tammareddy bharadwaja
-
మా సినిమాలో ఎవరి ముఖాలు కనిపించవు.. పెద్ద ప్రయోగమే!
‘‘డైరెక్టర్ స్టీవెన్ స్పీల్ బర్గ్ తీసిన ‘డ్యూయల్’ చిత్రంలో నటీనటుల ముఖం కనిపించదు. అలాంటి నేపథ్యంలో ‘రా రాజా’ సినిమా తీసి దర్శకుడు శివ ప్రసాద్ ధైర్యం చేశాడు. ఇది చాలా పెద్ద ప్రయోగం’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. బి. శివ ప్రసాద్ దర్శకత్వంలో పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్పై రూపొందిన చిత్రం ‘రా రాజా’. బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన ఈ సినిమా మార్చి 7న విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ను తమ్మారెడ్డి భరద్వాజ్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ముఖాలు కనిపించవు. కథే ముందుకు వెళ్తుంటుంది. ఇది అద్భుతమైన ఐడియా. ఇది సక్సెస్ అయితే హీరోలు, స్టార్లతో పని లేకుండా అద్భుతమైన చిత్రాలు, ప్రయోగాలు చేయొచ్చని అంతా ముందుకు వస్తారు’’ అన్నారు. ‘‘మా చిత్రంలో నటీనటుల ముఖాలు కనిపించవు. కథ, కథనమే ముఖ్యంగా ఈ మూవీని తీశాం. ఇది ఒక ప్రయోగం’’ అన్నారు డైరెక్టర్ శివప్రసాద్. చదవండి: అమ్మానాన్న విడిపోయినప్పుడు హ్యాపీగా ఉన్నా: నటి -
సీఎం దగ్గరకు వెళ్లి అడుక్కోవడం కరెక్ట్ కాదు: తమ్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: టికెట్ రేట్ల పెంపు కోసం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్లి దేహి అని అడుక్కోవడం సరికాదంటున్నాడు ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaj). మొన్న జరిగింది ఇండస్ట్రీ సమావేశం కాదని, వ్యక్తిగతంగా కొందరు ప్రభుత్వాన్ని కలిశారని తెలిపాడు. కాగా సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలుగు సినీ ప్రముఖులతో గురువారం (డిసెంబర్ 26న) సమావేశమయ్యారు.ఇండస్ట్రీ మీటింగ్ కాదు!ఈ మీటింగ్ గురించి తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. 'ఇది ప్రభుత్వం పిలిచి మరీ ఏర్పాటు చేసిన మీటింగ్ కాదనుకుంటున్నాను. ఆ మీటింగ్కు నాకు ఆహ్వానం అందలేదు. ఇండస్ట్రీ అంటే ఛాంబర్ ఒక్కటే.. అన్ని సెక్టార్లు కలిపితేనే ఇండస్ట్రీ. అవన్నీ ఛాంబర్ కిందే ఉంటాయి. అది ఛాంబర్ సమావేశం కాదని తెలిసింది. టీఎఫ్డీసీ (Telangana Film Development Corporation) చైర్మన్ దిల్రాజును పిలవడంతో ఆయన కొంతమందిని తీసుకెళ్లారు. సినిమాలు తీసే నిర్మాతలు వాటి పరిష్కారం కోసం వెళ్లారు. బెనిఫిట్ షోలు వద్దని ముందే చెప్పా.. ఇప్పటికైతే పుష్ప 2తో ఏర్పడిన గ్యాప్ పోయింది. అల్లు అర్జున్ సమస్య సద్దుమణిగిపోయింది.సమాజానికి ఉపయోగపడేవి చేయండిటాలీవుడ్ ఇప్పటికే ప్రపంచరికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. మన దగ్గర అన్ని భాషల సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ ఇక్కడ పెట్టాలంటే హైదరాబాద్లో ఆఫీస్లు ఉండాలి. ఇకపోతే అల్లు అర్జున్, సుకుమార్ గతంలో మంచి సందేశాన్నిచ్చే షార్ట్ ఫిలిం చేశారు. ఎన్టీఆర్, చిరంజీవిగారు కూడా చేశారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు సినిమా వాళ్ల మద్దతుండాలి. కేవలం మూవీ రిలీజప్పుడే కాకుండా అవసరమైనప్పుడు అందుబాటులో ఉండాలి' అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చాడు.చదవండి: సల్మాన్తో ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి జింటా -
KSR Live Show: ఒక్కరి కోసం.. ఇండస్ట్రీకి ఇది అవమానం.. తమ్మారెడ్డి సంచలన కామెంట్స్
-
రిషబ్ శెట్టిలా పెద్ద హీరో కావాలి: తమ్మారెడ్డి భరద్వాజ
‘‘జాతర’ సినిమా ట్రైలర్ ఆసక్తిగా ఉంది. మంచి కథ ఉంటే.. హీరో, దర్శకుల గురించి ప్రేక్షకులు పట్టించుకోరు. కొత్తగా వచ్చిన సతీష్ హీరో, రైటర్, డైరెక్టర్ అయ్యాడు. రిషబ్ శెట్టిలా తను కూడా పెద్ద హీరో, పెద్ద దర్శకుడు కావాలి. అలాగే ‘జాతర’ చిత్రం ఘనవిజయం సాధించాలి’’ అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సతీష్ బాబు రాటకొండ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘జాతర’. దీయా రాజ్ హీరోయిన్గా నటించారు. గల్లా మంజునాథ్ సమర్పణలో రాధాకృష్ణా రెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు శివ బాలాజీ మాట్లాడుతూ– ‘‘జాతర’ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘మంచి కథతో ఈ మూవీని చక్కగా తీశారాయన’’ అని శివ శంకర్ రెడ్డి చెప్పారు. ‘‘నటుడిగా, దర్శకుడిగా ఇది నా మొదటి సినిమా. మా చిత్రాన్ని ఆదరించాలి’’ అని సతీష్ బాబు రాటకొండ కోరారు. -
నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో లవ్ రెడ్డి మూవీ టీమ్ ఇంటర్వ్యూ
-
ఇండస్ట్రీలోని మహిళలకు ఆ ధైర్యం ఇవ్వలేకపోతున్నాం: తమ్మారెడ్డి భరద్వాజ
‘‘తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ 2018లో సెక్సువల్ హెరాస్మెంట్ రెడ్రెసెల్ ప్యానెల్ (లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్)ను ఆరంభించడం జరిగింది. మా దృష్టికి వచ్చిన ఫిర్యాదులను షరిష్కరించాం. పదిహేను రోజుల క్రితం ఓ కేసు మా దృష్టికి వచ్చింది. వారిద్దరి వ్యక్తిగత స్టేట్మెంట్స్ను తీసుకోవడం జరిగింది. కొన్ని ఆధారాల కోసం ఎదురు చూస్తున్నాం. అలాగే క్రిమినల్ కేసు కూడా నమోదు అయ్యిందన్న విషయం మా దృష్టికి వచ్చింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మా రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేస్తాం’’ అని సెక్రటరీ, కన్వీనర్, నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ అన్నారు. ఇదిలా ఉంటే... కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ విషయం చర్చనీయాంశమైంది. సినిమా ఇండస్ట్రీలో మహిళల భద్రత గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ వివాదం తేలేవరకూ అతన్ని డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని, అసోసియేషన్ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఫెడరేషన్కు చె΄్పాం. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై ఇంటర్నల్ రిపోర్ట్ వచ్చాక నిర్ణ యిస్తాం. చాంబర్ కార్యాలయంలో ఓ కంప్లైట్ బాక్స్ ఉంది. ఎవరైనా ఫిర్యాదులు చేయవచ్చు. ఫోన్కాల్, మెయిల్, పోస్ట్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఇది ఎప్పట్నుంచో ఉంది. అలాగే ఇండస్ట్రీలో ఉమెన్ సపోర్ట్ టీమ్ కూడా ఉంది. ఈ విషయం కొంతమందికి తెలియకపోవచ్చు. ప్రస్తుత వివాదం ముగిసిపోగానే ఈ టీమ్ గురించి అన్ని అసోసియేషన్లకు అవగాహన కల్పిస్తాం’’ అని అన్నారు. లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ చైర్పర్సన్ ఝాన్సీ మాట్లాడుతూ– ‘‘శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత ఓ కమిటీని ఫామ్ చేశాం. ఇతర ఇండస్ట్రీస్లో జరగుతున్న సెక్సువల్ హెరాస్మెంట్ ఇక్కడ కూడా జరుగుతోంది.ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు కొరియోగ్రాఫర్స్ మధ్య నెలకొన్న వివాదం ఇది. మేం ఇద్దరి స్టేట్మెంట్స్ను రికార్డ్ చేశాం. అయితే ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసే సమయంలో తెలిసింది... కేసు చాలా సీరియస్ అని. లీగల్ సపోర్ట్ కూడా ఆ అమ్మాయికి అవసరం అని అర్థమైంది. మా పరిధిలో మేం చేయాల్సినది ఆమెకు చేశాం. బాధితురాలిగా చెప్పబడిన అమ్మాయి మైనర్గా ఉన్నప్పట్నుంచే ఇండస్ట్రీలో పని చేస్తోంది. అయితే మైనర్గా ఇండస్ట్రీలో ఆమెకు చోటు కల్పించిన విధానం ్రపోటోకాల్ ప్రకారంగానే జరిగిందా? లేదా అనే విషయంపై కూడా ఎంక్వయిరీ జరుగుతోంది. మా ప్రస్తుత గైడ్లైన్స్ ప్రకారం 90 రోజుల్లో కేసును పరిష్కరించాలి. కానీ అంతకుముందే ముగించాలని మేం అనుకుంటున్నాం. ఎంక్వయిరీ తర్వాత మా రిపోర్ట్ చెబుతాం. ఎలాంటి చర్యలు తీసుకుంటామో చెబుతాం. ఇండస్ట్రీలోని వారంతా ఈ ఇష్యూపై బయటకు మాట్లడకపోయినా అంతర్గతంగా చర్చిస్తున్నారు. ఆమెకు సపోర్ట్గా ఉంటామని ఓ పెద్ద హీరో తన మేనేజర్తో చెప్పించారు. దర్శకులు– నిర్మాతలు స్పందిస్తున్నారు. ఇండస్ట్రీలో టాలెంట్కు వర్క్ ఉంటుంది. ఒకవేళ ఫేక్ కంప్లైట్స్ వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా ప్రత్యేక సెక్షన్ ఉంది. ఇండస్ట్రీలోని మహిళల రక్షణకు సంబంధించి ప్రభుత్వం తరఫు నుంచి సరైన గైడ్లైన్స్ లేవు. అలాగే ‘వాయిస్ ఆఫ్ ఉమెన్’ గురించి సమంతగారు సోషల్ మీడియాలో స్పందించారు. కానీ ‘వాయిస్ ఆఫ్ ఉమెన్’ అనేది ఇండస్ట్రీ నుంచి సెపరేట్ కాదు. దీనికి సంబంధించి ప్రభుత్వంతో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. బయటకు రాలేదు అంతే. సరైన సమయంలో పెద్దలు మాట్లాడతారు. అలాగే ఈ కేసుకు సంబంధించి బాధితురాలి ఫేస్ను మీడియా బయటపెట్టకూడదని కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు.‘‘2013లో ఆసరా అని పెట్టి, కొన్ని కేసులను పరిష్కరించడం జరిగింది. 2018లో సరికొత్తగా ఈ ప్యానెల్ పెట్టాం. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నాం. కానీ ఇండస్ట్రీలో ఉన్న మహిళలకు ధైర్యం ఇవ్వలేకపోతున్నాం. ఫలానా చోటుకు వచ్చి మీ సమస్యలపై ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని చెప్పలేకపోతున్నామని నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ తరహా కేసులు లేవని కాదు. జరుగుతున్నవి జరిగినా కానీ, చాలా కేసులు రావడం లేదని నా అభిప్రాయం. వచ్చినవరకు సాల్వ్ చేస్తున్నాం. సినిమాల్లో తనకు ఏదైనా అన్యాయం జరిగితే సపోర్ట్ చేసేందుకు ఇండస్ట్రీ ఉందనే ధైర్యం అమ్మాయిలకు రావాలి. ఆ ధైర్యం రావాలంటే కమిటీ ఉండాలి. వచ్చిన కేసులను మంచిగా సాల్వ్ చేయాలి. ప్రస్తుత కేసును సాల్వ్ చేయడానికి కొంత సమయం ఉంది. అలాగే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి యూనియన్కు ఓ కంప్లైట్ కమిటీ ఉండాలని సూచించాం. అలాగే మాకు కూడా డైరెక్ట్గా కంప్లైట్ చేయవచ్చు’’ అని ‘లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్’ అంతర్గత సభ్యులు, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో మైనర్లు ఎందుకు పని చేయాల్సి వచ్చిందన్న ప్రశ్నకు నిర్మాత వివేక్ కూచిభొట్ల స్పందిస్తూ– ‘‘చిన్నారులు డ్యాన్స్ చేయాల్సి అవసరం వచ్చినప్పుడు వారి తల్లిదండ్రుల అనుమతి తీసుకుంటాం. మేజర్ అయితే సభ్యత్వం ఇస్తాం’’ అని కమిటీ అంతర్గత సభ్యులు, నిర్మాత వివేక్ కూచిబొట్ల అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది, ‘పీఓఎస్హెచ్’ (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్) ఎక్స్పర్ట్ కావ్య మండవ తదితరులు మాట్లాడారు. -
జానీ మాస్టర్ వివాదంపై ఫిలిం ఛాంబర్ ఏం చెబుతుందంటే..?
లైంగిక వేధింపుల ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై కేసు నమోదైంది. తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి జానీపై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అయితే జానీ వివాదంపై తాజాగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీడియా సమావేశం నిర్వహించింది. అందులో తమ్మారెడ్డి భరద్వాజ, ఝూన్సీ, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ పాల్గొన్నారు.జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని మధ్యప్రదేశ్కు చెందిన యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేగింది. దీంతో ఫిలిం ఛాంబర్ కూడా రియాక్ట్ అయింది. జానీ మాస్టర్ మీద ఆరోపణలు రావడంతో ఈ వివాదం తేలే వరకు అతన్ని డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్ను ఇప్పటికే ఆదేశించామని ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ తెలిపారు.చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి యాంకర్,నటి ఝాన్సీ రియాక్ట్ అయ్యారు. 'మన ఇండస్ట్రీలో మహిళా రక్షణ కోసం సరైన గెడ్ లైన్స్ లేవు. నటి శ్రీ రెడ్డి ఇష్యూ తరువాత ఒక కమిటీ ఫామ్ అయింది. జానీ మాస్టర్ ఇష్యూ తెరపైకి వచ్చిన వెంటనే ఆ కమిటీ వారు పరిశీలిస్తున్నారు. ఈ వివాదంలో బాధితురాలు తొలుత తన వర్క్ పరంగా ఇబ్బంది అని ముందుకు వచ్చింది. కానీ, ఆ తర్వాత లైంగిక వేధింపులు కూడా ఉన్నాయని పేర్కొంది. ఆ అమ్మాయి స్టేట్మెంట్తో పాటు జానీ మాటలను కూడా కూడా రికార్డు చేశాం. అయితే, లైంగిక వేధింపులు అనేది వర్క్ ప్లేస్లో జరగలేదు. ఆ అమ్మాయి ఇప్పటకే లీగల్గా ముందుకు వెళ్తుంది. అయితే, మీడియా వారు బాధితురాలి ఫోటోలను రివీల్ చేయవద్దని కోరుతున్నా. విచారణ సాగుతుంది. 90రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ వస్తుంది.' అని ఝాన్సీ తెలిపారు.తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. 'మొదట మీడియా వారి నుంచే జానీ మాస్టర్ వివాదం మా వద్దకు వచ్చింది. ఇండస్ట్రీలో ఇబ్బందులు పడే వారి కోసం 2013లో ఆసరా అని పెట్టి.. 2018లో సరికొత్తగా ప్యానల్ పేరుతో మార్చాం. ఇలా పేర్లు అయితే మార్చాం కానీ, ఒక మహిళకు దైర్యం ఇవ్వలేకపోతున్నాం. ఇండస్ట్రీలోని ప్రతి అమ్మాయికి ఆపద వస్తే తమకు సపోర్ట్ ఉందనే బరోసా కల్పించాలి. అందుకు తగ్గ కమిటీ నిర్ణయాలు ఉండాలి. కచ్చితంగా 90 రోజుల్లోనే జానీ మాస్టర్ కేసు పూర్తి అవుతుంది.కానీ, సినిమా ఇండస్ట్రీలో ప్రతి అమ్మాయికి రక్షణ కావాలి. ఛాంబర్ తరపున ప్రతి యూనియన్కు ఓ కంప్లైట్ కమిటీ పెట్టుకోవాలని ఈ సందర్భంగా సూచించనున్నాం. డాన్సర్ యూనియన్ వారు కూడా ఈ విషయంలో మాతో పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు.' అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. -
'స్వాతంత్య్రం' సాంగ్ లాంచ్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదగా స్వాతంత్రం మా స్వాతంత్ర్యం అనే పాటను విడుదల చేశారు. ప్రజానాట్యమండలి రూపకల్పనలో ఎం శేషగిరి రచించిన ఈ పాటను శ్రీనివాస్ నందుల సంగీత సారధ్యంలో లక్ష్మణ్ పూడి పాడారు. సాంగ్ను లాంచ్ చేసిన అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ ఇలా మాట్లాడారు.సాంగ్ విడుదల సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. 'స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు అయ్యింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన దేశం ఆర్థికంగా, టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. కానీ నిరక్షరాస్యత, పేదరికంలో చాలా కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పరిస్థితులు అన్నిటిని దృష్టిలో పెట్టుకుని లక్ష్మణ్ పూడి గారు స్వాతంత్ర్యం మీద చేసిన సాంగ్ అద్బుతంగా ఉంది.' అన్నారు. ప్రజానాట్యమండలి గాయకుడు లక్ష్మణ్ పూడి మాట్లాడుతూ.. 'నేను కారులో వెళుతున్నప్పుడు సిగ్నల్స్ దగ్గర భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న వారిని పలకరించాను. వారికి స్వాతంత్య్రం అంటే ఏమిటో తెలియదు. దేశం మీద ప్రేమతో ఇలాంటి నిరక్షరాస్యులను పాటతో మేల్కొల్పటానికి ఈ సాంగ్ చేయడం జరిగింది. సాంగ్ లాంచ్ చేసిన మా గురువు గారు భరద్వాజ్ గారికి కృతజ్ఞతలు' అని ఆయన అన్నారు. కార్యక్రమానికి సినిమా డైరెక్టర్ కర్రి బాలాజీ, వంశీ లక్ష్మణ్ పూడి తదితరులు హాజరయ్యారు. -
రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన సినీ పెద్దలు
-
ఈ సినిమా చూశాక కన్నీళ్లు ఆపుకోలేకపోయా: తమ్మారెడ్డి భరద్వాజ
కొత్త కథలు, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇప్పుడు ఆడియెన్స్ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. అలాంటి ఓ డిఫరెంట్ కంటెంట్తో వచ్చిన సినిమానే మ్యూజిక్ షాప్ మూర్తి.. ఇప్పటికే థియేటర్ ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా తాజాగా ఓటీటీలో కూడా సందడి చేస్తుంది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది.అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు ప్రముఖ పాత్రల్లో నటించిన ఈ సినిమాను థియేటర్లో చూసిన ప్రతీ ఒక్కరూ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. బరువెక్కిన గుండెతో థియేటర్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓటీటీలో విడుదలైన సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా ప్రతినిధుల సమక్షంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శకనిర్మాతలతో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది.ఈ సందర్భంగా నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. 'ప్రతి మనిషి జీవితంలో జరిగే కథనే ఇది. ఎన్నో కష్టాలు దాటుకొని వచ్చిన తర్వాతే విజయం వరిస్తుంది. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు పేరు పేరునా కృతజ్ఞతలు. ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ ఎంతో కో-ఆపరేటివ్ గా పని చేశారు. ఓ ఫ్యామిలీలా అందరం కలిసి ఈ సినిమాను రూపొందించాం. నన్ను తెలుగు తెరపై చూపించిన మొదటి దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు ఈ సినిమా చూసి నాకు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. ఈ సినిమా కథను నమ్మి డబ్బు పెట్టిన నిర్మాతలకు సెల్యూట్. శివ సినిమాను బాగా రూపొందించారు. ఈ సినిమాలోని చాలా సీన్స్ నా నిజ జీవితంలో జరిగినవే.' అని ఆయన అన్నారు.ముఖ్య అతిధిగా వచ్చిన దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ చూశాక ఈ అజయ్ ఘోష్ని పెట్టి సినిమా తీసుకున్నారు. వీళ్ళ పని అయిపోనట్లే అనుకున్నా. కానీ, సినిమా చూశాక మతిపోయింది. చివరలో అయితే ఈ సినిమా సీన్స్ చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయా. ఈ సినిమాను చాలా డిఫరెంట్గా రూపొందించారు. కష్టాలు, కన్నీళ్లు కాదు మంచితనంతో కొట్టారు. సినిమా సక్సెస్ అయింది కానీ ఈ సినిమాతో వీళ్లకు డబ్బులు వచ్చాయని అయితే నేను నమ్మను. మంచి సినిమాను ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాలకు మీడియా వాళ్ల సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది.' అని తమ్మారెడ్డి అన్నారు. -
వేరు కుంపట్లతో దాసరిగారి పేరు చెడగొట్టొద్దు: దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
‘‘నరసింహారావుగారు (దర్శకుడు) మాట్లాడి, దాసరిగారి పేరిట రామ సత్యనారాయణ ఓ ఈవెంట్ చేశారు. రేపు మేం చేయబోతున్నాం అన్నారు. నేనేం అంటున్నానంటే... వచ్చే ఏడాది నుంచి సినిమా ఇండస్ట్రీ తరఫున దాసరిగారి జయంతిని అందరూ ఒక్కటై, ఒకే వేడుకలా జరుపుకునేలా ΄్లాన్ చేద్దాం. బయటివాళ్లు కావాలంటే ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు చేసుకుంటారు.ఇండస్ట్రీలో వేరు వేరు కుంపట్లు పెట్టి, గురువు (దాసరి నారాయణరావు) గారి పేరుని మనం చెడగొట్టొద్దు. గురువుగారి పేరును నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి (మే 4)ని ‘డైరెక్టర్స్ డే’గా తెలుగు పరిశ్రమ సెలబ్రేట్ చేసుకుంటోంది. తెలుగు దర్శకుల సంఘం ఆధ్వర్యంలో మే 4న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ వేడుక జరగాల్సింది.కానీ ఎన్నికల సమయంలో ఇలాంటి పెద్ద ఈవెంట్ నిర్వహిస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని పోలీస్ శాఖ చెప్పిన నేపథ్యంలో ఈవెంట్ తేదీని ఈ నెల 19కి మార్చామని తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ఈ వేడుక కొత్త తేదీ పోస్టర్ను తమ్మారెడ్డి భరద్వాజ, సి. కల్యాణ్, దామోదర ప్రసాద్ విడుదల చేశారు. ‘‘దేశవ్యాప్తంగా సినీ కార్మికుల సంక్షేమంలో టాలీవుడ్ నంబర్ వన్గా ఉందంటే కారణం దాసరిగారే’’ అన్నారు సి. కల్యాణ్.‘‘డైరెక్టర్స్ డే ఈవెంట్ సక్సెస్ కావడానికి శ్రమిస్తున్న యువ దర్శకులకు ధన్యవాదాలు’’ అన్నారు వీరశంకర్. ‘‘దాసరిగారి పేరిట రామసత్యనారాయణ ఈవెంట్ చేశారు. మే 5న మేం చేస్తున్నాం. దర్శకుల సంఘం చేయనున్న ఈవెంట్ కూడా సక్సెస్ కావాలి’’ అన్నారు రేలంగి నరసింహారావు. నిర్మాతలు దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, దర్శకులు ఎన్. శంకర్, సముద్ర, మెహర్ రమేష్, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, వశిష్ఠ, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని తదితరులు పాల్గొన్నారు. -
జర్నీ టు అయోధ్య
శ్రీరామ నవమిని పురస్కరించుకుని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ అధినేత వేణు దోనేపూడి ‘జర్నీ టు అయోధ్య’ (వర్కింగ్ టైటిల్) పేరుతో సినిమా ప్రకటించారు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ‘విశ్వం’ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ బేనర్లో ‘జర్నీ టు అయోధ్య’ రెండో సినిమా. దర్శకుడు వీఎన్ ఆదిత్య ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ‘‘అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ్ర΄÷డక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే వీఎన్ ఆదిత్య నేతృత్వంలో అయోధ్య సహా పలు చోట్ల లొకేషన్స్ పరిశీలిస్తున్నారు. ఒక యంగ్ డైరెక్టర్ తెరకెక్కించనున్న ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి దర్శక– నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ సారధ్యం వహిస్తున్నారు. -
దాసరి నారాయణరావు 77వ జయంతి వేడుకలకు ఏర్పాట్లు
దశాధిక రంగాల్లో అసాధారణ స్థాయిలో రాణించి, శతాధిక చిత్ర దర్శకునిగా... అనుపమాన దార్శకునిగా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆచంద్రతారార్కం నిలిచిపోయే పేరు ప్రఖ్యాతులు గడించిన దర్శక శిఖరం డాక్టర్ దాసరి నారాయణరావు 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆయన ప్రియ శిష్యులు సన్నాహాలు చేస్తున్నారు. దాసరి బహుముఖ ప్రతిభను నేటి తరానికి గుర్తు చేస్తూ... వారిలో స్ఫూర్తిని నింపేందుకు "దర్శకరత్న డి.ఎన్. ఆర్.ఫిల్మ్ అవార్డ్స్" పేరిట తెలుగు సినిమా రంగానికి చెందిన వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచినవారికి పట్టం కట్టి, దాసరికి ఘన నివాళులు అర్పించనున్నారు. దర్శకరత్నతో సుదీర్ఘమైన అనుబంధం కలిగిన ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు - ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ అధ్యక్షకార్యదర్శులుగా ఇందుకోసం ఏర్పాటైన కమిటీలో ఆడిటర్ గా, ఆర్ధిక సలహాదారుగా దాసరితో ప్రత్యేక అనుబంధం కలిగిన బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ, ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, ధీరజ అప్పాజీ సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్, శిల్పకళావేదికలో అత్యంత వైభవంగా మే 5న నిర్వహించనున్న ఈ వేడుక వివరాలు వెల్లడించేందుకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో "దర్శకరత్న డి.ఎన్. ఆర్.ఫిల్మ్ అవార్డ్స్" జ్యురీ మెంబర్స్ తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహారావు, బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ, ప్రభు, అప్పాజీలతోపాటు... తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ... "దశాధిక రంగాల్లో రాణించిన దాసరికి నివాళులు అర్పిస్తూ... "అభినవ దర్శకరత్న, అభినయ రత్న, నిర్మాణరత్న, పంపిణీరత్న, ప్రదర్శనారత్న, కథారత్న, సంభాషణారత్న, గీతరత్న, పాత్రికేయరత్న, సేవారత్న" పురస్కారాలు ప్రదానం చేయనున్నాం. ఇతర అవార్డులను స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ సినిమాల నుంచి ఎంపిక చేయనున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించేందుకు నడుం కట్టిన సూర్యనారాయణ గారిని అభినందిస్తున్నాను" అన్నారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ... "దాసరి లేని లోటు ఎప్పటికీ తీరనిది. ఈ అవార్డుల ఎంపిక అత్యంత పారదర్శకంగా, ప్రామాణికంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దాసరి భౌతికంగా దూరమై ఏడేళ్లు కావస్తున్నా ఆయనపై అపారమైన ప్రేమాభిమానాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బి.ఎస్.ఎన్. సూర్యనారాయణకు అభినందనలు" అన్నారు. బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ మాట్లాడుతూ... "దాసరి ప్రధమ జయంతిని ఘనంగా నిర్వహించాం. కరోన కారణంగా కంటిన్యూ చేయలేకపోయాయాం. ఇకపై ప్రతి ఏటా ఈ వేడుక నిర్వహిస్తాం" అన్నారు. టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ... "దురదృష్టవశాత్తూ మన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డుల విషయంలో చిత్రపరిశ్రమను చిన్నచూపు చూస్తున్నాయి. అలక్ష్యం చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ గారు చొరవ తీసుకుని భారతదేశం గర్వించదగ్గ మహానుభావుడైన దాసరి పేరిట అవార్డ్స్ ఇస్తుండడం ఎంతైనా అభినందనీయం" అన్నారు. ప్రభు మాట్లాడుతూ... "చిత్ర పరిశ్రమలోని ప్రతి విభాగంలో అత్యద్భుత ప్రతిభ కనబరిచిన ఒకే ఒక్కడు దర్శకరత్న డాక్టర్ దాసరి. ఆయన స్మారకార్ధం నిర్వహిస్తున్న ఈ పురస్కారాల వేడుకకు యావత్ చిత్ర పరిశ్రమ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను" అన్నారు. ధీరజ అప్పాజీ మాట్లాడుతూ... "అవార్డ్స్ కమిటీలో చోటు దక్కించుకోవడం తనకు "లైఫ్ టైమ్ అచీవ్మెంట్"లాంటిదని పేర్కొన్నారు. -
అవినీతి బాబు చుట్టూ..రాజకీయమేంటి?
కులం పునాదులతో రాజకీయాలేంటి? ఎవరో కొందరు..ఎవరి కోసమో ఈ నాటకాలాడితే ఎలా? మాసిపోయిన ‘సెటిలర్స్’ గాయాన్ని గెలికి గెలికి... పుండుగా చేయడం న్యాయమా?.. ప్రముఖ సినీ దర్శకుడు, తెలుగు సినీ కార్మికుల నేతగా ప్రసిద్ధి చెందిన తమ్మారెడ్డి భరద్వాజ సంధించిన ప్రశ్నలివి. అవినీతి ఆరోపణల కేసులో అరెస్టయిన చంద్రబాబుకు కులం ప్రాతిపదికన సానుభూతి తెలిపే విధానం వల్ల జరిగే నష్టాన్ని ఆయన ప్రస్తావించారు. ఇదే అదనుగా అందరికీ ‘కమ్మ’ రంగు పులమడం సరికాదని తమ్మారెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. దివంగత ఎన్టీఆర్ కూడా టీడీపీని కేవలం ఒక సామాజికవర్గానికే పరిమితం చేయలేదని చెప్పారు. తికమక పెట్టే రాజకీయాలు..ఇబ్బందులు సృష్టించే నాయకులను ఈసారి ఎన్నికల్లో చూస్తున్నామనేది ఆయన భావన. తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తున్న పబ్లిక్ మూడ్ మొదలుకొని, మారుతున్న రాజకీయాలపై తమ్మారెడ్డి విస్పష్టమైన వైఖరిని వెల్లడించారు. ఆయనేమన్నారంటే....? పవన్ రాజకీయమేంటి? పవన్కల్యాణ్ రాజకీయం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతోనే ఉంటానంటాడు. బీజేపీని వదిలేస్తానంటాడు. తెలంగాణకు వచ్చి బీజేపీకి మద్దతిస్తాడు. కలిసి పోటీ అంటాడు. చంద్రబాబు జైలుకెళ్లిన తర్వాతే కదా... జనసేన, టీడీపీ పొత్తు బంధం బయటకొచ్చింది. చంద్రబాబు జైలు నుంచి రాగానే పవన్కే కృతజ్ఞతలు తెలిపారు. మరి ఇదేంటి? చంద్రబాబు పార్టీ వాళ్లేమో తెలంగాణలో కాంగ్రెస్ జెండా మోస్తామంటున్నారు. పవన్ మాత్రం బీజేపీ గొడుక్కిందకు వెళ్తానంటున్నాడు. విచిత్రం ఏమిటంటే తెలంగాణలో తన కేడర్ ఏ పార్టీ వైపు ఉండాలనేది చంద్రబాబు చెప్పడు. టీడీపీ అయినా జనసేన అయినా అంతా తానే అని చెప్పే పవన్ ఇంకా వ్యూహం ఖరారు చేయలేదు. పవన్, చంద్రబాబు ఎవరి మాట ఎవరు వింటారో గానీ... తెలంగాణ ఎన్నికల్లో ఒకే వ్యూహంతో వెళ్లగలరా? ఈ తరహా రాజకీయాలు కొంత గందరగోళపరుస్తున్నాయి. ఇక్కడ సెటిలర్స్ హ్యాపీ.. కానీ ఇప్పుడు ఆ నిరసనలేంటి? తెలంగాణ ఏర్పడిన రోజుల్లో స్థానికేతరుల్లో కొంత టెన్షన్ ఉన్నమాట నిజం. ఇప్పుడది లేదు. అంతా కలిసిపోయి ఉంటున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత కొంతమంది మళ్లీ ఈ విభజన రేఖ తెస్తున్నారు. సెటిలర్స్ పేరుతో ముందుకొస్తున్నారు. దీన్ని ఓ సామాజికవర్గం నెత్తికెత్తుకోవడం విశేషం. సెటిలర్స్ అనేది మాసిపోయిన గాయం. కొంతమంది కోసం ఈ గాయాన్ని రేపుతున్నారు. పుండులా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సెటిలర్స్ పేరుతో చంద్రబాబు వ్యవహారంపై నిరసనలేంటి? సెటిలర్స్లో కమ్మవాళ్లే ఉన్నారా? అన్ని కులాల వాళ్లూ ఉన్నారని గుర్తించాలి. ఇది అందరి ప్రయోజనాలు దెబ్బతీస్తుందని తెలుసుకోవాలి. ‘చిత్రం’లోనూ మార్పులు రాజకీయాలపై సినిమా ప్రభావం కీలకం. రాజకీయాల నుంచే సినిమా వస్తుందా? సినిమా రాజకీయాలకు ప్రేరణ ఇస్తుందా? అనేది చెప్పలేం. కానీ ప్రజాజీవితాలకు దగ్గరగా ఉండే రాజకీయ సినిమాలను జనం ఆదరిస్తున్నారు. అంతే కాదు... కరుడుగట్టిన కాషాయం రంగుతో తీసిన సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. అంటే మార్పును ప్రజలు స్వాగతిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లోనూ అది కనిపిస్తోంది. రాష్ట్రం ఏర్పడ్డాక ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇది గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ మాత్రమే. అలా అని నిరుద్యోగమూ పూర్తిగా పోలేదు. యువత ఆలోచనకు ఇదే కారణమైంది. రైతుబంధు ఇస్తున్నామని చెప్పే నేతలు... రూ.కోట్లు ఉన్నవాడికి కూడా ఇవ్వడం న్యాయమేనా? అనేక కష్టనష్టాలకోర్చే కౌలు రైతులకు ఇవ్వకపోవడం ధర్మమేనా? సామాజిక పరిస్థితుల నుంచే ప్రజాతీర్పు వస్తుంది. ఒకటి మాత్రం నిజం. గెలిచే వాళ్ల వైపే ప్రజలు ఉంటారు. అందుకే వామపక్షాలు ఉద్యమించే చరిత్ర ఉన్నా, ఓట్లు పొందలేకపోతున్నాయి. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్రజలిచ్చిన అధికారం రాచరికంగా భావించే నాయకులను ఓటు ఆ«యుధంతోనే ప్రజలు బుద్ధి చెప్పాలి. వాళ్ల కోరలు పీకి వేయాల్సిందే. అసలేంటీ వైఖరి? చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్మెంట్ అవినీతి ఆరోపణల కేసులో అరెస్టు అయ్యారు. దీన్ని కొంతమంది తమ సామాజికవర్గం చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు సత్య హరిశ్చంద్రుడని వాళ్ల నమ్మకం కావొచ్చు. అది కోర్టులో తేలాలి. కానీ ఆ కసి తెలంగాణ రాజకీయాలపైనా చూపించే ప్రయత్నమేంటి? ఒక సామాజికవర్గం మొత్తం గంపగుత్తగా ఓ పార్టీని సమర్థిస్తుందని ప్రచారం చేయడంలో అర్థమేంటి? టీడీపీ ఒక సామాజిక వర్గానిదేనా? అదే నిజమైతే ఎన్టీఆర్ 50 శాతం బీసీలకే టికెట్లు ఎందుకిచ్చా రు? అసలు కులం ప్రస్తావనేంటి? వాళ్లు చెప్పే కులమే అంత బలమైనది అయితే, 2014లో ఎందుకు తెలంగాణలో ఓడిపోయింది? ఇలా ప్రచారం చేయడంలో ఓ కుట్ర కనిపిస్తోంది. తెర వెనుక కీలకమైన వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చు. - వనం దుర్గాప్రసాద్ -
చిరంజీవి అలాంటి సినిమాలు చేస్తే బెటర్: స్టార్ ప్రొడ్యూసర్
మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యే 'భోళా శంకర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సాధారణ ప్రేక్షకులకే కాదు మెగా ఫ్యాన్స్కి కూడా ఇది నచ్చలేదు. దీంతో చిరుతో పాటు దర్శకుడు మెహర్ రమేశ్పైనా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. చిరు రీమేక్స్పై కౌంటర్స్ వేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా వ్యాపారమైంది 'అప్పట్లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లకు పని తప్ప మరో ఆలోచన ఉండేది కాదు. ఇప్పటికీ అలాంటి వాళ్లు ఉన్నప్పటికీ.. దాన్ని వ్యాపారంగా చూసేవాళ్లు ఎక్కువైపోయారు. కథ చెప్పమని అడిగితే అప్పట్లో రైటర్స్ సూటిగా సుత్తిలేకుండా చెప్పేవారు. ఇప్పుడేమో 'ఓపెన్ చేస్తే' అని ఎలివేషన్స్ ఇస్తున్నారు. రైటర్స్ డైరెక్టర్స్ కావడం దీనికి కారణమై ఉండొచ్చు. ప్రేక్షకులకు పనికొచ్చే అంశం, అది కూడా నేచురల్గా ఉండాలి. ఇది పక్కనబెట్టి ఏదో చేస్తే సినిమాలు ఆడవు.' (ఇదీ చదవండి: చెల్లెలిగా కీర్తి సురేశ్.. చిరు-రజనీ ఇద్దరూ బలైపోయారు!) చిరు అలా చేయాలి 'ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ, చిరంజీవి.. ఇలా హీరోలందరూ కెరీర్ మొదట్లో మెథడ్ యాక్టింగ్ చేసినట్లు ఉంటుంది. చిరునే తీసుకోండి. శుభలేఖ, స్వయంకృషి, రుద్రవీణ, విజేత లాంటి సినిమాలకే అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. అమిర్ 'దంగల్' లాంటి సినిమా చిరంజీవి చేసినా జనాలు చూస్తారు. భోళా శంకర్, గాడ్ ఫాదర్ లాంటివి చేసి డిసప్పాయింట్ కావడం కంటే నేచురల్ మూవీస్ చేస్తే బెటర్ అని నా అభిప్రాయం' చెప్పాలని ప్రయత్నించా 'అయితే ఇదే విషయాన్ని చిరంజీవితోనూ చెబుదామని ప్రయత్నించాను. కానీ ఎందుకో కుదరలేదు. ఒకప్పటి సినిమాల్లో చిరంజీవిని చూస్తే మన ఇంట్లో మనిషిలా కనిపించేవారు. ఇప్పుడు ఆ చిరంజీవి మళ్లీ కనిపిస్తే చూడాలని ఉంది. అలానే సినిమాలు ఆడుతాయి అనేది నా నమ్మకం' అని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు. ఈయనే కాదు చాలామంది అభిమానులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి చిరు రాబోయే సినిమాల విషయంలో ఏం చేస్తారో చూడాలి? (ఇదీ చదవండి: సర్జరీ.. చిరంజీవి ఆరోగ్యపరిస్థితి ఇప్పుడెలా ఉందంటే?) -
ఎలక్షన్స్ చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదు: తమ్మారెడ్డి
-
TFCC Election: సంతోషపడాలో, సిగ్గు పడాలో తెలియట్లేదు..తమ్మారెడ్డి
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్సీసీ)ఎన్నికలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వాతావరణం చూస్తుంటే చాంబర్ ఎదిగిందని సంతోష పడాలో లేదా జనరల్ ఎలెక్షన్స్లాగా ఉందని సిగ్గుపడాలో తెలియట్లేదన్నారు. సభ్యులు దేనికి పోటీ పడుతున్నారో? ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియడం లేదన్నారు. ‘నేను కూడా చాలా ఎలెక్షన్స్ చూశాను.ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్గా కూడా గెలిచాను. కానీ ఇలాంటి వాతావరణం ఎప్పుడూ లేదు. ప్రస్తుతం ఎలెక్షన్స్ కాంపెయిన్ చూస్తుంటే భయమేస్తుంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నాను’అని తమ్మారెడ్డి అన్నారు. కాగా, టీఎఫ్సీసీ ఎన్నికల పోలింగ్ వాడివేడిగా జరుగుతోంది. రెండేళ్లకు ఒక్కసారి జరిగే ఎన్నికల్లో ఈ సారి అధ్యక్ష బరిలో దిల్ రాజు, సీ. కల్యాణ్ పోటీ పడుతున్నారు. ఈ రోజు(జులై 30) ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్ ఇలా నాలుగు సెక్టార్లలోని సభ్యులు ఇందులో ఓటర్లుగా ఉంటారు. మొత్తం 1600 మంది సభ్యులు ఉన్నారు. దాదాపు 900 వరకు ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై, 6 గంటల తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. -
అలా చేస్తే ఆర్ నారాయణమూర్తి ఇప్పటికీ నెంబర్ వన్ స్టార్గానే ఉండేవాడు
ఆర్ నారాయణ మూర్తి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి తెలిసిందే. విప్లవ సినిమాలు తీస్తూ పీపుల్స్ స్టార్గా ఎదిగాడు. కేవలం సినిమాల్లో నటించడమే కాదు.. కథ, కథనం, దర్శకత్వం, సంగీతం, గానం, నిర్మాణం..ఇలా 24శాఖలను తన భూజన వేసుకొని సూపర్ హిట్ చిత్రాలను అందించగల సమర్థుడు. ఈ మధ్యకాలంలో ఆయనకు సరైన హిట్ పడలేదు కానీ, ఒకప్పుడు ఆయన సినిమాలు టాలీవుడ్లో సంచలనం సృష్టించాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అలాంటి గొప్ప నటుడిపై దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నమ్మిన సిద్దాంతం కోసం స్టార్డమ్ని, కోట్ల రూపాయలను వదులుకున్న ఏకైన నటుడు ఆర్ నారాయణమూర్తి అని ప్రశంసించారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ‘తెలుగు సినిమాకు ఒక డిఫరెంట్ స్టేటస్ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఆర్ నారాయణమూర్తి. విప్లవాన్ని నమ్ముకొని.. విప్లవం కోసమే జీవితాన్ని అంకితం చేశాడు. తన కథలతో ప్రేక్షకుల ఆలోచనలు ప్రభావితం చేస్తూ, కొంతకాలం పాటు అతనే నెంబర్ వన్ స్టార్ అయ్యాడు కూడా. స్టార్ డమ్ వచ్చిన తరువాత కూడా తాను నమ్ముకున్న సిద్ధాంతాన్ని వదలకుండా అదే తరహా సినిమా చేస్తూ వచ్చాడు. సిద్దాంతం కోసం తన స్టార్ స్టేటస్ని వదులుకున్నాడు కానీ తన పంథా మార్చుకోలేదు. తన పంథా మార్చుకొని ఉంటే ఈ రోజుకి కూడా ఆర్ నారాయణమూర్తి నెంబర్ వన్ స్టార్గానే ఉండేవాడు. ‘మీ సిద్ధాంతం వదలకుండా మీరు సినిమా చేసే విధానం మార్చుకోండి’ అని నేను చాలాసార్లు చెప్పానుగానీ ఆయన వినిపించుకోలేదు. ఆయన ఏ సినిమా తీసినా అది విప్లవ పంథాలోనే ఉంటుంది. సూపర్ హిట్లు ఇచ్చాడు .. ఎంతో సంపాదించాడు. అయినా రోడ్లపై నడుచుకుంటూనే తిరుగుతూ ఉంటాడు. అంత సింపుల్ గా బ్రతికే మనిషిని గురించి ఎంత చెప్పినా సరిపోదు’ అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. -
'నాటునాటు'కు ఆస్కార్ రావడంపై స్పందించిన తమ్మారెడ్డి
-
తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం గర్వంగా ఉంది: తమ్మారెడ్డి
టాలీవుడ్ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ రూ.80 కోట్లు ఖర్చు చేసిందని, ఆ డబ్బు తమకిస్తే 8 సినిమాలు తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా గురించి ప్రపంచమంతా మాట్లాడుతుంటే తెలుగువాళ్లై ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని తమ్మారెడ్డిపై పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాట ఆస్కార్ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. హాలీవుడ్ పాటలను తలదన్ని నాటునాటు విజయకేతనం ఎగరవేసింది. తెలుగోడి ప్రతిభకు ఆస్కార్ పట్టం కట్టింది. దీంతో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి యావత్ సినీ, రాజకీయ ప్రముఖులు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ స్పందన కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. తాజాగా నాటునాటు పాటకు ఆస్కార్ రావడంపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. 'మన తెలుగు పాటకు ఆస్కార్ రావడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. నాకే కాదు, ప్రతి భారతీయుడు, సినిమాను ప్రేమించే వాళ్లకు ఇది గర్వకారణం. తెలుగు సంగీతాన్ని, తెలుగుదనాన్ని ఇప్పటికీ తమ సినిమాల్లో పొందుపరుస్తున్న అతికొద్దిమందిలో కీరవాణి, చంద్రబోస్ ఒకరు. వాళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన నాటునాటు పాటకు ఆస్కార్ రావడం చాలా అద్భుతమైన విషయం. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీంకి నా అభినందలు తెలియజేస్తున్నాను' అంటూ తమ్మారెడ్డి పేర్కొన్నారు. -
నేను నోరు విప్పితే.. మీరు ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పనా?: తమ్మారెడ్డి
ఆర్ఆర్ఆర్ మూవీ వివాదంపై ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఆస్కార్ బరిలో నిలిచిన ఆర్ఆర్ఆర్ మూవీపై ఇటీవల ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఆస్కార్ అవార్డు కోసం ట్రిపుల్ ఆర్ టీం రూ. 80 కోట్లు ఖర్చు చేసిందంటూ షాకింగ్ కామెంట్స్. దీంతో ఆయనపై సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. చదవండి: దిల్ రాజు కొడుకుని చూశారా? ఎంత క్యూట్గా ఉన్నాడో.. ఇక తనపై వస్తున్న నెగిటివిటీ చూసి తమ్మారెడ్డి నేరుగా స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఏ తప్పు చేయలేదని, క్షమాపణలు చెప్పనన్నారు. తాను చిన్న సినిమాలపై మూడు గంటలు మాట్లాడితే కేవలం ఓ క్లిప్పింగ్ ఆధారంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజమౌళిని చూసి ఈర్ష్యతో అలా అన్నానని కొందరు అంటున్నారని, ఆయన తనకు సమకాలీకుడు కాదంటూ కౌంటర్ ఇచ్చారు. రెండ్రోజుల కింద ‘ఆర్ఆర్ఆర్’ను ప్రశంసిస్తూ మాట్లాడానని.. దాని గురించి ఎవరూ పట్టించుకోలేదే? అని ప్రశ్నించారు. ‘నేను ఇండస్ట్రీకి వివరణ ఇచ్చుకోవాలి అనుకున్నా. కానీ ఇప్పుడు ఆ అవసరం నాకు లేదు. కానీ పెద్దవాళ్లు అందరు మాట్లాడాకా నేను దానికి సమాధానం కూడా చెప్పనక్కర్లేదు. అసలు వీడికేం లెక్కలు తెలుసంటున్నారు కొందరు. నాకు లెక్కలు తెలియనక్కర్లేదు. అయితే చాలా మంది అకౌంట్స్ నాకు తెలుసు. ఎవరెవరు ఏ అవార్డులు, పదవుల కోసం ఎవరెవరిని అడుక్కున్నారో, ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో అన్నీ నాకు తెలుసు. నేనెప్పుడూ వీటి గురించి మాట్లాడను. నేను మాట్లాడితే ఇండస్ట్రీ పరువు పోతుంది. ఇండస్ట్రీ నా తల్లి. ఇండస్ట్రీని గౌరవిస్తా. అందుకే ఈరోజుకీ సంయమనంగానే మాట్లాడుతున్నా’ అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. చదవండి: ఆర్ఆర్ఆర్పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిర్మాతపై నెటిజన్ల ఆగ్రహం ‘కొందరు నన్ను అసభ్యంగా, నీచంగా తిడుతున్నారు. నాకు నీతిగా బతకడం, నిజం చెప్పడం తెలుసు. ఎక్కడైన నేను నిజాలు మాట్లాడగలను. మీరు ధైర్యంగా నిజం చెప్పగలరా? నన్ను ఇంతగా తిడుతూ విమర్శిస్తున్నా మీకు నన్ను అనే హక్కు ఉందా? గతంలో రాజమౌళిని అభినందిస్తూ మాట్లాడాను అది చూడలేదా? ఇప్పుడు ఎవరో ఏదో క్లిప్ పెట్టేసరికి మీకు తెలిసిందా? మూడు గంటల చిన్న సినిమా గురించి మాట్లాడాను. మీరు ఓ చిన్న సినిమా కోసం టైం కెటాయించగలరా? ఎప్పుడు ఎవరో ఒకరి కాళ్లు పట్టుకోవాలని, ఎంతసేపు వాళ్లకు వీళ్లకు మర్దన చేయాలా? అని చూసే మీరా నా గురించి మాట్లాడేది. నన్ను అనే హక్కు మీకుందా? ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే తిరిగి మొహం మీదే పడుతుంది’ అంటూ తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు. -
దారుణమైన కామెంట్లు.. అసహ్యంగా, బాధగా ఉంది: తమ్మారెడ్డి
తెలుగు ఖ్యాతినే కాదు యావత్ భారతదేశ ఖ్యాతిని పెంచిన సినిమా ఆర్ఆర్ఆర్. వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ కళాఖండానికి వేల కోట్ల కలెక్షన్లు వచ్చిపడ్డాయి. ఈ సినిమా నుంచి నాటునాటు పాట ఆస్కార్ రేసులో పోటీపడుతున్న విషయం తెలిసిందే! ఆర్ఆర్ఆర్ టీమ్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందంటూ అందరూ చప్పట్లు కొడుతుంటే ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాత్రం వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ట్రిపుల్ ఆర్ ఆస్కార్ బరిలో నిలిచేందుకు రూ.80 కోట్లు ఖర్చు పెట్టిందని, ఆ డబ్బు తనకిస్తే ఎనిమిది సినిమాలు తీసి ముఖాన కొడతానంటూ కామెంట్లు చేశాడు. ఆయన వ్యాఖ్యలపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సహా పలువురు సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదంపై స్పందించాడు తమ్మారెడ్డి భరద్వాజ. 'నేను ఒక సెమినార్లో పాల్గొని అక్కడి యంగ్ డైరెక్టర్స్తో దాదాపు మూడు గంటలు మాట్లాడాను. అందులో ఒక నిమిషం క్లిప్ విని ఎవరెవరో రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం చిన్న సినిమాల గురించి మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్ బడ్జెట్పై మాట్లాడాను. దీనిపై కొందరు చాలా దారుణంగా కామెంట్లు చేయడం బాధ కలిగించింది. ఒకరేమో అకౌంట్స్ సమాచారం అడుగుతారు. మరొకరేమో బూతులు తిడుతున్నారు. చాలా బాధగా, అసభ్యంగా, అసహ్యంగా ఉంది. వాళ్ల సంస్కారం వాళ్లది, నా సంస్కారం నాది. నేనేమీ గుర్తింపు కోసం పాకులాడటం లేదు. బహుశా నన్ను టార్గెట్ చేసకుఉని వాళ్లు గుర్తింపు కోరుకుంటున్నారో తెలీదు. నేను కొన్ని రోజుల ముందు రాజమౌళిని అభినందిస్తూ వీడియో పోస్ట్ చేశాను. మరి అప్పుడు ఏ ఒక్కరూ మాట్లాడలేదే?' అని విమర్శించాడు. -
ఆర్ఆర్ఆర్పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిర్మాతపై నెటిజన్ల ఆగ్రహం
టాలీవుడ్ సంచలనం ఆర్ఆర్ఆర్ మూవీపై సీనియర్ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండిస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ మూవీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డు కోసం ఆర్ఆర్ఆర్ టీం రూ. 80 కోట్లు ఖర్చు చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై పలువురు టాలీవుడ్ సినీ దిగ్గజాలు, సినీ ప్రియులు అభ్యంతరం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: జేమ్స్ కెమెరూన్ డబ్బు తీసుకొని పొగుడుతున్నారా? లెక్కలున్నాయా?: కె. రాఘవేంద్రరావు సూటి ప్రశ్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్పందిస్తూ తమ్మారెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. మిత్రుడు భరద్వాజ్కి.. తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకు ప్రపంచవేదికలపై మొదటిసారి వస్తున్న పేరు చూసి గర్వపడాలి కానీ, రూ.80 కోట్ల ఖర్చు అని చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ లాంటి వారు డబ్బు తీసుకుని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా? అంటూ ట్వీట్ చేశారు. ఇక దర్శకేంద్రుడి మద్దతుగా నెటిజన్లు, ఆరఆర్ఆర్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ తమ్మారెడ్డి భరద్వాజ్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘శత్రువులు ఎక్కడో ఉండరు మన పక్కనే తిరుగుతారు. 80 కోట్ల రూపాయలు ఉంటే పది సినిమాలు తీస్తారు సరే.. అందులో ఒకటైన ఆస్కార్కు వెళుతుందనే గ్యారంటీ ఇస్తారా? భరద్వాజ గారు’ అంటూ ఓ నెటిజన్ ఆయనకు కౌంటర్ ఇచ్చాడు. అలాగే మరో నెటిజన్ స్పందిస్తూ ‘విచిత్రమైన మనిషి, విచిత్రమైన కామెంట్స్’ అసహనం వ్యక్తి చేశాడు. చదవండి: ఆస్కార్ కోసం 'ఆర్ఆర్ఆర్' ఫ్లైట్ ఖర్చులతో పది సినిమాలు తీయొచ్చు : తమ్మారెడ్డి కాగా రీసెంట్గా రవింద్ర భారతీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘రూ.200 కోట్లు పెట్టి బాహుబలి తీశారు. ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ బడ్జెట్. ఆ తర్వాత రూ.600 కోట్లు ఖర్చు పెట్టి ఆర్ఆర్ఆర్ మూవీ తీశారు. ఇప్పుడు వచ్చే ఆస్కార్ కోసం రూ.80 కోట్లు పెట్టారు. ఆ డబ్బులు నాకు ఇస్తే 8 సినిమాలు తీసి వాళ్ల మొఖాన కొడతాను’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. Satruvulu ekkada undaru andi mana pakkane tirugutuntaru. 80crores unte 10 cinemalu teesukovachu correct ye. aah 10 cinemalu lo okatyna oscar vastundi aney gaurantee isthara bharadwaj garu. — Challapalli Anurag 🇮🇳 (@anurough) March 9, 2023 పాపం భరద్వాజులు గారు చల్లగా Attention తీసుకుని జారుకుందాం అనుకున్నారు కానీ తెలుగు జాతిని గర్వపడేలా చేసిన @RRRMovie & @ssrajamouli గారి మీద రాయి వేసి జారుకుందాం అని చుస్తే, తెలుగు వారు తెలుగు ప్రముఖుల గమ్ముగా వుంటారని భావించి నట్లు ఉన్నారు. — CMA Monesh (@Cmamonesh) March 9, 2023 -
RRR Movie: నీ దగ్గర లెక్కలున్నాయా భరద్వాజ్: కె. రాఘవేంద్రరావు ఫైర్
'ఆర్ఆర్ఆర్' సినిమా ఆస్కార్ బరిలో నిలిచేందుకు దాదాపు 80 కోట్లు ఖర్చు పెట్టిందని, అమెరికా వెళ్లేందుకు ఫ్లైట్లకు గానూ అంతగా ఖర్చు పెడుతున్నారంటూ తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అంతేకాక ఆ 80 కోట్లు తనకు ఇస్తే ఎనిమిది సినిమాలు తీసి మీ మొఖాన కొడతామంటూ తమ్మారెడ్డి చేసిన కామెంట్ నేపథ్యంలో తనపై నెటిజన్లతో పాటు పలువురు సినీ ప్రముకుల నుంచి సైతం విమర్శల వర్షం కురుస్తోంది. తాజాగా ఇదే విషయంపై దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు స్పందించారు. మిత్రుడు భరద్వాజకి అంటూ మొదలు పెట్టిన ఆయన తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి మొదటి సారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి, అంతేగాని 80 కోట్లు ఖర్చు చేశారు అనడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా..? హాలీవుడ్ దర్శకులు స్పీల్ బర్గ్, జేమ్స్ కెమెరూన్ వంటి వారు కూడా డబ్బు తీసుకొని 'ఆర్ఆర్ఆర్'చిత్రం గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా..? అంటూ తమ్మారెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. pic.twitter.com/wy5FcWjs0W — Raghavendra Rao K (@Ragavendraraoba) March 9, 2023 -
ఆస్కార్ కోసం 'ఆర్ఆర్ఆర్' ఫ్లైట్ ఖర్చులతో పది సినిమాలు తీయొచ్చు : తమ్మారెడ్డి
ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ చిత్రం నుంచి ‘నాటు నాటు’ పాట నామినేట్ అయ్యింది. ప్రస్తుతం ఆస్కార్ వేడుకలు ఉండటంతో ఆర్ఆర్ఆర్ టీం అమెరికాలో సందడి చేస్తుంది. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను మరింత ప్రమోట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ రావాలని ప్రతి తెలుగువాళ్ళతో పాటు భారతీయులంతా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆర్ఆర్ఆర్ యూనిట్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆస్కార్ అవార్డు కోసం ఆర్ఆర్ఆర్ టీం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టింది. అదే డబ్బుతో మేం 8-10 సినిమాలు తీసి ముఖాన కొడతాం.కేవలం వారు ఫ్లైట్ టికెట్స్ కోసమే కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఇవన్నీ మాట్లాడుకోవడం కూడా టైమ్ వేస్ట్ అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతుంటే ఇలా మనవాళ్లే ఇలా మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబడుతున్నారు. -
ఆ సినిమా నా వల్లే పోయింది: తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ తెలుగు దర్శక-నిర్మాతల్లో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. ఆయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో రామ్మా చిలకమ్మా ఒకటి. ఇందులో సుమంత్, లయ జంటగా నటించిన ఈ సినిమా పరాజయం పాలైంది. దీనిపై తాజాగా ఆయన స్పందించారు. ఇటీవల ఓ యూట్యూబ్లో చానల్తో ముచ్చటించిన ఆయన తన సినిమాల ప్లాప్ గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తన దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమా పరాజయానికి తానే కారణమంటూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. చదవండి: సూపర్ స్టార్ కృష్ణ గురించి అప్పట్లో మహాకవి శ్రీశ్రీ ఏమన్నారో తెలుసా? రామ్మా చిలకమ్మాకు సుమంత్ బాగుంటాడని తీసుకుంటాడని తీసుకున్నా. నాగార్జునన కూడా పది ఫ్లాపుల తర్వాత సూపర్స్టార్ అయ్యాడు. అందువలనే ఈ సినిమాను సుమంత్తో చేయోచ్చని ట్రై చేసిన సినిమా అది’ అన్నారు. ఆ తర్వాత ‘‘రామ్మా చిలకమ్మా’.. ‘స్వర్ణముఖి’.. ‘ఉర్మిళ’’ ఈ మూడు సినిమాలు కూడా నా మనసుకు దగ్గరగా ఉన్నవే. కానీ ఈ సినిమాలేవి బాగా ఆడలేదు. కాకపోతే ఇప్పటికీ మళ్లీ తీయదగిన కథ వాటిలో ఉంది. ఇక ‘ఎంతబాగుందో’ సినిమా విషయానికి వస్తే.. ఆ సినిమాకి వక్కంతం వంశీ కథను అందించాడు. చదవండి: ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్ స్టార్ మంచి పాయింట్ ఉన్న కథ అది. ఆ సినిమా ఫ్లాప్ కావడంలో ఎవరి తప్పు లేదు. డైరెక్టర్గా నేను కాకుండా వేరే వారు ఉన్నట్టయితే ఇది మంచి సినిమా అయ్యుండేది. ఆ సినిమాను నేను మిస్ హ్యాండిల్ చేశాను. నా వల్లే సినిమా పోయిందని అనుకునే సినిమాల్లో అది ఒకటిగా చెబుతాను. మిగతా సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయో అడిగితే చెప్పలేను. కానీ, ఈ సినిమా మాత్రం నా మిస్ హ్యాండిలింగ్ వల్లనే పోయిందని ఒప్పుకుంటాను. ఇక ఇక్కడ సక్సెస్ వస్తే చేసిన తప్పులన్నీ దాంట్లో కొట్టుకుపోతాయి. ఫ్లాప్ వస్తే తప్పులను గురించి మాత్రమే మాట్లాడుకుంటారు’’ అంటూ చెప్పుకొచ్చారు. -
విశ్వక్ సేన్, అర్జున్ వివాదంపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా-యంగ్ హీరో విశ్వక్ సేన్ల వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. విశ్వక్ సేన్ షూటింగ్కు హాజరు కాకుండ ఇబ్బంది పెట్టాడంటూ అర్జున్ సర్జా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అర్జున్ ఆరోపణలపై విశ్వక్ స్పందిస్తూ.. తన అభిప్రాయాలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని, ఈ సినిమా షూటింగ్ సమయంలో తన ప్రవర్తన బాలేదని ఒక్క లైట్ బాయ్ చెప్పిన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ వివాదంపై ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. చదవండి: కోలుకుంటున్న ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే తాజాగా ఓ యూట్యూబ్ చానల్తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘సినిమా మొదలు పెట్టేముందు హీరోలు మనకు ఇష్టం ఉందా? లేదా? ఆ నిర్మాత ఇష్టమా? హీరోకు ఇష్టమా అన్నది లేదా పారితోషికం లాంటి వివిధ విషయాలను ముందే మాట్లాడుకోవాలి. సినిమా మొదలయ్యాక కాదు. సినిమా షూటింగ్ మొదలయ్యాక ఇలాంటి మాట్లాడుకోవడం ఎంతవరకు న్యాయం, ధర్మమో చూస్తే.. ఎన్టీ రామారావుగారు ఎవరి దర్శకత్వంలో చేసినా, ఆయన దర్శకుడు చెప్పినట్టుగా చేసేవారు. దర్శకుడికి సంబంధించిన విషయాల్లో ఆయన జోక్యం చేసుకునేవారు కాదు. ఇదే నిబద్ధతను నేను బాలకృష్ణగారిలో కూడా చూశాను. ఇచ్చిన కాల్షీట్ ప్రకారం బాలకృష్ణ సెట్లో ఉండేవారు. కానీ ఈ గొడవలో అర్జున్ గారు షూటింగు మొదలుపెట్టేశారు. విశ్వక్ సేన్ కొంతవరకూ చేశారు. ‘నాకు నచ్చని విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడుకున్నాక మొదలెడదాం’ అని అన్నట్టుగా విశ్వక్ చెబుతున్నాడు’’ అన్నారు. ‘ఇక అర్జున్ విషయానికి వస్తే ఆయనకు దర్శకుడిగా కూడా మంచి అనుభవం ఉంది. చాలా సూపర్ హిట్లు ఇచ్చారు. ఆయన అవుట్ డేటెడ్ అనుకుంటే విశ్వక్ ముందుగానే మానుకోవలసింది. సినిమా ఒప్పుకున్నాక మాటలు బాగోలేదు .. పాటలు బాగోలేదు అంటే ఎలా? నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు ప్రతి విషయంలోను జోక్యం చేసుకుంటున్నారు. ఈ కారణంగానే ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కూడా. కొత్త నిర్మాతలు .. కొత్త దర్శకులు .. వివిధ రకాల కథలతో వస్తున్నారు. చదవండి: ‘బింబిసార’ బ్లాక్బస్టర్.. మరో వైవిధ్యమైన కథతో వస్తున్న కల్యాణ్ రామ్ కానీ హీరోలు చెప్పినట్టు చేయడం వలన ఆ సినిమాలన్నీ ఒకేరకంగా ఉంటున్నాయనేది నా ఉద్దేశం’ అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం ‘కొత్తగా వచ్చిన హీరోలంతా దర్శకుడి పనిలో జోక్యం చేసుకుంటున్నారు. ఫంక్షన్స్లో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రేక్షకులను ఇరిటేట్ చేస్తున్నారు. అర్జున్ గారు అన్నట్టుగా చాలామంది నిర్మాతలు ఇలాంటి హీరోల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. యంగ్ హీరోలంతా ఈ పద్ధతిని మార్చుకోవలసిన అవసరం ఉంది. విశ్వక్ సేన్ చేసిన పని అర్జున్ గారికి మాత్రమే కాదు. నిర్మాత అనే ప్రతి ఒక్కరికీ.. దర్శకుడు అనే ప్రతి ఒక్కరికీ కూడా అవమానమే’’ అంటూ తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక్క విశ్వక్ సేన్ మాత్రమే కాదు ప్రస్తుతం యంగ్ హీరోల వల్ల చాలామంది దర్శక-నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైన తమ ధోరణి మార్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. -
లైగర్ వివాదం.. పూరీ డబ్బులివ్వాల్సిన పని లేదు: తమ్మారెడ్డి
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన లైగర్ సినిమా ఫ్లాప్ పూరీ జగన్నాథ్కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే! భారీ స్థాయిలో నష్టాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ తమకు కొంత డబ్బు వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు పూరీ ఒక నెల రోజులు గడువు కోరినప్పటికీ కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం పూరీ ఆఫీస్ ముందు ధర్నా చేసేందుకు రెడీ అయ్యారు. ఈ విషయం తెలిసిన పూరీ జగన్నాథ్ తన పరువు తీయాలని ప్రయత్నిస్తే ఒక్క పైసా ఇవ్వనని వార్నింగ్ ఇచ్చాడు. ఈమేరకు ఓ ఆడియోకాల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించాడు. 'పూరీ జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్లకు తిరిగి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. లైగర్ హక్కులు కొనమని వాళ్ల ఇంటికి వెళ్లి అడిగాడా? లేదు కదా! కొనుక్కునేవాడిదే తప్పు. అంతకుముందు విజయ్ దేవరకొండ నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు అంత పెద్ద మొత్తానికి కొనడం ఎందుకు? నష్టాలు వచ్చాయని డబ్బులు డిమాండ్ చేయడం ఎందుకు? లాభాలొస్తాయని పెద్ద సినిమాలు కొన్నప్పుడు నష్టం వచ్చినా భరించాలి' అని చెప్పుకొచ్చాడు. చదవండి: సినిమా చూడమని ఇంటింటికీ వెళ్లి అడుక్కోవాలా? అమ్మ ఆరోగ్యానికి రిస్క్ అని తెలిసినా నాన్న లెక్కచేయలేదు: శ్రీదేవి కూతురు -
'ఇండియాను షేక్ చేస్తా అన్నాడు.. ఫ్లాప్ చేశాడు'.. తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'లైగర్'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అనుకోని రీతిలో డిజాస్టర్గా మిగిలిపోయింది. రిలీజ్ అయిన తొలిరోజు నుంచి నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద చతికిలపడిందీ సినిమా. దీంతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చింది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండపై కొందరు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ లైగర్ రిజల్ట్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. 'మన యాక్షన్ని బట్టే ప్రేక్షకుల రియాక్షన్ఉంటుంది. ఎగిరెగిరిపడితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయి. సినిమాను చూడండి అని ప్రమోట్ చేసుకోవాలి. నువ్వు చిటికెలు వేస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. హీరోలు ఊరికే ఎగిరెగిరి పడటం మంచిది కాదు. అలాగే ఇష్టం వచ్చినట్లు ''ఊపేస్తాం.. తగలెడతాం.. అని స్టేట్మెంట్లు ఇస్తే ఇలాగే ప్రేక్షకులు మనల్ని తగలెడతారు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ సినిమా డిజాస్టర్కు కారణాలు ఏమై ఉంటాయి అని ప్రశ్నించగా.. ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడను. నేను పూరి జగన్నాథ్ అభిమానినే. కానీ లైగర్ ట్రైలర్ చూసినప్పుడే మూవీ చూడలనిపించలేదు. భవిష్యత్తులో కుదిరితే చూస్తా అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. -
పాన్ ఇండియా చిత్రాలకు ఎందుకన్ని వందల కోట్లు?: తమ్మారెడ్డి భరద్వాజ్
Tammareddy Bharadwaja Shocking Comments On Pan India Movies: అడివి శేష్ నటించిన మేజర్ మూవీపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ప్రశంసలు కురిపించాడు. మేజర్ సినిమా చూసిన ఆయన ఓ వీడియో విడుదల చేశాడు. ‘‘నిన్ననే మేజర్ సినిమా చూశాను. సినిమా చాలా బాగా తీశారు. నటీనటులందరూ చక్కగా నటించారు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. చిత్రబృందం మొత్తానికి నా అభినందనలు’ అని చెప్పుకొచ్చారు. అనంతరం పాన్ ఇండియా చిత్రాలపై స్పందించారు. ‘‘ఈ మధ్య మనం ఎక్కువగా పాన్ ఇండియా ప్రాజెక్ట్, పాన్ ఇండియా సినిమా అని చెబుతున్నాం. నిజంగా చెప్పాలంటే మేజర్ పాన్ ఇండియా కథ. అయితే కొంతమంది ‘మాది పాన్ ఇండియా ప్రాజెక్ట్. బడ్జెట్ భారీగా అయ్యింది, లాస్లు వస్తున్నాయి కాబట్టి మేము సినిమా టికెట్ రేట్లు పెంచుకునేలా అవకాశం కల్పించండి’ అని ముఖ్యమంత్రులను కోరారు. అలాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్లకు మేజర్ సినిమా ఏమాత్రం తీసిపోదు. చదవండి: పక్షవాతం బారిన స్టార్ సింగర్.., లైవ్ వీడియో వైరల్ టెక్నికల్, క్వాలిటీపరంగా సినిమా చాలా బాగుంది. ఈ చిత్రాన్ని కేవలం రూ. 25 కోట్లలోపే పూర్తి చేశారు. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసి మంచి విజయం సాధించారు. మరి మిగిలిన ప్రాజెక్ట్లకు ఎందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. మేజర్ లాంటి చిత్రానికి ఖర్చు అవ్వలేదు మీకు ఎందుకు అవుతుంది? నిర్మాతలు, హీరోలు ఆలోచించాలి. షూటింగ్ అని చెప్పి క్యారవాన్లో కూర్చుంటున్నారా? సినిమా చేస్తే ప్యాషన్తో చేయాలి. సమయాన్ని వేస్ట్ చేసి డబ్బులని వృథా చేస్తున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: Vignesh Shivan-Nayanthara: ‘ఆ కంగారులో చూసుకోలేదు క్షమించండి’ -
అలాంటివారికి మేమున్నాం అని చెప్పేందుకే ఈ వేడుక
‘తెలుగు పరిశ్రమలోని 24 శాఖలతో కలిసి మే డే ఉత్సవాలను నిర్వహించాలనుకుంటున్నాం. కరోనా టైమ్లో కార్మికులు ఇబ్బందులు పడ్డారు... సొంత ఊర్లకు వెళ్లిపోయారు. అలాంటి వారికి మేమున్నాం అని చెప్పేలా ఈ వేడుక చేస్తున్నాం. ఈ వేడుకలో చిరంజీవిగారు ముఖ్య అతిథిగా, ఆయనతో పాటు కిషన్ రెడ్డిగారు, తలసాని శ్రీనివాస్ యాదవ్గారు, సబితా ఇంద్రారెడ్డిగారు, భట్టి విక్రమార్కగారు, ఏపీకి చెందిన పలువురు మంత్రులు కూడా పాల్గొంటారు’’ అని తెలుగు చలన చిత్ర కార్మికుల సంఘం అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని అన్నారు. మే 1న ఫిలిం ఫెడరేషన్ కార్మిక దినోత్సవ సంబరాలను జరపనున్నారు. గురువారం జరిగిన సమావేశంలో ఈ వేడుకలకు సంబంధించిన బ్రోచర్ని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ, ఈవెంట్ టీ షర్ట్స్ను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: అజయ్ దేవగణ్, సుదీప్ల ట్విటర్ వార్పై సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు -
సమస్యలన్నీ పరిష్కారమవుతాయ్..
బంజారాహిల్స్: సినీ పరిశ్రమ సమస్యలన్నీ ఒకటి, రెండు నెలల్లో పరిష్కారమవుతాయని ప్రముఖ సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిలిం చాంబర్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో జరగనున్న సమావేశంతో అన్ని సమస్యలు కొలిక్కి వస్తాయని తెలిపారు. కూర్చొని చర్చించుకుంటే ప్రతి సమస్యకూ పరిష్కారం లభిస్తుందన్నారు. గతంలో ఎక్కువ ధరకు టికెట్లు విక్రయించారని, అయితే పన్నులు మాత్రం చెల్లించలేదన్నారు. ఇక ముందు అంతా పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. టికెట్ల రేట్లు పెంచితే డబ్బులొస్తాయనడం భ్రమని, దానికి మద్దతివ్వకూడదని చెప్పారు. అఖండ సినిమా పుష్పకంటే పెద్ద హిట్ అయినా.. పుష్ప సినిమానే ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసిందని వెల్లడించారు. ఎక్కువ స్క్రీన్లు వేస్తే డబ్బులొస్తాయన్నారు. ఐదో షో వేసి చిన్న సినిమాలను ఆడిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ అవార్డులు ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న సినిమాలకు, ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేసుకున్న సినిమాలకు సబ్సిడీ ఇవ్వాలని కోరారు. మినీ థియేటర్లను ప్రోత్సహించాలని, అవి వస్తేనే రెవెన్యూ పెరుగుతుందన్నారు. సినీ కార్మికులు ఈఎస్ఐ, పీఎఫ్ సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఈ రెండూ చెల్లిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. కరోనా కారణంగా థియేటర్లు మూతబడినందున మినిమం విద్యుత్ చార్జీలనే వసూలు చేయాలని తమ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. -
ఏపీ ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది: తమ్మారెడ్డి భరద్వాజ
Producer Tammareddy Bharadwaj Interesting Comments On Movie Ticket Rates: ‘‘సినిమా టికెట్ ధరలు పెంచుకోవ డానికి తెలంగాణ ప్రభుత్వానికి హక్కు ఉన్నట్లే.. టికెట్ ధరలు తగ్గించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హక్కు ఉంటుంది’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో భరద్వాజ మాట్లాడుతూ.. ‘‘థియేటర్స్కు బీ ఫామ్ అనేది ఒకటి ఉంది. ఆ ప్రకారం రేట్లు ఉంటాయి. తప్పా.. ఒప్పా అనేది తర్వాతి విషయం. కానీ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వం చేస్తున్నది కరెక్ట్. అది చట్టపరంగా వారికి రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కు. అయితే థియేటర్స్వారికి కూడా రాజ్యాంగం ప్రకారం హక్కులు ఉంటాయి. కానీ చట్టపరంగా వాటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చదవండి: ‘నా థైస్లో కాదు.. మీ కళ్లలోనే ఉంది’ అంటూ అషు బోల్డ్ కామెంట్, పోస్ట్ వైరల్ లీగల్గా తెచ్చుకునే వరకూ హక్కు లేదు. ఈ విషయాన్ని వివాదం చేయడం కంటే పరిష్కరించుకోవడం మంచిది. ఎవరిపైనా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఏపీలో టికెట్ ధరల గురించి చాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి రిక్వెస్ట్ చేశాం. ఇటీవల మీటింగ్ జరిగిందని తెలిసింది. త్వరలో మరో మీటింగ్ జరిగి, ఈ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకం ఉంది. ఇక తమిళనాడు, కర్ణాటక, ముంబై వంటి రాష్ట్రాల్లో థియేటర్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉండటం, మరికొన్ని రాష్ట్రాల్లో థియేటర్స్ క్లోజ్ చేసి ఉండటం, కరోనా థర్డ్ వేవ్ ముప్పు వంటి కారాణాల చేతనే ‘ఆర్ఆర్ఆర్’,‘రాధేశ్యామ్’ వాయిదా పడ్డాయి. ఈ విషయంలో ఏపీలోని టికెట్ ధరల ప్రభావం కేవలం ఒక శాతం మాత్రమే’’ అన్నారు. చదవండి: స్పెషల్ సాంగ్తో పేరొస్తుందని చెప్పి బన్నీ ఒప్పించాడు: సమంత ఇంకా మాట్లాడుతూ.. ‘‘ఫిలిం చాంబర్ మాట్లాడుతుందనే పెద్ద నిర్మాతలు కామ్గా ఉండి ఉండొచ్చు. అంతమాత్రాన వారి గురించి రకరకాలుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్స్.. ఇలా అన్ని సెక్టార్ల వారు చాంబర్ పరిధిలో ఉన్నారు. అయితే ‘మా’, ఫెడరేషన్ చాంబర్ పరిధిలోకి రావు. అవి ఇండిపెండెంట్ బాడీలు. అలాగే థియేటర్స్ టికెట్ ధరలతో మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్కి సంబంధం లేదు. అయితే చిరంజీవి, మోహన్బాబు, మహేశ్బాబు, పవన్కల్యాణ్ వంటి వారు నిర్మాతలుగా కూడా ఉన్నారు కాబట్టి టికెట్ ధరల గురించి మాట్లాడవచ్చు. కానీ ఆర్టిస్టులుగా వారికి ఆ అధికారం నాకు తెలిసి లేదు’’ అన్నారు. -
ఆడ సింహం అంటూ అదిరిపోయే బ్యానర్ : తమ్మారెడ్డి
కొత్త తరహా చిత్రాలను నిర్మించేందుకు నిర్మాత జి.ఆర్.జి.ఎన్ రాజు సొంతంగా 'లేడి లయన్ క్రియేషన్స్ బ్యానర్' పేరిట సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. సహా నిర్మాత గోవింద రాజులు బ్యానర్ లాంచ్ కార్యక్రమం సోమవారం ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా ప్రముఖ నిర్మాత కె ఎస్ రామారావు, రమేష్ ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు వీర శంకర్, తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ మామిడి హరికృష్ణ, మాదాల రవి, నాగబాల సురేష్ కుమార్ లతో పాటు తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా బ్యానర్ లోగో ను కె ఎస్ రామారావు విడుదల చేయగా, టీజర్ ను తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. ఆడ సింహం అంటూ అదిరిపోయే బ్యానర్ ని మొదలెట్టిన నిర్మాత రాజు గారికి, దర్శకుడు చల్లా భానులకు అభినందనలు. ఈ బ్యానర్ పై సరికొత్త తరహా చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఇండస్ట్రీ లో ఈ బ్యానర్ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేయాలనీ కోరుతున్నాను అన్నారు. నిర్మాత రాజు మాట్లాడుతూ .. లేడి లయన్ బ్యానర్ పై సరికొత్త తరహా చిత్రాలు తెరకెక్కించే ఉద్దేశంతో ఈ బ్యానర్ ని మొదలెట్టాం. సినిమాలే కాకుండా ఓటిటి కోసం వెబ్ సిరీస్ లను కూడా నిర్మిస్తున్నాం. చల్లా భాను కిరణ్ దర్శకత్వంలో మా ప్రయత్నంగా లవ్ యూ ఎనిమి అనే వెబ్ సిరీస్ త్వరలో విడుదల అవుతుంది అన్నారు. -
అన్నాచెల్లెళ్ల అనుబంధం
పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘నరసింహపురం’. శ్రీరాజ్ బళ్ళా దర్శకత్వంలో పి.ఆర్. క్రియేషన్స్ సమర్పణలో శ్రీరాజ్ బళ్ళా, టి.ఫణికుమార్ గౌడ్, నందకిశోర్ ధూళిపాల నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ‘‘వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ, అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యం లో ఈ సినిమా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. ‘‘ఈ సినిమా మా అందరికీ మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నందకిశోర్. -
ఈ పాట మెగాభిమానులకు అంకితం
ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రభు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రాంగ్ గోపాల్ వర్మ’. నటుడు ‘షకలక’ శంకర్ టైటిల్ పాత్ర పోషించారు. ఈ చిత్రం ఆడియోను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ప్రభు ఎంతో ఆవేదనతో, ధర్మాగ్రహంతో ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఆశించి తెరకెక్కించిన ఈ చిత్రం అందరికీ చేరువ కావాలి’’ అన్నారు. దర్శక–నిర్మాత ప్రభు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం కోసం నేను స్వయంగా రాసిన ‘వర్మా వర్మా వర్మా... ఓ రాంగ్ గోపాల్ వర్మ... ఇలా కాలింది ఏమిటయ్యా నీ ఖర్మ..’ అనే పాటని ర్యాప్ షకీల్ చక్కగా పాడటంతో పాటు మా చిత్రానికి సంగీతం అందించాడు. ఈ పాటను మెగాభిమానులకు, ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఫ్యా¯Œ ్సకు అంకితం చేస్తున్నాను. అందుకే పవన్ పుట్టినరోజున ఈ పాటను విడుదల చే శాం. చిత్తూరు జిల్లాలో విద్యుత్ షాక్తో మృతి చెందిన ముగ్గురు పవన్ అభిమానులకు మా చిత్రం ద్వారా వచ్చే ఆదాయంలో పావు వంతు వారి కుటుంబాలకు అందిస్తాం’’ అన్నారు. చిత్ర సంగీత దర్శకుడు ర్యాప్ షకీల్ పాల్గొన్నారు. -
ఫిల్మ్ ఛాంబర్లో మంత్రి, సినీ ప్రముఖుల భేటీ
సాక్షి, హైదరాబాద్: కరోనా వల్ల సినిమా షూటింగ్స్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న విధంగా తయారైంది. ఈ క్రమంలో తాజాగా కేంద్రప్రభుత్వం సినిమా, టీవీ చిత్రీకరణలకు అనుమతినిచ్చిచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఆరోగ్య శాఖ సూచనల మేరకు కొన్ని గైడ్ లైన్స్ కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని టూరిజం ప్రాంతాల్లో సినిమా షూటింగ్లపై తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సినీ పెద్దలతో కలిసి ఫిల్మ్ ఛాంబర్లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో నిర్మాతలు సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ సహా పలువురు హాజరయ్యారు. (రామానాయుడుగారు మాకు రోల్మోడల్) చదవండి: షూటింగ్స్ ప్రారంభించుకోండి! -
దాసరి లేని లోటు తెలుస్తోంది
‘‘కరోనా వల్ల ఇండస్ట్రీకి జరిగిన నష్టాన్ని దాసరిగారైతే మరోలా కాపాడేవారు. దాసరిగారిని తలుచుకోని రోజు లేదు’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. శనివారం దర్శకరత్న దాసరి నారాయణరావు 3వ వర్థంతి. హైదరాబాద్లోని ఫిల్మ్ చాంబర్లో పలువురు సినీ ప్రముఖులు దాసరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘దాసరిగారు లేని లోటు కనిపిస్తోంది. వచ్చే ఏడాది మరింత ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తాం’’ అన్నారు. ‘‘మేం దాసరిగారి దగ్గర పని చేయలేదు. అయినా ఆయన మనుషులం అని గర్వంగా చెప్పుకుంటాం’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ‘‘ప్రతి ఒక్కరికీ విలువ ఇచ్చి మాట్లాడేవారు దాసరిగారు. ఆయన స్థానాన్ని ఎవ్వరూ బర్తీ చేయలేరు’’ అన్నారు నిర్మాత ప్రసన్న కుమార్. ‘‘నేను బతికి ఉన్నంత కాలం దాసరిగారి జయంతి, వర్థంతి జరిగేలా చూస్తాం. ప్రతి ఏడాదీ దాసరి అవార్డ్స్ కొనసాగిస్తాం’’ అన్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. శ్రీకాంత్, రేలంగి నరసింహా రావు, రాజా వన్నెం రెడ్డి, తాండవ, పీడీవీ ప్రసాద్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 300 మందికి ఫుడ్ ప్యాకెట్లు, స్వీట్ ప్యాకెట్లు పంచిపెట్టారు రామసత్యనారాయణ. -
బాలయ్యకు మద్దతు తెలిపిన నిర్మాత
సాక్షి, హైదరాబాద్ : సినీ ఇండస్ట్రీకి మంచి జరుగుతుందని అనుకుంటే మెగాస్టార్ చిరంజీవనే కాకుండా ఎవ్వరితోనైనా కలిసి నడుస్తామని దర్శకనిర్మాత తమ్మరెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. చిరంజీవి ఇంట్లో సమావేశం ఆయన స్వలాభం కోసం పెట్టలేదని, ఈ భేటీని పెద్ద వివాదంగా చేస్తున్నారని తప్పుపట్టారు. ఇలాంటి సమావేశాలు గతంలో దాసరి నారాయణరావు ఇంట్లో అనేకం జరిగాయని గుర్తుచేశారు. (‘ఇంట్లో పెళ్లి కాదు.. బొట్టు పెట్టి పిలవడానికి’) నటులు బాలకృష్ణ, నాగబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. బాలకృష్ణ చేయని వ్యాఖ్యలను చేసినట్లు చూపుతున్నారని మండిపడ్డారు. ఇక అయన వ్యక్తిగత వ్యాఖ్యల గురించి స్పందించనని అన్నారు. చిరంజీవి, బాలకృష్ణల మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, వారిద్దరు మంచిగా ఉన్నారన్నారు. ఈరోజు బాలకృష్ణ, చిరంజీవిలతో మాట్లాడామని ఈ సమస్య ఇక్కడే పరిష్కారం అయిందనే అనుకుంటున్నట్లు తమ్మారెడ్డి తెలిపారు. (నన్ను ఒక్కడూ పిలవలేదు : బాలకృష్ణ) బాలకృష్ణ అభిప్రాయం అందరిదీ: ప్రసన్న కుమార్ సినీ పెద్దల సమావేశంపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను నిర్మాత ప్రసన్నకుమార్ సమర్థించారు. బాలకృష్ణ అభిప్రాయమే తమందరిలోనూ ఉందన్నారు. ఈ సమావేశం గురించి నరేశ్, జీవితా రాజశేఖర్, ఫిలిమ్ ఛాంబర్, కౌన్సిల్లోని సభ్యులెవరికీ తెలియదన్నారు. చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ ఇండస్ట్రీకి రెండు కళ్లని, ఇండస్ట్రీ సమస్య అందరిదన్నారు. (ఆ తర్వాత ఏలియన్స్ దాడులా?: వర్మ) -
‘ఇంట్లో పెళ్లి కాదు.. బొట్టు పెట్టి పిలవడానికి’
సాక్షి, హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి నివాసంలో కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ) సభ్యుల రివ్యూ సమావేశం ముగిసింది. ప్రస్తుతం టాలీవుడ్లో నెలకొన్న పరిస్థితులు, పేద సినీ కార్మికులకు అందిన సాయం, లోట్లుపాట్లపై సీసీసీ సభ్యుల మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ సమావేశం అనంతరం దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మీడియాతో మాట్లాడారు. ఇటీవల సినీ పెద్దలు ప్రభుత్వంతో జరిపిన చర్చలపై నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. (భూములు పంచుకుంటున్నారా?) ‘ఎవరి ఇంట్లో పెళ్లి కాదు, బొట్టు పెట్టి పిలవడానికి. పలానా వాళ్లని పిలవాలి అనేది లేదు నన్ను కూడా పిలవలేదు. ఈ విషయాన్ని ఇంత పెద్ద వివాదం చేయాల్సిన అవసరం లేదు. మహేశ్, వెంకటేశ్, ఇలా చాలా మందిని పిలువలేదు. మమ్మల్ని పిలవలేదు అంటే అర్థం లేదు. బాలకృష్ణ, నాగబాబు వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం. ఆ వ్యాఖ్యలతో చిత్రపరిశ్రమకు సంబంధంలేదు. ఇప్పటివరకు నిర్మాతలుగా మేము చిత్రీకరణ కోసం ప్రభుత్వంతో సంప్రదిస్తున్నాము. ఈ సమావేశానికి చిరంజీవి, నాగార్జునలను లీడ్ తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. బాలయ్య లేకుండా సినీ ఇండస్ట్రీ ఉందనుకోవడం లేదు. ఆయన అవసరం ఉన్నప్పుడు తప్పకుండా పిలుస్తాం’ అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. (బాలకృష్ణకు ఇక్బాల్ గట్టి కౌంటర్!) బాలయ్య అలా అనాల్సిందికాదు: సి.కళ్యాణ్ ‘ఈ రోజు చిరంజీవి ఇంట్లో సీసీసీ రివ్యూ మీటింగ్ సజావుగా జరిగింది. పలు విషయాలపై చర్చించాము. ఇక ప్రభుత్వంతో సినీ పెద్దలు జరిపిన సమావేశం రియల్ఎస్టేట్ సమావేశం అని ఎందుకు అన్నారో తెలియదు. అయితే బాలయ్య ఆలా అన్సాలింది కాదు. సమావేశానికి చిరంజీవి, నాగార్జునలను లీడ్ చేయమని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆందుకే వాళ్లు సమావేశానికి వచ్చారు. ఇప్పటివరకు నిర్మాతలు, దర్శకులు మాట్లాడుకునే సమావేశాలే జరిగాయి’ అని నిర్మాత సి. కళ్యాణ్ వివరించారు. -
తెలంగాణ యూనియన్లు ఎవరు పెట్టమన్నారు
జూబ్లీహిల్స్: ఈ కరోనా కఠిన సమయంలో ప్రాంతాల వారిగా కళాకారులను విడదీసి వారిని అవమానించేలా మాట్లాడటం సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు సరికాదని తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఫెడరేషన్ యూనియన్ నేతలు అన్నారు. బుధవారం బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఫెడరేషన్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు విలేకరుల సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షులు కరుణాకర్రెడ్డి, కోశాధికారి వజనేపల్లి ఠాగూర్ తమ్మారెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ సీసీసీ తరపున సినీ కళాకారులకు, సినీ కార్మికులకు సహాయం చేస్తున్న తరుణంలో తెలంగాణ సినిమా యూనియన్ వారికి సరిగ్గా అందడం లేదని ఒక ఇంటర్వ్యూలో ఆయనను ప్రశ్నించగా తమ్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ యూనియన్లను ఎవరు పెట్టమన్నారని, రాష్ట్రం వచ్చినంత మాత్రాన యూనియన్లు పెట్టుకుంటారా అని అవమానకరంగా మాట్లాడారన్నారు. ఆయన వెంటనే తెలంగాణ సినీ కార్మికులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం
ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాతృమూర్తి కృష్ణవేణి (94) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తుది శ్వాస విడిచారు. తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి కృష్ణమూర్తి కూడా చిత్ర నిర్మాతే. రవీంద్ర ఆర్ట్స్ పతాకంపై ‘లక్షాధికారి, జమీందారు, బంగారు గాజులు, ధర్మదాత, దత్త పుత్రుడు, డాక్టర్ బాబు’ వంటి అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించారు కృష్ణమూర్తి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు లెనిన్ బాబు చనిపోయారు. చిన్న కుమారుడు భరద్వాజ నిర్మాతగా, దర్శకుడిగా అనేక విజయవంతమైన చిత్రాలు అందించారు. మొదటి నుంచి వీరిది వామపక్ష భావాలున్న కుటుంబం. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘నా తల్లి రెండు నెలలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న నా మిత్రులు, శ్రేయోభిలాషులు ఫోన్లు చేస్తున్నారు. కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నందున నన్ను పరామర్శించడానికి ఎవరూ ఇంటికి రావద్దు’’ అని కోరారు. కాగా కృష్ణవేణి మరణ వార్త లె లుసుకున్న చిరంజీవి ఫో¯Œ లో తమ్మారెడ్డి భరద్వాజను పరామర్శించారు. -
తమ్మారెడ్డికి చిరంజీవి పరామర్శ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి కృష్ణవేణి(94) సోమవారం మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నేడు తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇందుకు సంబంధించి తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. తన తల్లి రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పారు. తన తల్లి మరణవార్త తెలిసి మిత్రులు, శేయోభిలాషులు చాలా మంది ఫోన్లు చేస్తున్నారని అయితే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున తనను పరామర్శించేందుకు ఎవరు ఇంటికి రావద్దని కోరారు. తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి కృష్ణమూర్తి కూడా నిర్మాత అనే సంగతి తెలిసిందే. రవీంద్ర ఆర్ట్స్ పతాకంపై లక్షాధికారి, జమీందారు, బంగారు గాజులు, ధర్మదాత, దత్త పుత్రుడు, డాక్టర్ బాబు వంటి హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు. కృష్ణమూర్తి, కృష్ణవేణి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు లెనిన్బాబు మరణించాడు. చిన్న కుమారుడు తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాతగా, దర్శకుడిగా అనేక విజయవంతమైన చిత్రాలను అందించారు. తొలి నుంచి వీరిది వామపక్ష కుటుంబం. కాగా, కృష్ణమూర్తి 2013లో మృతిచెందారు. తమ్మారెడ్డి భరద్వాజను ఫోన్లో పరామర్శించిన చిరంజీవి.. తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కృష్ణవేణి మరణవార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆయనను ఫోన్లో పరామర్శించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంతాప సందేశాన్ని తెలియజేశారు. సినిమా ఒక మజిలీ, సమ సమాజం నా అంతిమ లక్ష్యం అనే కృష్ణమూర్తి.. తెలుగు సినిమా పరిశ్రమకు ఇతోదిక సేవలదించారని చిరంజీవి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. -
సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ చారిటీ
కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వాలు చేస్తున్న కృషికి హీరోలు, నిర్మాతలు, దర్శకులు తమ వంతుగా విరాళాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు నడుం బిగించారు. ప్రస్తుతం సినిమా షూటింగ్లు ఆగిపోవడంతో పలువురు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు సి. సి. సి. మనకోసం (కరోనా క్రై సిస్ చారిటీ మనకోసం) అనే సంస్థ ఏర్పాటు చేశారు. ఈ సంస్థకి చైర్మన్ గా చిరంజీవి ఉంటారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ –‘‘ఎలాంటి విపత్తులు వచ్చినా సహాయం చేయడంలో సినిమా పరిశ్రమ ముందుంటుంది. సినీ కార్మికులకి మనం ఏం చేయగలం అని చిరంజీవిగారు తన ఆలోచనతో ముందుకు వచ్చారు. చిరంజీవిగారి ఆధ్వర్యంలో సురేష్ బాబు, నేను, ఎన్ .శంకర్, సి.కల్యాణ్, దాము కలిసి చిన్న కమిటీగా ఏర్పాటయి ‘సీసీసీ మనకోసం’ సంస్థ ద్వారా చిత్రపరిశ్రమ కార్మికుల సంక్షేమార్థం పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం. దీనికి నాందిగా మొదట చిరంజీవిగారు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. నాగార్జునగారు కోటి రూపాయలు, ఎన్టీఆర్ 25లక్షలు విరాళాలు ప్రకటించారు. ఎవరైనా సినిమా పరిశ్రమ కార్మికులను ఆదుకోవచ్చు’’అన్నారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ– ‘‘సి.సి. సి. మనకోసం కమిటీతో పాటు డైరెక్టర్ మెహర్ రమేష్, గీతా ఆర్ట్స్ బాబు, కోటగిరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, కొమరం వెంకటేష్, ఫెడరేషన్ కు సంబంధించి అన్ని కార్మిక సంఘాల నాయకులు ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్గారి ఆశీస్సులు, మంత్రి కేటీఆర్గారి అండదండలు కావాలని కోరుతున్నాం’’ అన్నారు. -
కష్టం వృథా కాలేదు – తమ్మారెడ్డి భరద్వాజ
‘‘నా నలభైఏళ్ల కెరీర్లో నాకు గుర్తుండిపోయే చిత్రం ‘పలాస’. ఈ సినిమాలో నటీనటుల అద్భుతమైన హావభావాలకు ప్రేక్షకులు మైమరచిపోతున్నారు. అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. మా కష్టం వృథా కాలేదని భావిస్తున్నాను’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ నెల 6న విడుదలైంది. తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో రక్షిత్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకు మంచి రివ్యూస్ రావడం హ్యాపీ. సినిమాలోని ప్రతి సన్నివేశం గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవడం చూస్తుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా విజయం మరిన్ని మంచి సినిమాలు చేయడానికి ధైర్యాన్నిచ్చింది’’ అన్నారు కరుణకుమార్. ‘‘దర్శకుడి ఆలోచన, నిర్మాత ప్రయత్నం సినిమాను నిలబెట్టాయి. నటీనటుల పాత్రలతో పాటు నా పాత్రకూ మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు సంగీత దర్శకుడు–నటుడు రఘుకుంచె. ‘‘పలాస’లాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు హీరోయిన్ నక్షత్ర. -
మీరు కూడా చూడకపోతే మీ ఖర్మ: తమ్మారెడ్డి
‘ఒక మంచి సినిమా కావాలి అంటారు..మంచి రివ్యూలు కావాలి అంటారు..అవన్నీ ఉన్న సినిమా పలాస 1978. దళితుల పాత్రలు సినిమాల్లో ఉండవు. దళిత కథలు సినిమాగా మారవు అంటారు. కానీ పలాసలో వారి పాత్రలను హీరో లను చేసాము. వారి సమస్యలను చర్చించాం. కానీ వారి నుండే స్పందన కరువైంది’ అని తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ.. ‘మీ సినిమాలు మీరు కూడా చూడకపోతే మీ ఖర్మ. మీరు చూసి ఆశీర్వదిస్తే..మరిన్ని సినిమాలు వస్తాయి. ఇది నా ఆవేదన. నా నలభై ఏళ్ల కెరియర్లో ఏ సినిమా ఆడినా, అడకపోయినా బాధ పడలేదు. కానీ ఈ సినిమా విషయంలో మేము సక్సెస్ అయ్యాం. అయితే ఈ సినిమా మరింత ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత దళితులదే’ అని అన్నారు. (‘పలాస 1978’ మూవీ రివ్యూ) కాగా రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’.. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
థమన్ చేతుల మీదుగా ‘నీలాకాశం’ ఆడియో లాంచ్
సినీ సంగీతం వివి విని అలసిన శ్రోతలకు ‘నీలాకాశం’ అనే సరికొత్త తెలుగు ఆల్బమ్ స్వాన్తన కలిగించనుంది. సీతారామరాజు అనే కొత్త సంగీత దర్శకుడు మరియు పాటల రచయిత దీనితో పరిచయం అవుతున్నారు. కృష్ణ తేజస్వి, ఆశిక్ అలీ, అఖిలేశ్వర్ చెన్ను, నికిత శ్రీవల్లి, మనీషా పండ్రంకి మొదలగు కొత్త గాత్రాలు సందడి చేయనున్నాయి. వైజాగ్, చెన్నై, ముంబై మొదలగు చోట్ల స్టూడియోలలో రికార్డ్ చేసిన పాటలను ముందుకు తీసుకు వచ్చారు. ఈ ఆల్బమ్ ‘వాటర్ లెమన్ రికార్డ్స్’ అనే కొత్త ఆడియో సంస్థ ద్వారా మార్కెట్ లోనికి రానున్నాయి. ఈ విడుదల కార్యక్రమం ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ మరియు తమ్మారెడ్డి భరద్వాజ్ గారిచే శనివారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఎస్ థమన్ మాట్లాడుతూ... ‘ఆశీర్వాద్ గారికి మాకు చాలా క్లోజ్ రిలేషన్ షిప్ ఉంది. చెన్నైలో తరచూ కలుస్తుంటాము. మా నాన్న గారికి ఆయనకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఆ కమ్యూనికేషన్ తోనే నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. చాలా మందికి లైట్ మ్యూజిక్ చాలా పాటలకు ఇన్స్పిరేషన్ మాత్రమే కాదు అదొక మెడిసిన్ కూడా.. ఇలాంటి లైట్ మ్యూజిక్ ను సీతారామ రాజు, ఆశీర్వాదం గారు శ్రోతలకు అందించడానికి చేసే ఈ ప్రయత్నం ఎంతో గొప్పది. ఈ నీలాకాశం ఆల్బమ్ సక్సెస్ ఫుల్ గా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సింగర్స్ అందరికీ బెస్ట్’ అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘ఘంటసాల గారు అప్పట్లో ఇలాంటి లైట్ మ్యూజిక్ నే చేసేవారు. అలాంటి మ్యూజిక్ వలనే ఎన్నో సినిమాల్లో ఎన్నో హిట్స్ సాంగ్స్ వచ్చాయి. ఆ తరాన్ని అనుసరిస్తూ ఇప్పుడు నీలాకాశం అనే లైట్ మ్యూజిక్ ఆల్బమ్ను తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది. ఏ జనరేషన్కు అయినా.. ఎప్పుడు విన్నా ఈ లైట్ మ్యూజిక్ ఆహ్లాదంగా అనిపిస్తూనే ఉంటుంది. వీరి స్ఫూర్తి తో మరెన్నో లైట్ ఆల్బమ్స్ రావాలని కోరుకుంటున్నాను. అలానే ఈ ఆల్బమ్ లో పాడిన నూతన సింగర్స్ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నా’ అన్నారు. -
మా దృష్టిలో దాసరి ఎప్పటికీ దేవుడే!
సినిమా వాళ్లు పారితోషికాలు తీసుకుంటూనే సేవ చేస్తున్నామని అంటుంటారని.. ప్రభుత్వాల నుంచి సబ్సడీలు, స్థలాలు కావాలని అడుగుతుంటారని చాలా మంది అంటుంటారు నిజమే.. కానీ, మా గురువు దాసరి నారాయణరావు నిజంగానే సేవ చేశారని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. డా.దాసరి నారాయణరావు అండ్ శ్రీమతి దాసరి పద్మ మెమొరియల్ నీడ చారిటబుల్ ట్రస్ట్ తరుపున దాసరి కుమార్తె హేమాలయ కుమారి, అల్లుడు డా.రఘునాథ్బాబు పలువురికి గురువారం చంద్ర, రాజేష్, చందు, నాగేశ్వరరావులకు స్కాలర్షిప్లు అందజేశారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘మా గురువు దాసరి గురించి గిట్టని వాళ్లు ఎన్ని చెప్పినా ముమ్మాటికి ఆయన సేవ చేశారు. తెలియకుండా ఎంతో మందికి దాన ధర్మాలు చేశారు. ఆయనను అత్యంత సన్నిహితంగా చూశాము కాబట్టి ఆయన ఏంటో మాకు తెలుసు. మా దృష్టిలో దాసరి ఎప్పటికీ దేవుడే. దాసరి సేవల్ని ఆయన కూతురు, అల్లుడు కొనసాగించడం ఆనందాన్ని కలిగిస్తోంది’ అని అన్నారు. ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘తన చుట్టూ వున్న వారికి సహాయం చేయాలన్న గొప్ప హృదయం దాసరిది. తండ్రి ప్రారంభించిన సేవా సంస్థను ఆయన కూతురు హేమాలయ కుమారి, అల్లుడు డా. హరనాథ్బాబు కొనసాగించడం నిజంగా హేట్సాఫ్. తల్లిదండ్రులు ఈ రోజుల్లో పిల్లలకు చదువునే ఆస్థిగా ఇస్తున్నారు. తన దగ్గర పనిచేసిన పిల్లలకు ఆసరాగా నిలుస్తూ వారి పిల్లల చదువులకు స్కాలర్షిప్ అందజేస్తున్నారంటే మా గురువుగారు నిజంగా చిరంజీవే. ఆయన చనిపోలేదు. మనందరిలో బతికే వున్నారు’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసరి నారాయణరావు మనవళ్లు, దవళసత్యం, రాజేంద్రకుమార్, సంజీవి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై కొంకపురి నాటక కళాపరిషత్కు దాసరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 20 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. -
ప్యాకేజీతో చంద్రబాబు మోసగించారు
టీడీపీ పాలనలో ఎవరికీ మేలు జరగలేదు. గతంలో ఇచ్చిన హామీల్ని మరిచి ఎన్నికలు రాగానే కొత్తవి ఎత్తుకోవడం చంద్రబాబుకు అలవాటైపోయింది. ఎన్నికల ముందు పసుపు–కుంకుమ పేరిట తాయిలాలిచ్చి మోసగిస్తున్నారు. అమరావతి అద్భుతం అన్నారు.. పోలవరం పూర్తయిందన్నారు.. జనాలకు ఏం చెప్పినా నడుస్తుందనుకున్నారు. తాత్కాలిక నిర్మాణాలకు, పర్యటనల పేరిట వందల కోట్ల ప్రజాధనం వృథా చేశారు. ఇదేనా ఆయన పరిపాలనా దక్షత. జగన్ సీఎం అయితే ఆయన తండ్రిలా పాలిస్తాడనే ఆశ ప్రజల్లో ఉంది. ప్రజలకు ఏం చేయాలో పాదయాత్ర ద్వారా జగన్ తెలుసుకున్నారు’ అని ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. ఎన్నికల వేళ తన మనసులో మాటను సాక్షితో పంచుకున్నారు. తమ్మారెడ్డి అంతరంగం ఆయన మాటల్లోనే చదువుదాం. ప్రజల్ని మభ్యపెట్టిన వారికే అధికారం దక్కింది గత ఎన్నికల్లో కేవలం ప్రజలను మభ్యపెట్టే పథకాలు ప్రకటించిన వారికే అధికారం దక్కింది. తాత్కాలికంగా పనులు చేస్తూ.. భవిష్యత్కు ఉపయోగపడే పథకాలు చేపట్టడంలేదు. హామీ సాధ్యమా? కాదా? అనేది ఆలోచించకుండా వాగ్దానాలు చేయడం అలవాటైంది. చంద్రబాబు పాలనా విధానాల్లో చాలా లోపాలున్నాయి. వైఎస్సార్సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను లాక్కోవడం, కేంద్రంలో మోదీతో కలవడంతో ఆయనలో ధీమా ఎక్కువైంది. జనాలకు మనం ఏం చెప్పినా నడుస్తుందనుకున్నారు. అమరావతి అన్నారు. పోలవరం అని చెప్పారు. ఆచరణలో మాత్రం పురోగతి లేదు. తాత్కాలిక నిర్మాణాల కోసం అంత ఖర్చా! కొత్త రాజధానిలో తాత్కాలిక నిర్మాణాల పేరిట డబ్బును వృథా చేస్తున్నారు. వాటితో కొన్ని చిన్న ప్రాజెక్టులు పూర్తయ్యేవి. రాష్ట్రం విడిపోగానే శాశ్వత భవనాలు కట్టుకుని ఉంటే ఈ పాటికి పూర్తయ్యేవి. ఏదో గొడవ పడి.. చివరకు అప్పటికప్పుడు అమరావతికి మారారు. మూడేళ్లు ఆలస్యంగా నిర్మాణాలు మొదలు పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. భూసేకరణ విషయంలో రైతులకు సినిమా చూపించారు. మూడు పంటలు పండే పంటపొలాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం.? హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు చేతకానితనమే కారణం. ప్యాకేజీకి ఒప్పుకోవడం చంద్రబాబు తప్పు. కేంద్రంలోని పెద్దలకు సన్మానాలూ చేశారు. ప్యాకేజీ గొప్పదని చెప్పి ప్రజలను మోసగించారు. బీజేపీ, మోదీ బంగారం అంటూ పొగిడారు. అది తప్పని ఆరోజు తెలియదా? ఇప్పుడు అన్యాయమని బాబు గగ్గోలు పెడుతున్నారు. సీనియర్ నాయకుడు ఇలా చేయడం ఆశ్చర్యం. టీడీపీ హయాంలో పేదలకు మేలు జరగలేదు ఈ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఏ మేలూ జరగలేదు. వైఎస్సార్, ఎన్టీయార్ పాలనలో మాత్రమే పేదలకు పట్టం కట్టారు. పేదలకు విద్య, వైద్యం, గూడు, తాగునీరు, ఉపాధి ఇలా వేటినీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎన్నికలొచ్చాయని ‘పసుపు–కుంకుమ’ పేరిట మహిళలకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తున్నారు. వీటిని ఎవరు చెల్లిస్తారు. ఎన్నికల ముందు తాయిలాలిచ్చి ఎన్నాళ్లు మభ్యపెడతారు. ప్రతిపక్షం పథకాల్ని కాపీ కొడితే ఎలా?.. ప్రజాసమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ కొత్త పథకాలు ప్రకటించింది. ప్రతిపక్షం ముందుగా మొదలుపెడితే చంద్రబాబు వాటిని పట్టుకుని పరుగెడుతున్నారు. ఆంధ్రాకు అన్యాయం జరుగుతోందని జగన్ అన్ని రాష్ట్రాలు తిరిగితే చంద్రబాబు అదే బాటపట్టారు. స్పెషల్ స్టేటస్ కోసం మొదటినుంచి జగన్ పోరాడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు అదే అజెండా పట్టుకున్నారు. సంక్షేమ పథకాల్ని నిర్వీర్యం చేశారు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104.. ఇవన్నీ వైఎస్ ప్రవేశపెట్టిన గొప్ప పథకాలు. తర్వాత వచ్చి న ప్రభుత్వాలు వాటిని నిర్వీర్యం చేశాయి. చాలా 108 వాహనాలు మూలనపడ్డాయి. ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల ఎంతోమంది విద్యావంతులయ్యారు. మంచి ఉద్యోగాలొచ్చాయి. ఆ పథకంలోని ఇబ్బందుల్ని సరిదిద్దుకుని అమలు చేయాలి. అంతేకాని... మొత్తానికే ఎత్తేస్తే ఎలా. జగన్.. తండ్రిలా పాలిస్తాడని ప్రజలు భావిస్తున్నారు ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకమవడం చాలా అవసరం. ఒక మనిషి ఏడాదికి పైగా ప్రజల్లో కలిసి ఉండటం, 3,648 కి.మీ.ల దూరం నడవడమంటే.. ఎంతో స్థిరనిశ్చయం ఉంటేనే సాధ్యం. పాదయాత్ర వల్ల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి బాటలు వేయొచ్చు. వైఎస్సార్ పాదయాత్రతో సమస్యలు తెలుసుకుని పరిష్కరించారు. జగన్ సీఎం అయితే ఆయన తండ్రిలా పరిపాలన చేస్తాడని ప్రజల్లో ఆశ ఉంది. అందుకే వైఎస్సార్పై ఉన్న అభిమానం, గౌరవం జగన్పై చూపుతున్నారు. ప్రస్తుత పాదయాత్రవల్ల ఆయనపై ప్రజల ఆశ మరింత పెరిగింది. నవరత్నాలు, బీసీ డిక్లరేషన్ మంచి పథకాలు. పోలవరంపై అంతా ప్రచార అర్భాటమే వైఎస్ దూరదృష్టికి పోలవరం ప్రాజెక్టు ఉదాహరణ. రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించింది ఆయనే. ఆయన హయాంలోనే ప్రధాన పనులు జరిగాయి. ప్రస్తుతం నిర్మాణం సరిగా సాగడంలేదు. ప్రభుత్వ ప్రచారమే తప్ప పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఆ విషయం అందరికీ తెలుసు. ముంపు గ్రామాల ప్రజలకు అన్యాయం జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ముంపు బాధితుల సమస్యను పరిష్కరించి ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలి. ప్రపంచ పర్యటనల పేరిట వృథా ఖర్చులు కొత్త కంపెనీలొస్తాయని చెప్పి విమానాల్లో ప్రపంచమంతా తిరిగారు. ఆ ఖర్చంతా వృథానే కదా.. వాళ్లు చెప్పిన పరిశ్రమలు రాలేదు. పెట్టుబడులు లేవు. వీళ్లు పెట్టుబడుల రాక కోసం ఎంత ఖర్చుపెట్టారో అంత మొత్తం పెట్టుబడులు కూడా రాలేదు. వచ్చిన కొద్ది పెట్టుబడులు కూడా తమ వల్లే వచ్చాయని కేంద్రం చెబుతోంది. మరి రాష్ట్ర ప్రభుత్వం సాధించిందేంటి.? హైదరాబాద్ను చంద్రబాబే అభివృద్ధి చేశారంటే ఎవరూ నమ్మరు. సాంకేతిక విప్లవం ప్రపంచమంతా విస్తరించింది. ఆ పరిణామ క్రమంలోనే ఇక్కడా అభివృద్ధి జరిగింది. ఆ సమయంలో ఎవరు సీఎంగా ఉన్నా అలాగే జరిగేది. బెంగళూరు, చెన్నైతో పోలిస్తే మనం వెనుకబడే ఉన్నాం. మాతృభాషపై చిన్నచూపు తగదు తెలుగుకు ప్రాచీన హోదా సాధించినా ఆంధ్రలో తెలుగు అభివృద్ధికి కృషి జరగడంలేదు. ఈ ప్రభుత్వం స్కూళ్లలో తెలుగు అవసరం లేదని చెబుతోంది. ప్రభుత్వం మన మాతృభాషను, సంస్కృతిని, గౌరవాన్ని కాపాడాలి. అది చేయనపుడు ప్రభుత్వం దేనికి. ఇవ్వని హామీలు కూడా వైఎస్ అమలుచేశారు వైఎస్ రాజశేఖరరెడ్డి విద్య, వైద్యం, గృహ నిర్మాణం, నీటిపారుదల పథకాల్ని ఒక యజ్ఞంలా చేపట్టారు. రాజకీయాలకన్నా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించేవారు. హామీలన్నీ అమలు చేశారు. చెప్పని హామీలూ పూర్తిచేశారు. వైఎస్ అనంతరం అధికారంలోకి వచ్చిన పార్టీలన్నీ అమలుకాని హామీలిచ్చి, తూతూమంత్రంగా చేసి వదిలేయడం, మళ్లీ కొత్త హామీలివ్వడం సర్వసాధారణంగా మారింది. చంద్రబాబు చెప్పింది చేయరు.. పైగా అన్నీ నాన్చుతారు. ఏది చేయాలన్నా డబ్బుల్లేవంటారు. ఆయన అనుకున్నవాటికి మాత్రం డబ్బులు ఉంటాయి. హీరోలు సీఎంలు కావడం ఇప్పడు సాధ్యంకాదు సినీ హీరోలు రాజకీయ పార్టీలు పెట్టి సీఎంలు కావడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు. స్వతంత్రంగా గద్దెనెక్కడం అన్నది జరిగేపనికాదు. సాధారణంగా ఎవరు గెలిస్తే వారికే సినీ రంగం అనుకూలం. కొత్త రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఎన్నికల ముందు అది చేస్తాం, ఇది చేస్తాం అని ఏవేవో ప్రకటించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రోత్సహించి ఉంటే ఈ పాటికి విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేది. ప్రలోభాలకు లొంగకుండా ఓటేయండి డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలకు లొంగొద్దు. మంచివాళ్లకు ఓటేస్తే సమాజం బాగుపడుతుంది. రాజ్యాంగం కల్పించిన ఉన్నతమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి. – యర్రా యోగేశ్వరరావు, సాక్షి ప్రతినిధి -
కళాశాల నేపథ్యంలో సాగే 'ప్యార్ ప్రేమ కాదల్'
ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం 'ప్యార్ ప్రేమ కాదల్'. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకులను పలుకరించ బోతోంది.. శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో సుప్రసిద్ధ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పణలో నిర్మాతలు యువన్ శంకర్ రాజా మరియు విజయ్ మోర్వనేని కలిసి 'ప్యార్ ప్రేమ కాదల్' ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎలన్ డైరెక్షన్ లో హరీష్ కళ్యాణ్, రైజ విల్సన్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం కళాశాల నేపథ్యంలో జరిగే ప్రేమకథ. ఎలన్ రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్ర కధ, ప్రేమ లోని భావోద్వేగాలు ప్రేక్షకులను సమ్మోహితులను చేస్తాయి.చిత్రానికి, పాటలు, నేపధ్య సంగీతం అద్భుతంగా అందించారు యువన్ శంకర్ రాజా. ఈ ప్యార్ ప్రేమ కాదల్ తెలుగు నాట కనువిందు చెయ్యడానికి అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది అని చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు. తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. -
‘ది ఫాగ్’ సినిమా ట్రైలర్ విడుదల
మ్యాజిక్ లైట్ స్టూడియోస్ బ్యానర్పై మధుసూదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ఫాగ్’ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ట్రైలర్ రిలీజ్ చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఎప్పుడో చనిపోయిన వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ తాజాగా హత్యకు గురైన వారి శరీరాలపై ఉండడమేంటనే సీన్ సినిమా కథపై ఆసక్తి రేపుతోంది. బహుశా ఆత్మ నేపథ్యంలో కథ ఉండొచ్చనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఎంవీ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విరాట్చంద్ర, చందన, హరిణి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ట్రైలర్ రిచ్గా ఉందనీ, కొత్త టెక్నాలజీతో వచ్చిన కెమెరా, కొత్త నటీనటులతో తెరకెక్కించిన సినిమా విజయమంతమవ్వాలని భరద్వాజ ఆకాక్షించారు. ఈ సినిమాకు సందీప్ సంగీతం సమకూర్చుతుండగా.. యల్లనూరు హరినాథ్, కె.సతీష్రెడ్డి సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. -
ప్రమాదం జరిగిన తీరు భయంకరంగా ఉంది!
హైదరాబాద్: రాజ్యసభ మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. హరికృష్ణ మృతి తనకు బాధ కలిగించిందన్నారు. ప్రమాదం జరిగిన తీరు చూస్తే చాలా భయంకరంగా ఉందన్నారు. ఎన్టీఆర్ కుటుంబంలో తనకు హరికృష్ణ అత్యంత ఆప్తుడని పేర్కొన్నారు. హరికృష్ణకు డ్రైవింగ్ అంటే ఇష్టమని, మంత్రిగా ఉన్న సమయంలో కూడా సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లేవాడని తెలిపారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ.. హరికృష్ణ మృతి పట్ల బాధ వ్యక్తం చేశారు. హరికృష్ణ తండ్రి ఎన్టీఆర్ తనను సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసేవారని, హరికృష్ణ తనను బాబాయి అని పిలిచేవాడని గుర్తు చేసుకున్నారు. చాలా హుందా గల మనిషి, హృదయం ఉన్న మనిషి, నిజాయతీ కలిగిన వ్యక్తి అకాల మరణం చెందడం తనకు బాధ కలిగించిందని వెల్లడించారు. -
సినిమా టికెట్ల ధరలు పెరుగుతాయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గూడ్స్, సర్వీసెస్ ట్యాక్స్తో (జీఎస్టీ) రానున్న రోజుల్లో తమ రంగానికి కష్ట కాలమేనని సినీ పరిశ్రమ హెచ్చరిస్తోంది. 95 శాతం మంది నిర్మాతలు నష్టాలను చవిచూస్తున్నారని నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంపై జీఎస్టీ ప్రభావం అన్న అంశంపై అసోచాం, పీడబ్లు్యసీ గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నష్టాలు పొందుతున్న నిర్మాతలకు జీఎస్టీ అదనపు భారమేనని స్పష్టం చేశారు. ‘పన్నుతో నిర్మాతలకు 30% ఖర్చు పెరుగుతోంది. రూ.100 దాటిన టికెట్పై పన్ను 28 శాతముంది. అంటే రూ.150 టికెట్లో రూ.42 జీఎస్టీ ఉంది. ఇది పరిశ్రమకు అనుకూలం కాదు. త్వరలో రూ.100 టికెట్ కాస్తా రూ.150, రూ.150 విలువగలది రూ.200లకు చేరనుంది. థియేటర్లో లభించే ఫుడ్, బెవరేజెస్ సైతం ప్రియం కానున్నాయి. అంతిమంగా ఖర్చులు అధికం అవుతాయి కాబట్టి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుంది’ అని వెల్లడించారు. లగ్జరీ నుంచి తొలగించాలి.. సినిమాలను లగ్జరీగా పరిగణించరాదని అసోచాం ఎంటర్టైన్మెంట్, మీడియా నేషనల్ కౌన్సిల్ చైర్మన్, సారథి స్టూడియోస్ డైరెక్టర్ కె.వి.రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పన్ను విషయమై సమీక్షించాలని కోరారు. సినీ రంగంలో వందలాది మంది వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఈ రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వాలని పీడబ్లు్యసీ పార్టనర్ అనిత రస్తోగి డిమాండ్ చేశారు. దాదాపు 1.2 లక్షల ప్రతిపాదనల ఆధారంగా జీఎస్టీ రూపుదిద్దుకుందని మేడ్చల్ జీఎస్టీ కమిషనరేట్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. పన్ను తగ్గింపు విషయంలో ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. కార్యక్రమంలో అసోచాం ప్రతినిధులు డీఎస్ రావత్, బి.శ్రీకాంత్ పాల్గొన్నారు. -
తమ్మారెడ్డి రిక్వెస్ట్
సాక్షి, హైదరాబాద్: హాట్ టాపిక్గా మారిన చికాగో వ్యభిచార రాకెట్ వ్యవహారం.. అందులో టాలీవుడ్ నటీమణులు ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న కథనాలు తెలుగు చలన చిత్రపరిశ్రమను కుదిపేస్తున్నాయి. ఈవెంట్ల పేరుతో నటీమణులను కిషన్-చంద్రకళ దంపతులు విదేశాలకు పిలిపించుకోవటం.. వారితో గుట్టుగా వ్యభిచారం నిర్వహించటం వెలుగుచూసింది. దీంతో కేసు నమోదు చేసిన అక్కడి పోలీసులు పక్కాగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మీడియాకు విజ్ఞప్తి చేస్తూ ఫేస్బుక్లో ఓ వీడియోను ఉంచారు. ‘కిషన్ గతంలో ఏవో సినిమాలు చేసి ఉండొచ్చు. కానీ, ఇపుడు అతడో విటుడిగా మారి ఈ రాకెట్ నడుపుతున్నాడు. అలాంటప్పుడు అతన్ని ఇంకా నిర్మాతగా చూపిస్తూ... తెలుగు చిత్ర పరిశ్రమతో సంబంధాలంటగట్టడం సరికాదు. కిషన్ - చంద్రకళలను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. దాంతోపాటే కొంత మంది బాధితులను కూడా కాపాడారు. ఇందులో కొంతమంది టాలీవుడ్ నటీమణులు పాల్గొని ఉండొచ్చు. అలాగనీ మొత్తం తెలుగు ఇండస్ట్రీకి ఆ రాకెట్తో లింకు పెట్టడం బాధాకరం. కిషన్ ఓ వ్యభిచార రాకెట్ ను నడిపిస్తున్నాడు. అతడి చేతిలో కొందరు చిక్కుకుంటే అతన్ని పింప్ అనకుండా... ఓ ప్రొడ్యూసర్ అని, సినిమావాడని సంబోధించడం సరికాదు. టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మంచి చెడులు, రివ్యూలు రాస్తున్నారు. కానీ, ఇండస్ట్రీని డ్యామేజ్ చేసే కథనాలు మాత్రం రాయకండి’ అని తమ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక నటీమణులు కూడా భవిష్యత్తులో జరిగే ఈవెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ - ఫిల్మ్ చాంబర్లకు ఓ మాట చెప్పి విదేశీ ఈవెంట్లకు వెళితే మంచిదని సూచించారు. ‘ఈవెంట్ల పేరిట జరుగుతున్న ఈ చీకటి వ్యవహారాల్లో తెలిసో.. తెలీకో తెలుగు సంఘాలు కూడా ఇన్ వాల్వ్ అయ్యాయి. ఆ సంఘాల పేరుమీదే వీసాలు జారీ అవుతున్నాయి. ఇన్విటేషన్స్ పంపుతున్నారు. అలాంటప్పుడు వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత తెలుగు సంఘాలపై కూడా ఉంటుంది’ అని తమ్మారెడ్డి తెలిపారు. -
‘టిఫినీ’లు చేశారా?
సాక్షి, బంజారాహిల్స్ : పిజ్జా దోశ.. చాక్లెట్ దోశ.. డ్రై ఫ్రూట్ దోశ.. వీటిని రుచి చూడాలనిపిస్తోందా..? జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో గురువారం ప్రారంభమైన టిఫినీ రెస్టారెంట్లో వెజ్, నాన్వెజ్లతో వివిధ రకాల టిఫిన్లు అల్పాహార ప్రియులను ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన టిఫినీ రెస్టారెంట్ను మాజీ గవర్నర్ రోశయ్య, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సినీ గేయ రచయిత అనంత శ్రీరాం, కేవీ రమణాచారి, చక్రపాణి, డాక్టర్ బీవీ పట్టాభిరామ్తో పాటు అలనాటి నటి జమున ప్రారంభించారు. ఇక్కడి టిఫిన్లను రుచి చూశారు. 80 మంది ఒకేసారి కూర్చునే విధంగా ఇక్కడ రెస్టారెంట్ను సంప్రదాయ రీతిలో రూపొందించినట్లు నిర్వాహకులు వెంకట్రామ్, నవీన్ వెల్లడించారు. ఇక్కడ కీమ దోశ, బొమ్మిడాల పులుసు, రొయ్యల ఇగురు, నాటుకోడి కర్రీ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకోనున్నాయని వారు తెలిపారు. -
కాస్టింగ్ కౌచ్పై తమ్మారెడ్డి స్పందన
-
ఇంత నీచంగా మాట్లాడతారా?: తమ్మారెడ్డి
సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మరోసారి స్పష్టం చేశారు. తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదని, అయితే తెలుగు ప్రజలకు మంచి జరగాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గురువారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. హోదా ఉద్యమానికి తెలుగు చిత్రసీమ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం ఎందుకు స్పందించదని తమ్మారెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఇంత ఉద్యమం జరుగుతున్నా హోదా ఇవ్వడంపై కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తోందో అర్థం కావడం లేదన్నారు. నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. రాష్ట్రానికి నిధులు ఉత్తపుణ్యానికి ఇస్తున్నట్లు బీజేపీ నేతలు మాట్లాడటం సరికాదన్నారు. అలాగే కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనతో పాటుగా తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, తాజా పరిణామాలపై కూడా తమ్మారెడ్డి స్పందించారు. కాస్టింగ్ కౌచ్పై తమ్మారెడ్డి స్పందన టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్పై తమ్మారెడ్డి స్పందించారు. సినిమా ఇండస్ట్రీ గురించి నీచంగా మాట్లాడుకోవడం బాధ కలుగుతుందన్నారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని తాము ఒప్పుకుంటామని అయితే అది కొందరి వల్లే జరుగుతోందని ఆయన అన్నారు. ’ కొంతమంది అన్నట్లు సినీ పరిశ్రమ అంత దరిద్రంగా లేదు. అలా ఉంటే ఎందుకు సినిరంగానికి చెందిన వారి పిల్లలను సినిమా రంగంలోకి దించుతాము. హీరోలు హీరోయిన్లను ఎందుకు పెళ్లిళ్లు చేసుకుంటారు. సినిమా వాళ్ళు అంటే అందరికి లోకువ అయిపోతున్నారు. మీడియా, సినిమా రంగం రెండు సమన్వయంతో పని చేయాలి. పవన్ కళ్యాణ్ ను తిట్టడానికి వీళ్లు ఎవరు. సంధ్యా, దేవి లాంటి వారు కొంతమంది ట్రాప్లో పడ్డారని నేను అనుకుంటున్నాను. రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుతో కొడతామని ఎలా అంటారు.. ఎవరికైనా అన్యాయం జరిగితే సినీ ఇండస్ట్రీలో పెద్దలకు చెప్పాలి. లేదంటే పోలీసులకు, లేదంటే షీ టీమ్స్ కు పిర్యాదు చేయాలి. ఎవరైనా సినిమా రంగంలో అవకాశాలు ఇస్తామని చెప్పి అమ్మాయిలను ఇబ్బంది పెడితే అటువంటి వారిని కొట్టండి. ఎవరైనా వారి హక్కులను హరిస్తే వారిపై తిరుగుబాటు చేయండి. సినీ పరిశ్రమలో అసలు దేని గురించి మాట్లాడదలచుకున్నారు. బాధితులుంటే ఫిల్మ్ ఛాంబర్కు వచ్చి ఫిర్యాదు చేయమంటున్నాం. కానీ మీడియాలోకి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదు. సినీ పరిశ్రమ అంటే అందరికీ లోకువైపోయింది. అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలన్న పవన్ కల్యాణ్పై శ్రీరెడ్డి విమర్శలు చేయడం సరికాదు. సాక్ష్యాలు ఉంటే కేసు పెట్టాలి. త్వరలో ఏర్పాటు కాబోయే క్యాష్ కమిటీ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. రెండు, మూడు రోజుల్లో కమిటీ సభ్యుల పేర్లు వెల్లడిస్తాం. ఇక అమరావతికి సినీ ఇండస్ట్రీని రమ్మని ఎవరు పిలవలేదు. మాకు ఏమీ రాయితీలు ఇవ్వనక్కర్లేదు. మాకు సహాయ సహకారాలు అందిస్తే చాలు.’ అని తమ్మారెడ్డి తెలిపారు. ప్రధానికి తన పదవి గురించి మాత్రమే బాధ దేశంలో ముక్కుపచ్చలారని చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు స్పందించరని తమ్మారెడ్డి ప్రశ్నించారు. ఈ ఘటనలు తన మనసును కలిచివేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాని మాత్రం.. బీసీని అయిన నా మీద కుట్ర చేస్తున్నారు.. నన్ను పదవి నుంచి దించేయడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. మోదీ కేవలం తన పదవిని గురించి మాత్రమే బాధపడ్డారని విమర్శించారు. మోదీ ప్రభుత్వంలో ఉన్న మహిళా మంత్రులు... కథువా, ఉన్నావ్ ఘటనలపై ఎందుకు స్పందించరని ఆయన డిమాండ్ చేశారు. పైపెచ్చు ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మాట్లాడటం సరికాదని అన్నారు. -
తెలుగుదేశం పార్టీకి చేవ చచ్చిందా?
-
టీడీపీకి చేవ చచ్చిందా?
సాక్షి, అమరావతి: నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడడానికి తెలుగుదేశం పార్టీకి చేవ చచ్చిందా? 15 రోజుల క్రితం నుంచే వారికి హోదా ఉద్యమం గుర్తుకు వచ్చిందా? అని ప్రముఖ సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన విమర్శలపై భరద్వాజ బుధవారం స్పందించారు. గతంలో ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొంటే తనను, సంపూర్ణేషు బాబు, మహేష్ కత్తి, శివాజీలను అరెస్ట్ చేసింది టీడీపీ ప్రభుత్వం కాదా? అని నిలదీశారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా అక్కర్లేదు అని చెప్పి, ఇప్పుడు హోదా ఉద్యమం క్రెడిట్ మొత్తం ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి వెళ్లిపోతోందన్న భయంతోనే మాట మార్చారని దుయ్యబట్టారు. మీ రాజకీయాల్లోకి మమ్మల్ని లాగొద్దు ఇప్పటికే సినిమా రంగానికి చెందిన పవన్ కళ్యాణ్, మోహన్బాబు, కొరటాల శివ వంటి వారు ప్రత్యేక ఉద్యమానికి మద్దతు తెలిపారని, కానీ టీడీపీలో ఉన్నవారు, పుష్కరాలు వంటి వేడుకలు నిర్వహించిన వారు, ప్రభుత్వంతో కలిసి నంది అవార్డులు పంచుకున్న సినీ నటులు, జ్యూరీ సభ్యులే హోదా గురించి మాట్లాడటం లేదని తమ్మారెడ్డి భరద్వాజ ఆరోపించారు. అధికారం ఉంది కదా అని టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. మీ రాజకీయాల్లోకి సినిమా వాళ్లని లాగొద్దని సుతిమెత్తగా హెచ్చరించారు. బానిసలుగా బతుకుతున్నారని తమను అంటున్నారని, కానీ వాస్తవంగా పదవుల కోసం నాలుగేళ్లుగా బీజేపీకి బానిసలుగా, తొత్తులుగా జీవిస్తున్నది తెలుగుదేశం నేతలు కాదా? అని ప్రశ్నించారు. తమను విమర్శిస్తున్న టీడీపీ నాయకులు ఈ నాలుగేళ్లు ప్రత్యేక హోదాను పక్కన పెట్టి లంచాల మత్తులో మునిగితేలారా? అంటూ ఘాటుగా విమర్శించారు. సీఎం చంద్రబాబులో ప్రత్యేక హోదా సాధించాలన్న తపన కంటే వైఎస్ జగన్ బీజేపీ, పవన్ కళ్యాణ్లతో కలుస్తాడన్న భయమే ఎక్కువగా కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలోని రాజకీయ నాయకులంతా ఒక్కతాటిపైకి వచ్చి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేపడితే సినీ పరిశ్రమ కూడా తప్పకుండా పాల్గొని మద్దతు ఇస్తుందని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు. -
'శ్రీదేవిని చూపిస్తే .. 2 లక్షలు ఇస్తానన్నాడు'
సాక్షి, హైదరాబాద్ : తన అందం అభినయంతో సినీ ప్రేక్షక లోకాన్ని అలరించిన లెజండరీ నటి, అతిలోక సుందరి శ్రీదేవి (54) హఠాన్మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. 1980 దశకంలో శ్రీదేవి అంటే యువతలో విపరీతమైన క్రేజ్ ఉండేదని తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ఈ రోజు ఉదయం ఓ ఫోన్ కాల్ తో నిద్ర లేచాను. ఫోన్ ఎత్తగానో టీవీ చూశారా అన్నారు. లేదనడంతో శ్రీదేవి గారు మృతిచెందారు అని చెప్పారు. ఆ షాక్ నుండి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నప్పటి నుంచి ఇటీవల మామ్ సినిమా వరకు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో ఆమెకు ఎంత క్రేజ్ ఉండేదంటే.. నేను చదువు ముగించుకొని సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలి నాళ్లలో దుబాయి నుంచి ఓ స్నేహితుడు ఫోన్ చేశాడు. శ్రీదేవిని చూడటానికి రూ. 2 లక్షలు ఇస్తానన్నాడు. షూటింగ్ లో జస్ట్ చూపిస్తే చాలు.. పరిచయం కూడా చేయనక్కర్లేదన్నాడు. ఆ రోజుల్లో(1980 దశకంలో) రూ. 2 లక్షలు ఇస్తానన్నడంటే యువతలో శ్రీదేవికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీదేవి సినిమాలకు దూరంగా ఉండి, చాలా ఏళ్ల గ్యాప్ తీసుకుని ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాలో నటించినా శ్రీదేవి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని తమ్మారెడ్డి అన్నారు. కొత్త హీరోయిన్లందరూ శ్రీదేవిని అనుకరించాలని చూస్తుంటారని, క్రమశిక్షణ, ప్రొఫెషనలిజంలోనూ ఆమెను ఫాలో అయితే బాగుంటుందని సూచించారు. శ్రీదేవి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్నారు. ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. -
టూ స్టోరీస్
ఆకాశం కథొకటి. భూమి కథొకటి. అంటే.. ఒకరి కథలో ఆకాశం.. ఇంకొకరి కథలో భూమీ.. ఉన్నాయని కాదు. అలాగని లేవనీ కాదు! ఆకాశమూ భూమీ పుట్టినప్పటి నుండి ఉన్న కథలని. అన్ని కథలని! లైంగిక వేధింపులతో మన అమ్మాయిలకు... అన్ని వేధింపులని!! ‘జీవితంలో ఎదుగుతూనే నన్ను నేను కాపాడుకోవాలి. నాపై విసిరే అనేకానేక వలల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి. సినీరంగంలో ఇదో పెద్ద సవాల్ నాకు’ అంటున్నారు గీత రచయిత్రి శ్రేష్ఠ. 2012లో సినీ సీమలోకి అడుగుబెట్టి పదిహేను సినిమాలకు పాటలు రాసిన ఈ మంచిర్యాల యువతి మొదటి నుంచి లైంగిక, మానసిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ‘సమాజం.. కుటుంబం.. మగాడు ఎంత చెత్తగా ప్రవర్తించినా అతణ్ణి గౌరవిస్తాయి. ఆడపిల్ల విషయంలో మాత్రం చిన్న మచ్చ కూడా ఉండకూడదంటాయి. స్త్రీల పట్ల మన దృష్టికోణం మారాలి’ అంటున్న శ్రేష్ఠ వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ శ్రేష్ఠ తొలి సినిమా. 2016లో విడుదలైన ‘పెళ్లిచూపులు’ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ‘ఆ సినిమా హిట్ కావడంతో ‘అర్జున్రెడ్డి’లో అవకాశం వచ్చింది. తర్వాత ‘హలో’ ‘యుద్ధం శరణం’ సినిమాలకు పాటలు రాశాను. ‘అర్జున్రెడ్డి’కి రాసిన ‘మధురమే ఈ క్షణమే చెలీ’ పాటకు జీ గోల్డెన్ అవార్డు రావడం సంతోషంగా అనిపించింది. ‘యుద్ధం శరణం’ పాటలకూ మంచి అప్లాజ్ వచ్చింది. వేధింపు వ్యధల మధ్య నలిగిపోయిన నాకు ఈ విజయాలు కొంత శక్తినిచ్చాయి’ అంటున్న శ్రేష్ఠ చేతిలో ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులున్నాయి. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. సినిమా పాటలు రాయాలనేది నా కోరిక. గీత రచనపై పట్టు సాధించేందుకు పుస్తకాలు చదివేదాన్ని. పాటలు బాగా వినేదాన్ని. కొన్ని పాటలు రాసుకున్నాక.. అవి బాగా వచ్చాయనే నమ్మకం కలిగాక.. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాను. ఓ నిర్మాతను కలసి చాన్స్ ఇవ్వమని అడిగాను. ‘నువ్వే మాకు ఒక చాన్స్ ఇవ్వు’ అని బదులిచ్చాడు ఆయన. ఇలా వెళ్లిన ప్రతిచోటా ఎన్నో చేదు అనుభవాలు. అవమానాలు. ‘నీకు అవకాశమిస్తే మాకేంటి లాభం! నీ కంటే ఎంతోమంది గొప్ప రచయితలున్నారు. వాళ్లతో రాయించుకుంటాం’ అని కూడా అన్నారు. మొండిగా ముందుకు... 2013లో నా చేతిలోంచి చాలా ప్రాజెక్టులు జారిపోయాయి. నా తిరస్కారంతో ఇగో దెబ్బ తిన్నవాళ్లు కొందరు, నాతో మర్యాదగా మాట్లాడిన వాళ్లని ఇన్ఫ్లుయన్స్ చేసి, అవకాశాలు రాకుండా చేశారు. ఈ కారణంగా బతుకు మీదే విరక్తి పుట్టింది. ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. సైలెంట్గా ఉంటే ఎక్కడైనా∙సంబంధాలు బాగుంటాయి. కానీ అలా ఉండకూడదనుకున్నాను. గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నాను. మొండితనంతో ముందుకు సాగాను. ఎప్పుడూ భయపడలేదు. కానీ నీరసం వచ్చింది. ఓపిక లేనట్టు అన్పించింది. నా బాధను ఎవ్వరితోనూ పంచుకోలేకపోయాను. మన సమాజం – కుటుంబం బాధితురాలినే తప్పుబట్టి, ఆమె మాటలకు తప్పుడు వ్యాఖ్యలు జోడించి ప్రచారం చేస్తాయి. అబ్బాయిలకీ ఇబ్బందులు ఉంటాయి కదా అంటారు కొందరు. నిజమే, కానీ సక్సెస్ వచ్చేవరకే వాళ్లు ఇబ్బందిపడతారు. ఆ తరవాత వారికి రెడ్ కార్పెట్ పరుస్తారు. అమ్మాయిలు ‘ప్రిపేర్డ్’గా వస్తారనుకుంటారు పరిశ్రమలో చాలామంది. అందుకే మొదటి అవకాశం అందుకోవడానికి టైమ్ పట్టింది. కొందరు పది పదిహేనేళ్ల వరకూ ఎదురుచూడాల్సివస్తుంది. ఈ లోపు ఉత్సాహం సన్నగిల్లుతుంది. ఇక సినిమాలు వదిలేద్దాంలే అనిపిస్తుంది. మహిళా దర్శకురాలే వల విసిరింది అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న రోజుల్లో ఒక మహిళా దర్శకురాలు పరిచయం అయ్యింది. ఆవిడని అక్కా అని పిలిచేదాన్ని. కాస్త సన్నిహితంగా మెలిగేదాన్ని. ఒకరోజు ఫోన్ చేసి, ‘న్యూ ఇయర్ పార్టీకి వస్తావా’ అని అడిగింది. ఆసక్తి లేదని చెప్పాను. ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తున్నాడని, పార్టీకి వస్తే ఇద్దరూ కలవొచ్చని చెప్పింది. ‘నన్ను ఎందరో ఇష్టపడుతుంటారు. నేను ఎందరినో కాదంటాను. నాకు ఇష్టం లేనప్పుడు మీరు ఎలా లీడ్ తీసుకుంటారు? నేను వద్దంటే ఎందుకు ఒత్తిడి చేస్తారు?’ అని ఆ దర్శకురాలిని ప్రశ్నించాను. ఆమె ఇబ్బంది పెట్టడంతో తనతో కలసి చేద్దామనుకున్న ప్రాజెక్టును వదిలేసుకున్నాను. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాలేదు. ఈ ఆలోచనల నుంచి బయటపడకముందే ఫోనొచ్చింది. అవతలి వాడి మాటలు అసభ్యంగా ఉన్నాయి. ‘ఆవిడ నిన్ను ఆఫర్ చేసింది. నువ్వు కాదంటావేమిటి’ అంటూ పిచ్చిపిచ్చిగా వాగాడు. నాకు కోపం ఆగలేదు. ‘ఎవడ్రా నువ్వు’ అని గట్టిగా అరుస్తూ కాల్ కట్ చేశాను. ఇది జరిగి నాలుగు సంవత్సరాలైంది. ఈ రంగంలో అమ్మాయిల్ని నమ్మడం కూడా కష్టమవుతోంది. వాళ్లతో స్నేహం చేసే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది. పురుషుల దురుద్దేశాన్ని తొందరగా పసిగట్టవచ్చు. కానీ స్త్రీల విషయంలో అది కష్టమవుతోంది. ‘నీ దగ్గర ఏముందని ఇంత పొగరు? నన్నే కాదంటావా? నువ్వు నా గ్రిప్లో ఉండాలి. లేదంటే నీకు కెరీర్ లేకుండా చేస్తా’ అన్నాడు ఓ దర్శకుడు. ఇలాంటి అనేకానేక చేదు అనుభవాల కారణంగా పురుష సమాజం మీదే జుగుప్స కలుగుతోంది. సాధారణంగా ధనవంతుల కుటుంబాల్లో పుట్టిన వారికి లేదా వెన్నుదన్నులు ఉన్న వారికి సినీ పరిశ్రమలో అంతగా ఇబ్బందులు ఉండవు. ఏ పరిచయాలూ లేని నాబోటి మధ్యతరగతి వాళ్లది మాత్రం ముళ్లదారే! ఆ దారిలో నన్ను నేను కాపాడుకుంటూ ముందుకు సాగే క్రమంలో కనీసం పది సినిమాలు వదులుకున్నాను. మంచి వాళ్లూ ఉన్నారు.. 2016లో పెళ్లిచూపులు చిత్రం రచయిత్రిగా నన్ను నిలబెట్టింది. నాకు పేరు తీసుకొచ్చింది. అక్కడ ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయోనని భయపడ్డాను. వాళ్లకు నా భయాలు – చేదు అనుభవాలు వివరించాను. ‘అందరూ ఒకేలా ఉండరు. ఇక్కడ మీకు ఎలాంటిæ భయమూ ఉండదు’ అని హామీ ఇచ్చారు వాళ్లు. ‘పెళ్లిచూపులు’ సినిమా ఇండస్ట్రీలో ఇక ముందుకు సాగవచ్చనే నమ్మకం ఇచ్చింది. మరో మూడు సినిమాల్లో పాటలు రాసే అవకాశం అందించింది. సినీసీమలో ‘చాన్స్ ఇస్తావా’ అని అడిగే వాళ్లతో పాటు స్త్రీని గౌరవించే వారూ తారసపడ్డారు. పెళ్లిచూపులు సినిమా తర్వాత మురికి మాటలు తగ్గాయి. నాకు గాలమేయాలని చూసిన ‘పెద్దలు’ ఇప్పుడు డౌన్లో ఉన్నారు. నేను వాళ్ల కంటే మెరుగ్గా ఉన్నాను. ఇది ఒకింత సంతోషపరిచే విషయం నాకు. ఇటీవల ఓ టీవీ చానల్ నన్ను ఇంటర్వ్యూ చేసింది. ‘ఆమెను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు’అంటూ ఆ చానల్ ఆఫీసుకు ఫోన్లు వెళ్లాయి. ఇంటర్వ్యూ ప్రసారం కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. కాల్ చేసింది ఓ మహిళేనట! ఈ విషయం తెలిసిన ఆ చానల్ ఉద్యోగులు నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ‘పెళ్లిచూపులు’ తర్వాత నా చేదు అనుభవాల్ని మీడియాతో పంచుకున్నాను. ఈ కారణంగా వేధింపులు తగ్గాయి. ‘సాక్షి’ ద్వారా నేను చెప్పగలిగింది ఒకటే. ఇలాంటి తోడేళ్లు ప్రతి చోటా ఉంటాయి. అప్రమత్తంగా ఉంటూ ముందుకు సాగాల్సిందే. సమస్యలు ఎదురైతే గొంతు విప్పాల్సిందే. నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టాల్సిందే. – హృదయ మంచం కింద, తలగడ కింద, వంట గదిలో, ఫ్రిడ్జ్ కింద... అన్ని చోట్లా కత్తులు ఉంచుకుంది ఫిదా ఫేమ్ గాయత్రి గుప్తా. ఎవరినీ చంపడానికి కాదు, తనను తాను రక్షించుకోవడం కోసమే ఈ ఏర్పాటంతా. ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ఏక్షణమైనా ఏదైనా జరుగుతుందేమోనని ఆమెకు భయం. సినీ పరిశ్రమలో కొందరు తనను లైంగికంగా వేధించారని ఇటీవల మీడియా ముందు గొంతు విప్పింది గాయత్రి గుప్తా. నేను షార్ట్ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్లో నటించాను. పాటలు పాడతాను, కథలు రాస్తాను. ఒక సినిమా షూటింగ్లో నేను లైంగిక వేధింపులకు గురయ్యాను. అందుకే మీడియా ముందుకు వచ్చి నా గొంతు వినిపిస్తున్నాను. చాలామంది ఆడవాళ్లు దుస్తులు సరిగా వేసుకుంటే వారి మీద లైంగిక దాడులకు అవకాశముండదు, ఒంటి నిండా బట్టలు కట్టుకోవాలి అంటున్నారు. భారత కాలంలో ద్రౌపది దుస్తులు సరిగా వేసుకోలేదనే ఆమె మీద దుశ్శాసనుడు, కీచకుడు, సైంధవుడు అత్యాచారం చేయబోయారా. మన వస్త్రధారణ మీద పాశ్చాత్య ప్రభావం ఎక్కువగా ఉంది. ‘ఆడవాళ్లు ఏం వేసుకోవాలి’ అనేది ఇంకా మగవారు నిర్ణయించక్కర్లేదు. నాకు అనువుగా ఉన్న బట్టలు వేసుకునే హక్కు నాకు ఉంది. కారులో దింపుతూ మిస్బిహేవ్ చేశారు.. నేను ఒక చిత్రం ఒప్పుకున్న సందర్భంలో, ‘‘ఇక్కడి వాతావరణం బాగుంటుందా’’ అని నేరుగా అడిగాను. ‘‘అంతా బాగుంటుంది, మీకు ఇబ్బంది ఏమీ ఉండదు’’ అని సమాధానం చెప్పారు వారు. నిజమని నమ్మాను. సినిమా షూటింగ్ మొదలవ్వకుండానే, వారు నాతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఎక్కడికక్కడ నేను జాగ్రత్తగా నన్ను రక్షించుకుంటూ వచ్చాను. పరిశ్రమలో అన్నీ నాలుగుగోడల మధ్య జరిగిపోతాయి. ఎవ్వరికీ బయటకు తెలియవు. పోలీస్ స్టేషన్కి వెళ్లాలన్నా ఆధారాలు కావాలి. ఇటువంటివి విన్నప్పుడే... సినీ పరిశ్రమకు అమ్మాయిల్ని పంపడానికి చాలామంది భయపడుతున్నారు. ఫిర్యాదు చేయాలంటే ఆధారాలు లేవ్! చాలామంది ‘ఫిలిమ్ చాంబర్లో ఫిర్యాదు చేశారా’ అని అడుగుతున్నారు. ఫిర్యాదు చేయడం నా ఉద్దేశం కాదు. పరిశ్రమలో పరిస్థితి ఇలా ఉంటుంది అని చెప్పడానికే నేను గొంతు విప్పాను. నాలాగే వేధింపులకు గురైన వారు గొంతు విప్పితేనే వేధించాలనుకునేవారు భయపడతారు. ఇబ్బందులు వచ్చినప్పుడు గట్టిగట్టిగా అరిస్తే, అవతలివారు నోరు మూసుకుని పారిపోతారు. అంతే. నాకు ఏం కావాలో, ఏది సంతోషం ఇస్తుందో నేను ప్లాన్ చేసుకుంటాను. ఇంటి నుంచి బయటకు వచ్చిన మూడు నాలుగు సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డాను. ఆ టైమ్లో ఎమోషనల్ అయ్యాను కూడా. నేను అందరికీ చెప్పేది ఒక్కటే. తిండి కంటే కూడా ఆత్మ గౌరవం ప్రధానం. ఆ ఆత్మ గౌరవమే మనల్ని కాపాడుతుంది. అవకాశాలు రాలేదని మీడియా కెక్కానట.. నేను మీడియాలో నా గొంతు వినిపించడాన్ని చాలా మంది విమర్శిస్తున్నారు. ‘ఈ అమ్మాయికి ఆఫర్లు రావట్లేదు కాబట్టి, అటెన్షన్ కోసం ఇలా చేస్తోంది’ అంటున్నారు. ఇలా మాట్లాడితే నేను ఏం చేయాలి. అందుకే నా సమస్యను నేనే పరిష్కరించుకుంటున్నాను. రాధికా ఆప్టే తెలుగులోనే కాదు దక్షిణాది సినిమాలు చేయనని గట్టిగా చెప్పేశారు. ‘ఇక్కడ అసలు మనిషిలా చూడట్లేదు’ అని చాలా ఘాటుగానే సినీ పరిశ్రమను విమర్శించారు. అలాంటిదేం జరగలేదు నేను చేసిన మొదటి సినిమా ఐస్క్రీమ్ 2. ‘రామ్గోపాల్ వర్మతో చేస్తున్నావు, జాగ్రత్త’ అని చాలామంది చెప్పారు. భయం భయంగానే సినిమా షూటింగ్కి వెళ్లాను. ఆయన ఏ మాత్రం అసభ్యంగా ప్రవర్తించినా వెంటనే ఫేస్బుక్లో పోస్టు పెట్టేయాలనుకున్నాను. ఆయనే కాదు, టీమ్లో అందరూ ఎంతో మంచిగా ఉన్నారు. వారంతా పని దాహం ఉన్నవారే. నాకేమీ అక్కర్లేదు... చాలామంది నన్ను వలలో వేసుకోవడానికి డబ్బు ఆఫర్ చేశారు. నాకు ఎవ్వరి డబ్బు అవసరం లేదు. అందునా నీతి తప్పి సంపాదించే డబ్బు అస్సలు అవసరం లేదు. తినడానికి తిండి, ఇల్లు అన్నీ ఉన్నాయి. డబ్బు సంపాదించడం నా జీవిత ధ్యేయం కాదు. నాకు నచ్చి, చేసిన పనికి డబ్బులు వస్తే సంతోషం. నేను రాయగలను, పాడగలను, డైరెక్ట్ చేయగలను. ఎవరో నాకు జీవితం ఇవ్వవలసిన అవసరం లేదు. ఇప్పుడు నేనే సొంతంగా సినిమా తీసే ఆలోచనలో ఉన్నాను. – వైజయంతి అవసరమైతే తిరగబడాలి వేధింపులకు సినీరంగం సహా ఏ రంగమూ అతీతం కాదు. ఎవరికి వాళ్లు జాగ్రత్తగా ఉండాల్సిందే. లౌక్యంగానో, మొండిగానో ముందుకు సాగాల్సిందే. అవసరమైతే తిరగబడాలి కూడా. సినిమా రంగంలో అవకాశాల కోసం తమను తాము ఆఫర్ చేసుకుంటున్న వారు, తమంతట తాము ‘కమిట్’ అవుతున్నట్టు ప్రకటించే వారు కూడా ఉన్నారు. కొందరు తల్లిదండ్రులు పదిహేడు పద్దెనిమిదేళ్ల అమ్మాయిల్ని తీసుకొచ్చి మా అమ్మాయిని మీకు అప్పజెపుతున్నాం.. మీదే పూచీ.. అన్నట్టు మాట్లాడుతుంటారు. ఈ కోణాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. శీలం అనేది నైతికతలో ఒక భాగం. అది ప్రధానం అనుకున్నవాళ్లు గట్టిగా నిలబడాలి. ఎదురు తిరగాలి. డబ్బు, అవకాశాలతో లొంగదీసుకోవాలనుకునే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏ రంగంలోనైనా నీతికోసం నిలబడితే, ఎదురు తిరిగితే గెలుస్తాం. శ్రేష్ఠ ఇందుకు ఒక ఉదాహరణ. సినిమా, మోడలింగ్, ఎంటర్టైన్మెంట్ వంటి రంగాల్లో ఆమెలా నిలబడుతున్న వాళ్లు్ల కొందరున్నారు. – తమ్మారెడ్డి భరద్వాజ, సినీ దర్శకులు. -
మౌనంగా ఎందుకు ఉంటున్నారు?
-
ఇంకా మౌనంగా ఎందుకు ఉంటున్నారు?
సాక్షి, సినిమా : సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్.. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం నడుస్తున్న సమస్యలు.. సినిమాలపై కొందరు ప్రదర్శిస్తున్న తీరులను ఎండగడుతూనే ఆయన ప్రధానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘దేశానికి మంచి నాయకుడు కావాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీని పీఎంగా ఎన్నుకున్నాం. కానీ, మీ వ్యవహారశైలి చూస్తుంటే, మీరు కొంత మందికి మాత్రమే ప్రధాన మంత్రి అనే ఫీలింగ్ కలుగుతోంది. మీరు అలాంటివారు కాదనేది గట్టి నమ్మకం. ఈ మధ్య కాలంలో సినిమాలపై ప్రతి ఒక్కరూ పడిపోతున్నారు. ముఖ్యంగా బీజేపీవాళ్లు. 'ఉడ్తా పంజాబ్', 'మెర్సల్', 'పద్మావతి'... ఇలా ఎన్నో సినిమాలపై దాడులు జరుగుతున్నాయి. సినిమా అనే క్రియేటివిటీని ఆపడానికి చేసే ప్రయత్నం, భావ ప్రకటన స్వేచ్ఛను ఆపే ప్రయత్నం జరుగుతుంటే, మీరూ మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. ఈ మౌనం సమర్థిస్తున్నట్టుగానే కనిపిస్తోంది అని తమ్మారెడ్డి అన్నారు. బీజీపీకి చెందిన ఎంపీలు చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారని... సినిమావాళ్ల భార్యలంతా ఎవరితోనే వెళ్లిపోతున్నారంటూ ఓ ఎంపీ దారుణ వ్యాఖ్యలు చేశారని... ఇలాంటి వ్యాఖ్యలను విని కూడా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారని ప్రశ్నించారు. పద్మావతి చిత్ర వివాదంపై స్పందిస్తూ... కొంతమంది సినిమావాళ్ల తలకాయలు తీసేయమంటున్నారు. దీపికా పదుకొనే ముక్కు కోసేయాలంటూ పిలుపునిచ్చారు. వీటన్నింటినీ చూస్తుంటే మనం మళ్లీ ఆటవిక సమాజానికి వెళ్తున్నట్టు అనిపిస్తోంది అని పేర్కొన్నారు. 'గౌరీ లంకేష్ ను చంపినప్పుడు కొంతమంది సెలబ్రేట్ చేసుకున్నారని... ఇది ఎంతవరకు సబబని మాత్రమే నటుడు ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారని, కానీ, ప్రకాశ్ రాజ్ అల్లకల్లోలం చేశాడంటూ కొందరు బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రధాన మంత్రిని దేని గురించైనా ప్రశ్నించడం తప్పా మోదీ గారు? అని అన్నారు. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మనసులోని మాటను తమతో పంచుకుంటున్నారని... మా మనసులోని మాటను కూడా మీరు వింటే చాలా బాగుంటుందని భావిస్తున్నానని చెప్పారు. ఈ వీడియో మీ వరకు చేరుతుందనే నమ్మకం కూడా తనకు లేదని... ఎవరైనా తన భావనను మీకు చెబుతారనే చిన్న ఆశ మాత్రం ఉందని అన్నారు. ఏ ఒక్క వర్గానికో మీరు కాదని.. ప్రధానిగా దేశంలోని ప్రతి ఒక్కరినీ రక్షించే బాధ్యత తమరిపై ఉందని మోదీని ఉద్దేశించి తమ్మారెడ్డి ఆ వీడియోలో వివరించారు. -
సినిమా వాళ్ల భార్యలు అంత తేరగా దొరికారా?
సాక్షి, హైదరాబాద్ : ఎవరి మీద అయినా కోపం వస్తే వాళ్లను తిట్టాలి కానీ, నోరు ఉంది కదా ఏది పడితే అది వాగితే ఊరుకునే ప్రసక్తే లేదంటున్నారు సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్. బీజేపీ ఎంపీ చింతామణి మాలవీయ.. సినిమా వాళ్ల భార్యలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ్మారెడ్డి మాలవీయపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నోరు ఉంది కదా అని వాగితే తాట తీస్తా అంటూ తన అఫీషియల్ యూట్యూబ్ పేజీలో ఆయనో వీడియో సందేశం ఉంచారు. అందులో మాలవీయపై ఓ రేంజ్లోనే ధ్వజమెత్తారు. ఎవరి మీదైనా కోపం వస్తే.. వాళ్లను మాత్రమే తిట్టాలి.. అంతేకానీ సినిమా వాళ్ల మహిళను కించపరుస్తూ మాట్లాడటం దారుణమని ఆయన అన్నారు. గతంలో కమల్ హాసన్ వైవాహిక జీవితం గురించి కూడా మాట్లాడారని.. వివాహాలు, విడాకులు దేశంలో ఇప్పుడు సర్వసాధారణమైపోయాయన్న ఆయన... కొత్త మొగుళ్లు.. కొత్త పెళ్లాళ్లు వస్తున్నారని చెప్పారు. బీజేపీలో కూడా అలాంటి నేతలు ఉన్నారన్న ఆయన.. తనకు సంస్కారం ఉంది కాబట్టే వారి పేర్లు ప్రస్తావించనని చెప్పారు. ‘‘ఇలాంటి వ్యాఖ్యలు క్షమించరాని నేరమని.. ఖండించకుండా ఊరుకోవటం కూడా చాలా కష్టం అన్నారు. సినిమా వాళ్ల భార్యలు ఊరికే దొరికారా? ఏమిటతని ఉద్దేశ్యం? నోటి కొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోవాలా? సమాజంపై ప్రభావం చూసే సినిమాను, వాళ్ల కుటుంబ సభ్యుల చులకనగా మాట్లాడే హక్కు అతనికేక్కడిది?’’ అని తమ్మారెడ్డి ప్రశ్నించారు. కోపం వస్తే చెప్పుతో కొడతామని మాలవీయ అన్నారని... అలాంటి పరిస్థితి వస్తే, మేము కూడా చెప్పు తీసుకుని కొట్టే పరిస్థితి వస్తుందని తమ్మారెడ్డి వారించారు. చేతిలో ప్రభుత్వం ఉందని.. ఏది పడితే అది చెయ్యొచ్చని అనుకుంటే సహించే ప్రసక్తే లేదన్నారు. అలాంటి పరిస్థితి వస్తే... సినిమా పరిశ్రమ అంతా ఏకమైతే ఎలా ఉంటుందో మీకూ తెలీదు. చూపించాల్సిన పరిస్థితి వస్తే చూపిస్తాం ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. "సినిమా తీసే వాళ్ల కుటుంబాల్లో మహిళలు ప్రతిరోజూ భర్తలను మార్చేస్తుంటారు. దుష్ట మనస్తత్వాలతో నన్ను చికాకు పెట్టే దర్శకులను చెప్పుతో కొడతాను..’ అంటూ ఉజ్జయిని ఎంపీ చింతామణి మాలవీయ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
సినిమా వాళ్ల భార్యలు అంత తేరగా దొరికారా?
-
తమ్మారెడ్డి భరద్వాజతో మనసులో మాట
-
తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్లో విషాదం
ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మనవడు (కుమార్తె చరిత కొడుకు) సాకేత్ రామ్ వెల్లంకి(19) మంగళవారం అమెరికాలో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు అమెరికాలోని వర్జీనియా, మనస్సాస్లో జూలై 5న నిర్వహించనున్నారు. సాకేత్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. వెల్లంకి కుటుంబానికి ప్రవాసులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. రేపు వర్జీనియాలో నిర్వహించనున్న కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెలుగు వారు హాజరు కానున్నారు. -
జ్ఞానోదయం అయింది!
సినిమాకి రీక్యాప్లా అసలేం జరిగిందంటే... ‘బాహుబలి–2’ ప్రీ–రిలీజ్ వేడుక గత నెల 26న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అన్ని కళ్లూ ఆ వేడుకను చూడాలనుకున్నాయి. అదే జరిగింది. అలాగే అన్ని నోళ్లూ ఆ రోజు కీరవాణి చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుకున్నా యి. ‘‘నేను ఎక్కువగా బ్రెయిన్లెస్ దర్శకులతో పని చేశా. వేటూరి, సిరివెన్నెల తర్వాత తెలుగు సినిమా సాహిత్యం అంపశయ్య పై ఉంది’’ అని ఆ రోజు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. ఎవరి అభిప్రాయాలను వాళ్లు వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉన్నట్లే, ఆ అభిప్రాయాలను విమర్శించే హక్కు కూడా అందరికీ ఉంటుంది. ‘కీరవాణిగారూ.. ఎందుకయ్యా మీకు ఇవన్నీ..’ అంటూ దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఓ వీడియో ద్వారా పేర్కొన్నారు. ఇతర ప్రముఖులెవరైనా కీరవాణికి సలహాలిచ్చారేమో. అందుకే సోమవారం ట్విట్టర్లో కీరవాణి ఈ విధంగా స్పందించారేమో! ► మీ సలహా తప్పకుండా పాటిస్తా తమ్మారెడ్డి భరద్వాజ్గారూ... థ్యాంక్స్.. ఒక ట్వీట్లో ‘మోస్ట్లీ’ అనే పదం వాడాను. అది చాలామందిని బాధపెట్టింది. కానీ, టీబీ (తమ్మారెడ్డి భరద్వాజ్) వంటి పెద్దవారు మంచి సలహా ఇచ్చారు. టీబీ సలహాకు సంబంధించిన కొన్ని ట్వీట్స్ను తొలగించాను. ►మనం ఎప్పటికీ విద్యార్థులమే.. తప్పులు చేస్తుంటాం. అయితే తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి వారే మన తప్పులను సరిదిద్దగలరు. ► గౌరవనీయులైన దర్శకులందరూ మేథావులని సడన్గా నాకు జ్ఞానోదయం కలిగింది. ఎవరైనా తెలివితక్కువవారు ఉన్నారంటే.. అది నేనేనేమో! ► నేను తప్ప అందరూ సృజనాత్మకత కలిగినవారే. ఎంత ఎదిగినా అందరూ ఒదిగి ఉంటున్నవారే. ► నాకు ఎవరో ఒక నిఘంటువు పంపారు. అందులో పొగరుకి ‘ఎమ్.ఎమ్.కె’ (అంటే ఎం.ఎం. కీరవాణి) అని అర్థం ఉందట. ఆ పుస్తకం మొత్తం చదువుతాను. ► ప్రపంచంలో ఉన్న దర్శకులందరూ గొప్పవారు. వారితో పనిచేసేందుకు నేను తహతహలాడుతున్నాను. కానీ, నేను ఓల్డ్ బ్రెయిన్లెస్ కంపోజర్ని కాబట్టి, అవకాశాలు తక్కువ వస్తాయనుకుంటున్నా. ► కేవలం ఐదు నిమిషాల్లోనే బుర్ర లేని నా మతిని తమ్మారెడ్డి భరద్వాజ్ వాష్ చేశారు. ► ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు. ► తమ్మారెడ్డి భరద్వాజ్గారికి మళ్లీ థ్యాంక్స్. త్యాగయ్యగారికి ధన్యవాదాలు. ► నాకు పాటల రచయితలందరూ ఇష్టమే. ఎంతో కష్టపడి వాళ్లు రాస్తున్న పాటలంటే ఇష్టమే. వాళ్లను ఎలా మరచిపోయాను? (నేను వృద్ధుణ్ణి అయిపోతున్నా). ► వేటూరిగారికి 100 మార్కులు, సిరివెన్నెల సీతారామశాస్త్రికి 90, మా నాన్నగారికి 35, నాకు 10 మార్కులేనని నా అభిప్రాయం. మిగతా వారందరూ 11 మార్కుల నుంచి 89 మార్కుల మధ్యలో ఉంటారు.. ► ఇటీవల సాయిగారు టీవీ ప్రోగ్రామ్ చూశారు. ఆ ప్రోగ్రామ్లో టాలీవుడ్లో కంపోజర్స్ కొరత ఉందని అన్నారు. ఆ మాటలను నేను వ్యతిరేకించాను. ఆయన్ను ఎడ్యుకేట్ చేశాను. ► నిజానికి రైటర్స్ కొరత అధికంగా ఉంది. వాళ్లకు తక్కువ పారితోషికం ఇస్తున్నారు. ► తన 30 ఏళ్ళ అనుభవంలో మా నాన్నగారు నాకు 20 పాటలకంటే తక్కువగా రాశారు. ఎందుకంటే ఆయన అవుట్సైడర్ కదా. నేను బంధు ప్రీతిని సపోర్ట్ చేస్తాను. చంద్రబోస్గారు నాకు బావ. ఆయన నాకోసం చాలా పాటలు రాశారు. (వ్యంగ్య ధోరణిలో) ► నెపోటిజమ్ను (బంధు ప్రీతిని) నేను నమ్ముతాను. వసుధైక కుటుంబాన్ని ప్రోత్సహిస్తాను. ఒకవేళ అది తప్పయితే నాలాంటి బుర్రలేనివారిని బాగుచేయండి. ► రాజమౌళి నా మీద కోపంగా ఉన్నాడు. ‘బాహుబలి–2’ వర్క్ని కంప్లీట్ చేయమని రాజమౌళి తొందరపెడుతున్నాడు. ఎందుకంటే ఆర్కా మీడియా ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయాలనుకుంటోంది. మళ్లీ కలుద్దాం మిత్రులారా. ► అనంత శ్రీరామ్ పాటలు రాయడం మానేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పాటలు రాస్తున్నారు. దాంతో ప్రతిభ ఉన్న రచయితలకు అవకాశాలు తగ్గుతున్నాయి. ► నిజమే... తెలుగు లిరిక్స్ అంపశయ్యపై లేవు. కానీ అనంత శ్రీరామ్ మాత్రం సంక్షోభంలో ఉన్నాడు. ► నీతి వాక్యాలు, దేశభక్తి పాటలే రాయమని మాత్రమే దర్శకులు తనను అడుగుతున్నారని అనంత శ్రీరామ్ చెప్పాడు. ► డ్యూయెట్లు, ఐటమ్ సాంగ్స్ హీరోలు, హీరోయిన్లు, సింగర్స్.. వీళ్లంతా రాసేస్తున్నారని అనంత శ్రీరామ్ అన్నాడు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
సందడిగా సాక్షి ఎరీనా వన్ స్కూల్ ఫెస్ట్ 420 మంది విజేతలకు బహుమతుల ప్రదానం ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయం: తమ్మారెడ్డి భరద్వాజ హైదరాబాద్: ‘సాక్షి ఎరీనా వన్ స్కూల్ ఫెస్ట్’ ఉల్లాసంగా.. ఉత్సాహంగా జరిగింది. ఆదివారం బంజారాహిల్స్లోని ముఫకంఝా ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన స్కూల్ ఫెస్ట్కు ప్రముఖ సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. సాక్షి కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారం భించారు. స్కూల్ ఫెస్ట్లో భాగంగా రెండు నెలల నుంచి 19 అంశాల్లో పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహిం చారు. మొత్తం 420 మంది విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్, కూకట్పల్లి మెరీడియన్ ప్రిన్సిపాల్ రోహిణి, చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతినిధి రాణి, సెయింట్ ఆండ్రూస్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మాలయ శర్మ, గీతాంజలి స్కూల్ ప్రిన్సిపాల్ బాలా త్రిపుర సుందరీదేవి పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినం దనీయమని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందని, వారికి నాయకత్వ లక్షణాలు అలవడుతాయని చెప్పారు. భవిష్యత్తులో కూడా యూత్ ఫెస్ట్ లాంటి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. స్కూల్ ఫెస్ట్ పేరుతో విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసి ప్రోత్సహించడం ద్వారా వారు మరింత పట్టుదలతో ముందుకుసాగేందుకు అవకాశం ఉంటుందని మధుసూదన్ అన్నారు. -
వినోదం గ్యారెంటీ
‘హోప్’, ‘చంద్రహాస్’, ‘వెన్నెల’ వంటి చిత్రాలను నిర్మించి, నటించిన పొలిచర్ల హరనాథ్ కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఓ సినిమాలో నటిస్తున్నారు. ‘టిక్ టాక్’ పేరుతో ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారాయన. ఈ సినిమా డిజిటల్ పోస్టర్ను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. హరనాథ్ మాట్లాడుతూ– ‘‘నేనిప్పటివరకు తీసిన సినిమాలకు భిన్నంగా ఉండాలని కామెడీ హారర్ నేపథ్యంలో ‘టిక్ టాక్’ తీస్తున్నా. ఇదొక పక్కా ఎంటర్టైన్మెంట్ చిత్రం. అశ్లీలం ఉండదు, చిన్నపిల్లలను భయపెట్టే హారర్ కాదు. నాకు సినిమాలు ఆత్మతో సమానం. అందుకు తగ్గట్లుగానే జీవిస్తున్నాను. ఈ సినిమా కోసం డ్యాన్సులు, ఫైట్లు నేర్చుకున్నా. ఈ చిత్రం తర్వాత వచ్చే రెండేళ్లలో ఐదు సినిమాలు నిర్మించాలనుకుంటున్నా. ఆస్కార్ స్థాయి సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అన్నారు. నిషిగంధ, మౌనిక కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.వంశీకృష్ణ, సంగీతం: ఎస్ఆండ్బీ మ్యూజిక్ మిల్. -
పవన్ క్లారిటీ అడగడంలో అర్ధం లేదు: నిర్మాత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా పవన్కళ్యాణ్ కోరుతున్నారో? లేదో? తనకు అర్ధం కావడం లేదని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గురువారం అన్నారు. ప్రత్యేక హోదా కోసం పవన్ పిలుపునిస్తున్నా.. దాన్ని ఫాలోఅప్ చేయడం లేదని అభిప్రాయపడ్డారు. పవన్ అదే పనిగా బీజేపీ, టీడీపీ నేతలను క్లారిటీ ఇవ్వాలని అడగడంలో అర్ధం లేదని అన్నారు. ప్రత్యేకహోదాపై వాళ్లు ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశారని చెప్పారు. -
ఖాకీ వనం విశాఖపట్నం
ప్రత్యేక హోదా గళాలపై పోలీసుల ఉక్కుపాదం నగరంలో అప్రకటిత ఎమర్జెన్సీ వాతావరణం సాక్షి, విశాఖపట్నం: సుందర విశాఖ నగరం ఖాకీల పదఘట్టనలతో హోరెత్తిపోయింది. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీసులు గురువారం నగరాన్ని దిగ్బంధించారు. అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తూ సామాన్యులను ఆంక్షలతో భయభ్రాంతులకు గురిచేశారు. నగరంలో అడుగడుగునా కర్ఫ్యూ వాతావరణమే కనిపించింది. ప్రత్యేక హోదా కోసం నినదించిన గళాలను కర్కశంగా అణగదొక్కారు. కనిపించినవారినల్లా అదుపులోకి తీసుకున్నారు. బస్సులు, ఆటోలు, టాక్సీలే కాదు.. వ్యక్తిగత వాహనాల్లో వస్తున్న వారిని సైతం వదిలి పెట్టలేదు. చంటి పిల్లలతో వెళ్తున్న మహిళలను కూడా బలవంతంగా ఈడ్చుకెళ్లారు. స్టేషన్లకు తరలించారు. పర్యాటక ప్రాంతాల్లోనూ ఆంక్షలు విధించారు. జాతీయ జెండా పట్టుకున్నా నేరమే! గణతంత్ర దినోత్సవం రోజున యువత జాతీయ జెండాలు పట్టుకొని విశాఖ వీధుల్లో తిరగడమే నేరమైంది. జాతీయ జెండా పట్టుకున్న పాపానికి విద్యార్థులు, యువకులకు పోలీసులు తరిమి కొట్టారు. సంపూర్ణేష్బాబు, తమ్మారెడ్డి అరెస్ట్ ప్రముఖ సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్, సినీ నటుడు సంపూర్ణేష్బాబు, నిర్మాత తిలక్ తదితరులు యువతకు మద్దతు తెలిపేందుకు విశాఖ వచ్చారు. వుడా పార్కు వద్ద తొలుత వీరిని పోలీసులు అడ్డుకోగా.. పార్కు పక్కనే ఉన్న హోటల్కు వెళ్లారు. ఆ తర్వాత కొద్దిసేపటికి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. -
నాది తెలంగాణైనా హోదాకు మద్దతు
-
స్టేటస్ ఫైట్: సంపూర్ణేష్, తమ్మారెడ్డికి బ్రేక్!
విశాఖపట్నం: ప్రత్యేక హోదా కోసం శాంతియుత ఆందోళనకు దిగిన విద్యార్థులు, యువతపై పోలీసుల ఓవరాక్షన్ కొనసాగుతూనే ఉంది. ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతుగా వైజాగ్ వచ్చిన సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, హీరో సంపూర్ణేష్ బాబు, సినీ విమర్శకుడు మహేశ్ కత్తి తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్పోర్టు బయట వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి సినీ నటులు పలువురు ట్విట్టర్, ఫేస్బుక్లో మద్దతు పలికిన సంగతి తెలిసిందే. హీరోలు చాలామంది సోషల్ మీడియాలో ఉద్యమానికి జై కొట్టినప్పటికీ, హీరో సంపూర్ణేష్ బాబు హోదా పోరుకు మద్దతుగా వైజాగ్ వస్తున్నట్టు ప్రకటించారు. అన్నట్టుగానే ఆయన తమ్మారెడ్డి భరద్వాజ తదితరులతో కలిసి వైజాగ్ రాగా, నిరసన ప్రదర్శనలో పాల్గొనకముందే వారిని పోలీసులు అడ్డుకున్నారు. -
నాలుగేళ్లు... 24 సినిమాలు... అన్నీ వెరైటీనే!
తమ్మారెడ్డి భరద్వాజ ‘‘విజయ్ సేతుపతి నటించిన ‘పిజ్జా’ చిత్రాన్ని నేను, సురేశ్ కొండేటి తెలుగులో విడుదల చేసి హిట్ సాధించాం. చేసే ప్రతి చిత్రంలో ఏదో ఒక కొత్తదనం ఉండాలని విజయ్ సేతుపతి కోరుకుంటాడు.. లేకపోతేతను చేయడు. నాలుగేళ్లలో 24 వైవిధ్యచిత్రాలు చేయడం గ్రేట్’’ అని దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఇప్పుడు విజయ్ సేతుపతి, గాయత్రి జంటగా రంజిత్ జయకొడి దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ‘పురియాద పుదిర్’ చిత్రాన్ని లత సమర్పణలో ‘పిజ్జా 2’ పేరుతో డి.వెంకటేశ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. శామ్ సి.ఎస్ స్వరాలు అందించగా, తెలుగులో ‘మంత్ర’ ఆనంద్ సంగీత పర్యవేక్షణ చేశారు. ఈ చిత్రం పాటల సీడీని తమ్మారెడ్డి రిలీజ్ చేసి నిర్మాత బెల్లంకొండ సురేశ్కు ఇచ్చారు. డి. వెంకటేశ్ మాట్లాడుతూ -‘‘ఆధునిక టెక్నాలజీని వాడుకొని కొందరు సమాజంలోని అమాయక మహిళలను ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు? అనే అంశంతో థ్రిల్లర్గా నిర్మించిన చిత్రమిది. తెలుగు, తమిళాల్లో ఒకేసారి విడుదల చేయనున్నాం’’ అన్నారు. రంజిత్ జయకొడి, గాయత్రి, నిర్మాతలు సుదర్శన్ రెడ్డి, మల్కాపురం శివకుమార్, శోభారాణి పాల్గొన్నారు. -
ప్రేమలో తప్పులు చేస్తే...
సీనియర్ నటుడు ఉత్తేజ్ తనయ చేతన కథానాయికగా నటిస్తున్న రెండో చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. శ్రీవత్స ప్రొడక్షన్స్ పతాకంపై వి. శశిభూషణ్ దర్శకత్వంలో కమల్కుమార్ పెండెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి శ్రీమతి వాణి కెమెరా స్విచ్చాన్ చేయగా, సీనియర్ నిర్మాత కేయస్ రామారావు క్లాప్ ఇచ్చారు. దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఓ యువకుడు కొన్ని తప్పులు చేసి ప్రేమకు, కెరీర్కు దూరమవుతాడు. తిరిగి వాటిని దక్కించుకోవడానికి ఏం చేశాడన్నదే ఈ సినిమా కథాంశం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. సంజయ్, చేతన ఉత్తేజ్, కారుణ్య, నాగేంద్రబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట హనుమ, సంగీతం: రాంనారాయణ్. -
నిర్బంధ తమిళ చట్టంపై ఉద్యమిద్దాం
♦ తెలుగు భాషను పరిరక్షించుకుందాం ♦ ‘మాతృభాషను కాపాడుకుందాం’లో వక్తలు సాక్షి, హైదరాబాద్: ‘తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది’ గుర్తొచ్చినప్పుడు ఆహా.. ఓహో అనడం, తెలుగు కనపడాలి.. వినపడాలనే రాతలతో సరిపెట్టుకోవడం కాదు.. ప్రపంచంలో ఎక్కడైనా తెలుగు భాషకు అన్యాయం జరుగుతుందంటే సమైక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తెలుగు అభిమానుల పోరాటాలతోనే ఉమ్మడి ఏపీలో అధికార భాషా సంఘానికి ఊపిరి వచ్చిందని, అదే స్ఫూర్తితో అంతా కదిలి తమిళనాడు సీఎం జయలలిత ఇంటి ఎదుట ఆందోళనకు ఉపక్రమిస్తే కానీ తిమిళనాట తెలుగు భాష బతికిబట్టకట్టదని వారు వాపోయారు. తమిళ పాఠశాలల్లో నిర్భంధ తమిళ చట్టంపై ఉద్యమించాల్సిందేనని పిలుపునిచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం తమిళనాడు తెలుగు యువశక్తి, తమిళనాడు తె లుగు సంఘాల ఆధ్వర్యంలో ‘మాతృభాషను కాపాడుకుందాం’ అనే అంశంపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో భాషాభిమానులు క్రిష్ణారెడ్డి, రామారావు, జర్నలిస్టు సంఘాల నేతలు ఎం. సోమయ్యతో పాటు పలువురు సాహితీ వేత్తలు, రచయిత పాల్గొన్నారు. తెలుగు వెండి తెరతోనే జయకు ఖ్యాతి... తల్లిదండ్రులను ఎవరైనా తక్కువ చేసినా, అవమానించినా ఊరుకుంటామా? లక్షలాది మంది తెలుగు వారున్న తమిళనాడులో తెలుగు వెలగాల్సిందే. తమిళనాడు సీఎం జయలలిత తొలుత తెలుగు వెండి తెరపైనే ఖ్యాతి గడించారు. తమిళనాడు ప్రజల్లో ఐక్యత ఎక్కువ. పాఠశాలల్లో నిర్భంద తమిళ చ ట్టాన్ని మనమూ సంఘటితంగా అడ్డుకుందాం. - వడ్డేపల్లి కృష్ణ, ప్రముఖ రచయిత జయ ఇంటి వద్ద ఆందోళన... ఇప్పటికే చాలాసార్లు ఆందోళన చేశాం. అయినా దిగిరాలేదు. ఇక సీఎం జయలలిత ఇంటిని ముట్టడించాల్సిందే. సమస్యను అక్కడే పరిష్కరించుకుందాం. తమిళనాడులో 90 వేల మంది విద్యార్థులు తెలుగు మీడియం చదువుతున్నారు. ఇప్పుడు తమిళంలో పరీక్షలు రాయమంటే ఎలా?. వారి భవిష్యత్తు కోసం తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు, ప్రజలు ఉద్యమించాలి. - సినీ నిర్మాత, అభ్యుదయ వాది తమ్మారెడ్డి భరద్వాజ తెలుగు రాష్ట్రాల భాషా సాంస్కృతిక శాఖలు చర్చ జరపాలి భాష పట్ల అభిమానం ఉండాలి. కానీ ఇతర భాషల పట్ల దురాభిమానం తగదు. దీన్ని ఎవరూ అంగీకరించరు. నాడు తెలుగుకు ప్రాచీన హోదా రాకుం డా అడ్డుకున్నది తమిళనాడువారే. పక్కనే ఉన్న రాష్ట్రం తెలుగును రద్దు చేయడం జుగుప్సాకరం. తెలంగాణ, ఏపీల భాషా సాంస్కృతిక శాఖలు స్పందించి, తమిళనాడు సాంస్కృతిక శాఖతో చర్చించాలి. - బసవపున్నయ్య,టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి డిసెంబర్ 1 లోపల స్పందించకపోతే... డిసెంబర్ 1 లోపల జయలలిత ఈ చట్టంపై స్పందించి.. తమిళనాట తెలుగు విద్యార్థులకు న్యాయం చేయాలి. లేకుంటే డిసెంబర్ 10న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆందోళన చేస్తాం. 20 కోట్ల మంది మాట్లాడే తెలుగు భాషను జాతీయ రెండో అధికార భాషగా గుర్తించాలి. - కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, తమిళనాడు తెలుగు యువశక్తి -
అశ్రునయనాల మధ్య మాడా అంత్యక్రియలు
హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు మాడా వెంకటేశ్వరరావు అంత్యక్రియలను హైదరాబాద్ రాయదుర్గంలోని మహాప్రస్థానం శ్మశానవాటికలో బుధవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానుల అశ్రునయనాల మధ్య నిర్వహించారు. మాడా వెంకటేశ్వర్రావు శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. అమెరికాలో ఉన్న ఆయన కుమార్తె రాక ఆలస్యం కావడంతో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని స్వగృహం నుంచి ప్రత్యేక వాహనంలో మాడా భౌతికకాయాన్ని తరలించారు. సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, జి.వి.సుబ్బయ్య, కాపునాడు జాతీయ అధ్యక్షుడు తాడివాక రమేశ్ నాయుడు తదితరులు హాజరయ్యారు. -
పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది
-
ప్రచారమెంత ఫలితమెంత?