మనుషులు మారితేనే... | tamma reddy bharadhwaj new film "prathi ghatana" | Sakshi
Sakshi News home page

మనుషులు మారితేనే...

Published Fri, Jan 31 2014 11:38 PM | Last Updated on Thu, Jul 11 2019 9:16 PM

మనుషులు మారితేనే... - Sakshi

మనుషులు మారితేనే...

చాలా విరామం తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ప్రతిఘటన’. చార్మి జర్నలిస్ట్‌గా లీడ్‌రోల్ చేస్తున్నారు. రేష్మ, తనికెళ్ల భరణి, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 చాలా విరామం తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ప్రతిఘటన’. చార్మి జర్నలిస్ట్‌గా లీడ్‌రోల్ చేస్తున్నారు. రేష్మ, తనికెళ్ల భరణి, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ -‘‘ఒరిస్సాలో జరిగిన రేప్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల గురించి చెబుతూ, మనుషులు మారితేనే సమాజం, నాయకులు కూడా మారతారని ఇందులో చూపిస్తున్నాం. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’’ అని తెలిపారు. బాధ్యతాయుతమైన చిత్రంలో నటించినందుకు రేష్మ సంతోషం వెలిబుచ్చారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.గోపాల్‌రెడ్డి, సంగీతం: ఎం.ఎం.కీరవాణి-యశ్వంత్ నాగ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement