న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 13 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని మదిపూర్ ప్రాంతానికి చెందిన శివగా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం బాలికకు మాయమాటలు చెప్పి అతడు తన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
ఈ దురాగతాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో అదే రోజు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్(376), పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
13 ఏళ్ల బాలికపై అత్యాచారం
Published Wed, Jun 29 2016 8:19 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM
Advertisement
Advertisement