ఓ చమురు క్షేత్రానికి సమీపంలో గుర్తుతెలియని దుండగులు పాల్పడిన శక్తిమంతమైన బాంబు పేలుడు ధాటికి ఇద్దరు సైనికులు నేలకొరిగారు.
బొగొటా: ఓ చమురు క్షేత్రానికి సమీపంలో గుర్తుతెలియని దుండగులు పాల్పడిన శక్తిమంతమైన బాంబు పేలుడు ధాటికి ఇద్దరు సైనికులు నేలకొరిగారు. కొలంబియాలోని సంతాందర్ రాష్ట్రంలో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది.
వెనుజులా సరిహద్దుకు అతి సమీపంలో ఉన్న ఈ ప్రాంతం వద్ద ఆయిల్ పైప్ లైన్ మరమత్తులు జరుగుతుండగా చనిపోయిన సైనికులిద్దరు అక్కడ కాపలా విధుల్లో ఉన్నారు. ఇప్పటివరకు ఏ సంస్థా పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించలేదు.