ar murugadoss
-
శివకార్తికేయన్ కొత్త సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్
శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా టైటిల్ ప్రకటనతో పాటు అదిరిపోయే గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. మావీరన్, అయలాన్, అమరన్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన శివ కార్తికేయన్. ఇప్పుడు మరో భారీ విజయంపై కన్నేశాడు. తన కెరీర్లో 23వ చిత్రాన్ని ఏఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళ అభిమానులకు విపరీతంగా కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రానికి మదరాసి అనే టైటిల్ను మేకర్స్ ఫిక్స్ చేశారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ కూడా పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్లతో ఉంది.మదరాసి చిత్రంలో శివ కార్తికేయన్ పవర్పుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు తెలిసింది. కాగా నటి రుక్మిణి వసంత్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. శ్రీ లక్ష్మి మూవీస్ బ్యానర్పై శ్రీ లక్ష్మి ప్రసాద్, సుందర్రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
సల్మాన్ ఖాన్, మురుగదాస్ యాక్షన్ టీజర్ విడుదల
సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సికందర్’. సల్మాన్ ఖాన్ పుట్టినరోజు కానుకగా ఆ చిత్రం నుంచి తాజాగా టీజర్ను విడుదల చేశారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రానున్న ఈ ప్రాజెక్ట్లో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనుంది. సాజిద్ నడియాడ్ వాలా ఈ సినిమాను నిర్మించనున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా 2025 రంజాన్ కానుకగా విడుదల కానుంది. యానిమల్, పుష్ప వంటి చిత్రాలతో రష్మికకు బాలీవుడ్లో క్రేజ్ పెరిగింది. ఇప్పుడు సికందర్ మూవీ ఆమెకు మరింత పాపులరాటిని తీసుకురావచ్చని చెప్పవచ్చు. -
శివకార్తికేయన్ కొత్త సినిమా విడుదల ఎప్పుడంటే..?
మావీరన్, అయలాన్, అమరన్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన నటుడు శివకార్తికేయన్. అయితే, తాజాగా విడుదలైన అమరన్ మంచి విజయాన్ని సాధించడంతో పాటు, సినీ విమర్శకుల ప్రశంసలను పొందడం విశేషం. కాగా ఈ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న శివకార్తికేయన్ ప్రస్తుతం ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ఈయన నటిస్తున్న 23వ చిత్రం కావడం గమనార్హం. ఇందులో ఆయన పవర్పుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు తెలిసింది. కాగా నటి రుక్మిణి వసంత్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తి అయ్యిందని ఇటీవల ఓ భేటీలో నటుడు శివకార్తికేయన్ తెలిపారు. కాగా ఈ చిత్రంతో పాటు దర్శకుడు ఏఆర్.మురుగదాస్ హిందీలో సల్మాన్ఖాన్ హీరోగా ఒక చిత్రం చేస్తున్నారు. అయితే శివకార్తికేయన్ చిత్రాన్ని ముందుగా పూర్తి చేసి ఆ తరువాత హిందీ చిత్రాన్ని పూర్తి చేయాలని భావించినట్లు తాజా సమాచారం. ఆ విధంగా ఇంకా పేరు నిర్ణయించని శివకార్తికేయన్ చిత్రానికి సింగనై అనే టైటిల్ పేరు ప్రచారంలో ఉంది. కాగా ఈ యాక్షన్ ఎంటర్టెయిన్ కథా చిత్రాన్ని 2025 మే నెలలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజాగా తెలిసింది. కాగా ఈ చిత్రం తరువాత శివకార్తికేయన్ సిబి.చక్రవర్తి దర్శకత్వంలో ఓ చిత్రం, సుధా కొంగర దర్శకత్వంలో పురనానూరు చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారు. -
సికందర్కు సాయం
‘సికందర్’కు సాయం చేయనున్నారట హీరోయిన్ కాజల్ అగర్వాల్. సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ సినిమా ‘సికందర్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ . సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ కీలకపాత్రలుపోషిస్తున్నారు. కాగా ఈ సినిమాలో కాజల్ కూడా ఓ కీలకపాత్రలో నటించనున్నారట. త్వరలోనే ‘సికందర్’ షూటింగ్లో ఆమెపాల్గొంటారని బాలీవుడ్ టాక్. కథ రీత్యా ఈ చిత్రంలో సల్మాన్ కు సాయం చేసేపాత్రలో కాజల్ నటిస్తారట. మరి.. ‘సికందర్’లో కాజల్ భాగమైనట్లేనా? అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. ముంబైలోని ఓ స్టూడియోలో నిర్మించిన భారీ సెట్లో ప్రస్తుతం ‘సికందర్’ చిత్రీకరణ జరుగుతోంది. సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే రంజాన్ సందర్భంగా రిలీజ్ కానుంది. -
సౌత్ సినిమాలో సల్మాన్ !.. ఏ హీరో సినిమాలో అంటే ?
-
సౌత్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్న సల్మాన్ ఖాన్!
బాలీవుడ్ ప్రముఖ నటీనటులు ఇప్పుడు దక్షిణాదిపై దృష్టి సారిస్తున్నారు. జాకీష్రాఫ్, సంజయ్దత్, బాబీ డియోల్ వంటి స్టార్ నటులు దక్షిణాదిలో విలన్గా లేదంటే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా దక్షిణాది తెరపై మెరవబోతున్నట్లు ఓవార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ తమిళ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నట్లు టాక్.దర్శకుడు ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ తన 23వ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రముఖ మలయాళ నటుడు బిజుమీనన్, తుపాకీ చిత్రం ఫేమ్ విద్యుత్ జమ్వాల్ ముఖ్యపాత్రలను పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. రూ.150 కోట్ల భారీ బడ్జెట్తో శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ఖాన్ అతిథి పాత్రలో మెరిసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు ఏఆర్.మురుగదాస్ హిందీలో సల్మాన్ఖాన్ హీరోగా సిఖిందర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆ పరిచయంతోనే సల్లూభాయ్ను తమిళంలో శివకార్తికేయన్తో చేస్తున్న చిత్రంలో అతిథి పాత్రలో నటింపజేస్తున్నట్లు టాక్. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.చదవండి: ‘సత్యభామ’ మూవీ రివ్యూ -
Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
‘పుష్ప’ చిత్రంలో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది రష్మిక. ఆ తర్వాత తన ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టింది. మిషన్ మజ్ను, గుడ్బై లాంటి బాలీవుడ్ సినిమాల్లో నటించినా.. అంతగా గుర్తింపు రాలేదు. కానీ యానిమల్ మూవీ రష్మికకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. అందులో ప్రేమతో హింసించే భర్తకు భార్యగా రష్మిక అద్భుతంగా నటించి, విమర్శకుల ప్రశంసలు పొందింది. యానిమల్ తర్వాత రష్మికకు బాలీవుడ్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో అవకాశం సొంతం చేసుకుంది ఈ నేషనల్ క్రష్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది.‘మీరు ఎన్నో రోజులుగా నా సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీకోసమే ఈ సర్ప్రైజ్. ‘సికందర్’తో మీ ముందుకు వస్తున్నాను. ఇంత గొప్ప ప్రాజెక్ట్లో నటించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా, గౌరవంగా ఉంది’ అని రష్మిక తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో రాసుకొచ్చింది. ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక ‘కుబేర’, ‘రెయిన్ బో’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాల్లో నటిస్తోంది. ఆమె నటించిన పుష్ప 2 చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సల్మాన్ ఖాన్ సికందర్
సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘సికందర్’ టైటిల్ ఖరారైంది. గురువారం (ఏప్రిల్ 11) ఈద్ సందర్భంగా ‘సికందర్’ టైటిల్ను అధికారికంగా ప్రకటించి, టైటిల్ లోగోను కూడా విడుదల చేశారు మేకర్స్. సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్కు రిలీజ్ కానుంది. ‘‘ఈ ఈద్కు ‘బడే మియా చోటే మియా’, ‘మైదాన్’ సినిమాలను థియేటర్స్లో చూడండి. వచ్చే ఈద్కు ‘సికందర్’ వస్తాడు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు సల్మాన్ ఖాన్. -
స్టార్ హీరోతో మురగదాస్ సినిమా.. అధికారికంగా ప్రకటన
సౌత్ ఇండియా టాప్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చాలా రోజుల తర్వాత కొత్త సినిమాను ప్రకటించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తను ఒక చిత్రం నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గజిని, స్టాలిన్, తుపాకి, 7th సెన్స్, స్పైడర్, కత్తి వంటి చిత్రాల ద్వారా సౌత్ ఇండియాలో అగ్రగామి దర్శకుడిగా ఆయనకు గుర్తింపు తెచ్చాయి. బాలీవుడ్లో ఇప్పటికే అమీర్ ఖాన్తో గజనీ చిత్రాన్ని రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టారు. ఆపై సోనాక్షి సిన్హాతో "అకీరా" చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. గతంలో ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్లు అందుకున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో ఆయన నుంచి పెద్దగా సినిమాలు రాలేదు. కానీ కోలీవుడ్ హీరో విజయ్, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో మురగదాస్ సినిమా తీస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవి వర్కౌట్ కాలేదు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్తో సినిమా చేసే చాన్స్ ఆయనకు దక్కింది. ఈ యాక్షన్ చిత్రం కోసం ఎఆర్ మురుగదాస్ చాలా కాలంగా స్క్రీన్ ప్లేపై వర్క్ చేస్తున్నారు. దీని ద్వారా ఏఆర్ మురుగదాస్ కమ్ బ్యాక్ ఇస్తాడని అంతా అనుకుంటున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా సాజిద్ నడియాద్వాలా ఉన్నారు. 2025 రంజాన్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే అజిత్ కుమార్ హీరోగా బిల్లా, ఆరంభం చిత్రాలకు దర్శకత్వం వహించిన విష్ణు వర్ధన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ది బుల్ చిత్రంలో కనిపించనున్నాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ మళ్లీ తమిళ దర్శకుడి సినిమాకు ఓకే చెప్పడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. Glad to join forces with the exceptionally talented, @ARMurugadoss and my friend, #SajidNadiadwala for a very exciting film !! This collaboration is special, and I look forward to this journey with your love and blessings. Releasing EID 2025.@NGEMovies @WardaNadiadwala pic.twitter.com/dv00nbEBU1 — Salman Khan (@BeingSalmanKhan) March 12, 2024 -
మృణాల్ అనుకుంటే రుక్మిణి బంపరాఫర్ పట్టేసింది!
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరి దశ తిరుగుతుందో అస్సలు చెప్పలేం. అలా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ లక్ మారేలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె ప్లానింగ్ చూస్తుంటే అదే అనిపిస్తోంది. తాజాగా ఓ క్రేజీ డైరెక్టర్-హీరో కాంబోతో కలిసి నటించేందుకు ఓకే చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. (ఇదీ చదవండి: రష్మికతో పెళ్లి ఆగిపోవడంపై మాజీ ప్రియుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్) 'సప్త సాగరాలు దాటి' సినిమాతో దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించిన భామ రుక్మిణి వసంత్. గతేడాది రెండు పార్టులుగా రిలీజైన ఈ సినిమాలో రుక్మిణి యాక్టింగ్కి మంచి మార్కులు పడ్డాయి. ఆ వెంటనే తెలుగు నుంచి కూడా బోలెడన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ వేటికి ఓకే చెప్పకుండా ఒక్కో అడుగు ఆచితూచి వేస్తున్నట్లు కనిపిస్తుంది. తాజాగా శివకార్తికేయన్ కొత్త మూవీలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే తొలుత ఈ సినిమాలో పూజాహెగ్డే లేదా మృణాల్ ఠాకుర్ హీరోయిన్లుగా నటిస్తారనే టాక్ వినిపించింది. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా రుక్మిణి బంపరాఫర్ కొట్టేసింది. ఇప్పటికే తమిళంలో విజయ్ సేతుపతి సరసన ఈ బ్యూటీ ఓ సినిమా చేస్తోంది. తెలుగు నుంచి ఆఫర్స్ వస్తున్నా సరే ఏ మాత్రం తొందరపడకుండా మూవీస్ చేయాలని చూస్తోంది. ఈమె ప్లానింగ్ చూస్తున్న నెటిజన్స్.. మరో రష్మిక అవుతుందని మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ రివ్యూ) -
మురుగదాస్ ను పిలిచి సినిమా ఆఫర్ ఇచ్చిన సల్మాన్..?
-
ఖరీదైన కారు కొన్న స్టార్ డైరెక్టర్.. ఏకంగా అన్ని కోట్లా?
స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. గత మూడు నాలుగేళ్లలో దర్శకుడిగా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా తీయని ఇతడు.. ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా ఓ మూవీ తీస్తున్నారు. ఇది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అది అలా ఉండగా ఇప్పుడు ఓ ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అలానే ఈ ఖరు ధర తెలిసి అందరూ షాకవుతున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'సలార్'.. అక్కడ మాత్రం ఇంకా పెండింగ్లోనే) స్టాలిన్, గజిని, తుపాకీ, కత్తి లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో యమ క్రేజ్ తెచ్చుకున్న మురుగదాస్.. 2020లో రజనీకాంత్తో 'దర్బార్' మూవీ తీశాడు. అది ఘోరంగా ఫెయిల్ కావడంతో పూర్తిగా డైరెక్షన్ పక్కనబెట్టేశాడు. నిర్మాతగా రెండు సినిమాలు తీశాడు అవి కూడా ఏమంత పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో అలరించలేకపోయాయి. ప్రస్తుతం శివకార్తికేయన్తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇది ఈ ఏడాది రిలీజ్ కావొచ్చు. ఇకపోతే తాజాగా దాదాపు రూ.1.30 కోట్ల విలువ చేసే బీఎమ్డబ్ల్యూ ఎక్స్ 7 (BMW X7) కారుని కొనుగోలు చేశాడు. షోరూంలో మురుగదాస్ ఫ్యామిలీ అంతా కలిసి తీసుకున్న పిక్స్ వైరల్ అయ్యాయి. అదే టైంలో ఈ కారు ఏకంగా రూ.కోటి కంటే ఎక్కువ కాస్ట్ అని తెలిసి షాకవుతున్నారు. దర్శకుడిగా ఫామ్లో లేనప్పటికీ కాస్ట్ లీ కారు కొన్నాడని మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'గుంటూరు కారం'.. అదే ట్విస్ట్ ఇవ్వబోతున్నారా?) -
చిరంజీవికి హిట్ అందించిన డైరెక్టర్.. కానీ ఇప్పుడేమో!
ఏ రంగంలోనైనా విజయం ఎంత ప్రభావం చూపుతుందో.. అపజయం కూడా అంతే ప్రభావం చూపుతుంది. దీనికి చిన్న ఉదాహరణే దర్శకుడు ఏఆర్ మురుగదాస్. తొలి చిత్రం నుంచి సర్కార్ వరకు వరుసగా ఒకదానికి మించిన ఒకటి హిట్స్ ఇచ్చిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. గజిని చిత్రంతో బాలీవుడ్లోనూ హిట్ కొట్టారు. తెలుగులోనూ చిరంజీవితో స్టాలిన్, మహేష్ బాబుతో స్పైడర్ చిత్రాలు చేశారు. ఇక తమిళంలో రజనీకాంత్ హీరోగా రూపొందించిన దర్బార్ భారీ అంచనాల మధ్య విడుదలైన అపజయం మూటగట్టుకుంది. ఆ చిత్రం ప్లాప్ కావడం ఏఆర్ మురుగదాస్పై గట్టిగానే ప్రభావం చూపింది. ఎంతగా అంటే ఆ తర్వాత ఆయన మరో చిత్రం చేయలేక పోయారు. నటుడు విజయ్కి తుపాకీ, సర్కార్ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన ఏఆర్ మురుగదాస్ ఆయనతో మరో చిత్రం చేయాల్సి ఉండగా విజయ్ ఆసక్తి చూపించలేదు. ఇక ఏఆర్ మురుగదాస్ నిర్మాతగా చేసిన చిత్రాలు తీవ్ర నిరాశ పరిచాయి. దీంతో ఎలాగైనా సక్సెస్ కొట్టి పూర్వ వైభవాన్ని చాటుకోవాలనే పట్టుదలతో దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్నారు. శివకార్తీకేయన్ హీరోగా చిత్రం చేయడానికి ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే కోలీవుడ్లో ఏఆర్ మురుగదాస్కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. వారితో ఇటీవల ఇన్స్ట్రాగామ్లో ఏఆర్ మురుగదాస్ ముచ్చటించారు. ఈ సందర్భంగా మీ కొత్త చిత్రం ఎప్పుడు అన్న అభిమాని ప్రశ్నకు ఒక్క నెల ఓపిక పట్టండి బాస్ అని బదులిచ్చారు. అంటే ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించనున్న చిత్రం ప్రారంభం కానుందని హింట్ ఇచ్చారని భావిస్తున్నారు. -
స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన సీతారామం బ్యూటీ..!
సీతారామం సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్. ఇటీవల తమన్నా, విజయ్ వర్మ కలిసి నటించిన లస్ట్ స్టోరీస్-2లోనూ మెరిసింది. అయితే ప్రస్తుతం తమిళ స్టార్ హీరోతో ఆమె జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మావీరన్(మహావీరుడు) చిత్రంతో హిట్ కొట్టిన శివ కార్తికేయన్కు జంటగా నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. (ఇది చదవండి: నా రూమ్లో సీక్రెట్ కెమెరా పెట్టారు: స్టార్ హీరోయిన్) మావీరన్ సక్సెస్ తర్వాత శివ కార్తికేయన్ మరో చిత్రానికి ఓకే చెప్పేశారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈయన నటించనున్నారు. ఈ చిత్రంలో అతని సరసన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే శివ కార్తికేయన్ ప్రస్తుతం రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై కమలహాసన్ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా కనిపించనుంది. దీనికి రాజ్కుమార్ పెరియ సామి దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో మేజర్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో శివ కార్తికేయన్ మరోసారి పోలీస్ అధికారిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈయన ఇంతకుముందు కాక్కీసట్టై చిత్రంలో పోలీస్ అధికారిగా నటించారు. అదేవిధంగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చివరిగా దర్శకత్వం వహించిన చిత్రం దర్బార్. ఇందులో రజినీకాంత్ పోలీస్ అధికారిగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. (ఇది చదవండి: ఫోటోపై రియాక్ట్ అయిన రేణు దేశాయ్.. వెంటనే తొలగించేసిన రాఘవేంద్ర రావు) ఆ తర్వాత ఏఆర్.మురుగదాస్ చాలా గ్యాప్ తీసుకుని శివ కార్తికేయన్ హీరోగా మరోసారి పోలీస్ కథనే నమ్ముకుని చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఈ చిత్రాన్ని స్పైడర్ చిత్ర నిర్మాతలు నిర్మించనున్నట్లు తెలిసింది. దీనికి అనిరుధ్ సంగీతం అందించినట్లు, షూటింగ్ అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
టాప్ డైరెక్టర్తో శివకార్తికేయన్.. హీరోయిన్గా సీతారామం బ్యూటీ!
కోలీవుడ్లో వేగంగా ఎదిగిన హీరో శివకార్తికేయన్. ప్రారంభంలో కీర్తిసురేష్, ఆనంది వంటి వర్తమాన నటీమణులతో నటించిన ఈయన ఆ తర్వాత హన్సిక, నయనతార వంటి క్రేజీ హీరోయిన్లతో నటించే స్థాయికి ఎదిగారు. అదేవిధంగా శివకార్తికేయన్ ఇప్పటికి హీరోగా 19 చిత్రాలు చేశారు. వాటిలో అధిక భాగం హిట్ చిత్రాలే. ఆ మధ్య డాక్టర్, డాన్ వంటి చిత్రాలు వరుసగా సూపర్ హిట్ అయినా, ఆ తర్వాత వచ్చిన ప్రిన్స్ మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. ప్రస్తుతం అశ్విన్ మడోనా దర్శకత్వంలో మావీరన్ చిత్రంలో నటిస్తున్నారు. అదితిశంకర్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంపై శివకార్తికేయన్ చాలా ఆశలు పెట్టుకున్నారు. తాజాగా కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో సాయిపల్లవి నాయకిగా నటించనున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్పైకి వెళ్లనుంది. అయితే శివకార్తికేయన్ మరో చిత్రానికి కమిట్ అయినట్లు తాజా సమాచారం. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన దర్బార్ చిత్రం తర్వాత ఈ దర్శకుడు మరో చిత్రం చేయలేదు. అదేవిధంగా శివకార్తికేయన్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. దానికి ఇప్పుడు టైమ్ వచ్చినట్లు సమాచారం. ఇకపోతే ఈ మూవీలో శివకార్తికేయన్కు జంటగా మృణాల్ ఠాకూర్ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అమ్మడు తెలుగులో నటించిన సీతారామం చిత్రంతో బాగా పాపులర్ అయిందన్న విషయం తెలిసిందే. ఈమె శివకార్తికేయన్తో జతకట్టే విషయం గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. చదవండి: మెగా ప్రిన్సెస్కు ఘనస్వాగతం.. ఫోటో షేర్ చేసిన ఉపాసన -
అందుకే దర్బార్ ఫ్లాప్ అయింది: ఏఆర్ మురుగదాస్
కోలీవుడ్ టాప్ దర్శకుల్లో ఏఆర్ మురుగదాస్ ఒకరు. అజిత్ కథానాయకుడిగా దీనా చిత్రంతో తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆయన వరుసగా పలు చిత్రాలతో విజయపథంలో కొనసాగుతూ వచ్చారు. అయితే ఏఆర్ మురుగదాస్ను ఒకసారిగా డౌన్ ఫాల్ చేసిన చిత్రం దర్బార్. ఆ చిత్ర కథానాయకుడు రజనీకాంత్. భారీ అంచనాల మధ్య విడుదలైన దర్బార్ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. దీంతో మూడేళ్లుగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మెగా ఫోన్కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. దర్బార్ దెబ్బతో తదుపరి విజయ్ హీరోగా చేయాల్సిన చిత్రం వెనక్కి వెళ్లిపోయింది. కాగా ఇటీవల ఓ భేటీలో రజనీకాంత్ తో చేసిన దర్బార్ చిత్రం ఫ్లాప్ కావడానికి కారణాన్ని సుమారు మూడేళ్ల తర్వాత ఏఆర్ మురుగదాస్ బయటపెట్టారు. రజనీకాంత్ను డైరెక్ట్ చేసే అవకాశం తనకు ఫిబ్రవరి నెలలో వచ్చిందనీ, జూన్ నెల ముంబాయిలో వర్షాల సీజన్ కావడంతో అలా చిత్ర షూటింగును హడావుడిగా పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. ఎందుకంటే ఆగస్టులో రజనీకాంత్ రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు చెప్పారన్నారు. తాను రజనీకాంత్కు వీరాభిమానిని. దీంతో ఆయనతో చిత్రాలు చేసే అవకాశాన్ని ఏ కారణంగాను వదులుకోకూడదని భావించానన్నారు. రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవడంతో ఆ సమయంలో దర్బారే ఆయన చివరి చిత్రం అనే ప్రచారం జరిగిందన్నారు. దీంతో ఫిబ్రవరిలో రజనీకాంత్ చిత్రాన్ని దర్శకత్వం వహించే అవకాశం రావడం మార్చి నెలలో షూటింగ్ ప్రారంభించి జూన్ నెలకంతా చిత్రాన్ని పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీంతో ఎలాగైనా రజనీకాంత్ చిత్రం చేసి హిట్ కొట్టాలని భావించానని, అయితే సరైన ప్రణాళిక లేకపోవడంతో దర్బార్ చిత్రం ఫ్లాప్ అయ్యిందని చెప్పారు. సాధారణంగా షూటింగ్కు ముందు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలకు చాలా సమయం అవసరం అవుతుందన్నారు. అది దర్బార్ చిత్రానికి లేకపోయిందని మురుగదాస్ పేర్కొన్నారు. -
పుష్ప-2 తర్వాత ఆ స్టార్ డైరెక్టర్తోనే బన్నీ సినిమా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ నెక్ట్స్ చేయబోయే సినిమాలు ఏంటన్న దానిపై పలు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురగదాస్తో బన్నీ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరగుతున్నా అధికారికంగా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్న మురగదాస్ ఈ విషయంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఒక డైరెక్టర్ చాలామంది హీరోలతో చర్చలు జరుపుతుంటారు. అలాగే హీరోలు కూడా. ప్రారంభ దశల్లొ ఉన్న ప్రాజెక్ట్ గురించి ఇప్పుడే ప్రకటించలేము. అన్నీ అనుకున్నట్లు జరిగితే తప్పకుండా చెబుతాను' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. -
August 16 1947: ఇది చాలా స్పెషల్ మూవీ
‘‘1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని మనందరికీ తెలుసు. కానీ అడవి మధ్యలో ఉండే ఓ కొండ ప్రాంతంలోని ఓ ఊరు ప్రజలకు ఈ విషయాన్ని ఓ కారణం చేత బ్రిటిష్ అధికారులు చెప్పరు. దీంతో అక్కడి ప్రజలు స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే ఉంటారు. వ్యక్తిగతంగా వారందరికీ ఆగస్టు 16న స్వాతంత్య్రం. అయితే 1947 ఆగస్టు 14, 15, 16.. ఈ మూడు రోజుల్లో ఆ ఊళ్లో ఏం జరిగింది? అనే విషయం ఆసక్తికరం. ఇది చాలా స్పెషల్ మూవీ’’ అన్నారు దర్శక–నిర్మాత ఏఆర్ మురుగదాస్. గౌతమ్ కార్తీక్ హీరోగా ఎన్.ఎస్. పొన్కుమార్ దర్శకత్వంలో రూపొందిన పీరియాడికల్ ఫిల్మ్ ‘ఆగస్టు 16, 1947’. దర్శకుడు ఏఆర్ మురుగదాస్, ఓం ప్రకాష్ భట్, నర్సిరామ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 14న నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో ‘‘ఎప్పటికీ గుర్తుండిపోయే కథ ఇది’’ అన్నారు గౌతమ్ కార్తీక్. ‘‘ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలి’’ అన్నారు పొన్కుమార్. ‘‘ఆగస్టు 16, 1947’ ప్రత్యేకంగా ఉంటుంది. క్లయిమాక్స్ అద్భుతంగా ఉంది. తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత ‘ఠాగూర్’ మధు. -
నా నటనలో రజినీకాంత్ ఛాయలుంటాయి
తమిళ సినిమా: యువ నటుడు గౌతమ్ కార్తీక్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఆగస్టు 16, 1947. ఈ చిత్రం ద్వారా నటి రేవతి కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఏఆర్ మురుగదాస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఓం ప్రకాష్ బట్, నర్శీరామ్ చౌదరితో కలిసి దర్శకుడు ఏఆర్ మురుగదాస్ నిర్మించిన చిత్రం ఇది. ఏఆర్ మురుగదాస్ శిష్యుడు ఎన్ఎస్ పొన్కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందించారు. కాగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక రాయపేటలోని సత్యం థియేటరో సోమవారం రాత్రి నిర్వహించారు. ఇందులో ముఖ్యఅతిథిగా నటుడు శివకార్తికేయన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... తనకు సీనియర్ నటుడు కార్తీక్ అంటే చాలా ఇష్టం అని, ఆయన చాలా స్వీటెస్ట్ పర్సన్ అని పేర్కొన్నారు. అదేవిధంగా గౌతమ్ కార్తీక్ను కలిసిన చాలా కాలం తర్వాత తాను కార్తీక్ను కలిశానని, ఆయన చాలా అందగాడని పేర్కొన్నారు. ఆయన నటనలో ఇతర ఏ నటుల ఛాయలు ఉండవని, అయితే తన నటనలో మాత్రం రజనీకాంత్ చాయలు ఉంటాయని శివకార్తికేయన్ పేర్కొన్నారు. కాగా తన పయనం దర్శకుడు ఏఆర్ మురుగదాస్తో ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రంతోనే మొదలైంది అన్నారు. అది ఏఆర్ మురుగదాస్కు నిర్మాతగా తొలి చిత్రమని తెలిపారు. ఆ చిత్ర ప్రారంభోత్సవానికి తాను వ్యాఖ్యాతగా వ్యవహరించానన్నారు. ఆ తర్వాత ఆయన నిర్మించిన మాన్ కరాటే చిత్రంలో తాను కథానాయకుడిగా నటించానని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ ఆయన నిర్మించిన ఈ చిత్రానికి తాను అతిథిగా విచ్చేశానని అదేవిధంగా త్వరలో మరో ఇంపార్టెంట్ స్టెప్పును వేయబోతున్నట్లు చెప్పారు. అది త్వరలోనే జరుగుతుందని అన్నారు. కాగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ఓ భారీ చిత్రం తెరకెక్కనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. -
శివ కార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో సినిమా?
తమిళ సినిమా: ఏ రంగంలోనైనా, ఎవరికైనా గ్యాప్ రావడం అనేది సహజం. అలాంటి వారు మళ్లీ టైం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. తొలి చిత్రంతో మంచి విజయం సాధించిన ఈ దర్శకుడు ఆ తర్వాత విజయకాంత్తో రమణ, సూర్య కథానాయకుడిగా గజిని వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్గా వెలుగొందారు. విజయ్ హీరోగా కత్తి, తుపాకీ, సర్కార్ వంటి విజయవంతమైన చిత్రాలకీ దర్శకత్వం వహాంచిన మురుగదాస్ చివరిగా రజనీకాంత్ కథానాయకుడిగా దర్బార్ చిత్రం చేశారు. అది ఆశించిన విజయాన్ని సాధించలేదు. అంతే మురుగదాస్ ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. విజయ్ 65వ చిత్రానికి ఈయన దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే ఏమైనా అది జరగలేదు దర్బార్ తర్వాత మురుగదాస్ ఇప్పటి వరకు ఏ చిత్రం చేయలేదు. ఇటీవల త్రిష కథానాయక నటించిన రాంకీ చిత్రానికి కథను అందించారు. ఈయన మళ్లీ ఎప్పుడు దర్శకత్వం వహిస్తారా..? అన్న ప్రశ్నకు తాజాగా సమాధానం వచ్చినట్లు కోలీవుడ్ వర్గాల తాజా సమాచారం. ఏఆర్ మురుగదాస్ నటుడు శివ కార్తికేయన్ కాంబోలో ఒక చిత్రం తెరకెక్కనుందనే ప్రచారం సాగుతోంది. దీన్ని లైట్ హౌస్ మూవీస్ సంస్థ నిర్మించినట్లు టాక్. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలుపడాల్సి ఉంది. కాగా ప్రస్తుతం అయిలాన్ చిత్రాన్ని పూరి చేసి మావీరన్ చిత్రంలో నటిస్తున్నారు. -
రిలీజ్కు రెడీ అయిన త్రిష లేడీ ఓరియెంటెండ్ సినిమా
తమిళసినిమా: నటి త్రిష నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం రాంగీ. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కథను అందించిన ఈ చిత్రానికి ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రం ఫేమ్ ఎం.శరవణన్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి సి.సత్య సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రాంగీ చిత్రం ఈనెల 30వ తేదీ తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. నిజానికి ఈ చిత్రం గత ఏడాదే తెరపైకి రావాల్సి ఉంది. సెన్సార్ సమస్యల కారణంగా చిత్రం విడుదల వాయిదా పడింది. మొత్తం మీద రివైజింగ్ కమిటీకి వెళ్లి సుమారు 30కి పైగా కట్స్తో బయటపడి ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. చిత్ర వివరాలు దర్శకుడు తెలుపుతూ నటి త్రిషను దృష్టిలో పెట్టుకుని రాసిన కథ ఇది అని చెప్పారు. కథ నచ్చడంతో త్రిష ఇందులో నటించడానికి అంగీకరించారని తెలిపారు. ఇది యాక్షన్తో కూడిన విభిన్న కథా చిత్రం అని పేర్కొన్నారు. ఫ్యామిలీ, కామెడీ, సెంటిమెంట్ యాక్షన్ వంటి అంశాలతో కూడిన మాస్ ఎంటర్టైనర్గా ఉంటుందని తెలిపారు. త్రిష యాక్షన్ సన్నివేశాల్లో నటించారని చెప్పారు. ఒక విలేకరి అయిన ఆమె తన అన్నయ్య కూతురికి ఏర్పడిన సమస్యను పరిష్కరించడానికి రంగంలోకి దిగుతుందన్నారు. ఆ సమస్య పరిష్కారం అయిన రాంగి చిత్ర కథ విదేశాల వరకు వెళుతుందన్నారు. దీంతో చిత్రం సగభాగం ఉజ్బెకిస్తాన్లో చిత్రీకరింనట్లు చెప్పారు. చిత్ర విడుదల ఆలస్యం అవుతుండడంతో సెన్సార్ బోర్డ్ సభ్యులు అడిగిన కట్స్కు ఓకే చెప్పినట్లు తెలిపారు. చిత్రంలో పార్లర్గా కుటుంబ కథా సన్నివేశాలు చోటు చేసుకుంటాయని చెప్పారు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్, నటి త్రిష చిత్రాన్ని చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యారని తెలిపారు. -
సూర్య గజిని సీక్వెల్కు సిద్ధం?
తమిళ సినిమా: నటుడు సూర్య దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం గజిని. 2008లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. అంతేకాకుండా సూర్య కెరియర్లో మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రాన్ని ఏఆర్ మురుదాస్ అమీర్ ఖాన్ హీరోగా హిందీలోనూ తెరకెక్కించి హిట్ కొట్టారు. ఆ తర్వాత సూర్య, ఏఆర్. మురుగదాస్లో కాంబినేషన్లో రూపొందిన ఏళామ్ అరివు చిత్రం 2011లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. చదవండి: తల్లిదండ్రులైన మరుసటి రోజే నయన్ దంపతులకు షాక్! ఆ తర్వాత వీరి కాంబినేషన్లో చిత్రం రాలేదు. ఏఆర్ ముగురుదాస్ చివరిగా రజనీకాంత్ కథానాయకుడిగా దర్బార్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత విజయ్ కథానాయకుడిగా తుపాకీ- 2 చిత్రాన్ని ఏఆర్.మురుగదాస్ తెర్కెక్కించబోతున్నట్టు ప్రచారం జరిగినా అది ఆచరణలోకి రాలేదు. దీంతో ఏఆర్.మురుగదాస్ తదుపరి చిత్రం ఏమిటి అన్నది ఆసక్తిగా మారింది. ఈయన చిత్రం చేసి చాలా కాలమే అయ్యింది. చదవండి: ‘గాడ్ఫాదర్’పై సూపర్ స్టార్ రజనీ రివ్యూ.. ఏమన్నారంటే కాగా తాజాగా సూర్యతో మరోసారి సినిమా చేయడానికి ఈయన సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. వీరిద్దరి కాంబినేషన్లో ఘనవిజయం సాధించిన గజిని చిత్రానికి సీక్వెల్ కోసం మురుగదాస్ కథను సిద్ధం చేసినట్లు తెలిసింది. అలాగే ఇందులో నటించే విషయమై సూర్యతో సంప్రదింపులు జరుపుతున్న ట్లు సమాచారం. అయితే ఇందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక నటుడు సూర్య చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. -
'కడలి' హీరోతో మురగదాస్ సినిమా.. టీజర్ విడుదల
ఏఆర్ మురుగదాస్కు దర్శకుడిగా చిన్న గ్యాప్ వచ్చింది. రజనీకాంత్ హీరోగా ఈయన చేసిన దర్బార్ చిత్రం తరువాత మరో చిత్రం చేయలేదు. విజయ్తో ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత బాలీవుడ్ చిత్రం చేయబోతున్నట్లు గుసగుసలు వినిపించాయి. అయితే దీనికి సంబంధించిన అధికార ప్రకటన రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏఆర్ మురుగదాస్ చిత్ర నిర్మాణాన్ని పునః ప్రారంభించారు. పీపుల్ బుల్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి 1947 ఆగస్టు 16 అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ను విడుదల చేశారు. గౌతమ్ కార్తీక్, రేవతి జంటగా నటిస్తున్న ఈ చిత్రం స్వాతంత్య్ర పోరాట కాలంలో ఒక గ్రామీణ యువకుడు బ్రిటీష సైన్యంతో పోరాడే ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రం అని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. భావోద్వేగాలతో కూడిన సంఘటనలతో, ప్రేమను కలిపిన ఎంటర్టైన్మెంట్ కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సలహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
27 ఏళ్ల తర్వాత పూర్తి పాత్రల్లో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ !..
ఖాన్ త్రయం (సల్మాన్, షారుక్, ఆమిర్) కలిసి సినిమా చేస్తే.. ఫ్యాన్స్ తీన్ మార్ డ్యాన్స్ వేయడం ఖాయం. అలాంటి ఓ ప్రాజెక్ట్కి సన్నాహాలు జరుగుతున్నాయట. ఖాన్ త్రయం కాంబినేషన్లో సౌత్ డైరెక్టర్ ఏఆర్ మురుగ దాస్ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఆ విశేషాల్లోకి వెళదాం. గజిని, తుపాకీ, కత్తి, సర్కార్.. ఇలా తమిళంలో మురుగదాస్ భారీ చిత్రాలనే తెరకెక్కించారు. ఆయన ఇచ్చిన భారీ హిట్స్లో ఈ నాలుగుతో పాటు మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. ‘గజిని’ చిత్రాన్ని హిందీలో ఆమిర్ ఖాన్తో తెరకెక్కించి, బాలీవుడ్లోనూ హిట్ సాధించారు మురుగదాస్. ఆ తర్వాత హిందీలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా సల్మాన్, షారుక్లతో ఓ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారట. ‘గజిని’ ద్వారా ఆమిర్తో ఏర్పడిన అనుబంధంతో ఈ విషయాన్ని ఆయనకు చెప్పారట మురుగదాస్. దాంతో షారుక్, సల్మాన్లను మురుగదాస్ కలిసే ఏర్పాటు ఆమిర్ చేశారని బాలీవుడ్ టాక్. ఇద్దరు ఖాన్లకు మురుగదాస్ స్టోరీ లైన్ చెబితే, నచ్చి, కథ డెవలప్ చేయమన్నారని భోగట్టా.. 27 ఏళ్ల తర్వాత.. 1995లో వచ్చిన ‘కరణ్ – అర్జున్’లో సల్మాన్, షారుక్ హీరోలుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ అలరించింది. అప్పటినుంచి ఈ ఇద్దరూ మళ్లీ కలిసి సినిమా చేస్తే బాగుండు అని కోరుకుంటున్నవాళ్లు లేకపోలేదు. అయితే మధ్యలో మనస్పర్థల వల్ల ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తొలగిపోయి, ఒకరి సినిమాలో మరొకరు అతిథి పాత్రలు చేస్తున్నారు. సెట్స్లో ఉన్న సల్మాన్ ‘టైగర్ 3’లో షారుక్ అతిథిగా, షారుక్ ‘పఠాన్’లో సల్మాన్ గెస్ట్గా కనిపించనున్నారు. అయితే ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్స్లో సినిమా అంటే ఫ్యాన్స్కి పండగే. ‘కరణ్ – అర్జున్’ రిలీజైన 27 ఏళ్లకు సల్మాన్, షారుక్ చేసే సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. ఆమిర్ ఖాన్కి ఈ చిత్రంలో ఓ ప్రత్యేకమైన పాత్ర రాస్తున్నారట మురుగదాస్. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా ఆరంభమవుతుందని బాలీవుడ్ అంటోంది. -
బాలీవుడ్ స్టార్ హీరోలతో మురుగదాస్ కొత్త చిత్రం?
స్టార్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రజినీకాంత్తో చేసిన దర్బార్ చిత్రం నిరాశపరచింది. దీంతో ఆయనకు అవకాశాలు సన్నగిల్లాయి. ఆ మధ్య విజయ్ హీరోగా చిత్రం చేయబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే విజయ్ ఆయనకు చాన్స్ ఇవ్వడానికి సముఖంగా లేరని తెలిసింది. అదే విధంగా తెలుగులో ఒకరిద్దరు హీరోలతో చిత్రాలు చేయన్నట్లు ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇవి కార్యరూపం దాల్చలేదు. ఈనేపథ్యంలో మురుగదాస్ తదుపరి చిత్రం ఏమిటనేది..? సినీ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈయన బాలీవుడ్లో ఇద్దరు స్టార్ హీరోలతో చిత్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏఆర్ మురుగదాస్ ఇంతకుముందే గజిని చిత్రంతో బాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. కాగా తాజాగా సల్మాన్ఖాన్, షారూక్ఖాన్ హీరోలుగా హిందీలో మల్టీస్టార్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 1995లో కరణ్ అర్జున్ అనే చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రలో మెరిశారు. అయితే పూర్తిస్థాయి చిత్రాన్ని మాత్రం ఇప్పటి వరకు చేయలేదు. దీంతో మురుగదాస్ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. -
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్.. ఇప్పుడు ఏ హీరో డేట్స్ ఇవ్వడం లేదు!
ఒకప్పుడు సౌత్ లోనే టాప్ డైరెక్టర్ మురుగదాస్.ఆ మాటకు వస్తే బాలీవుడ్ లోనూ అతని పేరు బాగా వినిపించింది. సోషల్ ఇష్యూస్ ను తనదైన పంధా డీల్ చేస్తూ, మురుగదాస్ తీసే సినిమాలు అతన్ని ప్రత్యేకమైన దర్శకుడిగా నిలబెట్టాయి.కాని ఇదంతా గతం.ఇప్పుడు మురుగదాస్ చేతిలో సినిమాలే లేవు. రెండేళ్ల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్తో తెరకెక్కించిన దర్బార్ ప్లాఫ్ అవ్వడంతో మురుగదాస్కు అవకాశాలు దగ్గాయి. ఇతనితో సినిమాలు చేసేందుకుహీరోలెవరూ ముందుకు రావడం లేదట. దర్బార్ తర్వాత విజయ్ తో సినిమా తీయాల్సింది. కానీ దర్బార్ రిజల్ట్ చూసిన తర్వాత విజయ్ ఈ డైరెక్టర్ ను దూరం పెట్టాడు. దాంతో మురగదాస్ ఆ తర్వాత బన్ని కోసం స్టోరీ రాస్తున్నాడని టాక్ వినిపిచింది. కాని ఐకాన్ స్టార్ పుష్ప సిరీస్ తో బిజీ కావడంతో ఇప్పుడు మురుగదాస్ మరో హీరో డేట్స్ కోసం ట్రై చేయడం మొదలుపెట్టాడు. రెండేళ్ల తర్వాత మురగదాస్ ను నమ్మి సినిమా చేసేందుకు ఓ స్టార్ హీరో డేట్స్ ఇచ్చాడట. ఆ హీరో మరెవరోకాదు చియాన్ విక్రమ్. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాను నిర్మించేందుకు సన్ పిక్చర్స్ ప్రయత్నిస్తోందట. రీసెంట్ గా ప్రైమ్ లో రిలీజైన మహాన్ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు చియాన్.మురుగదాస్ మూవీతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అందుకోవాలనుకుంటున్నాడట.ఈ చిత్రంతోనైనా మురుగదాస్ గతవైభవాన్ని అందుకుంటాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. (చదవండి: జోరు మీదున్న హీరోలు, రీమేక్ అంటే మరింత హుషారు) -
మహేశ్-కమల్తో క్రియేటివ్ డైరెక్టర్ భారీ ప్రాజెక్ట్!
ఈ మధ్యకాలంలో పరిశ్రమతో సంబంధంగా లేకుండా స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోల కాంబినేషన్లు సెట్ అవుతున్నాయి. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పటికే ప్రభాస్తో సలార్ మూవీ తెరకెక్కిస్తుండగా, ఇక సెన్సెషనల్ దర్శకుడు శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో ఓ పాన్ ఇండియా మూవీ తీయబోతున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా మరో క్రేజీ కాంబినేషన్ రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు, విలక్షణ నటుడు కమల్ హాసన్లతో క్రియేటివ్ డైరెక్టర్ ఏఆర్ మురుగుదాస్ ఓ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్కు సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీకి స్టోరీ లైన్ కూడా సిద్ధమైందని సమాచారం. మహేశ్ ఇందులో సీబీఐ ఆఫీసర్గా కనిపించబోతుండగా, కమల్ హాసన్ ఓ యువతి తండ్రి పాత్రలో కనిపిస్తాడని వినికిడి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియాలి అంటే దీనిపై డైరెక్టర్ స్పందించేవరకు వేచి చూడాలి. కాగా ఇప్పటికే మురుగుదాస్ గతంలో మహేశ్తో స్పైడర్ చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కమర్షియల్స్గా అంతగా సక్సెస్ అందుకోలేదు. -
కాంబినేషన్ కుదిరేనా?
ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సినిమా చేయనున్న దర్శకుడి పేరు ఇదేనంటూ ఇప్పటికే కొంతమంది పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రశాంత్ నీల్, అనిల్æరావిపూడి వంటి దర్శకుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ పేరు తెరపైకి వచ్చింది. ఈ కాంబినేషన్ దాదాపు కుదిరినట్లేనని టాక్. ఇదిలా ఉంటే.. దర్శకుడు వేణు శ్రీరామ్తో అల్లు అర్జున్ ‘ఐకాన్: కనపడుటలేదు’ సినిమా కమిటయ్యారు. అలాగే కొరటాల శివతో ఓ సినిమా ఫిక్స్ అయింది. మరి... ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేస్తారో చూడాలి. -
మురుగదాస్ పాన్ ఇండియా మూవీ టెటిల్ ఇదే
సామాజిక అంశాలతో కూడిన సినిమాలను తీసేందుకు ఏఆర్ మురుగదాస్ రెడీగా ఉంటారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘స్టాలిన్ , తుపాకి, కత్తి, సర్కార్’ వంటి సినిమాలే ఇందుకు నిదర్శనం. తాజాగా ‘1947’ అనే టైటిల్తో సినిమాను ప్రకటించారు మురుగదాస్. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని హిందీ నిర్మాత ఓం ప్రకాశ్భట్ నిర్మిస్తారు. ఇప్పటివరకు అయితే ఈ సినిమా బ్యాక్డ్రాప్ ఏంటి? నటీనటులు ఎవరు? అనే అంశాలపై స్పష్టత రాలేదు. అయితే టైటిల్ను బట్టి ఈ సినిమా చారిత్రక నేపథ్యంలో ఉంటుందని ఊహించవచ్చు. -
పదేళ్లకు జోడీ కుదిరింది
పదేళ్ల క్రితం విజయ్–తమన్నా జంటగా ‘సుర’ అనే తమిళ చిత్రంలో నటించారు. మంచి మాస్ మసాలా ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ ఇద్దరూ జంటగా సినిమా చేయలేదు. పదేళ్ల తర్వాత ఈ జోడీ ఒక సినిమాకి కుదిరిందని సమాచారం. హీరో విజయ్కి ‘తుపాకి’, ‘కత్తి’, ‘సర్కార్’ వంటి హ్యాట్రిక్ విజయాలను అందించిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇది విజయ్కి 65వ సినిమా కావడం, మురుగదాస్–విజయ్ కాంబినేషన్లో రూపొందే చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్లోనే విజయ్ సరసన తమన్నా కథానాయికగా నటించనున్నారని తెలిసింది. ‘సర్కార్’ సినిమాను తెరకెక్కించిన సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, కెమెరా: సంతోష్ శివన్. -
ఆ దర్శకుడితో విజయ్ నాలుగో సినిమా!
చెన్నై : తమిళ హీరో దళపతి విజయ్.. దర్శకుడు మురుగదాస్ కలిసి మరో సినిమా చేయనున్నట్లు కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్.. లోకేశ్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్న మాస్టర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్కు 64వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్గా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్లో విడుదలవ్వాల్సి ఉంది. కాగా మాస్టర్ తర్వాత విజయ్ ఎవరి దర్శకత్వంలో నటించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తొలుత సుధా కొంగర, అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రచారాలు జరిగాయి. (ఆ స్టార్ ప్రేమజంట పెళ్లి వాయిదా!) తాజా వివరాల ప్రకారం.. విజయ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను ఏఆర్ మురుగదాస్ దర్వకత్వంలో చేయనున్నారని తెలుస్తోంది. అంతేగాక ఇది 2012లో వచ్చిన బ్లాక్ బాస్టర్ సినిమాకు సినిమాకు సీక్వెల్గా తీయనున్నట్లు సమాచారం. ఇక తుపాకీలో హీరోయిన్ పాత్ర పోషించిన కాజల్ అగర్వాల్నే ఈ సినిమాలోనూ తీసుకొంటున్నట్లు తెలుస్తోంది. ఆగష్టులో సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇటీవలే మురుగదాస్ రెండు కథలతో విజయ్ను సంప్రదించినట్లు, అందులో ఒకటి తుపాకీ సీక్వెల్ అవ్వగా.. విజయ్ దీనికే మొగ్గు చూపినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్పి ఉంది. కాగా విజయ్, మురుగదాస్ దర్వకత్వంలో ఇప్పటికే మూడు సినిమాలు(తుపాకీ,కత్తి, సర్కార్) విడుదలయ్యాయి. (దర్శకుడి ఇంట్లోకి వారసుడు.. పేరేంటో తెలుసా!) నమస్కారం చేద్దాం: చిరంజీవి -
నాలుగోసారి...
కొన్ని కాంబినేషన్స్ చాలా క్రేజీగా ఉంటాయి. అలాంటి కాంబినేషన్స్లో సినిమాలు మళ్లీ మళ్లీ రావాలనుకుంటారు ప్రేక్షకులు. తమిళ హీరో విజయ్–దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్లది అలాంటి కాంబినేషనే. ఈ ఇద్దరి కాంబోలో ‘తుపాకి’, ‘కత్తి’, ‘సర్కార్’ సినిమాలు విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు నమోదు చేశాయి. ఈ మూడూ పక్కా కమర్షియల్ సినిమాలు. కానీ సందేశం కూడా ఉండేట్లుగా చూసుకున్నారు విజయ్, మురుగదాస్. ఈ క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా రానుందట. ‘సర్కార్’ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. విజయ్ నటించనున్న 65వ చిత్రమిది. ప్రస్తుతం విజయ్ హీరోగా నటించిన ‘మాస్టర్’ చిత్రం ఆడియో వేడుకను చిత్రబృందం సమక్షంలో జరపాలనుకుంటున్నారు. కరోనా కారణంగా భారీ వేడుక రిస్క్ అని యూనిట్ భావించింది. మోహన్రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతానికి సినిమా థియేటర్లు మూతపడ్డాయి. షూటింగ్లు ఆగాయి. ఏప్రిల్నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో? మరి ‘మాస్టర్’ చెప్పిన ప్రకారం ఏప్రిల్ 9న వస్తాడా? వాయిదా పడతాడా? చూడాలి. -
‘దర్బార్’ డిస్ట్రిబ్యూటర్ల నిరాహార దీక్ష!
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ సినిమాతో దాదాపు రూ.70 కోట్లు నష్టపోయామని పంపిణీదారులు తెలిపారు. దీంతో ఈ చిత్ర పంపిణీదారులు హీరో రజనీకాంత్ను కలవడానికి చెన్నైలోని ఆయన ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు ఆయనను కలవకుండా వారిని అడ్డుకోవడంతో నిరాహార దీక్ష చేయాలని పంపిణీదారులు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత శనివారం తాము రజనీకాంత్ను కలిసేందుకు చెన్నైలోని ఆయన ఇంటికి వెళ్లామని చెప్పారు. ఇంటి సమీపంలోకి వెళ్లగానే పోలీసులు లోపలికి వెళ్లకుండా తమను అడ్డుకున్నారని, రజనీకాంత్ కూడా తమను కలవడాని ఇష్టపడలేదని చెప్పారు. దీంతో తాము నిరాశకు గురయ్యామన్నారు. ఈ క్రమంలో నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్లు పంపిణీదారులు తెలిపారు. కాగా గతంలో రజనీ నటించిన లింగా చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కూడా రజనీ ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. దర్బార్ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు నష్టమా? కాగా రూ. 200 కోట్లతో నిర్మించిన దర్బార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్లు వసూలు చేసినప్పటికీ భారీ డిజాస్టర్గా నిలిచి పంపిణి దారులకు నష్టాన్నిచ్చింది. అయితే ఈ సినిమాకు రజనీ రూ. 108 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. దర్శకుడు ఎఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీసు ఆఫీసర్గా కనిపించారు. ఇక గజిని, కత్తి వంటి సూపర్ హిట్లను అందించిన మురుగుదాస్.. రజనీతో తీసిన మొదటి సినిమా ఇది. -
దర్బార్ చిత్రంలో నయనతార పాత్ర దారుణం
అగ్రనటి నయనతార మరోసారి వార్తల్లోకెక్కింది. సంచలన నటిగానే కాదు లేడీ సూపర్స్టార్గా వెలిగిపోతున్న నటి నయనతార. లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో నటిస్తూ వాటి భారాన్నంతా తన భుజాలపైనే వేసుకుని విజయాల తీరం చేర్చుతున్న సత్తా కలిగిన నటి ఈ బ్యూటీ. అలాగని స్టార్ హీరోల చిత్రాలను పక్కన పెట్టడం లేదు. అయితే ఇలాంటి చిత్రాలతోనే ఈ అమ్మడు అభిమానుల నుంచి విమర్శలను ఎదుర్కొంటోంది. మొన్న విజయ్తో, అటు మొన్న తెలుగులో చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాల్లోనూ నయనతార పాత్ర నామమాత్రంగానే ఉందనే విమర్శలు వచ్చాయి. ఇకపోతే ఇటీవల రజనీకాంత్కు జంటగా నటించిన దర్బార్ చిత్రంలో నయనతార పాత్ర ఇంకా దారుణం అనే విమర్శలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అందులో రజనీకాంత్కు కూతురుగా నటించిన నివేదా థామస్కు ఉన్న ప్రాముఖ్యతను కూడా నయనతారకు ఇవ్వలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాదు దర్బార్ చిత్రంలో ఒక జూనియర్ ఆర్టిస్ట్లా చూపించారనే ఆరోపణలు ఎక్కు పెడుతున్నారు. హీరోయిన్ సెంట్రిక్ కథా పాత్రల్లో నటిస్తూ తన ప్రతిభను నిరూపించుకుంటున్న నయనతార అసలు ఇలాంటి చిత్రాలను ఎందుకు ఒప్పుకోవాలనే ప్రశ్నలను అభిమానులు సంధిస్తున్నారు. ఇవి నయనతార దృష్టికి వచ్చింది. చదవండి: విఘ్నేశ్తో నయన్ తెగతెంపులు? ఇప్పటికే దర్బార్ చిత్రంలో ఆ చిత్ర దర్శకుడు ఏఆర్.మురుగదాస్ తన పాత్రకు ప్రాధాన్యత ఇవ్వలేదన్న ఆసంతృప్తితో ఉన్న నయనతార ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో అభిమానుల విమర్శలకు మరింత అశాంతికి గురవుతున్నట్లు సమాచారం. నిజానికి దర్శకుడు ఏఆర్.మురుగదాస్తో నయనతారకు చాలా కాలంగా కోల్డ్ వార్ జరుగుతోంది. గజని చిత్ర సమయంలోనే తన పాత్రను కట్ చేసి నటి ఆసిన్కు ప్రాధాన్యతనిచ్చారని విమర్శించింది. అంతే కాదు తాను చేసిన పెద్ద తప్పు గజని చిత్రంలో నటించడమేనని ఆ మధ్య పేర్కొంది. అలాంటిది దాదాపు 12 ఏళ్ల తరువాత ఇటీవల ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలోనూ నయనతారకు అన్యాయం జరిగిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో మరోసారి నయనతార ఏఆర్.మురుగదాస్పై అసంతృప్తితో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు మూక్కూత్తి అమ్మన్, నెట్రికన్ చిత్రాల్లో నటిస్తోంది.ఈ రెండు చిత్రాలు కథానాయకికి ప్రాముఖ్యత కలిగిన కథా చిత్రాలే అన్నది గమనార్హం. -
దుమ్ము దులుపుతున్న ‘దర్బార్’
రజనీకాంత్ సినిమా అంటేనే అటు సినీ ఇండీస్ట్రీకి ఇటు ఆయన ఫ్యాన్స్కు పెద్ద పండగ. రజనీ సినిమా ప్రారంభం నుంచి విడుదలైన తర్వాత వచ్చే టాక్ వరకూ తలైవా ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇక సినిమాపై కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా వాళ్ల జోరు మామూలుగా ఉండదు. అలాంటిది హిట్ టాక్ వస్తే ఇక ఏ రేంజ్లో వారి ఆనందం ఉంటుందో ఊహించుకోగలరు. ప్రస్తుతం ‘దర్బార్’ఫలితంతో ఆయన ఫ్యాన్స్ రెండు పండుగలు చేసుకుంటున్నారు. రజనీకాంత్ హీరోగా కోలీవుడ్ అగ్ర దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’ . సంక్రాంతి కానుకగా ఈ నెల 9న(గురువారం) విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు వేల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్తో దూసుకపోతోంది. అంతేకాకుండా వసూళ్ల పరంగానూ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. చాలాకాలం తర్వాత పోలీస్ గెటప్లో కనిసిస్తుండటం, మురగదాస్ దర్శకత్వం వహిస్తుండటం, టీజర్, ట్రైలర్, పాటలు ఓ రెంజ్లో ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ భారీ అంచానల నడుమ విడుదలై ఈ సినిమాకు తొలి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మొదటి రోజే ఏకంగా రూ. 36 కోట్ల వరకు వసూలు చేసింది. కేవలం తమిళనాటనే దాదాపు రూ. 19 కోట్ల వరకు ఈ సినిమా వసూలు చేసిందంటే కోలీవుడ్లో రజనీ స్టామినా ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది. ఇక కేవలం దక్షిణాదినే కాకుండా బాలీవుడ్, ఓవర్సీస్లోనూ రజనీకి మంచి పట్టు ఉండటంతో అక్కడ కూడా ‘దర్బార్’భారీ వసూళ్లు రాబడుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే ‘దర్బార్’ రూ. 50 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఇక ఈ చిత్రం రెండో రోజు కూడా తన జోరును కొనసాగించింది. బాలీవుడ్లో తానాజీ, ఛపాక్ చిత్రాలు విడుదలైనప్పటికీ ‘దర్బార్’జోరు, హుషారు ఏమాత్రం తగ్గలేదు. ఆ చిత్రాలకు ధీటుగా పోటీనిస్తూ కలెక్షన్ల ప్రవాహాన్ని కొనసాగించింది. అదేవిధంగా శుక్రవారం తెలుగులో మరే సినిమా లేకపోవడం దర్బార్కు మరింత కలిసొచ్చింది. రెండో రోజు కూడా దాదాపు రూ. 50 కోట్ల పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఓవరాల్గా సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే రజనీ దర్బార్ రూ. 100 కోట్ల మార్క్ దాటిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఏదేమైనప్పటికీ ‘రజనీ దర్బార్’బాక్సాఫీస్ వద్ద హిస్టరీ క్రియేట్ చేయబోతోందని అతడి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. నయనతార, నివేదా థామస్, సునీల్ శెట్టి, యోగిబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతమందించాడు. చదవండి: దర్బార్ : మూవీ రివ్యూ అమితాబ్ సూచనను పాటించలేకపోతున్నా -
దర్బార్ : మూవీ రివ్యూ
టైటిల్: దర్బార్ జానర్: యాక్షన్ ఎంటర్టైనర్ నటీనటులు: రజనీకాంత్, నయనతార, నివేదా థామస్, యోగిబాబు, సునీల్ శెట్టి, సంగీతం: అనిరుద్ కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: ఏఆర్ మురుగదాస్ బ్యానర్: లైకా ప్రొడక్షన్ సూపర్స్టార్ రజనీకాంత్ తనదైన స్టైల్లో బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సంబరాలను ప్రారంభించాడు. దర్బార్ సినిమాతో బాక్సాఫీస్ బరిలో పందెంకోడిలా దూకాడు. ఇది డబ్బింగ్ సినిమా అయినా.. తెలుగులో రజనీకాంత్కు ఉన్నఛరిష్మా, స్టామినాను చూసుకుంటే పెద్ద సినిమాగానే పరిగణించాలి. గతంలో కబాలి, కాలా, 2.0, పెట్టా వంటి సినిమాలతో తెలుగువారిని పలుకరించిన ఈ సూపర్స్టార్ తన స్టామినాకు తగ్గ హిట్ను అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో స్టార్ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తొలిసారి రజనీకాంత్ నటిస్తున్న సినిమా కావడం.. సంక్రాంతి బరిలో దిగుతుండటంతో ‘దర్బార్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు రజనీ సరసన నయనతార నటిస్తుండటం.. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లో ఆదిత్య అరుణాచలంగా రజనీ తనదైన లుక్స్తో మెస్మరైజ్ చేయడం సినిమాపై అంచనాలను పెంచింది. సంక్రాంత్రి కానుకగా తాజాగా ప్రేక్షకుల ముందుకు ‘దర్బార్’ ఏమేరకు ప్రేక్షకుల మెప్పించిందో తెలుసుకుందాం పదండి... కథ: ముంబై పోలీసు కమిషనర్ అయిన ఆదిత్య అరుణాచలం (రజనీకాంత్) ఒక్కసారిగా ఆవేశానికిలోనై.. రౌడీలను, గ్యాంగ్స్టర్లను విచ్చలవిడిగా కాల్చిచంపుతుంటాడు. అతని ఎన్కౌంటర్లపై విచారణ జరపడానికి వచ్చిన మానవహక్కుల కమిషన్ సభ్యులను కూడా బెదిరిస్తాడు. ఏదైనా పని చేపడితే.. దానిని కంప్లీట్గా క్లీన్ చేసే వరకు వదిలిపెట్టని ఆదిత్య అరుణాచలం ముంబైలో డ్రగ్స్, హ్యుమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్లను ఏరివేసే క్రమంలో కిరాతకుడైన విక్కీ మల్హోత్రా కొడుకు అజయ్ మల్హోత్రాను అరెస్టు చేస్తాడు. ఆదిత్య అరుణాచలం వ్యూహాలతో అనూహ్య పరిస్థితుల నడుమ జైల్లోనే అజయ్ హతమవ్వాల్సి వస్తోంది. దీంతో డ్రగ్లార్డ్, మొబ్స్టర్ అయిన హరిచోప్రా (సునీల్ శెట్టి) ప్రతీకారానికి తెగబడతాడు. ఆదిత్య కూతురితోపాటు విక్కీని కూడా చంపుతాడు. అతనెందుకు ఈ హత్యలు చేశాడు. గతంలో పోలీసులను సజీవదహనం చేసి ముంబై పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసిన హరిచోప్రా అసలు ఎవరు? ఈ చిక్కుముడులను ఆదిత్య అరుణాచలం ఎలా విప్పాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది మిగతా కథ.. నటీనటులు: దక్షిణాది వెండితెరపై ఇప్పటికీ తిరుగులేని సూపర్స్టార్ రజనీకాంత్. ఆయనకు వయస్సు పెరుగుతున్నా.. రోజురోజుకు స్టామినా మాత్రం తగ్గడం లేదు. తనదైన స్టైల్, గ్లామర్, యాక్టింగ్, పంచ్ డైలాగులతో రజనీ ఇప్పటికీ వెండితెరమీద ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూనే ఉన్నాడు. తాజా సినిమా ‘దర్బార్’ కూడా పూర్తిగా రజనీ స్టైల్, మ్యానరిజమ్స్, పంచ్ డైలాగుల మీద ఆధారపడింది. ముంబై పోలీసు కమిషనర్గా రజనీ లుక్, స్టైల్, మ్యానరిజమ్స్ ఫ్యాన్స్తో అదరహో అనిపిస్తాయి. పోలీసు కమిషనర్గా రౌడీ మూకలను రప్ఫాడిస్తూనే.. ఇటు నయనతారతో మనస్సు గెలిచేందుకు ప్రయత్నించే పాత్రలో రజనీ అదరగొట్టాడు. తన ఏజ్కు తగ్గట్టు నడి వయస్సు పాత్ర పోషించిన రజనీ.. నయనతారతో మాట్లాడేందుకు, ఆమె ప్రేమ గెలిచేందుకు పడే పాట్లు ప్రేక్షకులను నవిస్తాయి. ఇక, హీరోయిన్గా నయనతార పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఇది ప్రధానంగా తండ్రీ-కూతురు మధ్య సెంటిమెంట్ కథ. తండ్రిగా రజనీ, కూతురిగా నివేదా థామస్ తెరపై అద్భుతంగా ఒదిగిపోయారు. స్నేహితుల్లా ఉండే తండ్రీ-కూతురు మధ్య సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. సెంకడాఫ్లో ఇద్దరి పాత్రలు, అభినయం ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తుంది. ఇక, విలన్గా సునిల్ శెట్టి ఓ మోస్తరుగా నటించాడు. రజనీ స్థాయికి తగ్గ విలన్ అయితే కాదు. యోగిబాబు కామెడీ అంతంతమాత్రమే ఉండగా.. ముంబై నేపథ్యం కావడంతో ఎక్కువశాతం నటులు కొత్తవాళ్లు, బాలీవుడ్ వాళ్లు సినిమాలో కనిపిస్తారు. విశ్లేషణ: రజనీకాంత్ను మరోసారి తెరమీద పోలీసు ఆఫీసర్గా చూపిస్తూ మురగదాస్ తీసుకొచ్చిన ‘దర్బార్’ సినిమాలో కథ అంత బలంగా కనిపించదు. ఇలాంటి రివేంజ్ డ్రామా కథలతో ఇప్పటివరకు చాలా సినిమాలే వచ్చాయి. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏమిటంటే అది కచ్చితంగా రజనీకాంత్. ప్రతి ఫ్రేములోనూ రజనీని స్టైలిష్గా చూపించడంలో, రజనీ స్టైల్స్, మ్యానరిజమ్స్ ఉపయోగించుకోవడం దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కానీ, కథ కొత్తది కాకపోవడం, క్లైమాక్స్ రోటిన్గా ఉండటంతో కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా కొంత బోర్ కొట్టవచ్చు. ఇక, సెకండాఫ్లో కథ కొంచెం నెమ్మదించినట్టు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా బాగున్నా.. క్లైమాక్స్ రోటిన్గానే అనిపిస్తుంది. ఈ సినిమాకు ప్రధాన బలం అనిరుద్ అందించిన నేపథ్య సంగీతం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చాలా సీన్లను అనిరుద్ ఓ రేంజ్కు తీసుకెళ్లాడు. ముఖ్యంగా రైల్వేస్టేషన్లో వచ్చే ఫైట్ సీన్లో ఫైట్ స్టైలిష్గా ఉండటంతోపాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్బ్గా అనిపిస్తుంది. అయితే, డబ్బింగ్ సినిమా కావడంతో పాటలు చాలావరకు రణగొణధ్వనుల్లా అనిపిస్తాయి. ఇక, సినిమాటోగ్రఫి బాగుంది. సినిమా నిర్మాణ విలువలూ రిచ్గా ఉన్నాయి. మొత్తానికీ ఈ సినిమా రజనీ ఫ్యాన్స్కు పండుగే అని చెప్పవచ్చు. బలాలు రజనీకాంత్ స్టైలిష్ లుక్, మ్యానరిజమ్ కూతురిగా నివేదా థామస్ నటన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బలహీనతలు రజనీ స్థాయికి తగ్గట్టు కథ బలంగా లేకపోవడం ఒకింత రోటిన్ కథ కావడం, రోటిన్ క్లైమాక్స్ - శ్రీకాంత్ కాంటేకర్ -
దర్బార్: ట్విటర్లో ఏమంటున్నారంటే?
సౌతిండియన్ సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఏర్పడ్డాయి. అంతేకాకుండా చాలా కాలం తర్వాత తలైవా పోలీస్ గెటప్లో కనిపిస్తుండటంతో థియేటర్లో రచ్చరచ్చే అని ఫ్యాన్స్ ఆనందపడ్డారు. ఇక సంక్రాంతి కానుకగా నేడు(గురువారం) ‘దర్బార్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ‘దర్బార్’ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విటర్లో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. రజనీ వన్ మ్యాన్ షోతో అదరగొట్టారని.. ఈ సినిమాతో అలనాటి తలైవాను మళ్లీ చూశామని తమిళ తంబిలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అనిరుధ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్తో రచ్చరచ్చ చేశాడంట. అదేవిధంగా ఇంటర్వెల్ సీన్ అదిరిపోయిందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే రేసు గుర్రం పరిగెట్టినట్టు పరిగెత్తిందని అందరూ చెబుతున్న కామన్ పాయింట్. సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు ఒక్క సెకన్ కూడా బోర్ కొట్టకుండా ఉందట. ఇక సెకండాఫ్లో డైరెక్టర్ తన క్రియేటివిటీని ప్రదర్శించాడని అంటున్నారు. దీంతో బొమ్మ బ్లాక్బస్టర్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘జెట్ స్పీడ్ స్క్రీన్ ప్లే, ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. కామెడీ, రొమాంటిక్, యాక్షన్స్ సీన్స్లో తలైవా అదరగొట్టాడు. విలన్ ఇంటర్వెల్కు ముందు రావడంతో అసల ఆట ఆరంభవుతుంది’అంటూ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘ఈ సినిమా రూ.400-500 కోట్లు వసూలు చేయకపోతే సినీ అభిమానులకు టేస్ట్ లేదని అర్థం’, ‘తలైవా వన్ మ్యాన్ షో. రజనీ ఎనర్జీ, స్టైల్, చరిష్మా అందరినీ ఇన్స్పైర్ చేసేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రజనీని చాలా కొత్తగా చూపించారు. ఘనవిజయాన్ని అందుకున్న ‘దర్బార్’ టీంకు శుభాకాంక్షలు’, ‘బొమ్మ బ్లాక్బస్టర్ హిట్’, అంటూ పలువురు నెటజన్లు ట్విటర్లో కామెంట్ చేస్తున్నారు. Hats off to Thalaivar and ARM. #Darbar Every minute enjoyable. No doubt , #Darbar going to be industrial hit and massive blockbuster. Only one super star and thalaivar. No one can stand in front of thalaivar. #DarbarThiruvizha#DarbarFDFS #DarbarThiruvizha — looking for good leader (@suchi2019) January 9, 2020 #Darbar 1st half - It's a complete Vishwaroopam of #SuperstarRajinikanth's charisma, energy & screen presence🙏👑 #Thalaivar pinni pedal edukaraaru. Ageless!#TharamMaaraSingle la avar panra dance, settai (enjoying Mahanadhi Kamal sir's kiss scene) etc vera ragam👌😎 Delightful — Kaushik LM (@LMKMovieManiac) January 9, 2020 -
రవితేజ టీంకు మురుగదాస్ విషెస్
సందేశంతో కూడిన కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడంలో డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దిట్ట. తాజాగా సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘దర్బార్’. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. చాలా కాలం తర్వాత రజనీ పోలీస్ గెటప్లో అభిమానులను కనువిందు చేయనున్నాడు. ఇక చిత్ర ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రజనీ, దర్బార్ టీంతో పాటు టాలీవుడ్కు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అయితే ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్లోనే ఉన్న డైరెక్టర్ ఏఆర్ మురగదాస్.. రవితేజ తాజా చిత్రం ’క్రాక్’ సెట్ను సందర్శించారు. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన విషయాలను తెలుసుకున్న మురుగదాస్ అనంతరం డైరెక్టర్ గోపిచంద్ మలినేనికి చిత్ర సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఏఆర్ మురుగదాస్ క్రాక్ సెట్ను సందర్శించిన ఫోటోను గోపిచంద్ మలినేని తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. కాగా, డాన్ శీను, బలుపు వంటి చిత్రాలతో కమర్షియల్ డైరెక్టర్గా పేరొందిన గోపీచంద్ మలినేని తాజాగా రవితేజతో మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో టెంపర్ పోలీసాపీసర్గా రవితేజ కనిపించునున్నాడు. ఇప్పటికే న్యూఇయర్ కానుకగా విడుదలై ‘క్రాక్’ ఫస్ట్ లుక్ పోస్టర్కు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. సమ్మర్లో విడుదల కానున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తుండగా సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్పై బి. మధు నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘డిస్కో రాజా’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సినిమా కేవలం వినోదం మాత్రమే కాదు
‘‘రజనీకాంత్గారితో సినిమా చేయాలని 15 ఏళ్లగా అనుకుంటున్నా. కానీ కుదర్లేదు. ఫైనల్గా ఆయనతో సినిమాకి కాల్ వచ్చింది. ఆ న్యూస్ బయటకు వచ్చేసింది. నా మిత్రులందరూ ఫోన్ చేసి అభినందించారు. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు. తుది నరేషన్లోనూ సినిమా కుదరకపోవచ్చు. అలా జరగకూడదనుకున్నాను. అందుకే ఏ మార్పు సూచించినా నాలుగైదు ఆపషన్స్ ఉండేట్టు కథ తయారు చేసుకుని రజనీసార్ దగ్గరకు వెళ్లాను’’ అని దర్శకుడు మురుగదాస్ అన్నారు. రజనీకాంత్, నయనతార జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్ తెలుగులో ఈ నెల 9న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మురుగదాస్ మీడియాతో మాట్లాడారు. ► చెన్నైకి 200 కిలోమీటర్ల దూరంలో మా స్వగ్రామం. అక్కడ కేవలం 2 థియేటర్స్ ఉండేవి. చిన్నప్పుడు అమ్మతో కలసి రజనీగారి సినిమా చూశాను. రజనీగారిది ఈ ఊరే. థియేటర్లో ఉంటారు అనుకునేవాణ్ణి. ఓసారి అక్క వాళ్ల ఇంటికి వెళ్తే ఆ ఊరి థియేటర్లోనూ ఉన్నారు. రజనీగారిది మన ఊరు కదా ఇక్కడికి ఎలా వచ్చారు అని నాకు డౌట్ వచ్చింది. అది సినిమా, ఆయన నటుడు అని వివరించి చెప్పారు మా అక్క. నా 5వ తరగతిలో చెన్నై టూర్ వెళ్లాను. చెన్నైలో రజనీసార్ ఎక్కడ అని చూస్తూ ఉండేవాణ్ణి. ఆ తర్వాత అసిస్టెంట్ దర్శకుడిగా ఉన్నప్పుడు రజనీగారిని దూరంగా చూశాను. ‘గజిని’ అప్పుడు డైరెక్ట్గా కలిసే అవకాశం వచ్చింది. ► తమిళ ‘గజిని’ రిలీజ్ అయ్యాక రజనీగారు ఫోన్ చేశారు. తమిళంలో మంచి సినిమా రిలీజ్ అయితే అభినందించడం ఆయనకు అలవాటు. ఆ టీమ్తో సంభాషిస్తారు. ‘గజని’ అప్పుడు నాకు ఆ అవకాçశం కలిగింది. ఆయన ‘శివాజీ’ చేస్తున్న సమయంలో మేం కలిసి సినిమా చేయాలనుకున్నాం. అప్పుడు ‘గజిని’ హిందీ రీమేక్తో నేను, ‘రోబో’తో ఆయన బిజీగా ఉన్నాం. ఏడాదిన్నర క్రితం మళ్లీ సినిమా చేయాలనుకున్నాం. ఈసారి అవకాశం మిస్ అవ్వకూడదు అనుకున్నాను. ► రజనీకాంత్ గారిని నేను ఎలా చూడాలనుకుంటున్నానో, ఆయన్ను స్క్రీన్ మీద చూసి ఎలా ఎంజాయ్ చేశానో అది ఈ జనరేషన్ వాళ్లకు కూడా కనెక్ట్ అయ్యేలా ‘దర్బార్’లో చూపించాను. ముంబై బ్యాక్డ్రాప్లో సాగే పోలీస్ కథ ఇది. సమాజంలో జరిగే అన్యాయాలకు తనదైన శైలిలో న్యాయం చేసే పోలీస్ కథ. ఇందులో ఫ్యాన్స్ ఆయన్నుంచి ఆశించే మేనరిజమ్స్, స్టయిల్స్ అన్నీ ఉంటాయి. రజనీగారితో ఈ ప్రయాణంలో చాలా తెలుసుకున్నాను. దేవుడి గురించి ఆయన చాలా విషయాలు చెప్పారు. నాకో పుస్తకం కూడా ఇచ్చారు. ► సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియా. సినిమా కేవలం వినోదంగానే ఉండకూడదని నా అభిప్రాయం. అందుకే సందేశం ఇవ్వాలనుకుంటాను. ఆ సందేశం వల్ల ఒక్క రాత్రిలో జనాలు మారిపోతారని కాదు. కానీ ఓ ఆలోచన కలుగుతుంది. మెల్లిగా తెలుసుకుంటారు. కమర్షియల్ సినిమాలో, పెద్ద హీరోల సినిమాల్లో సందేశం జోడిస్తే ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది. ► రజనీకాంత్గారు మేకప్ వేసుకొని కేరవేన్ నుంచి బయటకు వచ్చాక మళ్లీ లంచ్ బ్రేక్, షూటింగ్ ప్యాకప్ అప్పుడే లోపలికి వెళ్తారు. షూటింగ్ లేట్ అయినా సహకరిస్తారు. ► మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్గా ఎదిగిన అమ్మాయి నయనతార. ఆమె ఎదుగుదలను మనం గౌరవించాలి. చాలా గ్యాప్ తర్వాత నయనతార, రజనీసార్ కలసి యాక్ట్ చేశారు. అనిరుధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు. ఎన్వీ ప్రసాద్గారితో ఎప్పటి నుంచో నాకు పరిచయం ఉంది. ఆయన నిర్మాతలా కాకుండా ఫ్యామిలీ మెంబర్లా ఉంటారు. నా తదుపరి చిత్రం గురించి నిర్ణయించుకోలేదు. ‘తుపాకీ’ సీక్వెల్ ఆలోచన ఉంది. ► ఈ సినిమాలో హీరో పాత్రకు ఓ పవర్ఫుల్ పేరు పెట్టాలి. ఏం పెట్టాలా అని ఆలోచించాను. షూటింగ్లో ఆలోచిద్దామనుకున్నా. హీరో వేసుకునే పోలీస్ యూనిఫామ్ మీద నేమ్ప్లేట్ తయారు చేయాలని ముందే అడిగేసరికి మా నాన్న పేరు (అరుణాచలం) మా అబ్బాయి (ఆదిత్య) పేర్లు కలిపి ఆదిత్యాఅరుణాచలం అని పెట్టా. ► ప్రస్తుతం కొత్త కొత్త దర్శకులు కొత్త కొత్త ఆలోచనలతో సినిమాలు తీస్తున్నారు. నా అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా డైరెక్టర్స్ అవుతున్నారు. నేను ఇచ్చిన కథతో శరవణన్ అనే అతను ‘రాంగీ’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో త్రిష కథానాయిక. ► తెలుగులో స్ట్రయిట్గా నేను తీసిన సినిమాలు సరిగ్గా ఆడలేదు. స్టార్డమ్ను అంచనా వేయడంలోనో ఇంకేదో విషయంలోనో మిస్ అయ్యాను. మహేశ్బాబు లాంటి సూపర్స్టార్, కష్టపడే హీరోకు హిట్ ఇవ్వలేదని బాధపడ్డాను. సినిమా రిలీజ్ అయిన 10 రోజుల తర్వాత కూడా నన్ను ప్రోత్సహించేలా మెసేజ్లు పంపారు మహేశ్గారు. ఆయన చర్మం రంగు కంటే ఆయన మనసు ఇంకా తెలుపు. సినిమాను ఇంతలా ప్రేమించే హీరోకు హిట్ ఇవ్వలేకపోయాననే బాధ ఎప్పటికీ ఉంటుంది. -
‘దర్బార్’ ప్రీ రిలీజ్ వేడుక
-
తక్కువగా ఆశ పడితే సంతోషంగా ఉంటాం
‘‘1976లో తెలుగులో నా ‘అంతులేని కథ’ సినిమా విడుదలైంది.. ఇçక్కడున్న వారిలో 99శాతం మంది అప్పుడు పుట్టి ఉండరు. తమిళ ప్రేక్షకులు నన్ను ఎంతగా ప్రేమిస్తారో తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ప్రేమించడం నా పూర్వజన్మ సుకృతం’’ అన్నారు రజనీకాంత్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్, నయనతార జంటగా రూపొందిన చిత్రం ‘దర్బార్’. ఎ. సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. ఈ నెల 9న ‘దర్బార్’ విడుదల కానుంది. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో రజనీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఎన్వీ ప్రసాద్గారు నాకు 20ఏళ్లుగా తెలుసు.. సినిమా ఆడినా, ఆడకున్నా ఒకేలా ఉంటారాయన. మామూలుగా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ను ఆయన కొంచెం లో ప్రొఫైల్లో చేసేవారు. కానీ ‘దర్బార్’ సినిమా హిట్ అని తెలిసిపోయినట్టుంది ఆయనకు.. అందుకే ఇంత భారీ వేడుక ప్లాన్ చేశారు. నా వయసు 70 ఏళ్లు.. ఇంకా నేను హీరోగా నటిస్తున్నానంటే ప్రేక్షకుల అభిమానం, ప్రోత్సాహమే కారణం.. అవే నా ఎనర్జీ. ఈ వయసులోనూ మీరు ఇంత సంతోషంగా, ఉత్సాహంగా ఎలా ఉన్నారని కొందరు అడుగుతారు.. నేను వారికి చెప్పేది ఒక్కటే. తక్కువగా ఆశ పడండి.. తక్కువ ఆలోచనలు పెట్టుకోండి.. తక్కువగా భోజనం చేయండి, తక్కువగా నిద్రపోండి.. తక్కువగా వ్యాయామాలు చేయండి.. ఇవన్నీ చేస్తే సంతోషంగా ఉంటాం (నవ్వుతూ). తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. ‘పెదరాయుడు, బాషా, నరసింహా, చంద్రముఖి, రోబో’ వంటి సినిమాలు రజనీ ఉన్నాడని బాగా ఆడలేదు.. ఆ సినిమాలు బాగున్నాయి.. వాటిల్లో రజనీ ఉన్నాడంతే. అందరూ సక్సెస్ఫుల్ సినిమా తీయాలి, బాగా ఆడాలని తీస్తారు. సినిమా తీసేటప్పుడు ఓ మ్యాజిక్ జరుగుతుంది, ఆ సినిమా బాగా వస్తుంది. అయితే అది మన చేతుల్లో ఉండదు. ‘దర్బార్’ చేసేటప్పుడు ఆ మ్యాజిక్ మాకు తెలిసిపోయింది. మురుగదాస్గారితో పని చేయాలని 15ఏళ్లుగా చూశాను కానీ కుదర్లేదు.. ఇప్పుడు కుదిరింది. సుభాస్కరన్గారు పెద్ద వ్యాపారవేత్త. సినిమాలంటే ఇష్టంతో తీస్తున్నారు.. ఇప్పుడు మన ‘బాహుబలి’లాగా ‘పొన్నియిన్ సెల్వన్’ అనే ప్యాన్ ఇండియన్ ఫిల్మ్ తీస్తున్నారు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ట్రైలర్ చివరలో రజనీసార్ నడుచుకుంటూ వచ్చే షాట్కి నేను ఫిదా అయిపోయా. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఇరగదీస్తున్న మురుగదాస్గారికి సెల్యూట్. రజనీ సార్ ‘జీవన పోరాటం’ సినిమా టైమ్లో నేను పిల్లాణ్ణి.. ఆ సినిమాలో ఆయన స్టైల్ చూసి, అలా చేయాలని ప్రయత్నించా. కానీ, రాలేదు’’ అన్నారు. మురుగదాస్ మాట్లాడుతూ–‘‘నా కెరీర్లో ఇది చాలా ముఖ్యమైన సినిమా.. ఎందుకంటే రజనీగారితో నేను చేసిన తొలి మూవీ. అలాగే నేను తీసిన తొలి పోలీస్ స్టోరీ. పదిహేనేళ్ల క్రితం రజనీగారిని ప్రేక్షకులు ఎలా చూశారో ఆ స్టైల్, ఆ మాస్ అంశాలన్నీ ‘దర్బార్’లో ఉన్నాయి. ఇలాంటి ప్యాన్ ఇండియన్ సినిమా చేయడానికి అవకాశం ఇచ్చిన సుభాస్కరన్ సార్కి ధన్యవాదాలు. సుభాస్కరన్గారు నిజమైన హీరో. భవిష్యత్లో ఆయన లైఫ్ స్టోరీ ఒక బయోపిక్గా రావొచ్చు. అంత మంచి లైఫ్ స్టోరీ ఆయనది. రజనీగారికి ప్రత్యర్థిగా ఉండే బలమైన పాత్రని సునీల్శెట్టిగారు బ్యాలెన్స్ చేశారు’’ అన్నారు. నివేదా థామస్ మాట్లాడుతూ– ‘‘ఇంత పెద్ద సినిమాలో ఈ పాత్రకి నేను సరిపోతానని అవకాశం ఇచ్చిన మురుగదాస్గారికి చాలా థ్యాంక్స్. షూటింగ్లో రజనీ సార్ ఎలా మాట్లాడుతున్నారు? ఎలా నటిస్తున్నారని చూస్తూనే ఉండేదాన్ని. విజయ్, అజిత్, మహేశ్బాబు, అల్లు అర్జున్, నాని.. ఇలా అందర్నీ మనం అభిమానిస్తాం. వాళ్లందరికీ కామన్గా నచ్చే ఒక యాక్టర్ రజనీ సార్’’ అన్నారు. పాటల రచయిత భాస్కరభట్ల మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్గారి ‘2.ఓ’కి ఓ పాట, ‘పేట’కి ఓ పాట రాసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ‘దర్బార్’లో రెండు పాటలు రాశా’’ అన్నారు. సంగీత దర్శకుడు అనిరుద్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా నాకు ప్రత్యేకం.. ఎందుకంటే నా మనసుకు బాగా దగ్గరైన చిత్రమిది. ఈ అవకాశం ఇచ్చిన రజనీసార్కి, తన కలల చిత్రంలో చాన్స్ ఇచ్చిన మురుగదాస్కి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘రజనీగారిని అందరూ సూపర్స్టార్ అని పిలుస్తారు. కానీ, నా వరకు ఆయన గాడ్ ఆఫ్ సినిమా. ఆయన నుంచి ఎంతో కొంత నేర్చుకోవచ్చు. సెట్లో మురుగదాస్గారు మా అందరికీ గురువు’’ అన్నారు బాలీవుడ్ నటుడు సునీల్శెట్టి. ‘‘రజనీకాంత్గారితో తొలిసారి ‘దళపతి’ సినిమాకు చేశాను. ఆయన ఎనర్జీలో మార్పు లేదు’’ అన్నారు కెమెరామేన్ సంతోష్ శివన్. ఈ వేడుకలో నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, కేకే రాధామోహన్, దర్శకులు వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, మారుతి, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, పాటల రచయిత కృష్ణకాంత్, గాయకుడు శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఈ స్టార్ హీరోను కొత్తగా చూపించాలనుకున్నా’
రాజకీయాలకనుగుణంగా దర్బార్ చిత్రంలో రజనీకాంత్ పాత్రను రూపొందించలేదని ఈ చిత్ర దర్శకుడు ఏఆర్.మురుగదాస్ పేర్కొన్నా రు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా దర్బార్ ఫీవర్ నడు స్తోంది. ఎక్కడ చూసినా ఈ చిత్రం గురించిన చర్చే. అందుకు కారణం చిత్ర కథానాయకుడు సూపర్స్టార్ కావడమే. దీనికి దర్శకుడు ఏఆర్.మురుగదాస్. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి చిత్రం దర్బార్ కావడం ఈ క్రేజ్కు మరో కారణం. ఇక అగ్రనటి నయనతార నాలుగోసారి రజనీకాంత్తో జత కట్టడం, యువ సంగీతతెరంగం అనిరుద్ సంగీతాన్ని అందించడం, లైకా సంస్థ రాజీలేని నిర్మాణం వెరసి దర్బార్ అంచనాలను పైపైకి పెంచేస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే సుమారు 10 ఏళ్ల తరువాత రజనీకాంత్ పోలీస్ అధికారిగా నటించడం కూడా అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న రజనీ దర్బార్ 2020 జనవరి 9వ తేదీన ఒక ప్రభంజనం సృష్టించడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు ఏఆర్.మురుగదాస్ శనివారం ఉదయం స్థానిక టీ.నగర్లోని లైకా సంస్థ కార్యాలయంలో మీడియాను కలిశారు. దర్బార్ అంటే? దర్బార్ అంటే రూలింగ్ చేసే స్థలం అనవచ్చు. దర్బార్ చిత్రం గురించి చెప్పండి? చిత్ర కథ గురించి ఇప్పుడే రివీల్ చేయలేను గా నీ, ఇది పూర్తిగా ముంబైలో చిత్రీకరించిన చిత్రం. రజనీకాంత్ పోలీస్కమిషనర్గా నటించారు. ఈ చిత్ర కథకు ఎక్కడ బీజం పడింది? ఒకసారి రజనీకాంత్ను కలవడానికి కారులో వెళుతున్నాం. నిర్మాత థానునే రజనీకాంత్కు నన్ను పరిచయం చేశారు. అలా కారులో పయనిస్తుండగానే కథ గురించి ఆలోచించాను. రజనీకాంత్ గత పదేళ్లుగా చేస్తున్నవేంటి? చేయని విషయాలు ఏంటి. అన్న దాని గురించి బేరీజు వేసుకున్నాను. రజనీకాంత్ను ప్రస్తుతం చేస్తున్న చిత్రాలకు భిన్నంగా చూపించాలన్న విషయంలో చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. పదేళ్లుగా ఆయన నటించిన చిత్రాలకు భిన్నంగా, కొత్తగా రజనీకాంత్ను చూపించాలనుకున్నాను. అలాగని కోట్లకు పడగలెత్తిన రజనీకాంత్ మోసానికి గురై ఆస్తులు పోగొట్టుకుని తిరిగి సంపాందించుకోవడం లాంటి కథను, డాన్ ఇతివృత్తంతో కూడిన కథను ఆయనతో చేయాలనిపించలేదు. మరో విషయం ఏమిటంటే తుపాకీ చిత్రం షూటింగ్ సమయంలో మిలటరీ నేపథ్యంలో చిత్రం చేస్తే, హర్బర్లో షూటింగ్ చేస్తే ఆ చిత్రాలు ఆడవు అని అర్థం చేసుకున్నాను. అలాంటి ఆలోచనలోంచి పుట్టిందే పోలీస్అధికారి పాత్ర. రజనీకాంత్ను కలిసినప్పుడు యూండ్రుముఖం చిత్రంలో అలెక్స్ పాండియన్ను పూర్తి స్థాయిలో చూపించాలనుకుంటున్నట్లు చెప్పారు. అది విన్న ఆయన బాగుంది చేద్దాం అని చెప్పారు. రజనీకాంత్ను పోలీస్ గెటప్లో మీసం, గెడ్డంతో చూపించడానికి కారణం? నిజానికి పోలీసులకు గడ్డం ఉండదు. అలా ఉండాలంటే రీజన్ ఉండాలి. గెడ్డం లేకపోతే ముఖానికి అలెర్జీ వస్తుందనో, ఏదైనా మొక్కుబడి లాంటి రీజన్లతో పై అధికారి వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఒక పోలీస్అధికారి సూచనలను తీసుకున్నాం. అలా ఒక రీజన్తో దర్బార్ చిత్రంలో రజనీకాంత్కు గడ్డెం, మీసం పెట్టాం. మహిళల రక్షణ గురించి ఏమైనా చెప్పారా? అలాంటి చిన్న చిన్న అంశాలు ఉంటాయి. అవి రియలిస్టిక్గా ఉంటాయి. నిజానికి మహిళా రక్షణ చట్టాలు ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో చాలా బాగా అమలవుతున్నాయి. తమిళనాడులో కూడా అలాంటి చట్టాలు అమలయితే బాగుంటుంది. దర్బార్ చిత్ర ట్రైయిలర్ చూస్తుంటే రక్తపాతం అధికంగా ఉన్నట్లు తెలుస్తోందే? దీన్ని పాన్ ఇండియా చిత్రంగా ఉండాలని భా వించాం. తమిళం, తెలుగు భాషలతో పాటు హిందీలోనూ రూపొందించ తలపెట్టాం. బాలీవుడ్ చిత్రా ల్లో కాస్త వైలెన్స్ అధికంగా ఉంటేనే అక్కడ ప్రేక్షకులు చూస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫాన్ ఇండియా చిత్రంగా దర్బార్ను తెరకెక్కించాం. ఈ చిత్ర షూటింగ్లో రజనీకాంత్ను చాలా దగ్గరుండి చూశారు. ఆయన గురించి? రజనీకాంత్ చాలా ఆశ్యర్యకరమైన వ్యక్తి. షూ టింగ్ ముగిసిన తరువాత ఆయన్ని చూడడానికి వేలాది మంది అభిమానులు ఎదురుచూస్తుంటా రు. ఒక సూపర్స్టార్, త్వరలో రాజకీయరంగ ప్ర వేశం చేయబోతున్న వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రజనీకాంత్ అలాంటివేవీ లేకుండా చాలా సహజంగా అందరిని పలకరిస్తూ, వారితో ఫొటోలు దిగుతూ ఎంతో నిరాడంబరతను ప్రదర్శిస్తారు. అంతే కాదు నేను ఏ ప్రశ్ర అడిగినా, అది వ్యక్తిగతం అయినా, రాజకీయపరమైనదైనా, ఆధ్యాత్మికపరమై నది అయినా అన్నింటికీ బదులిచ్చేవారు. ముఖ్యంగా నటనపై ఆయనకు ఉన్న తపన నన్ను ఎంతగానో ఆశ్చర్యచకితుడిని చేసింది. ప్రతి సన్నివేశం గురించి బాగుందా? అని అడుగుతారు. అంత డెడికేషన్స్ ఈ తరం నటుల్లో చాలా తక్కువే ఉంటుంది. రజనీకాంత్ త్వరలో రాజకీయరంగప్రవేశం చేయనున్నారు.ఈ చిత్రం ఆయన రాజకీయాలకు ఎంత వరకూ ఉపయోగపడుతుంది? నిజం చెప్పాలంటే రజనీకాంత్ రాజకీయాలకు ఉ పయోగపడేలా దర్బార్ చిత్ర కథను తయారు చేయలేదు. అలాంటి వాటిని అవైడ్ చేశాం. అయితే చిత్రంలో చిన్న చిన్న సన్నివేశాలు అలాంటివి ఉంటాయి. ఎంజీఆర్ రాజకీయ రంగప్రవేశానికి ముందు ఉలగం చుట్రుం వాలిబర్ చిత్రం చేశారు. ఆ చిత్రం ఆయన రాజకీయా రంగప్రవేశానికి తోడ్పడింది? నిజమే. అయితే ఎంజీఆర్ నటించిన ఉలగం చుట్రుం వాలిబర్ చిత్రం వేరు. రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్ర కథ వేరు. ఎంజీఆర్ ఉలగం చుట్రుం వాలిబర్ జేమ్స్బాండ్ తరహా కథతో కూడినది. దర్బార్ ఒక పవర్ఫుల్ పోలీస్అధికారి ఇతి వృత్తంతో కూడిన చిత్రం. రజనీకాంత్ ఆలోచనలు చాలా యంగ్గా ఉంటాయి. ఆయనలో ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు. 40 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తారు. రజనీ రాజకీయ ప్రవేశం గురించి? ఆయన రాజకీయ రంగ ప్రవేశం గురించి చెప్పేటంతటి వాడిని కాదు. అయితే ఆయనలో ప్రజలకు మంచి చేయాలన్న తపన మాత్రం ఉంది. చదవండి: అమితాబ్ సూచనను పాటించలేకపోతున్నా ట్రాన్స్జెండర్ పాత్రలో నటించాలని ఉంది -
దుమ్మురేపుతున్న ‘డుమ్ డుమ్’ పాట
రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ తెలుగులో రిలీజ్ చేయనున్నారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో రజనీ ఇంట్రడక్షన్ సాంగ్ 'దుమ్ము ధూళి' విడుదలైంది. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకువెళుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాటకి అనంత శ్రీరామ్ సాహిత్యం అందిచగా, ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. 'డుమ్ డుమ్' అంటూ సాగే ఈ పాట రజనీ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటుంది. పెళ్లికి ముందు, తర్వాత భార్యభర్తలు ఎలా ఉండాలి అనే అంశాన్ని పాట రూపంలో చక్కగా తెలియజేశారు. పెళ్లి నేపథ్యంలో వచ్చే ఈ ఎనర్జిటిక్ సాంగ్కు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా, మకాష్ అజీజ్ ఆలపించాడు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
డబ్బే నాకు సామర్థ్యాన్ని ఇచ్చింది..
తమిళనాడు, పెరంబూరు: నటనలో నేను సాధించానని అనుకోవడం లేదు అని సూపర్స్టార్ రజనీకాంత్ పేర్కొన్నారు. దక్షిణాది సూపర్స్టార్గా కొనియాడబడుతున్న ఈయన తాజాగా నటించిన చిత్రం దర్బార్. నయనతార నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో లైకా సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతికి తెరపైకి రానుంది. కాగా దర్బార్ హిందీలోనూ విడుదల కానుండడంతో ఇటీవల చిత్ర యూనిట్ ముంబైలోనూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు రజనీకాంత్ ఇచ్చిన సమాధానాలను చూద్దాం. ప్ర: నటనలో మీకింత సామర్థ్యం ఎక్కడ నుంచి వచ్చింది? జ: నిజం చెప్పాలంటే డబ్బే నాకు సామర్థ్యాన్ని ఇచ్చింది. తీసుకున్న పారితోషికానికి తగ్గట్టుగా నేను ఆ పాత్రలకు న్యాయం చేయాలి. ఇక నటించడం అన్నది నాకు చాలా ఆసక్తి. కెమెరా ముందుకు రావడం, వెలుగులో ఉండడం నాకు ఇష్టం. అదే నాకు సమర్థతను కలిగిస్తుంది. ప్ర: నటుడిగా ఎంత వరకూ ఎదిగానని అనుకుంటున్నారు? జ: వాస్తవంగా చెప్పాలంటే నేను నటుడిగా ఎదగలేదనే భావిస్తాను.ఆరంభంలో కొంచెం బిడియంగానూ, బెదురుగానూ ఉండేది. నటించగా నటించగా ఆత్మవిశ్వాసం పెరిగింది. మరో విషయం ఏమిటంటే నేను దర్శకుల నటుడిని. నటన అనేది నాకిచ్చిన పాత్రల పరిస్థితిని బట్టి ఉంటుంది. ఎలానో ప్రేక్షకులకు నేను నచ్చేశాను. అంతే కానీ నటనలో నేనే ఎదిగానని భావించడం లేదు.అప్పుడు ఇప్పుడు ఓకే రజనీకాంత్ ప్ర: గత 8 నుంచి 12 ఏళ్లలో అమితాబ్ నటించిన చిత్రాల్లో ఏ చిత్రానైనా రీమేక్ చేయాలనిపించిన చిత్రం ఉందా? జ: షమితాబ్ చిత్రం ప్ర: మీకు ప్రపంచ వ్యాప్తంగా అబిమానులు ఉన్నారు. అయినా ఒకే ఒక్క హాలీవుడ్లో మాత్రమే నటించారే? జ: మంచి కథ, అవకాశాలు రాలేదు. అలాంటి అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తాను. ప్ర:ముంబైలో మీకు నచ్చింది? జ: ఒకటని కాదు ముంబై అంటేనే చాలా ఇష్టం, ప్ర:మీ చిత్రంలో నటించిన సునిల్శెట్టి గురించి? జ: ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. ముఖ్యంగా వరుసగా చిత్రాలు చేస్తున్న సునిల్శెట్టి ఆయన తండ్రికి ఆరోగ్యం బాగోలేకపోతే నటనను దూరంగా పెట్టి ఆయనకు వైద్యం చేయించడానికే సమయాన్ని కేటాయించారు. అలా నాలుగేళ్ల విరామం తరువాత ఇప్పుడు మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు సునిల్శెట్టి. -
అదిరిపోయిన ‘దర్బార్’ ట్రైలర్
-
అదిరిపోయిన ‘దర్బార్’ ట్రైలర్
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. ఈ చిత్రం ట్రైలర్ సోమవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.‘ వాడు పోలీసాఫీసరా సర్..హంతకుడు’, ‘ఆదిత్యా అరుణాచలం కమిషనర్ ఆఫ్ ముంబై’ అనే డైలాగులతో షురూ అయ్యే ట్రైలర్ రజనీ అభిమానులను అలరించేలా ఉంది. ‘ఆ చూపేంటి..ఒరిజిల్ గానే విలనమ్మా..ఇదేలా ఉంది’, ‘ ఐయామ్ ఏ బ్యాడ్ కోప్’ అంటూ రజనీకాంత్ చెప్పే సంభాషణలు హైలెట్గా నిలిచాయి. దర్భార్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. రజనీకాంత్ ఇందులో పోలీస్ అధికారి ఆదిత్యా అరుణాచలం పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
‘ఫుల్ యాక్షన్ ట్రైలర్కు సిద్దంగా ఉండండి’
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దర్బార్’. చాలా కాలం తర్వాత రజనీ పోలీస్ గెటప్లో అలరించనుండటంతో ఈ చిత్రంపై భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. అంతేకాకుండా విభిన్న కథలతో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాల ఎక్స్పర్ట్గా పేరుగాంచిన మురుగదాస్ డైరెక్ట్ చేస్తుండటం ఈ సినిమాకు డబుల్ ప్లస్ కానుంది. కాగా ఇప్పటికే విడుదలైన రజనీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, పాటలు సినిమాను ఓ రేంజ్కు తీసుకెళ్లాయి. తాజాగా రజనీ ఫ్యాన్స్కు హుషారు కలిగించే వార్తను ‘దర్బార్’టీమ్ ప్రకటించింది. ‘దర్బార్’మూవీ ట్రైలర్ను డిసెంబర్ 16(సోమవారం) సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘హలో ఫ్రెండ్స్. ఈ విషయాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు చిత్ర ట్రైలర్ విడుదల కాబోతుంది. దర్బార్ యాక్షన్ ట్రైలర్తో ఎంజాయ్ చేయడానికి సిద్దంగా ఉండండి’అంటూ మురుగదాస్ ట్వీట్ చేశాడు. షూటింగ్ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అంతేకాకుండా మూవీ ప్రమోషన్స్ కూడా భారీగా నిర్వహిస్తున్నాయి సినిమా యూనిట్. కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా నివేదా థామస్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నాడు. -
దుమ్ము ధూళి దుమ్ము రేపుతోంది
రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ లె లుగులో రిలీజ్ చేయనున్నారు. ‘దర్బార్’లోని తొలి పాట ‘దుమ్ము ధూళి..’ ని ఇటీవల విడుదల చేశారు. అనిరుధ్ స్వరపరిచిన ఈ పాటకి అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ‘‘దుమ్ము ధూళి’ పాట ఇంటర్నెట్లో దుమ్ము రేపుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ పాటకు ఇప్పటికి 8 మిలియన్ వ్యూస్ వచ్చాయి’’అని చిత్రబృందం పేర్కొంది. అనంత శ్రీరామ్ మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్గారి సినిమా మొదటి పాటకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ పాటను రాసే అదృష్టం ‘పేట’ చిత్రానికి(మరణం మాస్ మరణం..) దక్కింది. ఇప్పుడు ‘దర్బార్’ చిత్రంలో ‘దుమ్ము ధూళి’ అన్నే పాటను రాశాను. ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు పాడారు. రజనీకాంత్గారి ‘కథానాయకుడు’ చిత్రానికి తొలిసారి పాట రాశా. ఆ తర్వాత ‘విక్రమసింహా’, ‘2.0’, ‘పేట’, ఇప్పుడు ‘దర్బార్’ చిత్రాలకు పాటలు అందించాను’’ అన్నారు. -
దూసుకెళ్తున్న రజినీ ‘దుమ్ము.. దూళి’
రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దర్బార్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన దర్బార్.. ఫస్ట్ సాంగ్ను చిత్ర బృందం బుధవారం యూట్యూబ్లో విడుదల చేసింది. తమిళ్తో పాటు, తెలుగు, హిందీలో కూడా ఈ సాంగ్ విడుదల అయింది. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు తెలుగులో అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాశారు. తెలుగులో ‘దుమ్ము.. దూళి’ అని సాగే ఈ పాట.. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దీంతో రజినీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్.. ఐపీఎస్ ఆఫీసర్ ఆదిత్య అరుణాచలంగా కనిపించనున్నారు. చాలా కాలం తర్వాత రజినీ పోలీసు అధికారిగా కనిపిస్తున్న చిత్రం ఇదే. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించారు. రజనీకాంత్ కూతురిగా నివేథా దామస్ నటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘దర్బార్’ చిత్రం జనవరి 9న విడుదల కానుంది. -
వారికంటే ముందే రానున్న రజనీ!
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా క్రేజీ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబినేషన్లో వస్తున్న సెన్సేషనల్ మూవీ ‘దర్బార్’. చాలా కాలం తర్వాత రజనీ పోలీస్ గెటప్లో కనిపిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా వెరైటీ కథలతో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాల ఎక్స్పర్ట్గా పేరుగాంచిన మురుగదాస్ డైరెక్ట్ చేస్తుండటం ఈ సినిమాకు డబుల్ ప్లస్ కానుంది. కాగా ఇప్పటికే విడుదలైన రజనీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లు సినిమాను ఓ రేంజ్కు తీసుకెళ్లాయి. షూటింగ్ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అయితే ఈ చిత్ర విడుదల తేదీపై గందరగోళం నెలకొంది. సినిమా ప్రారంభం నుంచే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. అయితే సంక్రాంతి బరిలో ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’వంటి భారీ చిత్రాలు వస్తుండటంతో తెలుగులో దర్బార్కు థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం ఉండటంతో చిత్ర నిర్మాతలు పునరాలోచనలో పడ్డారు. మహేశ్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు జనవరి 12న వచ్చే అవకాశం ఉండటంతో.. దర్బార్ను జనవరి 12 న కాకుండా 15న విడుదల చేయాలని నిర్మాతలు తొలుత భావించారు. అయితే వారి నిర్ణయాన్ని మరోసారి మార్చుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా లైకా ప్రొడక్షన్స్ తన అధికారిక వెబ్సైట్లో దర్బార్ విడుదల తేదీ జనవరి 9వ తేదీ అని పేర్కొంది. దీంతో సంక్రాంతి బరిలో మహేశ్ బాబు, అల్లు అర్జున్ల కంటే ముందే రజనీ థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉంది. ఆ రెండు భారీ చిత్రాల విడుదలకు మూడు రోజుల ముందు అన్ని థియేటర్లలో విడుదల చేసి అధిక లాభం పొందేందుకు లైకా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల టాక్ ఇక డిసెంబర్ 12న రజనీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్దమవుతున్నట్లు సమాచారం. అయితే ఆ రోజు కుదరకపోతే డిసెంబర్ 7న నిర్వహించాలని భావిస్తోంది. ఇక లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా నివేదా థామస్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతమందిస్తున్నాడు. -
రజనీ అభిమానులకు మరో పండుగ
తమిళ సినిమా: సూపర్స్టార్ ఈ ఒక్క పేరు చాలు అభిమానులు సంతోషంలో మునిగితేలడానికి. అవును రజినీకాంత్ అభిమానులకు సూపర్స్టార్ అన్నది ప్రాణవాయువు లాంటిదేనని చెప్పవచ్చు. తలైవా (నాయకుడు) అన్నది ఆ తరువాతనే. అందుకే సూపర్స్టార్ పట్టాన్ని అంత సులభంగా వదులుకోవడానికి రజనీకాంత్ సిద్ధంగా లేరని చెప్పవచ్చు. సినిమాలకు దూరమై రాజకీయల్లోకి ప్రవేశిస్తే సూపర్స్టార్ పట్టాన్ని మరో హీరో తన్నుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకే రజనీకాంత్ వరుసగా చిత్రాలను చేసుకుంటూ పోతున్నారనిపిస్తోంది. ఈయన ప్రస్తుతం దర్బార్ చిత్రంలో నటిస్తున్నారు. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇందులో అగ్రనటి నయనతార నాయకిగా నటించింది. షూటింగ్ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. చిత్ర మోషన్ పోస్టర్ను ఇటీవలే విడుదల చేశారు. తమిళ వెర్షన్ను రజనీకాంత్ మిత్రుడు, మక్కళ్నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ ఆన్లైన్లో ఆవిష్కరించగా, హిందీ వెర్షన్ను సల్మాన్ఖాన్, తెలుగు వెర్షన్ను మహేశ్బాబు, మలయాళ వెర్షన్ను మోహన్లాల్ వంటి స్టార్ నటులు ఆవిష్కరించి సూపర్ పబ్లిసిటీని అందించారు. చాలా కాలం తరువాత ఆయన పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్న చిత్రం దర్బార్. చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా రజనీకాంత్కు డిసెంబర్ 12న పుట్టిన రోజు. అది అభిమానులకు పండుగరోజు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అంతకు ముందు అంటే డిసెంబర్ 7న వారికి మరో పండుగరోజు కాబోతోంది. అవును ఆ రోజున దర్బార్ చిత్ర ఆడియో ఆష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఈ వేడుకను చెన్నైలో భారీ ఎత్తున నిర్వహించడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. అయితే చిత్ర కథానాయకి నయనతార ఇందులో పాల్గొంటుందా అన్నది ఆసక్తిగా మారింది. -
డబ్బింగ్ షురూ
‘దర్బార్’లో ఆదిత్య అరుణాచలం మాటల తూటాలు పేలుతున్నాయి. మరి.. ఈ దర్బార్ డైలాగ్స్ ప్రేక్షకులకు ఎంత కిక్ ఇస్తాయో తెలిసేది మాత్రం సంక్రాంతి పండక్కే. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. ఇందులో నయతార కథానాయికగా నటించారు. నివేదాథామస్ కీలక పాత్రధారి. ఈ చిత్రంలో పోలీసాఫీసర్ ఆదిత్య అరుణాచలం పాత్రలో నటించారు రజనీకాంత్. ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలైనట్లు గురువారం చిత్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ వెల్లడించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ‘దర్బార్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
అరుణాచలం దర్బార్
రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘అరుణాచలం’ చిత్రం ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సుందర్ సి. దర్శకత్వంలో 1997లో విడుదలైన ఈ సినిమాలో అరుణాచలంగా అలరించిన రజినీ మరోసారి ‘దర్బార్’ చిత్రంలో అరుణాచలం పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ‘దర్బార్’ సినిమా తెలుగు మోషన్ పోస్టర్ని గురువారం హీరో మహేశ్బాబు విడుదల చేశారు. ‘‘రజనీకాంత్ సార్ నటించిన ‘దర్బార్’ మోషన్ పోస్టర్ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. మీపై ఈ ప్రేమ, అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. మురుగదాస్ సార్, చిత్రబృందానికి నా అభినందనలు’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మహేశ్బాబు. పవర్ఫుల్ పోలీసాఫీసర్ ఆదిత్య అరుణాచలంగా కొత్త లుక్లో రజనీని చూసి, ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘దర్బార్’ మోషన్ పోస్టర్ని తమిళ్లో కమల్హాసన్, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో మోహన్లాల్ విడుదల చేశారు. ‘‘అత్యంత భారీ బడ్జెట్తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా రూపొందుతోంది. అన్ని రకాల వాణిజ్య హంగులతో మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం సినిమా మీద అంచనాలను మరింత పెంచింది. ఇప్పటికే విడుదలైన రజనీ పోస్టర్స్కు చాలా మంచి స్పందన వస్తోంది. 2020 సంక్రాంతి కానుకగా ‘దర్బార్’ సినిమా విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
మరోసారి ‘అరుణాచలం’గా వస్తున్న రజనీ
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటేనే ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో అందరికీ తెలిసిందే. అందులోనూ క్రేజీ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్, రజనీ కాంబినేషన్లో వస్తున్న చిత్రం అంటూ అంచనాలు పీక్స్లో ఉండటం ఖాయం. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘దర్బార్’. చాలా కాలం తర్వాత ఈ సినిమాలో రజనీ పోలీస్ గెటప్లో కనిపించనున్నాడు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం భారీ ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా దర్బార్ మూవీ మోషన్ పోస్టర్ను గ్రాండ్గా విడుదల చేసింది చిత్ర యూనిట్. దీనిలో భాగంగా ‘దర్బార్’ చిత్ర తమిళ, మలయాల, హిందీ, తెలుగు మోషన్ పోస్టర్లను కమల్ హాసన్, మోహన్ లాల్, సల్మాన్ ఖాన్, మహేశ్ బాబు వంటి స్టార్ల చేతుల మీదుగా విడుదల చేయించింది. ప్రస్తుతం రజనీ దర్బార్ మూవీ మోషన్ పోస్టర్ నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ‘ఆదిత్య అరుణాచలం’గా రజనీ విలన్లు రఫ్పాడించనున్నాడు. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్గా ఉంది. బ్యాక్గ్రౌండ్లో వచ్చే తలైవా పదాలతో పాటు, రజనీ అడుగుల చప్పుడు హార్ట్ బీట్ను పెంచేస్తున్నాయి. దీంతో ‘దర్బార్’ బాక్సాపీస్ వద్ద దంచికొట్టడం ఖాయమని రజనీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార, నివేధా థామస్, మరియు సునీల్ షెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం సంక్రాతికి విడుదల కానుంది. -
దుమ్ములేపుతున్న ‘దర్బార్’ మోషన్ పోస్టర్
-
మురుగదాస్పై నయనతార ఫైర్
సినిమా: జీవితంలో తాను చేసిన అతి పెద్ద తప్పు అదే అని సంచలన వ్యాఖ్యలు చేసింది నటి నయనతార. ఆమె చేసిన కామెంట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ కలకలం సృష్టిస్తోంది. ఇంతకీ ఈ అమ్మడు ఏమనందనేగా మీ ఆసక్తి. ఈలేడీ సూపర్ స్టార్ నట జీవితమే కాదు, వ్యక్తిగత జీవితం సంచలనమే. ఎందుకంటే అన్ని సంఘటనలు తన జీవితంలో జరిగాయి. తన చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా ఆమె దూరంగా ఉంటుంది. అలాంటిది ఈ మధ్య ఒక ఆంగ్ల పత్రికకు భేటీ ఇచ్చింది. అది సంచలనంగా మారింది. తాజాగా ఒక ఎఫ్ఎం రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇంకా ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇందులో తన ప్రేమ వ్యవహారంతో సహా పలు విషయాల గురించి మాట్లాడింది. ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ సంచలన నటి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్కు జంటగా దర్బార్ చిత్రంలో నటించింది. 11 ఏళ్ల క్రితం ఆయన దర్శకత్వంలో గజిని చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో దర్శకుడు తనకు చెప్పిన కథాపాత్ర వేరని, చిత్రంలో చూపించింది వేరని, తనను ఆ చిత్రంలో డమ్మీని చేశారని ఆరోపణలు చేసింది. తాను జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు గజని చిత్రంలో నటించడం అని సంచలన వ్యాఖ్యలు చేసింది. గజిని తర్వాత నయనతార ఇప్పటివరకు మురుగదాస్ దర్శకత్వంలో నటించలేదు. మళ్లీ ఇప్పుడు రజనీకాంత్కు జంటగా దర్బార్ చిత్రంలో నటించింది. మురుగదాస్పై మళ్లీ ఆగ్రహించడానికి కారణం దర్బార్ చిత్ర పారితోషికమే కారణం అని సమాచారం. ఈ చిత్రంలో నటించినందుకు నయనతారకు పారితోషికం బాకీ ఉందట. దీంతో ఒక రోజు షూటింగ్కు కూడా రాకపోవడంతో హీరో రజనీకాంత్ కూడా ఎదురుచూడాల్సి వచ్చిందట. దర్శకుడు మురుగదాస్ కల్పించుకుని సమాధాన పరిచి నయనతారను నటింపజేసినట్లు టాక్. పారితోషికం చెల్లిస్తేనే నటిస్తానన్న వార్తలు తను ఇమేజ్ను డామేజ్ చేస్తాయని నయనతార భావించినట్లుంది. ఈ కారణంగానే నయనతార తన ఇంటర్వ్యూలో మురుగదాస్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. దర్బార్ చిత్రంలోనూ నయనతార పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో గజనీ చిత్రంతోనే మోసపోయాననుకుంటే మళ్లీ అదే మోసమా అన్న ఆగ్రహంతోనే తాజాగా నయనతార మరోసారి మురుగదాస్పై ఆగ్రహించినట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. దీని గురించి దర్శకుడు మురుగదాస్ ఎలా స్పందిస్తారో, దర్బార్ చిత్ర వర్గాల రియాక్షన్ ఎలా ఉండబోతోందో చూడాలి. -
మరింత యవ్వనంగా..
వయసు పెరుగుతున్న కొద్దీ రజనీకాంత్లో ఎనర్జీ, స్టయిల్, చరిష్మా కూడా పెరుగుతున్నాయి. సినిమా సినిమాకు మరింత ఫ్రెష్ లుక్లోకి మారిపోతున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. నయనతార కథానాయిక. లైకా సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ సెకండ్ లుక్ను ఓనమ్ సందర్భంగా బుధవారం రిలీజ్ చేశారు. ఫైట్కు రెడీ అవుతున్నట్టు గుర్రుగా చూస్తున్నారు రజనీ. ‘మరింత యవ్వనంగా, అందంగా, తెలివిగా, కఠినంగా రజనీకాంత్ను చూపించబోతున్నాం’ అని మురుగదాస్ పేర్కొన్నారు. ఇందులో పోలీస్ అధికారి పాత్రలో రజనీ కనిపిస్తారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ‘దర్బార్’ రిలీజ్ కానుంది. -
చలో జైపూర్
కేసులు, నేరస్థులు, తుపాకులు, పరిశోధనలు.. వీటికి బ్రేక్ ఇచ్చారు రజనీకాంత్. కాస్త రిలీఫ్ కోసం ప్రేయసితో కలిసి డ్యూయెట్ పాడటానికి రెడీ అయిపోయారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ‘దర్బార్’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జైపూర్లో ఆరంభం కానుంది. ఈ కొత్త షెడ్యూల్ ఆదివారం ప్రారంభం అవుతుంది. ఇందుకోసం నయనతార, రజనీ తదితరులు జైపూర్ ప్రయాణమయ్యారు. ఈ చిత్రంలో రజనీ పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారు. ఇప్పటివరకు జరిపిన షెడ్యూల్స్లో పరిశోధనలు, ఫైట్లు.. వీటికి సంబంధించిన సీన్స్ తీశారు. జైపూర్లో సాంగ్తో పాటు, కీలక సన్నివేశాల చిత్రీకరణకు ప్లాన్ చేశారు. -
అభిమానులూ రెడీయా!
సినిమా ఫస్ట్లుక్ విడుదల కాకముందే తమ అభిమాన హీరో లుక్స్ కొన్నింటిని ఫ్యాన్స్ రెడీ చేసి సంబరపడుతుంటారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి సందడి చేస్తుంటారు. ఈ విషయం గురించి ఆలోచించినట్లున్నారు ‘దర్బార్’ చిత్రబృందం. అందుకే కొన్ని పోస్టర్స్ను డిజైన్ చేసే అవకాశాన్ని ఫ్యాన్స్కే వదిలేశారు. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. ఇందులో ఐïపీఎస్ ఆఫీసర్గా నటిస్తున్నారు రజనీ. ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్టు చేసినప్పటికీ ఈ సినిమా లొకేషన్ స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటితో కొన్ని ఫ్యాన్మేడ్ పోస్టర్స్ రెడీ అవుతున్నాయి. దీంతో చిత్రబృందమే రెండు హై క్వాలిటీ ఫొటోస్తో పాటు తమిళ, ఇంగ్లీష్ వెర్షన్ టైటిల్స్ లోగోలను రిలీజ్ చేసింది. వాటితో క్రియేటివ్ పోస్టర్ డిజైన్ చేయమనే బంపర్ ఆఫర్ ఫ్యాన్స్కి ఇచ్చారు. నచ్చిన పోస్టర్ను అధికారికంగా విడుదల చేస్తామని ఏఆర్ మురుగదాస్ వెల్లడించారు. అభిమానులూ.. రెడీయా! -
వైరల్ అవుతున్న రజనీ స్టిల్స్!
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దర్బార్. పేట సినిమాతో సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న రజనీ ప్రస్తుతం సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార రజనీ సరసన కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ లోకేషన్స్లో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా రజనీ పోలీస్ గెటప్కు సంబంధించిన లుక్ సోషల్మీడియాలో వైరల్గా మారింది. సూపర్స్టార్ లుక్ సూపర్బ్ అనిపించేలా ఉండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ స్టిల్స్లో రజనీ వయస్సు 20 ఏళ్లు తక్కువగా కనిపిస్తుందని సంబరపడిపోతున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈసినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుథ్ సంగీతమందిస్తున్నాడు. -
ఆగస్ట్లో గుమ్మడికాయ
ఓ అమ్మాయితో కలిసి రైల్వేస్టేషన్లో వెయిట్ చేస్తున్నారు ఓ పోలీసాఫీసర్. ఆ పోలీసాఫీసర్ ఎవరంటే రజనీకాంత్. అమ్మాయేమో నివేథా థామస్. రజనీకాంత్ హీరోగా ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దర్బార్’లో నివేథా కీలకపాత్ర చేస్తున్నారు. ఇందులో నయనతార కథా నాయికగా నటిస్తున్నారు. సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్ నటిస్తున్నారు. చెన్నైలో వేసిన రైల్వేస్టేషన్ సెట్లో ఇటీవల రజనీకాంత్, నివేదాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ జూలైకల్లా పూర్తవుతుందనే ప్రచారం జరిగింది. ఈ వార్తను మురుగదాస్ ఖండించారు. ‘దర్బార్’ షూటింగ్ ఆగస్టు వరకు జరుగుతుందని వెల్లడించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
ఆ తరహా సినిమాలో త్రిష రాణించేనా!
చెన్నై : దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఒకరు నటి త్రిష. అందం, అభినయాలతో ఈ స్థాయికి చేరుకున్న ఈ అమ్మడికి చాలా కాలంగా రజనీకాంత్తో నటించాన్న కోరిక ఇటీవల పేట చిత్రంతో నెరవేరింది. తన సహ నటీమణులు నయనతార, అనుష్కలా కుటుంబకథా చిత్రాలు, రొమాంటిక్ ప్రేమ కథా చిత్రాల్లో నటించి సక్సెస్ అయిన ఈ బ్యూటీకి హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో నటించి రాణించాలన్న ఆశ మాత్రం ఇంకా నెరవేరలేదు. ఆ ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేకపోయింది. తను ఎంతో ఇష్టపడి నటించిన నాయకి చిత్రం త్రిషను నిరాశ పరిచింది. ఆ తరువాత నటించిన మోహిని చిత్రం అదే బాటలో నడిచింది. ప్రస్తుతం ఆ తరహాలో గర్జన, 1818, పరమపదం విళైయాట్టు వంటి చిత్రాల్లో నటిస్తున్నా, వాటి నిర్మాణ కార్యక్రమాల్లో జాప్యం జరుగుతోంది. తాజాగా నటిస్తున్న చిత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ కథాంశంతో కూడినదే కావడం విశేషం. దీనికి ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథ, సంభాషణలను అందించారు. ఇంతకుముందు ఎంగేయుమ్ ఎప్పోదుమ్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన శరవణన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్లో ప్రారంభమై తొలిషెడ్యూల్ను పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ త్వరలో విదేశాలకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. దీనికి రాంగీ అనే టైటిల్ను నిర్ణయించారు. తాజా షెడ్యూల్ను ఉజ్బెకిస్తాన్లో చిత్రీకరించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ షెడ్యూల్లో ఎక్కువగా నటి త్రిషకు సంబంధించిన పోరాట దృశ్యాలనే చిత్రీకరించనున్నారట. ఈ చిత్రంతోనైనా లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో సక్సెస్ కావాలన్న త్రిష ఆశ నెరవేరేనా? అన్న ఆసక్తి నెలకొంది. ఇంతకుముందు గర్జన చిత్రంలోనూ త్రిష పోరాట సన్నివేశాల్లో నటించింది. అయితే ఆ చిత్ర నిర్మాణం ఆలస్యం అవుతోంది. దీంతో రాంగీ చిత్రం పైనే ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం త్రిష టైమ్ బాగుందనే చెప్పవచ్చు. తన నటించిన 96, పేట చిత్రాలు విజయం సాధించాయి. అదే సక్సెస్ రాంగీ చిత్రానికీ కొనసాగుతుందనే నమ్మకంతో త్రిష ఉందట. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా రజనీ
ముంబైలోని మాఫియాను గడగడలాడించడానికి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా మారారు రజనీకాంత్. ప్రజలను భయపెడుతున్న గ్యాంగ్స్టర్స్కు తూటాతో సమాధానం చెబుతున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత రజనీకాంత్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. అందులోనూ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా కనిపించబోతున్నారట రజనీ. అలాగే ఈ సినిమాలో ఆయన రెండు పాత్రలు చేస్తున్నారని ప్రచారం జరగుతోంది. ఇటీవల ముంబైలో మొదలైన ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. ముఖ్యంగా ముంబైలోని ఓ కాలేజీలో వేసిన పోలీస్ ఇన్వెస్టిగేషన్ రూమ్ సెట్లో రజనీకాంత్పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారని తెలిసింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ 29న స్టార్ట్ చెన్నైలో మొదలవుతుందని తెలిసింది. బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ ‘దర్బార్’లో ఓ విలన్గా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త. -
‘దర్బార్’ సెట్లో ఆంక్షలు
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దర్బార్. పేట సినిమాతో సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న రజనీ ప్రస్తుతం సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార రజనీ సరసన కథానాయికగా నటిస్తోంది. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమాపై లీకు వీరులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఇప్పటికే రజనీ లుక్కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా రజనీతో పాటు నయనతార ఉన్న ఫొటో ఒకటి నెట్లో హల్చల్ చేస్తోంది. దీంతో చిత్రయూనిట్ లీకులను ఆపేందుకు చర్యలు తీసుకుంటోంది. సెట్లోకి విజిటర్స్ రాకుండా నిషేదం విదించటంతో పాటు సెల్ఫొన్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ల వాడకం పై ఆంక్షలు విదిస్తున్నారు. మరి ఈ చర్యలతో అయిన లీకులు ఆగుతాయేమో చూడాలి. -
దర్బార్లోకి ఎంట్రీ
‘దర్బార్’లో ప్లేస్ కన్ఫార్మ్ చేసుకున్నారు హీరోయిన్ నివేదా థామస్. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఐపీఎస్ పోలీసాఫీసర్ పాత్రలో రజనీకాంత్ నటిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా షూట్లోకి జాయిన్ అయ్యారు నయనతార. ఆమెతోపాటు నివేదా థామస్, కమెడియన్ యోగిబాబు కూడా ఈ ముంబై సెట్లో జాయిన్ అయ్యారు. లొకేషన్లో రజనీకాంత్, నివేదా, యోగిబాబు ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో రజనీకాంత్ కూతురి పాత్రలో నివేదా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ‘పాపనాశనం’ సినిమాలో కమల్హాసన్ కూతురిగా నటించారు నివేదా. ‘దర్బార్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
ఆమె లవ్ లాకప్లో ఖైదీ అయ్యాడా!
ముంబై గ్యాంగ్స్టర్ల గుండెల్లో దడ పుట్టిస్తున్నాడు ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్. అతని హృదయంలో ప్రేమ పుట్టించడానికి ఓ అందమైన అమ్మాయి మంగళవారం ముంబై వెళ్లింది. మరి.. ఆ పోలీసాఫీసర్ మనసుకు ఎలా బేడీలు పడ్డాయి? ఆమె లవ్ లాకప్లో ఖైదీ అయ్యాడా? అన్న విషయాలను మాత్రం ‘దర్బార్’ చిత్రంలో చూడాల్సిందే. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో రజనీకాంత్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్లో మంగళవారం నయనతార జాయిన్ అయ్యారు. ఇంతకుముందు ‘చంద్రముఖి’(2005)లో రజనీ సరసన నటించిన నయనతార ఆయన హీరోగా నటించిన ‘కథానాయకుడు’ (2008)లో స్పెషల్సాంగ్ చేశారు. అలాగే ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో నయనతార దాదాపు 14 ఏళ్ల తర్వాత నటిస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో 2005లో వచ్చిన ‘గజినీ’ సినిమాలో ఓ కీలక పాత్ర చేశారు నయనతార. ‘‘నయనతారతో కలిసి మళ్లీ వర్క్ చేయడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు మురుగదాస్. ఈ చిత్రాన్ని అనిరు«థ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ‘దర్బార్’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. -
సయ్యాటలు కాదా? జగడమేనా!
సినిమా: కోలీవుడ్లో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాక్గా మారిన చిత్రం దర్బార్. కారణం టాప్ స్టార్స్ కలయికలో రూపొందుతుండడమే కాదు. చాలా ఆసక్తికరమైన అంశాలను చోటుచేసుకున్న చిత్రం దర్బార్. ప్రధాన అంశం ఇది సూపర్స్టార్ దర్బార్ కావడం. రెండో అంశం లేడీ సూపర్స్టార్ నయనతార నటించడం. మూడోది సంచలన దర్శకుడు ఏఆర్.మురుగదాస్ దర్శకుడు కావడం. ఇవి చాలవా? దర్బార్ ప్రత్యేకతకు. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ క్రేజీ చిత్రానికి యువ సంగీతదర్శకుడు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తుండడం మరో విశేషం. ఇటీవలే దర్బార్ చిత్ర షూటింగ్ను ముంబైలో ప్రారంభించారు.ఇందులో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచా రం ఒక పక్క జరుగుతున్నా, ఆయన చాలా కాలం తరువాత ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారన్న ప్రచారం మరో పక్క జరుగుతోంది. కాగా చంద్రముఖి, కుశేలన్ చిత్రాల తరువాత రజనీకాంత్, నయనతార కలిసి నటిస్తున్న చిత్రం దర్బార్. దీంతో వీరిద్దరూ జంటగా నటిస్తున్నారని అనుకుంటున్న తరుణంలో జంటగా కాదు మరోలా నటిస్తున్నారనే టాక్ తాజాగా స్ప్రెడ్ అయ్యింది. వేరేలా అంటే అసలు ఇందలో రజనీకాంత్కు జోడీనే లేదని, తండ్రీ, కూతుళ్ల మధ్య ప్రేమానుబంధాలను ఆవిష్కరించే ఈ చిత్రంలో రజనీకాంత్కు కూతురిగా నటి నివేదా థామస్ నటించబోతోందని సమాచారం. మరి నయనతార పాత్రేంటి అనే ఆసక్తి కలగవచ్చు. దర్బార్లో రజనీకాంత్, నయనతారల మధ్య సరసాలు ఉండవట. జగడమేనట. అంటే ఇందులో నయనతార ప్రతికథానాయకి పాత్రలో నటిస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. పాత్రకు ప్రాముఖ్యత ఉండడంతో నటించడానికి అంగీకరించిందని, అంతే కాకుండా ఈ చిత్రం కోసం సంచలన నటి నయతార ఏకంగా 60 రోజులు కాల్షీట్స్ కేటాయించిందని సమాచారం. ఈ బ్యూటీ చిత్రం అంతా కనిపిస్తుందట. దర్బార్ టైటిల్ విడుదలతోనూ చిత్రంపై హైప్ పెరిగిపోయింది. ఇప్పుడు నయనతార విలనీయం అనగానే దర్బార్ చిత్రంపై మరింత ఆసక్తి కలుగుతోంది కదూ! అయితే ఈ విషయం గురించి స్పష్టమైన ప్రకటన చిత్ర వర్గాల నుంచి రావలసి ఉందన్నది గమనార్హం. -
డైరీలో ఖాళీ ఇల్లే!
వేగం పెంచారు రజనీకాంత్. అరవైలలో ఇరవైల దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఒక సినిమా పూర్తి కావడం ఆలస్యం మరో సినిమా సైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ‘దర్బార్’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయింది. అప్పుడే ఈ ప్రాజెక్ట్ తర్వాత చేయబోయే రెండు సినిమాలకు డేట్స్ ఇచ్చేశారట రజనీ. తనకు ‘ముత్తు, నరసింహ’ వంటి హిట్స్ ఇచ్చిన దర్శకుడు కేయస్ రవికుమార్ డైరెక్షన్లో ఓ మూవీ, ‘చతురంగవైటై్ట, ఖాకీ’ వంటి హిట్స్ ఇచ్చిన దర్శకుడు హెచ్. వినోద్తో మరో సినిమా అంగీకరించారట. ఈ మూడు సినిమాలతో రజనీ డైరీ 2021 వరకూ ఖాళీ ఇల్లే (లేదు). ఈ సినిమాలు పూర్తయిన తర్వాత 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మీద పూర్తిస్థాయిలో దృష్టిపెట్టే ఆలోచనలో రజనీ ఉన్నట్టు తమిళనాడు టాక్. ‘దర్బార్’ 2020 సంక్రాంతికి రిలీజ్. -
రజినీ ‘దర్బార్’ ప్రారంభం
-
రజనీ దర్బార్
లాఠీ పట్టి నేరగాళ్ల భరతం పట్టడానికి రజనీకాంత్ ఖాకీ డ్రెస్ వేసి పోలీస్గా మారారు. రజనీకాంత్ హీరోగా ‘గజిని, తుపాకి, కత్తి’ చిత్రాల ఫేమ్ ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘దర్బార్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. కెరీర్లో తొలిసారి రజనీకాంత్తో కలిసి వర్క్ చేస్తున్నారు మురుగదాస్. ఇందులో నయనతార కథానాయికగా నటించనున్నారు. ఇంతకుముందు ‘చంద్రముఖి (2005), కథానాయకుడు (2008)’ సినిమాల్లో రజనీకాంత్తో కలిసి సిల్వర్స్క్రీన్ను షేర్ చేసుకున్నారు నయనతార. ఇక ‘దర్బార్’ ఫస్ట్ లుక్ను బట్టి ఈ సినిమాలో రజనీ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఇరవైఏళ్ల తర్వాత పోలీస్ పాత్రలో నటిస్తున్నారట రజనీ. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ బ్యాగ్రౌండ్లో ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ కనిపిస్తోంది. సో.. ఇది ముంబై నేపథ్యంలో సాగే కథాంశమని కన్ఫార్మ్ చేసుకోవచ్చు. మురుగదాస్ ‘తుపాకీ’, రజనీకాంత్ ఇటీవలి ‘కాలా’ చిత్రాలు ముంబై నేపథ్యంలోనే సాగాయన్న సంగతి తెలిసిందే. ‘దర్బార్’ చిత్రానికి అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. సంతోష్ శివన్ ఛాయాగ్రాహకులు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. రజనీకాంత్ గత చిత్రం ‘పేట’ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై, హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. -
సూపర్ స్టార్ ‘దర్బార్’
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల పేటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీ మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేయనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రజనీ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమాకు దర్బార్ అనే టైటిల్ను నిర్ణయించారు. టైటిల్ లోగోతో పాటు సినిమాలో రజనీ లుక్ను కూడా రివీల్ చేశారు చిత్రయూనిట్. రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనున్న ఈ మూవీ 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.స్వరాలందించనున్నాడు. -
జోడీ రిపీట్?
సూపర్స్టార్ రజనీకాంత్తో జోడీ కట్టే హీరోయిన్ ఎవరో తెలిసిపోయిందోచ్ అంటున్నాయి చెన్నై కోడంబాక్కం వర్గాలు. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కొన్ని రోజులుగా పలువురి పేర్లను పరిశీలించింది చిత్రబృందం. ఇటీవల కీర్తీ సురేష్, కాజల్ అగర్వాల్ పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా నయనతార పేరు వినిపిస్తోంది. ఆల్రెడీ నయనతారకు కథ వినిపించారట మురుగదాస్. కథానాయిక నయనే అని కోలీవుడ్ అంటోంది. నయనతార ఈ చిత్రానికి ఊ కొడితే ‘చంద్రముఖి’ చిత్రం తర్వాత రజనీకాంత్, నయనతార జోడీగా మళ్లీ వెండితెరపై కనిపిస్తారు. అంటే.. 14 ఏళ్ల తర్వాత జంటగా నటించనున్నారన్న మాట. రజనీ ‘శివాజీ’లో ఓ స్పెషల్ సాంగ్, ‘కథానాయకుడు’లో ఓ స్పెషల్ సాంగ్ చేశారు నయనతార. రజనీ తాజా చిత్రం షూటింగ్ మార్చిలో ఆరంభం కానుంది. రజనీ, నయన జోడీ రిపీట్ అవుతుందో లేదో వచ్చే నెలలో తెలిసిపోతుంది. -
దళపతి తర్వాత మరోసారి
సూపర్స్టార్ రజనీకాంత్తో చేసే సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్ పెంచారు దర్శకుడు ఏఆర్ మురుగదాస్. ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ను ఎంపిక చేసుకుంటున్నారు కూడా. తాజాగా సంతోష్ శివన్ ఈ సినిమాకు కెమెరామేన్గా ఫిక్స్ అయ్యారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ కెమెరామేన్స్లో సంతోష్ శివన్ ముందు వరుసలో ఉంటారు. ‘దళపతి, రోజా, ఇద్దరు, దిల్సే’ వంటి గుర్తుండిపోయే సినిమాలకు కెమెరా వర్క్ను అందించారు సంతోష్. ‘‘రజనీసార్తో ‘దళపతి’ చిత్రం తర్వాత మళ్లీ కలసి పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాపై చాలా ఎగై్జటింగ్గా ఉన్నాను’’ అని ట్వీటర్లో పేర్కొన్నారు సంతోష్. 28 ఏళ్ల తర్వాత రజనీ, సంతోష్ కలసి పని చేయడం విశేషం. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చిలో స్టార్ట్ కానుంది. -
మురుగదాస్ దర్శకత్వంలో బన్నీ!
హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా భారీ వసూళ్లు సాధించే స్టామినా ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్. ఇటీవల నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో నిరాశపరిచిన ఈ స్టైలిష్ స్టార్.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాతో పాటు బన్నీ మరో రెండు సినిమాలకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టుగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయనున్నాడట. అంతేకాదు తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు బన్నీ ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించనున్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ను 2019 చివర్లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరో కొత్త దర్శకుడితోనూ బన్నీ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. -
జెట్ స్పీడ్!
సినిమా సినిమాకు మధ్యలో గ్యాప్ ఇవ్వడం లేదు. నాలుగైదు నెలల గ్యాప్లోనే స్క్రీన్పై కనిపిస్తున్నారు రజనీకాంత్. ‘కాలా, 2.0, పేట్టా’ మూడు చిత్రాలు ఏడు నెలల గ్యాప్లో రిలీజŒ అయ్యాయి. ఈ స్పీడ్ చూసి ఆశ్చర్యపడకమానలేం. సంక్రాంతికి కొత్త సినిమా ‘పేట్టా’ (తెలుగులో ‘పేట’)తో బరిలోకి దిగుతున్నారు. ఫిబ్రవరి నెలలో మురుగదాస్తో చేయనున్న ప్రాజెక్ట్ను పట్టాలెక్కించనున్నట్లు కోలీవుడ్ సమాచారం. ఇది పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా, రజనీను ఆయన ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఉండబోతోందని ఆ మధ్య ఓ ఫంక్షన్లో పేర్కొన్నారు మురగదాస్. ఆల్రెడీ మురుగదాస్తో ‘సర్కార్’, రజనీతో ‘పేట్టా’ సినిమాలను నిర్మించిన సన్ నెట్వర్క్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రజనీకాంత్ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ప్రవేశించాక సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టొచ్చనే టాక్ కూడా తమిళనాడులో ఉంది. అందుకోసమే ఇలా గ్యాప్ లేకుండా జెట్ స్పీడ్తో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తున్నారా? -
‘సర్కార్’లో విజయ్ చెప్పినట్టే చేస్తున్నాం..!!
-
‘సర్కార్’లో విజయ్ చెప్పినట్టే చేస్తున్నాం..!!
సాక్షి, చెన్నై : ఇళయ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘సర్కార్’ సినిమా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమిళనాడు దిగవంత సీఎం జయలలితను తప్పుగా చూపించారంటూ అన్నాడీఎంకే మంత్రులు మండిపడుతున్నారు. అలాగే, ఆమె ప్రవేశపెట్టిన ఉచిత పథకాలపై విమర్శనాత్మకంగా ఉన్న కొన్ని సీన్లను తొలగించాలని తమిళనాడు మంత్రులతో పాటు అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆ సీన్లను తొలగించకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సినిమాలోని అభ్యంతకరమైన సీన్లను తొలగించేందుకు నిర్మాతలు అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. (‘సర్కార్’పై ఏమిటీ అరాచకం!) అయితే, తమ అభిమాన హీరో సినిమాపట్ల అన్నాడీఎంకే నేతలు వ్యవహరించిన తీరుపై విజయ్ అభిమానులు మండిపడుతున్నారు. హీరో విజయ్ చెప్పింది నిజమేనంటూ ‘సర్కార్’ సినిమాలో చూపిన విధంగా.. జయలలిత హయాంలో ఇచ్చిన ఉచిత కంప్యూటర్లు, గ్రైండర్లు, మిక్సీలు, టేబుల్ ఫ్యాన్లు, ఇతర వస్తులవులను మంటల్లో వేసి బూడిద చేశారు. ఇప్పుడీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో ‘మహానటి’ ఫేం కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించారు. (వంద కోట్లు కొల్లగొట్టిన ‘సర్కార్’!) (చదవండి : ప్రభుత్వం అంత బలహీనమా?) (చదవండి : హై డ్రామా) -
మురుగదాస్కు హైకోర్టులో ఊరట
సాక్షి, చెన్నై: సర్కార్ మూవీ తమిళనాట పలు వివాదాలకు కేంద్రబిందువవుతోంది. ఈ సినిమాలోని కొన్ని డైలాగులు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని పాలక ఏఐఏడీఎంకే అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈనెల 27 వరకూ సర్కార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ను అరెస్ట్ చేయవద్దని మద్రాస్ హైకోర్ట్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐఏడీఎంకే నేతలు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో చేపట్టిన నిరసనలకు తలొగ్గిన చిత్ర మేకర్లు వివాదాస్పద సంభాషణలను తొలగించేందుకు అంగీకరించారు. చిత్ర దర్శకుడు మురుగదాస్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన మద్రాస్ హైకోర్ట్ను ఆశ్రయించారు. ఏ ఒక్కరినీ బాధపెట్టాలన్నది తన ఉద్దేశం కాదని మురుగదాస్ పిటిషన్లో పేర్కొన్నారు. కాగా మురుగదాస్ను అరెస్ట్ చేసేందుకు చెన్నై పోలీసులు సిద్ధమయ్యారని గురువారం రాత్రి చిత్ర నిర్మాతలు సన్ పిక్చర్స్ ట్వీట్ చేయగా, పోలీసు అధికారులు దీన్ని తోసిపుచ్చారు. రొటీన్ గస్తీలో భాగంగా ఆ ప్రాంతంలో పోలీస్ బృందం పహారాలో ఉందని వివరణ ఇచ్చారు. మరోవైపు గత రాత్రి పోలీసులు తమ ఇంటికి వచ్చి తన తలుపు తట్టారని, ఆ సమయంలో తాను ఇంట్లో లేకపోవడంతో వారు వెనుదిరిగారని, ప్రస్తుతం తన ఇంటి వద్ద పోలీసులు ఎవరూ లేరని తనకు తెలిసిందని దర్శకుడు మురుగదాస్ ఆ తర్వాత ట్వీట్ చేశారు. సర్కార్ మూవీకి నిరసనల సెగతో రజనీకాంత్, కమల్హాసన్ చిత్ర బృందానికి బాసటగా నిలిచారు. ఒత్తిడి పెంచేందుకు ఇలాంటి చర్యలను ఎంచుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. కాగా సర్కార్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మించారు.విజయ్, కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలైన రెండు రోజులకే రూ 100 కోట్ల క్లబ్లో చేరింది. -
వంద కోట్లు కొల్లగొట్టిన ‘సర్కార్’!
ఇళయ దళపతి విజయ్ సినిమా అంటేనే బాక్సాఫీస్లు బయపడుతుంటాయి. సినిమా టాక్తో సంబంధం లేకుండా రికార్డులను వేటాడేస్తుంది. ఇంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ ఈ మంగళవారం ‘సర్కార్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో ఇప్పటికే రెండు బ్లాక్బస్టర్ హిట్లను తన అభిమానులకు అందించిన విజయ్.. ఈ సారి సర్కార్తో మరోసారి ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా మొదటిరోజే కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఒక్క మొదటిరోజే తమిళనాడులో దాదాపు ముప్పై కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 2.32కోట్లు, కేరళలో దాదాపు 6కోట్లను కలెక్ట్ చేసి.. సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఇక ఓవర్సీస్లో ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. యూకే, సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికాల్లో ఈ సినిమా దూసుకెళ్తోంది. ఈ మూవీ రెండు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాను దాదాపు 3400 స్ర్కీన్స్పై విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం మెర్సెల్ రికార్డులను అధిగమించేట్టుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీలో కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. #Sarkar100CrIn2Days According to Team #Sarkar , the movie has crossed 100 Crs gross WW in 2 Days.. pic.twitter.com/HlrRPftudJ — Ramesh Bala (@rameshlaus) November 8, 2018 -
గూగుల్ సర్చ్లో ఇప్పుడు అదే టాప్!
మనకు ఏ విషయం గురించి తెలియకపోయినా.. వెంటనే చేసే పని గూగుల్లో వెతకడం. గూగుల్లో ఎప్పుడు ఏదీ ఎలా ట్రెండ్ అవుతుందో చెప్పడం కష్టమే. రోజుకు కొన్ని కోట్ల మంది గూగుల్లో ఏదో ఒక విషయం గురించి సర్చ్ చేస్తుంటారు. ప్రస్తుతం ఇలా ఎక్కువమంది టాపిక్ ఏంటో తెలుసా?. విజయ్ నటించిన సర్కార్ మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో దొంగ ఓట్ల నేపథ్యంలో తెరకెక్కించగా.. సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. అయితే ఈ సినిమాలో సెక్షన్ 49పి అనే టాపిక్ హైలెట్గా మారింది. కథ అంతా ఈ సెక్షన్ చుట్టూనే తిరుగుతుంది. ఈ సెక్షన్ ప్రకారం పోలింగ్ సమయంలో తన ఓటును ఎవరైనా వేసినట్టు ఓటరు గుర్తిస్తే వెంటనే ఆ పోలింగ్ బూత్కు వెళ్లి ఆ ఓటును వెనక్కి తీసేయమనీ, మళ్లీ తన ఓటు తాను వేసుకునే వీలు కల్పించమని అడిగే హక్కు ఓటరుకు ఉంటుంది. ఇప్పటివరకు ఇలాంటి సెక్షన్ ఒకటి ఉందని తెలియని నెటిజన్లు దీని గురించి గూగుల్లో తెగ వెతికేస్తున్నారట.