
మెదక్మున్సిపాలిటీ: ఏప్రిల్ 17 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఇన్చార్జి విద్యాధికారిని విజయలక్ష్మి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 17 నుంచి మే1 వరకు థియరీ, మే 8 నుంచి 12 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయని తెలిపారు. మరింత సమాచారం కోసం జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ వెంకటస్వామి సెల్.8008403635 నంబర్లో సంప్రదించవచ్చునని తెలిపారు.