
రజనీకాంత్
వేగం పెంచారు రజనీకాంత్. అరవైలలో ఇరవైల దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఒక సినిమా పూర్తి కావడం ఆలస్యం మరో సినిమా సైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ‘దర్బార్’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయింది. అప్పుడే ఈ ప్రాజెక్ట్ తర్వాత చేయబోయే రెండు సినిమాలకు డేట్స్ ఇచ్చేశారట రజనీ.
తనకు ‘ముత్తు, నరసింహ’ వంటి హిట్స్ ఇచ్చిన దర్శకుడు కేయస్ రవికుమార్ డైరెక్షన్లో ఓ మూవీ, ‘చతురంగవైటై్ట, ఖాకీ’ వంటి హిట్స్ ఇచ్చిన దర్శకుడు హెచ్. వినోద్తో మరో సినిమా అంగీకరించారట. ఈ మూడు సినిమాలతో రజనీ డైరీ 2021 వరకూ ఖాళీ ఇల్లే (లేదు). ఈ సినిమాలు పూర్తయిన తర్వాత 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మీద పూర్తిస్థాయిలో దృష్టిపెట్టే ఆలోచనలో రజనీ ఉన్నట్టు తమిళనాడు టాక్. ‘దర్బార్’ 2020 సంక్రాంతికి రిలీజ్.