భర్త అందరి ముందు తనను అవమానించాడనే కోపంతో భార్య అతన్ని కోర్టుకు లాగింది.
జెద్దా: భర్త అందరి ముందు తనను అవమానించాడనే కోపంతో భార్య అతన్ని కోర్టుకు లాగింది. ఆవు, గాడిదా అంటూ తనను దూషించాడని, చెప్పుకోలేనటువంటి అసభ్య పదాలు వాడాడని ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన సౌదీ అరేబియాలో జరిగింది.
జెద్దాలోని ఓ క్రిమినల్ కేసు విచారణకు చేపట్టింది. తనను అవమానించడం భర్తకు ఓ వ్యాపకంగా మరిందని ఆమో ఫిర్యాదులో పేర్కొంది. తను భర్తపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం రెండు వారాల్లోగా కోర్టు ముందు హాజరు కావాల్సింది ఆమె భర్తకు సమన్లు జారీ చేసింది.