రంజాన్‌ స్పెషల్.. ఆలయానికి సింగర్‌! | Singer Mano Visits Kanchi Temple On Ramzan Special | Sakshi
Sakshi News home page

రంజాన్‌ స్పెషల్.. ఆలయానికి సింగర్‌!

Jun 16 2018 7:20 PM | Updated on Jun 16 2018 7:47 PM

Singer Mano Visits Kanchi Temple On Ramzan Special - Sakshi

ప్రముఖ గాయకుడు మనో (నాగూర్‌ బాబు) పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాల్ ఆలయాన్ని దర్శించారు. ఆలయంలోని స్వామివారి ముందు ‘అదిగో అల్లదిగో శ్రీ హరివాసమూ’ అంటూ గానాలాపన చేసి భక్తి పారవశ్యం చెందారు. తన శ్రీమతి జమీలా బాబుతో కలిసి మతసామరస్యానికి ప్రతీకగా ఆయన వరదరాజ స్వామివారిని దర్శించుకోవటం గమనార్హం. ప్రతి ఏడాది రంజాన్ పండుగను తన నివాసంలో ఎంతో వేడుకగా జరుపుకునే సింగర్‌ మనో ఈసారి ఆలయాన్ని దర్శించుకుని, స్వామివారి ముందు వేంకటేశ్వరుని భక్తిపారవశ్యంతో కీర్తించటం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement