మహారాష్ట్రలో 14 మృతదేహాలు వెలికితీత | 14 bodies recovered so far in maharashtra | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో 14 మృతదేహాలు వెలికితీత

Published Fri, Aug 5 2016 11:01 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

14 bodies recovered so far in maharashtra

ముంబై : మహద్ వద్ద ముంబై - గోవా జాతీయ రహదారిపై వంతెన కూలడంతో.... బస్సులు నీటిలో కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 14 మృతదేహాలను వెలికితీసినట్లు ఉన్నతాధికారులు శుక్రవారం మంబైలో వెల్లడించారు. గల్లంతైన మరో 42 మంది కోసం ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల నష్ట పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

మహారాష్ట్రలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో సావిత్రి నది పొంగి ప్రవహిస్తుంది. గత శుక్రవారం ముంబై - గోవా జాతీయ రహదారిపై ఉన్న బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెన కుప్పకూలింది. ఈ సమయంలో బ్రిడ్జ్ పై ప్రయాణిస్తున్న రెండు బస్సు నదిలో కొట్టుకుపోయాయి.దీంతో బస్సులోని ప్రయాణికులు గల్లంతయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి... సహాయక చర్యలు చేపట్టింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement