
అందుకు బాధగా ఉంది!
‘‘ఈ చిత్రం కోసం నేను 18 నెలలు కష్టపడ్డాను. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని సినిమా పూర్తి చేశాం. నిర్మాతలు రాజీపడకుండా తీశారు. సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది. కానీ, ఆ ఘనత మొత్తం శివాజీనే తీసుకుంటున్నారు. అందుకు బాధగా ఉంది’’ అని రేవన్ యాదు చెప్పారు. ఆయన దర్శకత్వంలో శివాజి హీరోగా నటించిన ‘బూచమ్మా బూచోడు’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రేవన్ యాదు మాట్లాడుతూ -‘‘కథ నచ్చి నిర్మాతలను కూడా శివాజీనే సెట్ చేశారు. అయితే ఆయన ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకునేవారు. వాస్తవానికి శివాజి జోక్యం కనుక లేకపోయి ఉంటే.. ఈ చిత్రం 175 రోజులు ఆడేది’’ అన్నారు. తాను పోసాని కృష్ణమురళి దగ్గర రచయితగా చేశానని, గుణశేఖర్ దగ్గర పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో చేశానని చెప్పారు.