు నవంబర్ 11 లోపు పూర్తి చేస్తాం. డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్లు, ఇంజనీరింగ్ అడ్మిషన్లని నవంబర్ నెలాఖరుకి పూర్తి చేసి డిసెంబర్ ఒకటి తరగతులు ప్రారంభిస్తాం. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలతో తరగతులు నిర్వహిస్తాం. కళాశాలకి వచ్చే ప్రతీ విద్యార్ధి తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. కళాశాలకి వచ్చే విద్యార్థులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని’’ ఆయన పేర్కొన్నారు. (చదవండి: గ్రూప్–1 మెయిన్స్కు 9,678 మంది) -
ఏపీ: స్కూళ్లు, కళాశాలలకు ప్రత్యేక మార్గదర్శకాలు
సాక్షి,అమరావతి: కరోనా రాష్ట్రంలో తగ్గుముఖం పడుతోందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ చెప్పారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే విద్యా సంవత్సరాన్ని చాలా నష్టపోయిన నేపథ్యంలో స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితోపాటు హెడ్మాస్టర్లు, టీచర్లనూ అప్రమత్తం చేశామని వెల్లడించారు. తల్లిదండ్రులు అనుమతిస్తేనే పిల్లలు స్కూళ్లకు రావాలన్నారు. కొద్ది రోజులపాటు మధ్యాహ్నం వరకే స్కూళ్లు ఉంటాయన్నారు. చదవండి: మొదటి నెల రోజులు హాఫ్ డే స్కూళ్లు ఆ తర్వాత పరిస్థితిని బట్టి పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరుస్తున్నామని, కోవిడ్ నేపథ్యంలో రెండ్రోజుల్లో ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్న ఇళ్ల నుంచి పిల్లలు స్కూళ్లకు వస్తుంటే ఆ ఇళ్లనూ రోజూ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పర్యవేక్షించాలన్నారు. స్కూళ్లు తెరిచాక 15 రోజుల పాటు నిశితంగా పరిశీలిస్తామని వెల్లడించారు. దీన్ని బట్టి కోవిడ్ నియంత్రణపై భవిష్యత్ ప్రణాళిక ఉంటుందన్నారు. జిల్లా స్థాయిలో స్కూళ్లల్లో పరిస్థితులపై కలెక్టర్లతో టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశామని వివరించారు. కోవిడ్ టెస్టులను మరింతగా పెంచుతామన్నారు. చదవండి: రైతుబజార్లలో రూ.40కే కిలో ఉల్లి -
ఉన్నతంగా మారుద్దాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి అన్ని రకాలుగా అండదండలు అందిస్తూ పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన తదితర పథకాల ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ను 90 శాతానికి చేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నాలుగేళ్ల ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల్లో కూడా అప్రెంటిస్షిప్ ఉంటుందని, ఈ నాలుగేళ్లలోనే 20 అదనపు క్రెడిట్స్ సాధించిన వారికి బీటెక్ ఆనర్స్ డిగ్రీ వస్తుందని సీఎం జగన్ తెలిపారు. విద్యార్థి అదే విభాగంలో ఈ క్రెడిట్స్ సాధిస్తే ఆనర్స్ అడ్వాన్స్డ్ అని వ్యవహరిస్తారు. వేరే విభాగంలో క్రెడిట్స్ సాధిస్తే ఆనర్స్ మైనర్ అని పేర్కొంటారు. యూనివర్సిటీల్లో 1,100 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం జగన్ అక్టోబర్ 15 నుంచి కాలేజీలు పునఃప్రారంభమవుతాయని ప్రకటించారు. కాలేజీలు తెరిచిన తర్వాత విద్యాదీవెన, వసతి దీవెన ఇచ్చేందుకు సన్నద్ధం కావాలని ఆర్థికశాఖ అధికారులకు సూచించారు. సెప్టెంబర్లో సెట్ల నిర్వహణ పూర్తి చేయాలని ఆదేశించారు. ఉన్నత విద్యా రంగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. కాలేజీల్లో కూడా నాడు–నేడు కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ పూర్తి చేయాలని సీఎం సూచించారు. సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. 32.4 నుంచి 90 శాతానికి పెరగాలి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన ద్వారా ఉన్నత చదువులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నందున కచ్చితంగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరగాలి. దీన్ని ఇప్పుడున్న 32.4 శాతం నుంచి 90 శాతానికి తీసుకెళ్లాలి. అడ్మిషన్ల సమయంలోనే ఐచ్ఛికం మూడేళ్ల డిగ్రీ కోర్సులో 10 నెలల అప్రెంటిస్షిప్ను చేర్చాం. దీనికి అదనంగా ఒక ఏడాది నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అంశాలపై శిక్షణ కూడా ఉంటుంది. ఇవి నేర్చుకుంటేనే డిగ్రీ ఆనర్స్గా పరిగణిస్తాం. అదనంగా ఏడాది అనేది విద్యార్థి ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. అడ్మిషన్ల సమయంలోనే సాధారణ డిగ్రీ కావాలా? ఆనర్స్ డిగ్రీ కావాలా? అన్న దానిపై ఐఛ్చికాన్ని తీసుకుంటాం. బీటెక్లో కూడా.. బీటెక్ డిగ్రీలకు సంబంధించి 4 ఏళ్లలో కూడా తప్పనిసరి అప్రెంటిస్షిప్ ఉంటుంది. అదనంగా 20 క్రెడిట్స్ సాధించిన వారికి ఆనర్స్ డిగ్రీ వస్తుంది వైద్య కళాశాలలకు రూ.6 వేల కోట్లు పాత మెడికల్ కాలేజీలను మరమ్మతు చేసి నాడు– నేడు కార్యక్రమాల కోసం రూ.6 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. ఈ ప్రభుత్వం విద్యా రంగం మీద దృష్టి పెట్టింది కాబట్టి వీటి గురించి ఆలోచిస్తోంది. ఆ దుస్థితికి కారణం... ప్రభుత్వ ఆస్పత్రుల్లో గతంలో సెల్ఫోన్ వెలుగులో ఆపరేషన్లు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎలుకలు కొరికి శిశువు చనిపోయే దుస్థితి ఎందుకు దాపురించింది? జనరేటర్లు పని చేయని పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలుగు, సంస్కత అకాడమీల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ తెలుగు, సంస్కృత అకాడమీల ప్రారంభానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అరకులో ప్రభుత్వ ఆధ్వర్యంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకారం తెలిపారు. కచ్చితమైన నిధుల కేటాయింపుతో మూడు నాలుగేళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ, కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వర్సిటీల్లో 1,100 పోస్టుల భర్తీకి ఆమోదం ► యూనివర్సిటీల్లో దాదాపు 1,110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. ► సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్చంద్ర, ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. -
అక్టోబర్ 15 నుంచి కాలేజీలను తెరుస్తాం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 15 నుంచి అన్ని కాలేజీలను తెరుస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఇప్పటివరకు పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తోన్న సెట్లను సెప్టెంబర్ 3వ వారం నుంచి నిర్వహిస్తామని వెల్లడించారు. 3, 4 ఏళ్ల డిగ్రీ కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కళాశాలల్లో నాడు- నేడు కార్యక్రమాన్ని చేపడుతామని తెలిపారు. అన్ని ప్రైవేటు కళాశాలలు ఆన్లైన్లో అడ్మిషన్లు చేపట్టాలని సూచించారు. ఈ క్రమంలో ఏవైనా కాలేజీలు అక్రమాలకు పాల్పడితే వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. (సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలల పునఃప్రారంభం) గురువారం ఆయన సచివాలయం నుంచి మాట్లాడుతూ.. ఉన్నత విద్యా సంస్థల్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ 70 నుంచి 90 శాతం పెంచాలని సూచించారు. కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ, కడపలో అర్కిటెక్చర్, తెలుగు సంస్కృత అకాడమీ, కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ, పాడేరులో గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఈ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రకాశం జిల్లాలో టీచర్ ట్రైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. (అక్టోబరు 15న తెరుచుకోనున్న కాలేజీలు: సీఎం జగన్) -
ఉన్నత విద్యపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు
-
31 వరకు విద్యాసంస్థలన్నీ మూతే: యూజీసీ
సాక్షి, హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలోని ఉన్నత విద్యా సంస్థలన్నింటిని ఈ నెల 31 వరకు బంద్ చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కార్యదర్శి రజనీశ్ జైన్ ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు ఈ నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు. యూజీసీ ఆదేశాల నేపథ్యంలో తమ పరిధిలోని అన్ని కాలేజీలు, లైబ్రరీలను ఈ నెల 31 వరకు బంద్ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆదేశాలు జారీ చేసింది. -
ఐసీఐసీఐలో కోటి వరకు విద్యారుణం
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్లో విద్యా రుణాలు(ఎడ్యుకేషన్ లోన్స్)ను వేగంగా అందించేందుకు చర్యలు చేపట్టింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే వినియోగదారులకు రూ.10లక్షల నుంచి కోటి రూపాయలు అందించే ప్రణాళికను రూపకల్పన చేసింది. ‘ఇన్స్టా ఎడ్యుకేషన్ లోన్’ పేరిట నిబంధనలు, షరతులతో కొద్ది నిమిషాల్లోనే విద్యా రుణాలను అందించనుంది. పూర్తిగా డిజిటల్ పద్దతిలో విద్యా రుణాల ప్రక్రియను చేపట్టనుంది. దేశీయ, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు, కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు బ్యాంక్ రుణాలను మంజూరు చేస్తుంది. అయితే వినియోగదారులు తమ స్థిర డిపాజిట్ల(ఫిక్సడ్ డిపాజిట్స్)లో 90శాతం బ్యాంక్ రుణాలు పొందవచ్చు అని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. వేగంగా మంజూరు చేసే రుణాల వల్ల విద్యార్థులు ఎంతో ప్రయోజనం పొందుతారని ఐసీఐసీఐ తెలిపింది. కాగా రుణాలు చెల్లించడానికి పది సంవత్సరాల కాలపరిమితిని బ్యాంక్ విధించింది. మరోవైపు ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80 ఇ ప్రకారం.. 8 సంవత్సరాల వరకు బ్యాంక్లో విద్యా రుణాలకు ఆదాయపు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. కాగా అంతర్జాతీయ సంస్థలలో ప్రవేశం పొందే విద్యార్థుల కోసం, బ్యాంక్ రుణాలు రూ. 10 లక్షల నుంచి రూ.కోటి వరకు, దేశీయ సంస్థలలో రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పొందవచ్చు.కాగా విద్యారుణాలను అప్లై చేయాలంటే..మొదటగా వినియోగదారులు ఐసీఐసీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత బ్యాంక్ సైట్లో రుణాలకు సంబంధించిన ఆఫర్ను అధ్యయనం చేయాలి. వినియోగదారులకు కావాల్సిన రుణం, చెల్లించే కాలపరిమితి, ప్రవేశం పొందిన విశ్వవిద్యాలయం పేరు తదితర వివరాలను అప్లికేషన్ ఫార్మ్లో నమోదు చేయాలి. తరువాత విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్థితో సంబంధం వంటి వివరాలను నమోదు చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాంక్కు సంబంధించిన నిబంధనలు, షరతులను అంగీకరిస్తే వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) ద్వారా బ్యాంక్ దృవీకరించిన నెంబర్ వస్తుంది. ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాక, విద్యారుణాలు పొందిన మంజూరు లేఖను బ్యాంక్ వినియోగదారులకు అందిస్తుంది. (చదవండి: ‘బోగస్’తో బ్యాంక్కు టోకరా!) -
రూ.1,210 కోట్లతో 30 నైపుణ్యాభివృద్ధి కాలేజీలు
సాక్షి, అమరావతి: నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, కంపెనీల మధ్య నిరంతరం సంబంధాలు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో రూ.1,210 కోట్లకు పైగా అంచనాలతో ఏర్పాటు చేస్తున్న 30 నైపుణ్యాభివృద్ధి కాలేజీలను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కాలేజీల నమూనాలను పరిశీ లించారు. అనంతరం సీఎం ఇచ్చిన సూచనలు, జారీ చేసిన ఆదేశాలు ఇలా ఉన్నాయి. ► సంబంధిత రంగంలో టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులు, చేర్పులను పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాన్ని మెరుగు పరచాలి. ► కాలేజీల నిర్మాణం పూర్తయ్యాక ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ చదివిన విద్యార్థుల వివరాలపై సర్వే చేయాలి. ఆ తర్వాత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలి. ఈలోగా పరిశ్రమల అవసరాలు ఏమిటో తెలుసుకోవాలి. ► సింగపూర్, జర్మనీ, అమెరికా, యూకే దేశాల్లోని పలు యూనివర్సిటీలు, సంస్థలు మనతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల వాటిని ఇందులో భాగస్వాములను చేయాలి. ఐటీఐ, పాలిటెక్నిక్ చేసిన వారికి మేలు జరిగేలా ఎన్ఏసీ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్)ని కూడా భాగస్వామిని చేయాలి. 20 రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ► మొత్తం 30 చోట్ల స్కిల్ డెవలప్మెంట్ కాలేజీల నిర్మాణ నమూనాలను అధికారులు సీఎంకు చూపించారు. ఈ 30 కాలేజీల్లో 20 రంగాలలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి శిక్షణ ఇస్తారు. ► దాదాపు 120 కోర్సుల్లో బోధన, నైపుణ్యాభి వృద్ధిలో శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొం దిస్తున్నారు. స్థానిక పరిశ్రమలు, భారీ పరి శ్రమలు, అంతర్జాతీయ పరిశ్రమలకు అవసర మైన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తారు. ► కోర్సుల్లో కియా, ఐటీసీ, టెక్ మహీంద్ర, హెచ్సీఎల్, హ్యుందాయ్, వోల్వో, బాష్ వంటి కంపెనీల భాగస్వామ్యం ఉంటుంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏపీఎస్సీహెచ్ఈ, ఐఐఐటీ బోధనా సిబ్బందితో అడ్వాన్స్డ్ కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తారు. ► సమీక్షా సమావేశంలో ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధు సూదన్ రెడ్డి, ఉన్నతాధికా రులు పాల్గొన్నారు. -
తెలంగాణ అటవీ కళాశాలకు ‘ఏ+’ కేటగిరీ
సాక్షి, హైదరాబాద్: అటవీ విద్యా బోధన, పరిశోధనలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు గాను తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్సీఆర్ఐ)ను ఏ ప్లస్ కేటగిరీ విద్యాసంస్థగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అటవీ కాలేజీలు, ప్రమాణాలు, వసతులను అధ్యయనం చేసిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఐసీఎఫ్ఆర్ఈ), తెలంగాణ కాలేజీకి అత్యంత ప్రాధాన్యత గుర్తింపునిచ్చింది. ప్రభుత్వ కృషికి తగిన ఫలితం లభించిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. అటవీశాఖ అధికారులు, కాలేజీ యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అడవులు, పర్యావరణ రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అటవీ విద్యను ప్రోత్సహించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక అటవీ కళాశాల ఏర్పాటును ప్రోత్సహించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. 2015లోనే కాలేజీ స్థాపన.. తమిళనాడు మెట్టుపలాయం అటవీ కాలేజీకి దీటుగా తీర్చిదిద్దాలన్న కేసీఆర్ ఆదేశాలతో 2015లో కాలేజీ స్థాపన.. 2016లో బీఎస్సీ ఫారెస్ట్రీ మొదటి బ్యాచ్ నాలుగేళ్ల కోర్సుతో ప్రారంభమైంది. ఈ ఏడాదే ఫైనలియర్ విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేసుకుంటున్నారు. ముందుగా దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో మొదలైన కాలేజీ.. గతేడాది డిసెంబర్లో హైదరాబాద్ శివారు ములుగులోని సొంత క్యాంపస్లోకి మారింది. అత్యంత అధునాతన సౌకర్యాలు, వసతులతో ఏర్పాటైన కొత్త క్యాంపస్ ముఖ్యమంత్రి చేతుల మీదుగానే ప్రారంభమైంది. విజయవంతంగా మొదటి బ్యాచ్ బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సును పూర్తి చేసుకుంటున్న అటవీ కళాశాల ఈ ఏడాది నుంచి రెండేళ్ల ఎంఎస్సీ ఫారెస్ట్రీతో పాటు, మూడేళ్ల పీహెచ్డీ ఫారెస్ట్రీ కోర్సులను కూడా ప్రారంభిస్తోంది. తొలినాళ్లలో ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా బీఎస్సీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగింది. ఆ తర్వాత ఎంసెట్ కౌన్సెలింగ్ ఆధారంగా ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతున్నాయి. బోధనలో ఉన్నత ప్రమాణాలు పాటించటంతో పాటు బ్రిటిష్ కొలంబియా, అబర్న్ యూనివర్సిటీలతో అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇటీవలే ఓ విద్యార్థినికి అబర్న్ యూనివర్సిటీ ఉచితంగా ఎంఎస్సీ సీటును ఆఫర్ చేసింది. తాజాగా ఏ ప్లస్ గుర్తింపు సాధించడంతో తెలంగాణ ఫారెస్ట్ కాలేజీకి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు మరింతగా వచ్చే అవకాశముంది. ప్రభుత్వం, ఇతర సంస్థల సహకారంతో అటవీ కాలేజీ విద్య, పరిశోధనా రంగాల్లో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతోంది. -
కరోనా : స్కూళ్లు, కాలేజీలు, సినిమాలు అన్నీ బంద్
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 (కరోనా వైరస్) భయాందోళన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు వరకు సినిమాహాళ్లను మూసివేయాలని ఆదేశించింది. అలాగే పరీక్షలు నిర్వహించని స్కూళ్లు, కాలేజీలను కూడా మార్చి 31 వరకు మూసి వేసేందుకు నిర్ణయించింది. కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రకటన జారీ చేశారు. ప్రధానంగా జన సమూహాలను నిలువరించే చర్యల్లో భాగంగా తాజా ఆదేశాలిచ్చింది. మరోవైపు కరోనా వైరస్ను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాగా దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య గురువారం నాటికి 73 కి చేరింది. కేరళలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. Delhi Chief Minister Arvind Kejriwal: All cinema halls to remain shut in Delhi till 31st March. Schools and colleges where exams are not being held will also remain closed. #CoronaVirus pic.twitter.com/pbuB1JNFnW — ANI (@ANI) March 12, 2020 -
ఇంజనీరింగ్ కాలేజీల్లో ‘ఏఐ’
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను (ఏఐ) ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించిన సిలబస్ను రూపొందించడంతోపాటు ఏయే కాలేజీల్లో ప్రారంభించాలో నిర్ణయించేందుకు ఉన్న త స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. సబ్జెక్టుగానే కాకుండా వీలైతే ప్రత్యేక కోర్సుగా ప్రవేశపెట్టే అంశాన్ని కూడా పరిశీలించాలని కమిటీని కోరాలని భావిస్తోంది. ఏఐని సబ్జెక్టుగా ప్రారంభిస్తే అందుకు అవసరమయ్యే అధ్యాపకులు, ల్యాబ్లు, ఇతర సదుపాయాలు, సిలబస్ రూపకల్పన, ఎన్ని క్రెడిట్స్ కేటాయించాలన్న తదితర అంశాలను కమిటీ తేల్చుతుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. ఏఐపై అవగాహన కలిగిన నిపుణులకు ఆ కమిటీలో స్థానం కల్పించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో ఏఐ సబ్జెక్టును వచ్చే ఏడాది నుంచి ప్రారంభించేందుకు తగిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఈ నెలాఖరులోగా కమిటీని ఏర్పాటు చేసి నివేదికను త్వరగా తెప్పించుకోవాలని నిర్ణయించింది. ఇంజనీరింగ్లో ఏఐని ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే జేఎన్టీయూ సెనేట్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్ర ఐటీ శాఖ కూడా ఏఐ పాలసీని రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. ప్రారంభమైన కసరత్తు.. జేఎన్టీయూ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఏఐని ప్రవేశపెట్టేలా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకునేలా మండలి కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఈ విషయాన్ని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాలని ఆయన సూచించినట్లు తెలిసింది. కోర్సుగా ప్రవేశపెడితే అన్ని ప్రైవేటు కాలేజీల్లో అమలు సాధ్యం అవుతుందా? లేదా? అనేది కమిటీ తేల్చనుంది. కోర్సును కేవలం యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లోనే ప్రవేశపెట్టడంతోపాటు ముందుకు వచ్చే ప్రైవేటు కాలేజీలకు అనుమతి ఇస్తే బాగుంటుందన్న ఆలోచనలు చేస్తోంది. అయితే నిపుణులతో కూడిన కమిటీ చేసే సిఫారసుల ఆధారంగానే ముందుకు వెళ్లాలని భావిస్తోంది. -
డిగ్రీ కాలేజీ షిఫ్టింగ్ అంత ఈజీ కాదు!
సాక్షి, హైదరాబాద్: ఒక మండలం నుంచి మరో మండలానికి ప్రైవేటు డిగ్రీ కాలేజీల షిఫ్టింగ్ ఇకపై అంత ఈజీ కాదు. సీఎం ఆమోదంతోనే ప్రైవేటు డిగ్రీ కాలేజీలను షిఫ్ట్ చేసేలా నిబంధనల్లో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మార్పుతో ఉన్నత విద్యా మండలి, విద్యాశాఖ మంత్రిపై ఒత్తిళ్లు లేకుండా చూడొచ్చని భావిస్తోంది. మండల పరిధిలో ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతానికి కాలేజీని షిఫ్ట్ చేసేందుకు ఉన్నత విద్యా మండలి అనుమతి ఇస్తుండగా, ఒక మండలం నుంచి మరో మండలానికి కాలేజీని షిఫ్ట్ చేసేందుకు విద్యాశాఖ మంత్రి అనుమతి ఇస్తున్నారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు కాలేజీని షిఫ్ట్ చేయాలంటేనే ఫైలు సీఎంకు వెళ్లేది. కానీ ఇకపై ఆ పరిస్థితి లేకుండా నిబంధనలను మార్చే కసరత్తు మొదలైంది. జీహెచ్ఎంసీలో జోన్ను పరిగణనలోకి తీసుకోవాలా? పాత మండలాలను పరిగణనలోకి తీసుకోవాలా అన్న దాన్ని ఖరారు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయించింది. -
‘కమిషన్ కోరిన సమాచారాన్ని కళాశాలలు ఇవ్వాలి’
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 21వ తేదీలోగా రాష్ట్రంలోని అన్ని కాలేజీలు అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని ఉన్నత విద్యా కమిషన్ సెక్రటరీ ఎన్. రాజశేఖర్ విద్యాసంస్థలను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా కళాశాలల్లోని ఫీజులను సమీక్షిస్తున్న నేపథ్యంలో ఇంజనీరింగ్, ఫార్మా, ఏంసీఏ, ఎంబీఏ కాలేజీలన్నింటికీ నోటీసులు పంపించామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ప్రతి కాలేజీ యాజమాన్యం కమిషన్ కోరిన సమాచారాన్ని ఇవ్వాలని, గతంలో ఫీజుల నిర్థారణపై ఆరోపణులు వచ్చాయని పేర్కొన్నారు. కొన్ని కాలేజీలకు భారీగా ఫీజుల పెంచారని, మరికొన్ని కాలేజీలకు తక్కువ ఫీజుల పేట్టారని అన్నారు. కాలేజీల్లో సదుపాయాల తనిఖీకి కోసం ప్రత్యేక బృందాలను నియమిస్తున్నామని, టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. డిసెంబర్ నాటికి కొత్త ఫీజులను నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. -
కాలేజీ చేతుల్లోకి మెడిసీన్!
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) స్థానంలో తీసుకొచ్చిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చట్టంపై వైద్య విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దీని ప్రకారం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50% సీట్ల ఫీజులను మాత్రమే ప్రభుత్వం నియంత్రిస్తుంది. మిగతా ఫీజుల నిర్ణయం కాలేజీ యాజమాన్యాలదే. అలాగే ప్రస్తుతం పీజీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ పరీక్షను రద్దు చేసి ‘నెక్ట్స్’అనే పరీక్ష పెడతామని ప్రతిపాదించింది. ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పుడే అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు కాలేజీలు.. తాజా నిర్ణయంతో మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని జూడాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మిగులుతుందని అంటున్నారు. సాక్షి, హైదరాబాద్ : నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చట్టంపై జూనియర్ డాక్టర్ల ఆందోళనలు ఉధృతమయ్యాయి. దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళన చేస్తుండగానే.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. దీంతో 1956 నాటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) స్థానంలో, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అమల్లోకి వచ్చింది. డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సెక్షన్లకు ఎటువంటి సవరణలు చేయకుండానే బిల్లు చట్ట రూపం దాల్చింది. ఈ చట్టంలో ప్రతిపాదించిన కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్, కమిషన్లో డాక్టర్లకు బదులు నాన్–డాక్టర్లకు అవకాశం కల్పించడం.. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం, ప్రైవేటు కాలేజీల్లోని 50% సీట్ల ఫీజులను యాజమాన్యాలకే కట్టబెట్టడం వంటి అంశాలను డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2017లోనూ బిల్లుపై వ్యతిరేకత ఎన్ఎంసీ బిల్లును తొలిసారి 2017 డిసెంబర్లో లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సహా దేశవ్యాప్తంగా డాక్టర్లు ఈ బిల్లును వ్యతిరేకించడంతో సెలెక్ట్ కమిటీకి పంపించారు. 16వ లోక్సభ రద్దు అవడంతో ఈ బిల్లు మురిగిపోయింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. తాజాగా చట్టంగా మారడంతో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50% సీట్ల ఫీజులను మాత్రమే ప్రభుత్వం నియంత్రిస్తుంది. మిగతా 50% సీట్ల ఫీజుల నిర్ణయం కాలేజీ యాజమాన్యాలదే. దీంతో కాలేజీలు ఇష్టానికి ఫీజులు పెంచేసే అవకాశముందని, ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పుడే అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు కాలేజీలు, తాజా నిర్ణయంతో మరింతగా రెచ్చిపోయే ప్రమాదముందని డాక్టర్లు అంటున్నారు. ఈ బిల్లుతో పేద, మధ్యతరగతి స్టూడెంట్లకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రవేశ పరీక్షల్లో మెరిట్ సాధించకపోయినా, కోట్లలో ఫీజులు కట్టే సామర్థ్యం ఉన్నవాళ్లకు ఎంబీబీఎస్ సీట్లు దక్కుతాయని చెబుతున్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరసనలు చేపట్టారు. దీనికి తోడు ఈ బిల్లులో ప్రతిపాదించిన నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ (నెక్ట్స్)పై వైద్య విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒకే ఎగ్జామ్ను 3 రకాలుగా వినియోగించాలని కేంద్రం నిర్ణయించింది. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పరీక్షగా, దేశ, విదేశాల్లో చదివిన విద్యార్థులకు ఎగ్జిట్ ఎగ్జామ్గా, పీజీ ప్రవేశాలకు ఎంట్రన్స్ ఎగ్జామ్గా ఈ పరీక్షను నిర్వహించాలని భావిస్తున్నారు. అంటే, ఇకపై ఎంబీబీఎస్ విద్యార్థులు ఈ పరీక్ష పాసైతేనే డాక్టర్గా ప్రాక్టీస్ చేసేందుకు లైసెన్స్ ఇస్తారు. ఈ నేపథ్యంలోనే నెక్ట్స్ను ఎగ్జిట్ ఎగ్జామ్గా పేర్కొంటున్నారు. ఎన్ఎంసీ అమల్లోకి వస్తే.. విదేశాల్లో చదివిన వాళ్లు కూడా ఎఫ్ఎంజీఈకి బదులు, నెక్ట్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇందులో పాసైతేనే ప్రాక్టీస్కు అర్హులవుతారు. అలాగే, ప్రస్తుతం పీజీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ విధానాన్ని రద్దు చేసి, నెక్ట్స్లో సాధించిన మార్కుల ఆధారంగానే పీజీ సీట్లు కేటాయిస్తామని బిల్లులో ప్రతిపాదించారు. దీన్నే విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ ఎన్ఎంసీ బిల్లులోని సెక్షన్ 32లో కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ అనే క్లాజ్ ఉంది. మోడ్రన్ సైంటిఫిక్ మెడికల్ ప్రొఫెషన్తో ముడిపడి ఉన్న వ్యక్తులకు ‘కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్’గా ‘లిమిటెడ్ లైసెన్స్’ఇవ్వొచ్చునని ఈ సెక్షన్లో ప్రతిపాదించారు. దీన్ని డాక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ పేరుతో స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ఫిజియో థెరపిస్టులు తదితరులకు మోడ్రన్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే అవకాశం ఇచ్చే అవకాశముంది. అయితే వీళ్లకు మోడ్రన్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసేందుకు అవకాశమిస్తే, ప్రజారోగ్యం దెబ్బతింటుందని డాక్టర్లు చెబుతున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా వైద్య విద్యార్ధులు, జూనియర్ డాక్టర్లు గళమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా, హైదరాబాద్ ధర్నాచౌక్లో గురువారం భారీ సంఖ్యలో ధర్నా నిర్వహించారు. దీనికి పలు రాజకీయ పార్టీల నాయకులు, సినీ ప్రముఖులు హాజరై సంఘీభావం తెలిపారు. కమిషన్లో నాన్–డాక్టర్స్ ప్రస్తుతం ఉన్న మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా గవర్నింగ్ బాడీలో 80% మంది డాక్టర్లు ఉంటే, 20% మంది నాన్–డాక్టర్స్ ఉంటారు. కానీ, మెడికల్ కమిషన్లో 80% స్థానాల్లో నాన్–డాక్టర్స్ను కూడా నియమించుకునే అవకాశమిచ్చారు. ఇలా నాన్–డాక్టర్స్ కీలకంగా ఉండే కమిషన్లో రాజకీయ జోక్యం పెరుగుతుందని, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల చేతుల్లోకి వైద్య విద్య వ్యవస్థ వెళ్తుందని డాక్టర్లు ఆరోపిస్తున్నారు. భారీగా పెరగనున్న ఫీజులు నేషనల్ మెడికల్ కమిషన్ చట్టంతో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఫీజుల ధరలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బ్రిడ్జ్ కోర్సు, ఎగ్జిట్ ఎగ్జామ్, ఫీజుల నియంత్రణ ఎత్తివేయడం వంటి అనేక అంశాలు మెడిసిన్ స్టూడెంట్లకు, మెడిసిన్ చదవాలనుకుంటున్న విద్యార్థులకు నష్టాన్ని కలిగిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు కాలేజీల్లోని మొత్తం సీట్ల ఫీజులను నియంత్రించే అధికారం ప్రభుత్వాలకు ఉంది. ఎన్ఎంసీ చట్టంతో ప్రైవేటులోని 50% సీట్లపై ప్రభుత్వం నియంత్రణ కోల్పోనుంది. చాలా రాష్ట్రాల్లో బీ–కేటగిరీ సీటుకు కనీసం రూ.50లక్షలు, సీ–కేటగిరీ సీటుకు కోటి రూపాయల వరకూ కాలేజీలకు చెల్లించాల్సి వస్తోంది. ఈ నియంత్రణ ఎత్తివేస్తే ఫీజులు రెండు, మూడింతలు పెరిగే ప్రమాదముంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారనుంది. -
ర్యాగింగ్ చేస్తే...
సాక్షి, రాజమహేంద్రవరం క్రైం: విద్యాలయాల్లో ర్యాగింగ్ వెర్రితలలు వేస్తోంది. కొత్తగా కళాశాలలకు వచ్చే విద్యార్థులను సీనియర్లు వేధించడం షరా మామూలుగానే మారింది. ర్యాగింగ్ పేరుతో వేధింపులకు పాల్పడకూడదని చట్టాలున్నా అవి అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో ర్యాగింగ్ మహమ్మారిని అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. విద్యాసంవత్సరం మొదలు కావడంతో ర్యాగింగ్పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ర్యాగింగ్ వల్ల కలిగే దుష్ఫలితాలను వివరిస్తున్నారు. ర్యాగింగ్ అంటే.. 1997 చట్టం ప్రకారం ర్యాగింగ్ అంటే విద్యార్థికి అవమానం, బాధ, భయం, భీతి, దిగులు, జడుపు, దురుద్దేశపూరితమైన పనులు, గాయాలకు కారణమైన, కారణం కాబోయే చర్యలు చేస్తే ర్యాగింగ్ కిందకు వస్తుంది. సెక్షన్ 4 ఏపీ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ 1997 ప్రకారం ర్యాగింగ్కు పాల్పడితే శిక్షార్హులు అవుతారు. మహిళా చట్టాలు.. ⇔ సెక్షన్ 509 ఐపీసీ: మహిళలతో మాటలతో, సైగలతో, చేష్టలతో, అవమానపరిచినా, అల్లరి పెట్టినా ఒక సంవత్సరం నుంచి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా. రెండూ పడే అవకాశం. ⇔ సెక్షన్ 294 ఐపీసీ: అశ్లీల, అభ్యంతరకరమైన ప్రవర్తన, పాటలు పాడడం, ⇔ సెక్షన్ 354 ఐపీసీ : అత్యాచారం కు ప్రయత్నించడం లేదా మర్యాదకు భగం కలిగేలా ప్రవర్తించడం ⇔ మహిళలను దురుద్దేశంతో తాకినా, కోరిక తీర్చమని అడిగినా, లైంగికపరమైన చిత్రాలు, వీడియోలు, చూపించినా మూడేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు. ⇔ మహిళలపై దాడి చేసినా లేదా బల ప్రయోగం చేసినా, అత్యాచార యత్నం చేసినా, దురుద్దేశంతో వస్త్రాలు తొలగించినా ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ⇔ ఎవరైనా మహిళ అంతరంగికమైన జీవితానికి ప్రైవేటు(లైఫ్)కు సంబందించిన దృశ్యాలను రహస్యంగా చూసినా, చిత్రీకరించినా ఏడాది నుంచి ఏడేళ్ల జైలు శిక్ష , జరిమానా విధిస్తారు. ⇔ మహిళ అభీష్టానికి వ్యతిరేకంగా ఆమెను అనుసరించినా, తాకడానికి ప్రయత్నించినా ఈమెయిల్, ఇంటర్నెట్, తదితర సాధనాల ద్వారా ఆమెను సంప్రదించినా మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ప్రొటక్షన్ ఆఫ్ చిల్ట్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్ యాక్ట్ 2012 బాలికలను లైంగికపరమైన ఉద్దేశంతో తాకినా, వేధింపులకు గురి చేసినా, దాడి చేసినా, శరీరంలోకి చొచ్చుకుపోయే ఆయుధాలు, వస్తువులు, అగ్నివంటి వాటితో దాడికి గురి చేసినా, మారణాయుధాలతో దాడి చేసినా, గాయపరిచినా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో అసభ్యంగా చిత్రీకరించినా, శరీరకంగా, మానసికంగా ఎవరైనా నేరాలను ప్రోత్సహించినా ఏడాది నుంచి యావజ్జీవ జైలు శిక్ష విధిస్తారు. బాధితులు సంప్రదించాల్సి నంబర్లు.. పోలీస్ కంట్రోల్ రూమ్ : 100, 1090, 1091 డీఎస్పీ మహిళా పోలీస్ స్టేషన్ 9490760792 ర్యాగింగ్కు పాల్పడితే.. ⇔ వేధించడం, అవమానించడం చేస్తే ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. వెయ్యి జరిమానా లేదా రెండూ విధిస్తారు. కొట్టడం, బలవంతం చేయడం, హెచ్చరించడం చేస్తే సంవత్సరం జైలు శిక్ష లేదా రూ. 2000 జరిమానా, రెండూ విధించవచ్చు. అక్రమ నిర్బంధం, అడ్డుకోవడం, గాయపరచడం చేస్తే రెండేళ్ల జైలు శిక్ష, రూ.ఐదు వేల జరిమానా లేదా రెండూ విధిస్తారు. ⇔ హత్య చేయడం, ఆత్మహత్యకు ప్రేరేపించడం చేస్తే పదేళ్ల జైలు శిక్ష రూ.50 వేలు జరిమానా విధిస్తారు. యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తాం ప్రతి కాలేజీలో, విద్యా సంస్థల్లో య్యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఆ సంస్థలో చదివే విద్యార్థులతో ఒక కమిటీ వేసి ఒకవేళ ర్యాగింగ్ లాంటి సంఘటనలు జరిగితే ఎవరి పాత్ర ఎంత ఉంది అనేది దర్యాప్తు చేస్తాం. విద్యార్థుల పట్ల ర్యాగింగ్కు పాల్పడితే కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే అవగాహన సదస్సులు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. – లతా మాధురి, అడిషనల్ ఎస్పీ, రాజమహేంద్రవరం -
23 కాలేజీలు.. 7,199 సీట్లు కట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలు, సీట్లకు కోత పడింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) గుర్తింపు ఇచ్చిన వాటిల్లోనే 23 కాలేజీలతోపాటు 7,199 సీట్లు తగ్గిపోయాయి. రాష్ట్రంలోని 168 పాలిటెక్నిక్ కాలేజీల్లో 42,100 సీట్లకు ఏఐసీటీఈ ఇటీవల అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అందులో కొన్ని కాలేజీలు సీట్లను తగ్గించుకోగా, కొన్ని కాలేజీలు ప్రవేశాలకు ముందుకు రాలేదు. మరికొన్ని కాలేజీల్లో లోపాల కారణంగా రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. ఇలా 23 కాలేజీలు, 7,199 సీట్లకు కోత పడింది. ఈసారి ప్రవేశాల కౌన్సెలింగ్లో 145 కాలేజీల్లో 34,901 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్కు అవకాశం కల్పించామని తెలిపారు. దీంతో 12,511 మంది విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించారని, అందులో 12,303 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్లను బుక్ చేసుకున్నట్లు ఆయన వివరించారు. 24 వరకు ప్రాధాన్యక్రమంలో ఆప్షన్లు.. ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని బి.శ్రీనివాస్ పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు ఈనెల 24 వరకు ప్రాధాన్య క్రమంలో కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి ఈనెల 27న సీట్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఎన్సీసీ, వికలాంగులు, సాయుధ దళాల కుటుంబాలకు చెందిన పిల్లలు/ఆంగ్లో ఇండియన్ కుటుంబాలకు చెందిన పిల్లలు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్లో మాసాబ్ట్యాంకులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఎంచుకోవాలని పేర్కొన్నారు. కులీకుతుబ్ షాహి అర్బన్ డెవలప్మెంట్ ప్రాంతం లోని విద్యార్థులు అక్కడి క్యూక్యూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న సీట్లను ఎంచుకోవచ్చని, అయితే వారు తమ రేషన్కార్డు జిరాక్స్ కాపీ తప్పక సబ్మిట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అక్కడి విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు స్లాట్ బుకింగ్లో క్యూక్యూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఎంచుకోవాలని పేర్కొన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం వెళ్లే విద్యార్థులు వెంట తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్ల వివరాలను తమ వెబ్సైట్లో (https://tspolycet. nic.in) చూడొచ్చని తెలిపారు. -
ఎయిడెడ్లో ప్రైవేటు దందా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎయిడెడ్ కాలేజీల్లో ప్రైవేటు దందా మొదలైంది. ఇప్పటివరకు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతో కొన్ని సెక్షన్లలోనే కొనసాగిన ప్రైవేటు దందా.. ఇప్పుడు ఏకంగా ఎయిడెడ్ కాలేజీలను పూర్తి ప్రైవేటు కాలేజీలుగా మార్చేందుకు తెర వెనుక అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ తతంగంలో 25 నుంచి 75 ఏళ్ల చరిత్ర గల ప్రముఖ కాలేజీలు కూడా ప్రైవేటుగా మారిపోతున్నాయి. ప్రభుత్వానికే తెలియకుండా పదుల సంఖ్యలో ఇంటర్మీడియట్, డిగ్రీ ఎయిడెడ్ కాలేజీలు ప్రైవేటు కాలేజీలుగా ఆయా శాఖలే మార్చేశాయి. ఏళ్ల చరిత్ర గల వరంగల్లోని ఓ ఎయిడెడ్ జూనియర్ కళాశాల ఆవరణలోనే కొత్త యాజమాన్యం పేరుతో ప్రైవేటు కాలేజీగా బోర్డు పెట్టారు. హైదరాబాద్ నగరం, ఇతర జిల్లాల్లోని రూ. వేల కోట్ల ఆస్తులు గల ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలను ప్రైవేటు కాలేజీలుగా కొనసాగించేందుకు కళాశాల విద్యా శాఖ అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ఇలా 18 కాలేజీలను కళాశాల విద్యాశాఖ ప్రైవేటుగా మార్చేసినట్లు సమాచారం. నియామకాలు చేపట్టకే.. ప్రభుత్వం నియామకాలను చేపట్టకపోవడంతో ఉన్న సిబ్బందితోనే ఎయిడెడ్ కాలేజీలను నడిపిస్తున్నారు. మరోపక్క ప్రైవేటు లెక్చరర్లను నియమించుకొని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను నిర్వహిస్తూ విద్యార్థుల నుంచి భారీగా ఫీజులను వసూలు చేస్తున్నారు. మరికొన్ని యాజమాన్యాలు రూ. వేల కోట్ల ఆస్తులు, భూములు, భవనాలు గల ఆయా విద్యా సంస్థల ఆస్తులపై కన్నేశాయి. వీరంతా సరిపడా లెక్చరర్లు లేరన్న సాకుతో కాలేజీలను నడపలేమంటూ వాటిని మూసేసి ఆస్తులను కొట్టేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయా యాజమాన్యాలు కళాశాల విద్యాశాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్రంలోని 18 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లోని లెక్చరర్లు, సిబ్బందిని ప్రభుత్వ కాలేజీల్లో అవసరం ఉందంటూ వాటిల్లోకి బదిలీ చేసి, అక్కడ ఎయిడెడ్ కాలేజీ అనేది లేకుండా చేసినట్లు సమాచారం. కొన్ని కాలేజీలు మాత్రం ప్రైవేటు కాలేజీలుగా కొనసాగిం చేందుకు సిద్ధం కాగా, మరికొన్ని పూర్తిగా మూతవేసి ఆస్తులను కొట్టేసే యోచనల్లో ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం సీరియస్.. ఈ తతంగం మొత్తం ప్రభుత్వానికి తెలియడంతో సీరియస్ అయ్యింది. ప్రస్తుతం కళాశాల విద్యాశాఖ ఎయిడెడ్ నుంచి ప్రైవేటుగా మార్చుతూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లోని 5 ఇంజనీరింగ్ కాలేజీలను నగర పరిసరాల్లోకి మార్చుకునేందుకు సాంకేతిక విద్యాశాఖ అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. దీంతో సదరు కాలేజీలు అఖిల భారత సాంకేతిక విద్యా మండలికి కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన ప్రభుత్వం ఆ షిఫ్టింగ్లను రద్దు చేయాలని, ఏఐసీటీఈకీ లేఖ రాయాలని సూచించినా సాంకేతిక విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదని తెలిసింది. దీంతో వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం కాలేజీలను షిఫ్టింగ్ చేసేలా సాంకేతిక విద్యాశాఖకు ఉన్న అధికారాలను రద్దు చేసినట్లు సమాచారం. ఎయిడెడ్ కాలేజీలను ప్రైవేటు కాలేజీలుగా మార్చాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఎలా మార్పు చేశారన్న దానిపై నివేదిక కోరినట్లు తెలిసింది. ఆస్తులపై దాతల వారసుల కన్ను.. ఒకప్పుడు దాతలు విద్యాదానం చేసేందుకు ఎయిడెడ్ విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ దాతల వారసులే కొంతమంది ఎయిడెడ్ ఆస్తులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా కళాశాల విద్యాశాఖ అధికారులతో కుమ్మక్కయి ఆయా కాలేజీల్లోని లెక్చరర్లు, సిబ్బందిని ముందుగా ప్రభుత్వ కాలేజీల్లోకి పంపించి, చివరకు ఎయిడెడ్ అనేది లేకుండా చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో నగదు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. -
27 కాలేజీలు.. 8,887 సీట్లు కోత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు జారీ చేసింది. కొన్ని కాలేజీలు స్వచ్ఛందంగా పూర్తిగా కోర్సులను రద్దు చేసుకోవడం, మరికొన్ని కాలేజీల్లో లోపాల కారణంగా కోర్సులను ఏఐసీటీఈ రద్దు చేయడంతో గతేడాది కంటే ఈసారి కాలేజీలు, సీట్లకు భారీగా కోత పడింది. దీంతో మొత్తంగా 8,887 సీట్లు రద్దయ్యాయి. గతేడాదితో పొల్చితే రాష్ట్రంలోని 27 కాలేజీల్లో బీటెక్ మొదటి ఏడాది ప్రవేశాలు చేపట్టే వీలు లేకుండాపోయింది. కొన్ని కాలేజీలు కొన్ని బ్రాంచీలను రద్దు చేసుకోగా, మరికొన్ని కాలేజీలు బ్రాంచీల్లో సీట్లను పెంచుకున్నాయి. ఎక్కువ కాలేజీలు పలు బ్రాంచీల్లో సీట్లను ఏకంగా రద్దు చేసుకున్నాయి. మొత్తానికి ఈసారి రాష్ట్రంలోని 201 కాలేజీల్లో 1,05,360 బీటెక్ సీట్లకు అనుమతులు జారీ చేసిన ఏఐసీటీఈ గతేడాది కంటే 8,887 సీట్లను తగ్గించింది. ఈసారి యూనివర్సిటీలు ఇచ్చేవెన్నో.. గత విద్యా సంవత్సరం (2018–19)లో రాష్ట్రంలోని 228 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,14,247 సీట్లకు ఏఐసీటీఈ అనుమతులు ఇచ్చింది. అందులో లోపాల కారణంగా జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ లు లోపాల కారణంగా భారీగా సీట్లకు కోత పెట్టాయి. కేవలం 95,235 వేల సీట్లకు అనుబంధ గుర్తింపును ఇచ్చాయి. దీంతో వాటిల్లోనే ప్రవేశాలు చేపట్టగా, అందులోనూ 67,937 వేల సీట్లే భర్తీ అయ్యాయి. ఇక 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఏఐసీటీఈ 201 కాలేజీల్లోని 1,05,360 సీట్ల భర్తీకి అనుమతులు ఇచ్చింది. అయితే అందులో యూనివర్సిటీలు ఎన్ని సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపును ఇస్తాయో తేలాల్సి ఉంది. గతేడాది 95,235 సీట్లకు పరిమితం చేసిన యూనివర్సిటీలు ఈసారి వాటిని 90 వేలకే పరిమితం చేసే పరిస్థితి కనిపిస్తోంది. లోపాల సవరణకు ముగిసిన గడువు రాష్ట్రంలోని దాదాపు 250 కాలేజీల్లో తనిఖీలు చేసిన జేఎన్టీయూ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు (ఎఫ్ఎఫ్సీ) వాటిని సవరించుకోవాలంటూ లేఖలు రాసింది. ఆ లోపాలను సవరించుకునే గడువు శనివారంతో ముగిసిపోవడంతో వాటిపై మరోసారి కాలేజీలతో చర్చించి అనుబంధ గుర్తింపును జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కూడా ఇదే పనిలో ఉన్నాయి. ఈనెల 9వ తేదీతో ఎంసెట్ ప్రవేశ పరీక్షలు ముగిశాయి. శుక్రవారం వాటికి సంబంధించి కీలను ఎంసెట్ కమిటీ విడుదల చేసింది. ఈనెల 13 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తోంది. వీలైతే వచ్చే వారంలో ఎంసెట్ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఇంటర్మీడియెట్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలను కూడా ఈనెల 15 నాటికి విడుదల చేసే అవకాశం ఉండటంతో ఈలోగా ఎంసెట్ వ్యాల్యుయేషన్ పూర్తి చేసి సిద్ధంగా ఉండాలన్న ఆలోచన చేస్తోంది. వీలైతే వచ్చే వారం, లేదా ఈనెల 25 నాటికి ఎంసెట్ ఫలితాలను వెల్లడించనుంది. అలాగే కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను కూడా ఈనెలాఖరులోగా పూర్తి చేయాలన్న ఆలోచనల్లో ఉన్నాయి. ఆ ప్రక్రియ పూర్తయితే జూన్ మొదటి వారం/రెండో వారంలో ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. కొత్త కోర్సులకు ఓకే చెప్పిన ఏఐసీటీఈ మార్కెట్లో డిమాండ్ ఉన్న కొత్త కోర్సులకు ఈసారి ఏఐసీటీఈ అనుమతులను ఇచ్చింది. కంప్యూటర్ ఇంజనీరింగ్, ఆర్టిషీయల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సు లకు అనుమతులు ఇస్తామని ఏఐసీటీఈ తమ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్బుక్లోనే స్పష్టం చేయడంతో రాష్ట్రంలోని పలు కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. దీంతో ఏఐసీటీఈ వాటికి అనుమతి ఇచ్చింది. అయితే యూనివర్సిటీలు ఆయా కోర్సుల నిర్వహణకు అనుమతి ఇస్తాయా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. వాటి నిర్వహణకు అవసరమైన సిలబస్, స్కీం, ఫ్యాకల్టీ సరిపడ ఉన్నారా? లేదా? ఎలా నిర్వహిస్తారు? అన్న అంశాలను యూనివర్సిటీలు పరిశీలించాకే తమ బోర్డ్ స్టడీస్ సమావేశంలో చర్చించాక నిర్వహణకు ఓకే చెప్పాలా? వద్దా? అన్నది తేల్చనున్నాయి. పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ సీట్లకు కోత పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ ఈసారి కాలేజీలకు, సీట్లకు ఏఐసీటీఈ కోత పెట్టింది. ఈనెల 14వ తేదీ నుంచి పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సెలింగ్ చేపట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఏఐసీటీఈ అనుమతుల జాబితాలను క్రోడీకరించింది. 2019–20 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 162 కాలేజీలకు, వాటిల్లోని 42,100 సీట్లకు ఆమోదం తెలిపింది. గతేడాది రాష్ట్రంలోని 187 కాలేజీల్లోని 47,264 సీట్లకు అనుమతులు ఇచ్చిన ఏఐసీటీఈ ఈసారి 25 కాలేజీలకు, 5164 సీట్లకు కోత విధించింది. -
ఇంటర్లో ప్రవేశాలకు కార్పొరేట్ వల..!
జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు ఇంటర్లో ప్రవేశాలకు తెరలేపాయి. పదో తరగతి ఫలితాలు వెల్లడికాకుండానే విద్యార్థులకు వల విసురుతున్నాయి. తల్లిదండ్రులకు మాయమాటలుచెబుతూ విద్యార్థులను ‘బుక్’ చేసుకుంటున్నాయి. దీనికోసం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులకు భారీగా ముడుపులు ముట్టజెప్తున్నాయి. విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు కల్పిస్తున్నా.. జిల్లా ఇంటర్మీయట్ విద్యా పర్యవేక్షణ శాఖ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. విజయనగరం అర్బన్: పదోతరగతి ఫలితాలు వెల్లడికాకుండానే ఇంటర్లో ప్రవేశాలంటూ ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు జిల్లాలో హడవుడి చేస్తున్నాయి. తమ పీఆర్వోలను పల్లె, పట్టణాల్లో పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల ఇళ్లకు పంపిస్తున్నాయి. వారి తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ప్రవేశ దరఖాస్తులను నింపిస్తున్నాయి. ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని కళాశాలలు రాయితీల పేరుతో ముందుగానే 60 శాతం ఫీజును వసూలు చేస్తున్నాయి. లేందంటే ఐడీ నంబర్రాదని భయపెడుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు 22, ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు 72 ఉన్నాయి. మొత్తం కళాశాలల్లో మొదటి సంవత్సరానికి 26 వేల మంది విద్యార్థుల ప్రవేశం జరుగుతుంది. వీటిలో ప్రభుత్వ కళాశాలలను మినహాయించి చూస్తే 16 వేల మంది ప్రైవేటు, కార్పొరేట్ కళా శాలల్లోనే చదువుతున్నారు. వీరి ప్రవేశాల కోసం బేరసారాలు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ ఫీజులు... ఐఐటీ ప్రత్యేకం పేరుతో ఎంపీసీలో ప్రవేశాలకు కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఏడాదికి రూ. 90 వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. అదే గ్రూప్లో ఏసీ క్యాంపస్ (రాష్ట్రంలో ఎక్కడి బ్రాంచ్ల్లోనైనా)లో చదువుకోదలిస్తే రూ.1.75 లక్షల వరకు ఫీజు చెల్లించాల్సిందే. సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ గ్రూప్ల్లో సివి ల్స్ ఫౌండేషన్ పేరుతో కొత్త కోర్సులను పరిచ యం చేస్తున్నాయి. సుమారు రూ. 1.75 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నా యి. సీఈసీ, ఎంఈసీ గ్రూప్తో సీఏ, సీసీటీ పేర్లు జోడించి రూ.2.25 లక్షల డిమాండ్ చేస్తున్నాయి. నిబంధనలకు పాతర... వాస్తవంగా పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాక జూన్లో ప్రవేశాలు తీసుకోవాలి. అప్పటివరకు ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. పీఆర్వోలతో నియామకాలు చేసుకోకూడదు. ఇం టర్ బోర్డు అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఈ నిబంధనలు అమలు కావడం లేదన్న వాదన విని పిస్తోంది. జిల్లాలోని పలు విద్యాసంస్థలు విచ్చల విడిగా ప్రవేశాలు చేస్తున్నా పట్టించుకునేవారే లేరని విద్యావేత్తలు చెబుతున్నారు. తిరిగొస్తే డబ్బులు గోవిందా... కార్పొరేట్ కళాశాలల్లో చేరే విద్యార్థులు చాలా మందికి అక్కడి పరిసరాలు నప్పవు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. కళాశాలను విడిచి పెట్టేందుకు సిద్ధమవుతారు. అలాంటి పరిస్థితుల్లో ఫీజులో 30 శాతం చెల్లించాల్సి వస్తోందంటూ బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. పొరపాటున మొత్తం ఫీజు ఒకేసారి చెల్లిస్తే తిరిగి తెచ్చుకునేందుకు చుక్కలు చూడాల్సిందేనంటున్నారు. పాఠశాలల నిర్వాహకులకు తాయిలాలు.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల నిర్వాహకులకు భారీ తాయిలాలు ముట్టజెప్పి అందులో చదివే విద్యార్థులను తమ కళాశాలలో చేర్పించేందుకు కొన్ని కళాశాలల యాజమాన్యాలు ముందస్తుగా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. పాఠశాలల నిర్వాహకులకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల మేర ముడుపులు, లేదా ఆ స్థాయి బహుమతులు అందించేందుకు జిల్లాలో 100కు పైగా ఉన్నతపాఠశాలలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు అదే కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి విద్యార్థుల ప్రవేశాల విషయంలో ఇచ్చిన టార్గెట్ పూర్తి చేసిన వారికే వేసవి సెలవుల్లో వేతనాలిచ్చే నిబంధనలు విధించాయి. దీంతో ఆయా కళాశాలల్లోని సిబ్బంది తీవ్రఒత్తిడితో విధులు నిర్వహిస్తున్నట్టు భోగట్టా. అన్ని చోట్లా పీఆర్వోలు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు జిల్లా కేంద్రంతోపాటు పార్వతీపురం, సాలూరు, గజపతినరం, చీపురుపల్లి తదితర ప్రాంతాల్లో పీఆర్వో (పబ్లిక్ రిలేషన్ అధికారులు)లను నియమించుకున్నాయి. ఎల్ఐసీ ఏజెంట్లు, సిబ్బంది, ఉపాధ్యాయులను కళాశాలలకు ఏజెంట్లుగా నియమించి వీరికి నెలకు రూ.8వేల వరకు ఏడాది పొడువునా జీతం రూపంలో చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. పార్ట్టైం పీఆర్వోలకు ఒక్కో విద్యార్థితో యాజమాన్యం నిర్ణయించిన ఫీజు కట్టిస్తే 10 శాతం వరకు గిట్టుబాటవుతోంది. ఆ తాయిలాల కు ఆకర్షితులైన చాలామంది పీఆర్వోలుగా చేరి వివిధ ప్రాంతాల్లో రోజుకు వంద దరఖాస్తులు కార్పొరేట్ కళాశాలలకు పంపుతున్నారు.