ఎన్ కౌంటర్ కేసు నుంచి అమిత్ షాకు ఊరట | Amit Shah discharged from Sohrabuddin fake encounter case | Sakshi

ఎన్ కౌంటర్ కేసు నుంచి అమిత్ షాకు ఊరట

Dec 30 2014 2:21 PM | Updated on Oct 22 2018 8:17 PM

ఎన్ కౌంటర్ కేసు నుంచి అమిత్ షాకు ఊరట - Sakshi

ఎన్ కౌంటర్ కేసు నుంచి అమిత్ షాకు ఊరట

తంలో షాబుద్దీన్ ఫేక్ ఎన్ కౌంటర్ కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఊరట లభించింది.

న్యూఢిల్లీ: షహాబుద్దీన్ షేక్ ఎన్ కౌంటర్ కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఊరట లభించింది. మంగళవారం ముంబై సీబీఐ కోర్టులో విచారణకు వచ్చిన ఈ కేసులో అమిత్ షా పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలు లేవని కోర్టుకు సీబీఐ తెలిపింది. దీంతో ఈ కేసు నుంచి అమిత్ షా కు విముక్తి కలగనుంది.

అమిత్ షా గుజరాత్ హోం మంత్రిగా ఉన్న సమయంలో షహాబుద్దీన్ షేక్ ఎన్ కౌంటర్ కేసు సంచలనం రేపింది. ఆ ఘటన జరిగిన  ఐదు సంవత్సరాల అనంతరం 2010 లో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఇందులో నాటి గుజరాత్ డీజీపీ వంజర, హోం మంత్రి అమిత్ షా సహా పలువురిపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వాటినుంచి బీజేపీ అధ్యక్షుడికి విముక్తి లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement