CBI court
-
వైఎస్ జగన్పై కేసుల విచారణ.. మరో రాష్ట్రానికి బదిలీ అవసరం లేదు
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్న మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు గట్టి షాక్నిచ్చింది. వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులపై సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది. అలాగే వైఎస్ జగన్ బెయిల్ను రద్దు చేసేందుకు సైతం సుప్రీంకోర్టు నిరాకరించింది. జగన్పై రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి దాఖలైన కేసులపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతోందని, దీన్ని తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తోందని ధర్మాసనం పేర్కొంది. రోజూ వారీ విచారణకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు సైతం జారీ చేసిందని గుర్తు చేసింది. ఓ దశలో రఘురామకృష్ణరాజుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కింది కోర్టులో జరిగే విచారణను మమ్మల్ని పర్యవేక్షించమంటారా? అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సీబీఐ కోర్టు విచారణను తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తోంది. రోజూవారీ విధానంలో విచారణ జరపాలని సీబీఐ ప్రత్యేక కోర్టుకి ఆదేశాలు కూడా జారీ చేసింది. హైకోర్టు స్పష్టమైన ఆదేశాల తరువాత కూడా పిటిషనర్ (రఘురామకృష్ణరాజు) సీబీఐ కోర్టు విచారణలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతున్నారు. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం ఏమీ మాకు కనిపించడం లేదు’ ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది.సీబీఐ కోర్టు, హైకోర్టుల్లో రఘురామకు ఎదురుదెబ్బ..వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ, ఈడీ పలువురిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో జగన్కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై నమోదైన కేసుల్లో సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా జగన్ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు కొట్టివేసింది. అటు తరువాత ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో సైతం రఘురామకృష్ణరాజుకు చుక్కెదురైంది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైఎస్ జగన్ బెయిల్ను రద్దు చేయడంతో పాటు ఆయనపై నమోదైన కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ 2023లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. ఈ నెల 20న విచారణ సందర్భంగా అసలు జగన్ కేసులతో మీకేం సంబంధమని రఘురామకృష్ణరాజుని జస్టిస్ నాగరత్న ధర్మాసనం నిలదీసిన సంగతి తెలిసిందే.జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు...వాదన సందర్భంగా వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ స్పందిస్తూ.. సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న కేసుల విచారణను తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తోందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. జగన్ బెయిల్ను రద్దు చేయాల్సిన అవసరం ఏదీ కనిపించడం లేదంది. అలాగే సీబీఐ కోర్టు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది. హైకోర్టు పరిధిలోకి జోక్యం చేసుకోవడం దాని పనితీరును ప్రభావితం చేయడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. అందువల్ల పిటిషన్ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమయంలో రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు జగన్పై తాము దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంటామని, అందుకు అనుమతినివ్వాలని అభ్యర్థించడంతో అందుకు ధర్మాసనం అంగీకరిస్తూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. -
బొగ్గు స్కామ్లో ఢిల్లీ కోర్టు కీలక తీర్పు
సాక్షి,ఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు స్కామ్ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు బుధవారం(డిసెంబర్11) కీలక తీర్పిచ్చింది. యూపీఏ హయాంలో జరిగిన బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవకతవకలున్నాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేసింది.ఈ కేసులో విచారణ అనంతరం నవభారత్ పవర్ ఎండీ హరిశ్చంద్రప్రసాద్, నవభారత్ పవర్ చైర్మన్ త్రివిక్రమప్రసాద్, హరిశ్చంద్ర గుప్తా,సమారియా సహా మొత్తం ఐదుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.ఈ మేరకు 341 పేజీల తీర్పును ప్రత్యేక కోర్టు వెలువరించడం గమనార్హం. -
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు.. కాంగ్రెస్ నేతపై హత్యాభియోగం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులు కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్ను వదిలేలా లేవు. ఈ కేసుల్లో భాగమైన గురుద్వారా పుల్ బంగశ్ హత్యల కేసులో టైట్లర్పై హత్యా నేరం అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ రౌస్ఎవెన్యూ ప్రత్యేక కోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి రాకేశ్ సియాల్ ఆదేశాలు జారీ చేశారు. టైట్లర్పై విచారణ చేపట్టేందుకు సరిపడా సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లపై గతంలో ప్రత్యక్ష సాక్షి ఒకరు వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలం ఆధారంగా టైట్లర్పై అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 13కు వాయిదా వేశారు. -
ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో ఏపీ సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో గురువారం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఏ 1 గా చంద్రబాబు, ఏ 2 గా మాజీ మంత్రి నారాయణ ఉన్నారు. వీరితో పాటు నారా లోకేష్, లింగమనేని రాజశేఖర్, లింగమనేని రమేష్లను ముద్దాయిలుగా సీఐడీ పేర్కొంది. సింగపూర్తో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్నది తప్పుడు ఒప్పందమని సీఐడీ తేల్చింది. గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందం అంటూ తప్పుదారి పట్టించినట్టు సీఐడీ తెలిపింది. అయితే జీ 2 జీ ఒప్పందమే జరగలేదని సీఐడీ నిర్ధారించింది. సింగపూర్తో చేసిన ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వ అనుమతిలేదని సీఐడీ తేల్చింది. చట్టవిరుద్ధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో సుర్బానా జురాంగ్కు డబ్బులు చెల్లింపులు జరిగినట్టు నిర్ధారణ చేసింది. నిందితులకు మేలు చేసేలా ఇన్నర్ రింగ్ రోడ్, సీడ్ క్యాపిటల్, మాస్టర్ ప్లాన్ లు రూపొందించినట్టు సీఐడీ పేర్కొంది. ఇన్నర్ రింగ్ రోడ్ని లింగమనేని భూములు, హెరిటేజ్ భూములు, నారాయణ భూములకు అనుగుణంగా మార్చినట్టు సీఐడీ చార్జ్ షీట్లో వెల్లడించింది. 58 ఎకరాల భూములను బంధువుల పేరుతో మాజీ మంత్రి నారాయణ కొన్నారు. లింగమనేని 340 ఎకరాల ల్యాండ్ బ్యాంకుకి మేలు చేసేలా అలైన్ మెంట్ మార్పులు చేశారు. లింగమనేని నుండి చంద్రబాబుకు ఇంటిని ఇచ్చినట్టు సీఐడీ పేర్కొంది. లింగమనేని ల్యాండ్ బ్యాంక్ పక్కనే హెరిటేజ్ 14 ఎకరాల భూములు కొన్నట్టు సీఐడీ పేర్కొంది. ఈభూములకు విలువ పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చినట్టు సీఐడీ నిర్ధారించింది. -
బాబు కస్టడీకి మరో పిటిషన్: కరకట్ట రీఅలైన్మెంట్ స్కాం ఏంటీ?
సాక్షి, అమరావతి: విజయవాడ ACB కోర్టులో చంద్రబాబు కస్టడీకి మరో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో కస్టడీ కావాలని ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వమని పిటీషన్లో కోరింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో చంద్రబాబును A1 ముద్దాయిగా సీఐడీ పేర్కొంది. కరకట్ట ఇన్నర్ రింగ్ స్కాం అసలు కథ ఇదే? టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే అని దర్యాప్తులో తేటతెల్లమవుతోంది. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు దక్కాయని తేలిపోయింది. అసలేం జరిగింది? అమరావతి మాస్టర్ప్లాన్, ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ అంతా నాటి సీఎం, ఈ కేసులో ఏ–1 చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన సమయంలో సీఆర్డీయే ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరించిన చంద్రబాబుకు మాస్టర్ప్లాన్ గురించి మొత్తం ముందే తెలుసు. మాస్టర్ప్లాన్పై తుది నిర్ణయం తీసుకుంది చంద్రబాబే అని పేర్కొంది. అంతేకాదు రాజధాని ఎంపిక, ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు ప్రక్రియలో ఆయనకు పూర్తి భాగస్వామ్యం ఉంది. అలైన్మెంట్ మూడుసార్లు మార్పు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకోకు పాల్పడ్డారని స్పష్టమయింది. టీడీపీ ప్రభుత్వంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మూడుసార్లు మార్చారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు జరిగాయి. ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి టీడీపీ ప్రభుత్వం ప్రయోజనం కల్పించిందన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ కుటుంబానికి ఇన్నర్రింగ్ రోడ్డు తుది అలైన్మెంట్ను ఆనుకునే 168.45 ఎకరాలు ఉన్నాయి. అయితే ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేదని, లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలోనే అలైన్మెంట్ను ఖరారు చేసినట్లు దర్యాప్తులో తేలింది. కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబు ఉంటున్న కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మించారని తేలింది. ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ నివాసంలో ఏడేళ్లుగా నివసిస్తున్నారు. సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు నివసిస్తున్నారు. ఆ నివాసం గురించి ప్రభుత్వంతో లింగమనేని అధికారికంగా ఎలాంటి వ్యవహారాలు నెరపలేదు. అంటే ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు. కరకట్ట నివాసాన్ని లింగమనేని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారంటూ టీడీపీ చేస్తున్న వాదన పూర్తిగా అవాస్తవం. ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్ చంద్రబాబుకు వ్యక్తిగతంగానే ఇచ్చారు. రాజధాని మాస్టర్ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లలో కుంభకోణం ద్వారా భారీగా ప్రయోజనం కల్పించినందున క్విడ్ ప్రోకోలో భాగంగానే కరకట్ట నివాసాన్ని చంద్రబాబుకు ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. హెరిటేజ్ భూముల లావాదేవీలు గోప్యం లింగమనేని కుటుంబం నుంచి హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేస్తున్నట్టు చూపిస్తున్న భూముల బాగోతం కూడా బట్టబయలైంది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకు లింగమనేని కుటుంబం భూములు అమ్మినట్టు ఎలాంటి లావాదేవీలను చూపించలేదు. రాజధాని ప్రాంతంలో లింగమనేని కుటుంబం నుంచి హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసిన భూములకు సంబంధించి లావాదేవీలను చంద్రబాబు వెల్లడించలేదని తేలింది. లోకేశ్దీ కీలక పాత్రే... క్విడ్ ప్రోకో కింద అమరావతిలో లింగమనేని కుటుంబం భూములను హెరిటేజ్కు బదలాయించడంలో నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారన్నది బట్టబయలైంది. లింగమనేని కుటుంబం నుంచి భూములు తీసుకునేందుకు హెరిటేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానించారు. హెరిటేజ్ డైరెక్టర్గా లోకేశ్ ఆ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మంత్రిగా ఉంటూ చంద్రబాబుతో కరకట్ట నివాసంలోనే నివసించారు. అంటే లింగమనేని కుటుంబానికి భారీగా ప్రయోజనం కల్పించి క్విడ్ ప్రోకో కింద హెరిటేజ్ భూములు దక్కించుకోవడంలో, కరకట్ట నివాసాన్ని సొంతం చేసుకోవడంలోనూ లోకేశ్ క్రియాశీల పాత్ర పోషించారన్నది స్పష్టమైంది. కథ నడిపిన ఏ–2 నారాయణ అమరావతి మాస్టర్ప్లాన్, ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా నారాయణ కుటుంబం నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం పొందినట్లు స్పష్టమైంది. మాస్టర్ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల వ్యవహారాలన్నీ నారాయణకు పూర్తిగా తెలుసని, అంతా ఆయన ఆధ్వర్యంలోనే సాగిందని దర్యాప్తులో వెల్లడయింది. ఈ కేసులో ఇప్పటికే నారాయణ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు సీడ్ క్యాపిటల్లో భూములు కొనుగోలు చేశారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయి. తద్వారా సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో కొనుగోలు చేసిన భూములు సీఆర్డీయేకే భూసమీకరణ కింద ఇచ్చి 75,888 చ.గజాల ప్లాట్లు పొందారని తేలింది. ఆ భూములపై కౌలు కింద రూ.1.92కోట్లు కూడా పొందారని పేర్కొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కరకట్ట నివాసం, సీడ్ క్యాపిటల్లో నారాయణ కుటుంబ సభ్యులకు కేటాయించిన 75,888 చ.గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేసేందుకు కోర్టు కూడా అనుమతినిచ్చింది. -
వివేకా కేసు.. వైఎస్ భాస్కర్రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు.. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు 12 రోజులపాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం ఆదేశాలు ఇచ్చింది. ఎస్కార్ట్ బెయిల్లో భాగంగా ముగ్గురు పోలీసులు, ఒక పోలీస్ వెహికిల్ ఉంటాయి. ఎస్కార్ట్ బెయిల్లో వీళ్లు భాస్కర్ రెడ్డి వెంటే ఉంటారు. ఇదిలా ఉంటే వివేకా హత్య కేసులో.. ఈ ఏప్రిల్లో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డిని పులివెందులలో విచారించి.. నాటకీయ పరిణామాల నడుమ అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ సీబీఐ అధికారులు. అప్పటి నుంచి ఆయన చంచల్గూడ జైల్లో ఉన్నారు. మధ్యంతర బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ వేయగా.. ఇవాళ ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. అంతకు ముందు ఉదయ్ కుమార్రెడ్డికి కూడా సీబీఐ కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఉదయ్ భార్య గర్భవతిగా ఉండడంతో ఆమెను కలిసేందుకు 14 నుంచి 16వ తేదీ వరకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఇదీ చదవండి: Viveka Caseలో దారి తప్పిన 'సీబీఐ దర్యాప్తు' -
ఇదో పబ్లిక్ న్యూసెన్స్ పిటిషన్..హరిరామ జోగయ్యపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ హరిరామ జోగయ్యపై తెలంగాణ హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన నేపథ్యంలో.. ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్రంగా మందలించింది. ఇలాంటి పిటిషన్లు వేసి కోర్టు విలువైన సమయాన్ని వృధా చేసేందుకు యత్నించారంటూ మండిపడింది చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం. సోమవారం పిటిషనర్ హరిరామ జోగయ్య తరఫు న్యాయవాది వాదనలకు సిద్ధం కాగా.. ఆ వెంటనే బెంచ్ కలుగజేసుకుంది. ‘‘ఇదో పబ్లిక్ న్యూసెన్స్. ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముందసలు?. వ్యక్తిగత కక్షతోనే పిల్ దాఖలు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓ మాజీ ఎంపీ అయ్యి ఉండి మీరు ఇలా వ్యవహరించడం ఆమోద యోగ్యం కాద’’ని తెలిపింది. ‘‘సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుల విచారణ త్వరగా పూర్తి చేసేలా చూడాలని పిటిషన్ వేశారు. రాష్ట్రపతి లేఖ రాశాం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం.. అని అంటారా!. ఇది ఏం పద్ధతి?. ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి చెప్పినంత మాత్రాన కింది స్థాయి కోర్టు భయపడి పనిచేయవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓ బాధ్యత గల మాజీ పార్లమెంట్ సభ్యుడైన మీరు ఇలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదు. మీరు దాఖలు చేసిన పిటిషన్లో అసలు ఎక్కడన్నా ప్రజాసక్తి ఉంది అని మీకైనా అనిపిస్తోందా?. వ్యక్తిగత ద్వేషంతో కోర్టులను ఆశ్రయించి.. మా విలువైన సమయాన్ని వృధా చేయొద్దు. ఈ మధ్య తెలంగాణ గవర్నర్ చెప్పినట్లు ఇలాంటి పబ్లిక్ న్యూసెన్స్ కేసులు ఎక్కువయ్యాయి. కొందరికి ఇలాంటి పిటిషన్లు వేయడమే పరిపాటిగా మారింది. మీరు అడిగారు కదా అని వెంటనే విచారణ చేపట్టలేం అని బెంచ్ పిటిషనర్కు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. సీఎం జగన్పై కేసుల్ని త్వరగతిన విచారణ పూర్తి చేయాలని, 2024 సాధారణ ఎన్నికలకు ముందే తీర్పు వెలువరించాలని, ఆ మేరకు సీబీఐకోర్టుకు ఆదేశించాలని జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే.. ఈ పిల్ పైఅభ్యంతరం లేవనెత్తిన రిజిస్ట్రీ.. కేసు నంబర్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఫైలింగ్ నంబర్పైనే విచారణ మొదలైంది. రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తిన అంశాల కాపీని పిటిషనర్కు ఇవ్వాలని ఆదేశిస్తూ, విచారణను జూలై 6కు వాయిదా వేసింది ధర్మాసనం. ఇదీ చదవండి: కాపు ఉద్యమకారుడి కుటుంబానికి సీఎం జగన్ బాసట -
సీబీఐ కోర్టులో భాస్కర్రెడ్డి బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు
హైదరాబాద్: వివేకా కేసుకు సంబంధించి భాస్కర్రెడ్డి బెయిల్ పిటిషన్పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిసాయి. భాస్కర్రెడ్డి బెయిల్ పిటిషన్పై ఈనెల9వ తేదీన తీర్పు ఇస్తామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. దీనిలో భాగంగా తదుపరి విచారణను ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో సునీత ఇంప్లీడ్ పిటిషన్ను సీబీఐ కోర్టు అనుమతించింది. ఈ మేరకు లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని సునీతకు సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని అరెస్ట్ చేశారు సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా భాస్కర్రెడ్డి తరఫున న్యాయవాది ఉమా మహేశ్వర్రావు వాదనలు వినిపించారు. ‘ఎలాంటి సంబంధం లేని వ్యక్తి ని సిబిఐ అధికారులు ఆరెస్ట్ చేశారు. ఆరోపణలు మాత్రమే సిబిఐ పరిగణలోకి తీసుకుంది. భాస్కర్ రెడ్డి సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి. ఒక సీనియర్ సిటిజన్ను అక్రమ కేసులో సీబీఐ ఇరికించింది. ఎలాంటి నేర చరిత్ర లేనటువంటి వ్యక్తి భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి నేరం చేసాడు అనడానికి ఎక్కడ సరైన సాక్ష్యాలు లేవు. ఎర్ర గంగిరెడ్డి ఎక్కడ కూడా భాస్కర్ రెడ్డి పేరు ప్రస్థావించలేదు’ అని కోర్టుకు తెలిపారు. -
ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా భాస్కర్రెడ్డి.. సీబీఐ కోర్టు సిఫార్సు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ భాస్కర్రెడ్డిని ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా పరిగణించాలని హైదరాబాద్ జిల్లా మెజిస్ట్రేట్కు సీబీఐ కోర్టు సిఫార్సు చేసింది. ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలన్న భాస్కర్ రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు అంగీకారం తెలిపింది. కాగా, వివేకా లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్షకు అనుమతించాలన్న పిటిషన్పై సీబీఐ కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. సీబీఐ పిటిషన్పై గంగిరెడ్డి, సునీల్ యాదవ్ కౌంటర్లు దాఖలు చేశారు. తన వైపు కౌంటరు లేదని సీబీఐ కోర్టుకు దస్తగిరి తెలిపారు. సీబీఐ వాదనలు వినడానికి విచారణను ఈ నెల 5కు కోర్టు వాయిదా వేసింది. వివేకా హత్య కేసులో సునీత పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ వివేకా హత్య కేసులో సునీత పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కోర్టు విచారణలో సీబీఐ పీపీకి సహకరించేందుకు అనుమతివ్వాలన్న సునీత కోరగా, ఆమె పిటిషన్ పై శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషన్పై భాస్కర్ రెడ్డి, ఉదయ్ శంకర్ రెడ్డి తమ కౌంటర్లు దాఖలు చేయలేదు. సునీత వాదనల కోసం పిటిషన్ విచారణ ఈ నెల 5కు కోర్టు వాయిదా వేసింది. -
వివేకా కేసు: కోర్టుకు హాజరుకాని దస్తగిరి.. విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో ఉన్న ఐదుగురు నిందితులను సీబీఐ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిని హాజరుపరిచారు. అయితే, వివేకా కేసులో కీలక నిందితుడు దస్తగిరి ఈరోజు కూడా కోర్టులో హాజరు కాలేదు. దీంతో, కోర్టు.. కేసు విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై నాంపల్లి సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఇది కూడా చదవండి: వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా -
వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై నాంపల్లి సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు, వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్రెడ్డి బెయిల్ కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్నానని.. దాదాపు నెలన్నర రోజులుగా జైలులో ఉంటున్నానని, కస్టడీ విచారణ కూడా ముగిసిందని భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వివేకా హత్య కేసులో ఏప్రిల్ 16న భాస్కర్రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ.. ఏప్రిల్ 19 నుంచి 24 వరకు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపింది. ఏప్రిల్ 24 నుంచి చంచల్గూడ జైలులో ఉంటున్న భాస్కర్రెడ్డి గత వారం అస్వస్థతకు గురవ్వగా.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు హృదయ సంబంధ సమస్యలున్నట్లు గుర్తించారు. దీంతో నిమ్స్కు తరలించి.. పలు పరీక్షలు చేశారు. అనంతరం మళ్లీ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇది కూడా చదవండి: అనుమతి లేకుండానే విదేశాలకు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ -
వివేకా లేఖకు నిన్హైడ్రేట్ పరీక్ష.. సీబీఐ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ప్రక్రియలో.. సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా రాసిన లేఖపై వేలిముద్రలను గుర్తించేందుకు సీబీఐ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు లేఖపై వేలిముద్రలను గుర్తించేందుకు అవసరమైన నిన్హైడ్రేట్ (Ninhydrin Test) పరీక్ష నిర్వహించాలని నిర్ణయించుకుంది. అయితే.. ఈ పరీక్ష ద్వారా లేఖ పాడైపోయే అవకాశం ఉన్నందున.. పరీక్షకు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించింది దర్యాప్తు సంస్థ. వివేకా హత్య జరిగిన ఘటనాస్థలంలో దొరికిన లేఖను 2021 ఫిబ్రవరి 11వ తేదీన ఢిల్లీ సీఎఫ్ఎస్ఎల్కు పంపింది సీబీఐ. అయితే తీవ్ర ఒత్తిడిలోనే వివేకా ఆ లేఖ రాసినట్లుగా సీఎఫ్ఎస్ఎల్ తేల్చి చెప్పింది. ఇక ఇప్పుడు.. లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సీఎఫ్ఎస్ఎల్ను కోరింది సీబీఐ. అయితే.. లేఖపై వేలిముద్రలు గుర్తించేందుకు నిన్హైడ్రేట్ పరీక్ష నిర్వహించాలని సీఎఫ్ఎస్ఎల్ చెప్పింది. నిన్హైడ్రేట్ పరీక్ష చేస్తే లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని సీఎఫ్ఎస్ఎల్, సీబీఐకి స్పష్టం చేసింది. దీంతో.. ఒరిజినల్ లేఖపై చేతిరాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉన్నందున ఆ టెస్ట్ నిర్వహణ కోసం కోర్టును ఆశ్రయించించింది సీబీఐ. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందని, అలాగే రికార్డుల్లో ఒరిజినల్ లేఖ బదులుగా కలర్ జిరాక్స్ను అనుమతించాలని కోర్టును కోరింది సీబీఐ. దీంతో సీబీఐ పిటిషన్పై నిందితుల స్పందన కోరింది సీబీఐ న్యాయస్థానం. ఈ పిటిషన్పై జూన్ 2వ తేదీన విచారణ జరపనుంది నాంపల్లి సీబీఐ కోర్టు. ఇదీ చదవండి: వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలన స్టేట్మెంట్ -
వివేకా హత్య కేసు: దోషులని నిర్ణయించుకుని.. అదే లక్ష్యంగా దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొందరిని దోషులుగా నిర్ణయించుకుని, అదే లక్ష్యంగా దర్యాప్తు చేస్తోంది తప్ప.. అసలు నేరస్థులను పట్టుకునే ప్రయత్నం చేయడంలేదని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్ల న్యాయవాదులు సీబీఐ కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సీహెచ్ రమేశ్బాబు తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు. భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్ కస్టడీ పిటిషన్తో పాటు ఉదయ్కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సోమవారం కోర్టులో వాదనలు జరిగాయి. భాస్కర్రెడ్డి తరఫున ఉమామహేశ్వర్, ఉదయ్ తరఫున రవీందర్రెడ్డి వాదనలు వినిపించారు. ‘ఏ–4 (దస్తగిరి) చెప్పాడని వైఎస్ భాస్కర్రెడ్డిని అరెస్టు చేశారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల నాటి నుంచి భాస్కర్రెడ్డి, అవినాశ్, శివశంకర్రెడ్డితో వివేకాకు విభేదాలున్నాయని పేర్కొన్నారు. హత్య కోసం రూ.40 కోట్లకు ఒప్పందం కుదిరిందని, రూ.కోటి ఇచ్చారని చెప్పారు. ఈ ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాలు లేవు. రిమాండ్ పిటిషన్లోని సబ్జెక్ట్ను మార్చి కస్టడీ పిటిషన్గా వేశారు. దీనిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను పాటించకుండా ఇష్టం వచ్చినట్లు పిటిషన్ దాఖలు చేశారు. ఒక్క కస్టడీ అన్న పదం తప్ప రెండు పిటిషన్లు ఒక్కటే. 75 ఏళ్ల వృద్ధుడైన భాస్కర్రెడ్డిని పలుమార్లు విచారణకు పిలిచారు. విచారణలో ఏం అడిగారు, ఆయన ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదో తెలపకుండా.. సహకరించలేదని అనడం సరికాదు. సీబీఐ కోరుకున్న విధంగా ఆయన సమాధానాలు వెల్లడించరు. అలాగే సీబీఐ దాఖలు చేసిన రెండు చార్జీషీట్లలోనూ భాస్కర్రెడ్డి ప్రస్తావన కూడా లేదు. ఇష్టం వచ్చినట్లు అరెస్టు చేసి నిందితుల జాబితాలో చేరుస్తున్నారు. ఇంకా ఎంత మందిని కోర్టు అనుమతి లేకుండా ఇలా చేరుస్తారో తెలియదు. సాక్షులు ఎవరన్నది కూడా పిటిషన్లో లేదు. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. భాస్కర్రెడ్డి వెన్నెముకకు సర్జరీ జరిగింది. చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. భాస్కర్రెడ్డి కస్టడీ పిటిషన్ను కొట్టివేయాలి’ అని ఉమామహేశ్వర్ వాదించారు. అరెస్టులతో హడావుడి ‘ఉదయ్కుమార్ను ఏ నేరం కింద అరెస్టు చేశారో సీబీఐ ఎక్కడా చెప్పలేదు. సీఆర్పీసీ 173 ప్రకారం.. కోర్టు అనుమతి తీసుకున్న తర్వాతే ఏ–6 (ఉదయ్కుమార్), ఏ–7 (వైఎస్ భాస్కర్రెడ్డి)లను నిందితులుగా పేర్కొనాలి. కానీ కోర్టు నుంచి సీబీఐ ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఏ–6పై నమోదు చేసిన అన్ని సెక్షన్లు బెయిల్ ఇచ్చేవే. ఇప్పటికి 22 సార్లు సీబీఐ ఉదయ్కుమార్ను విచారించింది. అతని మొబైల్ తీసుకున్న అధికారులు రసీదు కూడా ఇవ్వలేదు. ఇన్నిసార్లు విచారణ జరిపి.. ఇంకా సహకరించలేదనడం హాస్యాస్పదం. తెలియని ప్రశ్నలకు సమా«దానం చెప్పకపోవడం అతని హక్కు. సీబీఐ మూడేళ్లుగా విచారణ చేస్తున్నా రెండు చార్జిషీట్లు వేయడం తప్ప సాధించిన పురోగతి లేదు. సుప్రీంకోర్టు ఆదేశించిన గడువు దగ్గరపడుతుండటంతో అరెస్టులు చేస్తున్నారు తప్ప ఆధారాలను సేకరించడంలేదు. చట్టాలను పాటించడం లేదు. సీబీఐ విచారణాధికారి రాంసింగ్పై ఉదయ్ ఫిర్యాదు చేశారు. ఈ కేసు ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. చదవండి: దస్తగిరితో డ్రామా! అప్రూవర్ వాంగ్మూలం ఉత్త కథే ఉదయ్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆయనపై మోపినవి నాన్–కాగ్నిజబుల్ నేరాలే. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఉదయ్కి బెయిల్ ఇవ్వాలి’ అని రవీందర్రెడ్డి కోరారు. ‘2017 ఎమ్మెల్సీ ఎన్నికల నాటి నుంచి వివేకాతో వైఎస్ భాస్కర్రెడ్డికి, శివశంకర్రెడ్డికి పలు విభేదాలు ఉన్నాయి. 2017లో ఎమ్మెల్సీగా పోటీ చేసిన వివేకా ఓడిపోయారు. ఈ ఓటమికి భాస్కర్రెడ్డి, శివశంకర్రెడ్డి కారణమని వివేకా తీవ్ర ఆగ్రహంతో ఉండేవారు. హత్య చేసిన వారు కూడా భాస్కర్రెడ్డికి, శివశంకర్రెడ్డికి అత్యంత సన్నిహితులు’ అని సీబీఐ పీపీ వాదనలు వినిపించారు. -
Kothapalli Geetha: సీబీఐ కేసులో మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఊరట
సాక్షి, హైదరాబాద్: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు హైకోర్టులో ఊరట లభించింది. వారికి తెలంగాణ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కొత్తపల్లి గీత దంపతులు రూ.25వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ను మోసం చేశారన్న కేసులో కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో వారు సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన హైకోర్టు సీబీఐ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 16కి వాయిదా వేసింది. చదవండి: (దశదిన కర్మరోజు వద్దామనుకున్నా.. అందువల్లే ఈ రోజు వచ్చా: రాజ్నాథ్ సింగ్) -
ఐవోబీ మాజీ ఉద్యోగులకు ఐదేళ్ల జైలు
సాక్షి, హైదరాబాద్: తప్పుడు ఆదాయ పన్ను(ఐటీ) ధ్రువపత్రాలతో గృహ రుణాలు మంజూరు చేశారన్న కేసులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) హైదరాబాద్ మాజీ చీఫ్ మేనేజర్ సౌమన్ చక్రవర్తి, మాజీ సీనియర్ మేనేజర్ శంకరన్ పద్మనాభన్కు సీబీఐ కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు టి.సత్య వెంకట దివాకర్, జూలూరి లక్ష్మయ్యలకు ఐదేళ్ల జైలు, రూ.75,000 జరిమానా, సయ్యద్ ముస్తక్ అహ్మద్, బొర్ర చంద్రపాల్, తోట రవీందర్, ఎం.గోపాల్రావు, బసవన్న రవీంద్రలకు మూడేళ్లు జైలు, రూ.75,000 జరిమానా విధించింది. తప్పుడు పత్రాలు సృష్టించి గృహ రుణాలు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో 2005లో బ్యాంక్ అధికారులిద్దరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. నకిలీ సేల్ డీడ్లను, గడువు ముగిసిన ఎల్ఐసీ పాలసీలతో రుణాలు మంజూరు చేసినట్లు విచారణలో తేలింది. 2007, నవంబర్లో సీబీఐ కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసింది. ఇలా అక్టోబర్ 2003 నుంచి జనవర్ 2004 వరకు ఈ రుణాలు మంజూరు చేసి.. బ్యాంక్కు రూ.2.21 కోట్ల నష్టం కలిగించినట్లు తేలడంతో సీబీఐ కోర్టు నిందితులకు శిక్షలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. -
టీఎంసీ నేతకు బెయిల్ ఇవ్వాలని జడ్జికి బెదిరింపులు..
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని ఆసన్సోల్ సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జికి బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. గోవుల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన టీఎంసీ నాయకుడు అనుబ్రత మండల్కు బెయిల్ ఇవ్వాలని, లేకపోతే జడ్డి కుటుంబసభ్యులపై నార్కొటిక్ డ్రగ్స్ కేసు పెడతామని ఓ వ్యక్తి బెదిరించాడు. ఈ విషయంపై జడ్జి రాజేశ్ చక్రవర్తి జిల్లా జడ్డికి ఫిర్యాదు చేశారు. బెదిరింపు లేఖను కూడా జత చేశారు. అనుబ్రత మండల్కు బెయిల్ ఇవ్వకపోతే తన కుటుంబసభ్యులందరిపై నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్(NDPS) కింద కేసు పెడతామని బప్ప చటర్జీ అనే వ్యక్తిపేరుతో లేఖవచ్చిందని జడ్జి పేర్కొన్నారు. నిందితుడు పుర్వ వర్ధమాన్లోని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టులో హెడ్ క్లర్క్ అని, టీఎంసీ లీడర్నని లేఖలో పేర్కొన్నాడని తెలిపారు. ఈ విషయాన్ని కోల్కతా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ వ్యవహారంపై బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ తీవ్రంగా స్పందించారు. అనుబ్రత మండల్ అరెస్టయినప్పటికీ సీఎం మమతా బెనర్జీ ఇంకా అతడ్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చదవండి: మా నాయకుడికి బెయిల్ ఇవ్వు లేకపోతే.. సీబీఐ జడ్జికి బెదిరింపులు -
బొగ్గు కుంభకోణంలో మాజీ కార్యదర్శి దోషే: కోర్టు
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో ఆ శాఖ మాజీ కార్యదర్శి హెచ్సీ గుప్తా, మాజీ సంయుక్త కార్యదర్శి కేఎస్ క్రోఫాలను సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం దోషులుగా తేల్చింది. మహారాష్ట్రలోని లొహారా ఈస్ట్ కోల్ బ్లాక్ కేటాయింపుల్లో వీరిద్దరూ నేరపూరిత కుట్రకు, మోసం, అవినీతికి పాల్పడ్డారని పేర్కొంది. గ్రేస్ ఇండస్ట్రీస్(జీఐఎల్)ను, ఆ కంపెనీ డైరెక్టర్ ముకేశ్ గుప్తాను కూడా ప్రత్యేక జడ్జి అరుణ్ భరద్వాజ్ దోషిగా పేర్కొన్నారు. వీరికి ఆగస్ట్ 4న శిక్షలు ఖరారు చేయనున్నారు. 2005–11 సంవత్సరాల మధ్య బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో చోటుచేసుకున్న అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇదీ చదవండి: ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల పెండింగ్ కేసులు -
వాన్పిక్ ప్రాజెక్ట్ లిమిటెడ్కు ఊరట
-
వాన్పిక్ ప్రాజెక్ట్స్పై కీలక తీర్పు వెలువరించిన సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. వాన్పిక్ ద్వారా పలు ప్రయోజనాలు కల్పించినందుకు నిమ్మగడ్డ ప్రసాద్ జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపిస్తూ వాన్పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్పై సీబీఐ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టి వేసింది. చట్టం అనుమతినిస్తే మినహా కంపెనీపై వచ్చిన నేరారోపణలకు, కంపెనీ చర్యలకు దాని చైర్మన్నుగానీ, ఆ కంపెనీని నడుపుతున్న వ్యక్తులను గానీ బాధ్యులుగా చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వాన్పిక్ ప్రాజెక్ట్స్పె సీబీఐ నమోదు చేసిన అభియోగ పత్రాన్ని (చార్జిషీట్) విచారణ నిమిత్తం పరిగణలోకి (కాగ్నిజెన్స్) తీసుకునేటప్పుడు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం యాంత్రికంగా వ్యవహరించిందని హైకోర్టు తేల్చి చెప్పింది. అభియోగపత్రాన్ని విచారణకు స్వీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసే సమయంలో సీబీఐ కోర్టు మెదడు ఉపయోగించలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. వాన్పిక్ ప్రాజెక్ట్స్ అనేది ఓ వ్యక్తి కాదనే విషయాన్ని సీబీఐ కోర్టు పరిగణలోకి తీసుకోలేదని పేర్కొంది. అంతేకాక వాన్పిక్ ప్రాజెక్ట్స్పైగానీ, దానికి నేతృత్వం వహిస్తున్న నిమ్మగడ్డ ప్రసాద్పైగానీ సీబీఐ ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని సంతృప్తి చెందేందుకు సీబీఐ కోర్టు ఎలాంటి కారణాలను నమోదు చేయలేదని తేల్చి చెప్పింది. చార్జిషీటు, దానితో జత చేసిన డాక్యుమెంట్లు, ఆఫీసు నోటు, కోర్టు తీర్పులను మాత్రమే సీబీఐ కోర్టు పరిశీలించిందని తెలిపింది. సీబీఐ ఆరోపణలకు ఓ కార్పొరేట్ సంస్థగా వాన్పిక్స్ ప్రాజెక్ట్స్ లేదా దాని చైర్మన్గా ప్రాథమిక ఆధారాలున్నాయా? కార్పొరేట్ సంస్థ చేసినట్లు ఆరోపిస్తున్న నేరాలకు చైర్మన్ మాత్రమే బాధ్యత వహించాలా? అన్న విషయంలో సీబీఐ ఎలాంటి కారణాలను నమోదు చేయలేదని హైకోర్టు స్పష్టం చేసింది. కార్పొరేట్ సంస్థ ఓ వ్యక్తి కాదని, అలాంటి కంపెనీ లేదా కార్పొరేషన్ నేరస్తుడైతే, అందుకు సంబంధించిన బాధ్యతను దాని డైరెక్టర్లకు గానీ, ఆ కంపెనీని నడుపుతున్న వ్యక్తులకుగానీ యాంత్రికంగా ఆపాదించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. నేరస్తులు కంపెనీకి చెందిన వారన్న కారణంతో కంపెనీ తప్పులకు వారిని యాంత్రికంగా బాధ్యులుగా చేయడానికి వీల్లేదంది. చైర్మన్గా నిమ్మగడ్డ ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేట్ సంస్థ అయిన వాన్పిక్ ప్రాజెక్ట్స్పై క్రిమినల్ ప్రాసిక్యూషన్కు అనుమతినిచ్చినట్లయితే అంతిమ న్యాయం చేసినట్లు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ గురువారం కీలక తీర్పు వెలువరించారు. నిరంజన్రెడ్డి వాదనలతో ఏకీభవించిన సీజే... సీబీఐ తమపై నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ వాన్పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2016లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై ఇటీవల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ గురువారం తీర్పు వెలువరించారు. సహేతుక కారణాలు చూపకుండానే సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ను సీబీఐ కోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకుందన్న వాన్పిక్ ప్రాజెక్ట్స్ తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి వాదనతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ ఏకీభవించారు. వాన్పిక్ ప్రాజెక్టŠస్ లాంటి కృత్రిమ వ్యక్తిని ప్రాసిక్యూట్ చేసేందుకు అవసరమైన ప్రాథమిక ఆధారాలు లేవని, ఈ విషయాన్ని కింది కోర్టు పూర్తిగా విస్మరించిందన్న నిరంజన్రెడ్డి వాదనను సైతం జస్టిస్ భుయాన్ పరిగణలోకి తీసుకున్నారు. చార్జిషీట్ను కాగ్నిజెన్స్లోకి తీసుకోవడం అన్నది మెదడు ఉపయోగించి చేయాల్సిన ప్రక్రియ అని, అది యాంత్రికంగా చేసే ప్రక్రియ ఎంత మాత్రం కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ప్రధాన న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. అలాంటప్పుడు నేరాన్ని ఆపాదించరాదు... ‘కాగ్నిజెన్స్ తీసుకునే విషయంలో మేజిస్ట్రేట్కు విస్తృత అధికారం ఉన్నప్పటికీ న్యాయపరంగా సహేతుక రీతిలో ఉపయోగించాలి. నేరం గురించి నిందితులకు అవగాహన కల్పించే విషయంలో కాగ్నిజెన్స్ అన్నది ఓ ప్రక్రియ అంటూ సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టంగా చెప్పింది. కాగ్నిజెన్స్ అన్నది మేజిస్ట్రేట్ ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలను, నమోదు చేసిన వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకుని, నిందితులు చట్టాన్ని ఉల్లంఘించారా? లేదా? అన్న దానిపై దృష్టి సారించడానికే తప్ప, వ్యక్తులను కోర్టు ముందు హాజరుపరచడానికి, కోర్టు ముందుకు పిలిచేందుకు ఉపయోగించే యాంత్రిక ప్రక్రియ ఎంతమాత్రం కాదు. నేరపూరిత ఉద్దేశంతో కంపెనీ లేదా దానిని నడిపిస్తున్న వ్యక్తులు నేరం చేసినట్లైతే ఆ నేరానికి ఆ కంపెనీని, ఆ వ్యక్తులను బాధ్యులుగా చేయవచ్చు. అయితే ఏ ఏ సందర్బాల్లో అలా బాధ్యులుగా చేయవచ్చో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కంపెనీ చేసిన నేరానికి ఆ కంపెనీని నడిపిస్తున్న వ్యక్తులను బాధ్యులుగా చేయాలంటే అందుకు చట్టం అనుమతినించి ఉండాలి. నేరంలో ఆ వ్యక్తుల పాత్ర ఉన్నట్లు నిర్దిష్ట ఆధారాలు ఉంటే, నేరానికి ఆ వ్యక్తులను బాధ్యులుగా చేయవచ్చు. ఈ సందర్భాల్లో మినహా మిగిలిన సందర్భాల్లో కంపెనీ చేసిన నేరానికి ఆ కంపెనీని నడిపిస్తున్న వ్యక్తులను యాంత్రికంగా బాధ్యులుగా చేయడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు తన తీర్పుల ద్వారా చాలా స్పష్టంగా చెప్పింది.’అని జస్టిస్ భుయాన్ స్పష్టం చేశారు. స్వతఃసిద్ధ అధికారాలను ఉపయోగించొచ్చు... ‘క్రిమినల్ కేసుల్లో నిందితులకు సమన్లు జారీ చేయడం అన్నది చాలా తీవ్రమైన విషయం. క్రిమినల్ లాను అమలు చేసే చర్య ఇది. సమన్లు జారీ చేయాలంటే, సంబంధిత మేజిస్ట్రేట్ నిందితులైన మేనేజింగ్ డైరెక్టర్, కంపెనీ సెక్రటరీ, ఇతర డైరెక్టర్లకు వ్యతిరేకంగా ప్రాథమికాధారాలు ఉన్నాయని సంతృప్తి చెందుతూ అందుకు కారణాలను నమోదు చేయాలి. ప్రస్తుత కేసులో కూడా సీబీఐ కోర్టు వాన్పిక్ ప్రాజెక్ట్స్, దాని చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్కు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలున్నాయని సంతృప్తి చెందేందుకు ఎలాంటి కారణాలను నమోదు చేయలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కంపెనీ చేసిన నేరాన్ని దాని చైర్మన్కు ఆపాదించడానికి ఎంత మాత్రం వీల్లేదు. అంతిమ న్యాయం అందించేందుకు, న్యాయ ప్రక్రియ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు హైకోర్టు సీఆర్పీసీ సెక్షన్ 482 కింద తనకున్న స్వతఃసిద్ధ అధికారాలను ఉపయోగించవచ్చు. ఈ అధికారాన్ని ఉపయోగించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొట్టేయవచ్చు. చైర్మన్గా నిమ్మగడ్డ ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేట్ సంస్థ అయిన వాన్పిక్ ప్రాజెక్టులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్కు అనుమతినిచ్చినట్లయితే అంతిమ న్యాయం చేసినట్లు అవదు. అందువల్ల వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో వాన్పిక్ ప్రాజెక్టులపై పెండింగ్లో ఉన్న కేసును కొట్టి వేస్తున్నాం’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ తన తీర్పులో పేర్కొన్నారు. -
దాణ స్కాం కేసులో లాలూను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు
బిహార్: జార్ఖండ్లోని రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ను దాణా కుంభకోణానికి సంబంధించిన ఐదో కేసులో దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్తోసహా మొత్తం 110 మంది నిందితులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే జనవరి 29న డిఫెన్స్ తరపున వాదనలు పూర్తి చేసిన తర్వాత... సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. 1996లో వెలుగులోకి వచ్చిన ఈ దాణా కుంభకోణం కేసులో లాలు ప్రసాద్ యాదవ్ని సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్థారణ చేస్తూ తీర్పును వెలువరించింది. మంగళవారం సీబీఐ కోర్టు.. దాణ కుంభకోణంకి సంబంధించిన ఐదో కేసులో.. డోరాండా ట్రెజరీ నుండి రూ. 139.35 కోట్లు అక్రమంగా విత్డ్రా చేసిననట్లు నిర్ధారించింది. ఈ మేరకు సీబీఐ కోర్టు మొత్తం దాణా కుంభకోణానికి సంబంధించి ఐదు కేసుల్లో దోషిగా తేలిన లాలూ యాదవ్ మంగళవారం ఉదయం న్యాయమూర్తి సికె శశి తీర్పును చదివేటప్పుడు కోర్టు హాలులో ఉన్నారు. ఈ కేసులో మరో 98 మంది నిందితులు భౌతికంగా హాజరు కావాల్సి ఉండగా 24 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. మిగిలిన వారిలో మాజీ ఎంపీ జగదీష్ శర్మ, అప్పటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ ధ్రువ్ భగత్ సహా 35 మందికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసులో లాలూ యాదవ్తోపాటు మరో 39 మంది దోషులకు ఫిబ్రవరి 21న శిక్ష ఖరారు కానుంది. అయితే లాలు కి సంబంధించిన అన్ని కేసులు పశువుల మేత కోసం ఉద్దేశించిన ప్రభుత్వ నిధులను స్వాహా చేసినవే కావడం గమనార్హం. ఇప్పటివరకు ఆయన మొత్తం 14 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించారు. -
వామ్మో!! ఆరు టన్నుల లాంతర్ ఆవిష్కరణ!!
Lalu Prasad can inaugurate 6 ton lantern: ఈ రాజకీయ నాయకులు వినూత్నంగా చేసే కొన్ని పనులు భలే ఫేమస్ అవుతాయి. పైగా తమ అభిమాన నాయకుడే ఆవిష్కరించాలన్న ఉద్దేశంతో వారి పార్టీ శ్రేణులు కొన్నింటిని భలే విన్నూతన రీతిలో వస్తువులు లేదా భవనాలను తయారుచేయడం లేదా కట్టించడం వంటి పనులు చేస్తుంటారు. అచ్చం అలానే పాట్నాలోని ఆర్జేడీ ప్రధాన కార్యాలయంలో తమ అభిమాన నాయకుడు ఆవిష్కరించాలనే ఉద్దేశంతో ఒక భారీ లాంతరు ఏర్పాటు చేశారు. (చదవండి: 2070 నాటి కల్లా భారత్ కార్బన్ న్యూటల్ దేశంగా మారాలి: నితిన్ గడ్కరీ) అసలు విషయంలోకెళ్లితే....పాట్నాలోని ఆర్జేడీ ప్రధాన కార్యాలయంలో వారి పార్టీ చిహ్నం అయిన 6 టన్నుల కంటే ఎక్కువ బరువున్న ఒక భారీ లాంతరును ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ త్వరలో లాంతరును ఆవిష్కరించే అవకాశం ఉన్నందున ఆ ప్రాంగణంలోకి ప్రవేశంపై నిషేధం కూడా విధించారు. అయితే ఈ లాంతర్ని తేజస్వి యాదవ్ అనే వ్యక్తి చొరవతోనే ఈ లాంతరును నిర్మించినట్లు ఆర్జేడీ కార్యకర్తలు చెబుతున్నారు. బంకా జిల్లా ట్రెజరీకి సంబంధించిన డబ్బు కుంభకోణం సంబంధించిన కేసు కోసం లాలు ప్రసాద్ యాదవ్ సీబీఐ అత్యున్నత న్యాయస్థానం ముందు హాజరై నిమిత్తం పాట్నా వస్తున్నారు. అందువల్ల ఆ సమయంలోనే ఈ ఆవిష్కరణ జరిగే అవకాశం ఉందని ఊహగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆవిష్కరణతో పాటు పార్టీ అధినేత పాట్నా పర్యటన తర్వాత కుల గణన అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. (చదవండి: ఇంట్లో వీల్చైర్లా... బయట స్కూటీలా) -
బెయిల్ రద్దు చేయలేం
సాక్షి, హైదరాబాద్: ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ వి.విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయలేమని ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులను వారు ఉల్లంఘించలేదని, బెయిల్ రద్దు చేసేందుకు సహేతుకమైన కారణాలేమీ లేవని తేల్చి చెప్పింది. ఈ మేరకు రఘురామ దాఖలు చేసిన రెండు పిటిషన్లను బుధవారం కొట్టివేసింది. గత మూడు నెలలుగా సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్రావు ఈ మేరకు తీర్పునిచ్చారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసమే.. ‘జగన్, సాయిరెడ్డి బెయిల్ను రద్దు చేయాలంటూ తన వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసమే రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఇది చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమే. పిటిషన్ దాఖలు చేసిన తీరు, అందులో వాడిన బాష ఆయన దురుద్దేశాన్ని స్పష్టం చేస్తోంది. అవాస్తవాలు, తప్పుడు ఆరోపణలు, అభూత కల్పనలతో ఈ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు రోజువారీ పద్ధతిలో కేసులను విచారిస్తోంది. నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు వింటోంది. ఈ క్రమంలో విచారణను జాప్యం చేస్తున్నారంటూ రఘురామ పేర్కొనడం కోర్టు ధిక్కరణకు పాల్పడటమే అవుతుంది. అలాగే బెయిల్ మంజూరు సమయంలో ప్రత్యేక కోర్టు విధించిన షరతులను వారు ఎప్పుడూ ఉల్లంఘించలేదు. బెయిల్ షరతులు ఉల్లంఘించారని భావించినప్పుడు నిందితుల బెయిల్ రద్దు చేయాలని కోరే అధికారం ప్రాసిక్యూషన్ విభాగానికి మాత్రమే ఉంటుంది. థర్డ్పార్టీకి బెయిల్ రద్దు చేయాలని కోరే హక్కు లేదని అనేక కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ను కొట్టివేయండి..’అని జగన్, సాయిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాదులు ఎస్.నిరంజన్రెడ్డి, ఇ.ఉమామహేశ్వరరావు కోర్టును కోరారు. మరో కోర్టుకు బదిలీకి కారణాల్లేవు హైకోర్టులోనూ రఘురామకృష్ణరాజుకు ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ తాను దాఖలు చేసిన పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. బదిలీ చేయడానికి సహేతుకమైన కారణాలు లేవని స్పష్టం చేసింది. ఊహాగానాలతో రఘురామ ఈ పిటిషన్ దాఖలు చే శారని న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. రఘురామకృష్ణంరాజు పిటిషన్ను కొట్టివేస్తూ బుధవారం తీర్పునిచ్చారు. అలా చేయాలంటే నిర్దిష్టమైన కారణాలుండాలి ‘ఏదైనా పిటిషన్పై విచారణను ఒక కోర్టు నుంచి మరొక కోర్టుకు బదిలీ చేయాలంటే నేర విచారణ చట్టంలో పేర్కొన్న మేరకు నిర్దిష్టమైన కారణాలు ఉండాలి. జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో రెండో నిందితునిగా ఉన్న విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారన్న కారణాన్ని చూపుతూ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ను మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సరికాదు. నిందితులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్లు దాఖలు చేసినప్పుడు అనుమతిస్తూ ఉండటం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. బెయిల్ రద్దు కోరుతూ ఏప్రిల్లో సీబీఐ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే సీబీఐ కోర్టుపై నమ్మకం లేదంటూ ఆ పిటిషన్లపై ఆదేశాలు ఇవ్వడానికి ఒక రోజు ముందు హైకోర్టును ఆశ్రయించడం సరికాదు..’అని జస్టిస్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. -
ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు రేపటికి వాయిదా..
హైదరాబాద్: ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణకు వచ్చింది. వేం నరేందర్రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్రెడ్డి రేవంత్రెడ్డి మాజీ పీఏ సైదయ్య వాంగ్మూలం నమోదు చేశారు. తదుపరి విచారణ రేపటి(శుక్రవారం)కి వాయిదా వేశారు. కాగా తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో టీడీపీ నేతలు బేరసారాలు సారించారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ బేరసారాల్లో భాగంగా టీడీపీ నేత చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్డ్మీ అంటూ స్టీఫెన్సన్తో మాట్లాడినట్టు అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి బయటికి వచ్చిన వీడియోలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఈ కేసుకు సంబంధించి రేవంత్రెడ్డి కొద్ది రోజులు జైలులో ఉన్నారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో రేవంత్రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరారు. -
సిస్టర్ అభయ కేసు: దోషులకు జీవిత ఖైదు
తిరువనంతపురం: కేరళలోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ కేసులో సీబీఐ కోర్టు ఫాదర్ థామస్ కొట్టూర్, నన్ సెఫీని దోషులుగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం సీబీఐ కోర్టు వీరికి శిక్ష ఖరారు చేసింది. ఫాదర్ థామస్ కొట్టూర్, నన్ సెఫీకి సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. దాంతో పాటు చెరో ఐదు లక్షల రూపాలయ జరిమానా కూడా విధించింది. దాదాపు 28 ఏళ్ల పాటు కొనసాగిన ఈ కేసులో చివరికి నేడు కోర్టు దోషులకు శిక్ష విధించింది. 1993లో కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఘటన జరిగిన 12 ఏళ్ల తర్వాత సెయింట్ పియస్ కాన్వెంట్లో అధ్యాపకులుగా పనిచేస్తున్న థామస్ కొత్తూర్, జోస్ పుత్రుక్కయిల్తో పాటు ఓ సిస్టర్ను అరెస్ట్ చేసింది. ఇక నేడు సీబీఐ కోర్టు వారికి శిక్ష విధించింది. ఇక కుమార్తెకు న్యాయం జరగాలని పోరాడిన అభయ తలిదండ్రులు నాలుగేళ్ల క్రితమే మరణించారు. కోర్టు తీర్పుతో వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని స్నేహితులు భావిస్తున్నారు. (చదవండి: ‘ఉరి తీసినా ఆశీర్వాదంగానే భావిస్తాను’) ఇక సీబీఐ చార్జ్షీట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. మార్చి 27,1992న తెల్లవారుజామున 4.15గంటలకు సిస్టర్ అభయ తన హాస్టల్ గది నుంచి కిచెన్ వైపు వెళ్లింది. అక్కడ దోషులు థామస్ కొత్తూర్, జోస్ పుత్రుక్కయిల్ ఓ క్రైస్తవ సన్యాసినితో అభ్యంతరకర రీతిలో కనిపించారు. ఈ విషయం అభయ బయటపెడుతుందోమోనన్న భయంతో ఆమెపై దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. అనంతరం మృతదేహాన్ని కాన్వెంట్ ప్రాంగణంలోని బావిలో పడేశారు. ప్రమాదవశాత్తు అభయ బావిలో పడి మరణించి ఉండవచ్చునని పోలీసులు తొలుత నిర్ధారించారు. కానీ మానవ హక్కుల కార్యకర్త జోమోన్ పుతెన్పురక్కల్ ఈ కేసును కోర్టులో సవాల్ చేయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. -
28 ఏళ్ల తర్వాత సిస్టర్ అభయ హత్య కేసులో తీర్పు
సాక్షి, తిరువనంతపురం: కేరళలో 1992లో సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో సీబీఐ కోర్టు మంగళశారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఫాదర్ థామస్ కొట్టూర్, నన్ సెఫీని దోషులుగా తేల్చింది. రేపు(డిసెంబర్23) దోషులకు శిక్షలు ఖరారు చేయనున్నట్లు సీబీఐ కోర్టు వెల్లడించింది. 1992, మార్చి 27న కొట్టాయంలో సిస్టర్ అభయ హత్యకు గురైంది. సిస్టర్ అభయను ఫాదర్ థామస్, నన్ సెఫీ హత్య చేసినట్లు నికోర్టు నిర్ధారించింది. 28 ఏళ్ల తర్వాత అభయ హత్య కేసులో తీర్పు వెలువడింది. చదవండి: 9 కంపెనీలు.. 9 బ్యాంకులు.. రూ.9వేల కోట్లు కేసు వివరాలు.. 1992లో సిస్టర్ అభయ(21) కేరళలోని బీఎంసీ కళాశౠలలో సైకాలజీ కోర్సు చేస్తోంది. ఆ సమయంలో థామస్ కొట్టూరు సైకాలజీ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మార్చి 27న కొట్టాయంలోని సెయింట్ పియస్ ఎక్స్ కాన్వెంట్లో ఉన్న ఓ బావిలో అభయ శవమై తేలింది. ప్రమాదవశాత్తు అభయ బావిలో పడి మరణించి ఉండవచ్చునని పోలీసులు తొలుత నిర్దారించారు. కానీ మానవ హక్కుల కార్యకర్త జోమోన్ పుతెన్పురక్కల్ ఈ కేసును కోర్టులో సవాల్ చేయడంతో న్యాయస్థానం దీని విచారణను 1993లో సీబీఐకి అప్పగించింది. అనంతరం సిస్టర్ అభయ హత్యకు గురైందని సీబీఐ తేల్చింది. ఈ ఘటన జరిగిన 12 ఏళ్ల తర్వాత సెయింట్ పియస్ కాన్వెంట్లో అధ్యాపకులుగా పనిచేస్తున్న థామస్ కొత్తూర్, జోస్ పుత్రుక్కయిల్తో పాటు ఓ సిస్టర్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. సీబీఐ చార్జిషీట్లో పేర్కొన్న వివరాల ప్రకారం... మార్చి 27,1992న తెల్లవారుజామున 4.15గంటలకు సిస్టర్ అభయ తన హాస్టల్ గది నుంచి కిచెన్ వైపు వెళ్లింది. అక్కడ థామస్ కొత్తూర్,జోస్ పుత్రుక్కయిల్ ఓ క్రైస్తవ సన్యాసినితో అభ్యంతరకర రీతిలో కనిపించారు. ఈ విషయం అభయ ఎక్కడ బయటపెడుతుందోమోనన్న భయంతో ఆమెపై దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. అనంతరం మృతదేహాన్ని కాన్వెంట్ ప్రాంగణంలోని బావిలో విసిరేశారు. తమ కుమార్తెకు న్యాయం జరగాలని చాలాకాలంగా ఎదురుచూసిన అభయ తల్లిదండ్రులు నాలుగేళ్ల క్రితమే మరణించారు. ఎట్టకేలకు 28 ఏళ్ల తర్వాత ఈ కేసు ఓ కొలిక్కి వచ్చి థామస్. నన్ సెఫీని దోషులుగా తేల్చుతూ న్యాయస్థానం తీర్పిచ్చింది. -
‘అరుణ్ శౌరీపై క్రిమినల్ కేసు పెట్టండి’
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరీతోపాటు, ప్రభుత్వ మాజీ ఉద్యోగి ప్రదీప్ బైజల్, హోటలియర్ జ్యోత్స్నా సూరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీబీఐ కోర్టు గురువారం ఆదేశాలిచ్చింది. రాజస్థాన్లోని ఉదయపూర్ లక్ష్మి విలాస్ ప్యాలెస్ హోటల్లో పెట్టుబడుల్లో అవినీతి జరిగిందన్న కేసులో అరుణ్ శౌరీని ప్రత్యేక సీబీఐ కోర్టు నిందితుడిగా పేర్కొంది. హోటల్ అమ్మకాన్ని తిరిగి ప్రారంభించాలని కోర్టు సూచించింది. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో పెట్టుబడుల మంత్రిగా అరుణ్ శౌరీ ఉన్న సమయంలో ప్రభుత్వానికి భారీ నష్టంతో ఈ హోటల్ను విక్రయించినట్లు గుర్తించింది. హోటల్ లక్ష్మి విలాస్ విలువ రూ.252 కోట్లకు పైగా ఉండగా.. కేవలం రూ.7.5 కోట్లకు అమ్ముడైందని కోర్టు తీర్పులో పేర్కొంది. కాగా, సీబీఐ కోర్టు తీర్పుపై రాష్ట్ర హైకోర్టుకు వెళ్తానని అరుణ్ శౌరీ స్పష్టం చేశారు. ప్యాలెస్ చరిత్ర ఇది ఫతే సాగర్ ఒడ్డున ఉన్నఈ ప్యాలెస్ ఉదయ్పూర్ రాజులకు చెందినది. రాజరిక పాలన చివరి రోజుల్లో ఈ ప్యాలెస్ని ప్రభుత్వానికి అప్పగించారు. భారత్ స్వతంత్ర దేశంగా మారిన తర్వాత ప్రభుత్వం దీనిని హోటల్గా నడిపింది. 2002లో దీనిని లలిత్ సూరి గ్రూప్ హోటల్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఆసమయంలోనే కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని అభియోగాలు నమోదయ్యాయి. అయితే, సరైన ఆధారాలు లేవని 2019లో సీబీఐ కేసు మూసివేతకు నివేదిక సిద్ధం చేసింది. కానీ, జోధ్పూర్లోని ప్రత్యేక కోర్టు ఈ నివేదికను తిరస్కరించి తదుపరి దర్యాప్తునకు ఆదేశించింది. ప్రస్తుతం దీని లలిత్ లక్ష్మీ విలాస్ ప్యాలెస్ అని పిలుస్తున్నారు. లలిత్ సూరి మరణించడంతో సంస్థ బాధ్యతలు జ్యోత్స్నా సూరి నిర్వర్తిస్తున్నారు. (చదవండి: వైరల్: కూతురి డైట్పై తండ్రి సరదా కామెంట్) -
వీడని విధ్వంసం : బాబ్రీ కేసుకు డెడ్లైన్
సాక్షి, న్యూఢిల్లీ : హిందూవులు చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణానికి ఓ వైపు అడుగులు పడుతున్న వేళ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీచేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసును సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని దేశ అత్యున్నత న్యాయస్థానం శనివారం ఆదేశించింది. విచారణ పూర్తి చేసి తుది తీర్పును కూడా వెలువరించాలని కోర్టు స్పష్టం చేసింది. కాగా గత ఏడాది ఇచ్చిన ఆగస్ట్ 31 వరకు గడువు ముగిస్తున్న నేపథ్యంలో సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి మరికొంత సమయం కావాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. దీనికి సమ్మతించిన న్యాయస్థానం విచారణ గడువును మరో నెలపాటు పొడిగించింది. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ కురు వృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ (92), అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, వినయ్ కటియార్, గిరిరాజ్ కిషోర్, నాటి యూపీ సీఎం కళ్యాణ్సింగ్లకు కొంత ఊరట లభించింది. (బాబ్రీ కేసులో సీబీఐ కోర్టు ముందుకు అడ్వాణీ) కరసేవకులను రెచ్చగొట్టి కుట్రపూరితంగానే మసీదును కూల్చివేశారని (కుట్ర) ఆరోపణలు వీరు ఎదుర్కొంటున్నారు. దాదాపు 29 ఏళ్ల నుంచి కోర్టుల్లో విచారణ సాగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీలతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొంత మంది వాగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది. సుప్రీంకోర్టు తాజా ఉత్వర్వులతో విచారణ మరికొంత వేగంగా ముందుకు సాగనుంది. మరోవైపు 1992 నాటి బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నిందితులుగా ఉన్న అద్వానీ.. ఆ కేసు నుంచి బయటపడేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. సీబీఐ కేసులో బీజేపీ అగ్రనేతలు.. 1992 డిసెంబర్ 6న సాయంత్రం (బాబ్రీ మసీదు కూల్చివేత) స్థానిక పోలీస్ స్టేషన్లో 198/92 నెంబర్తో మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరిలో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, వినయ్ కటియార్, గిరిరాజ్ కిషోర్, నాటి యూపీ సీఎం కళ్యాణ్సింగ్ కూడా ఉన్నారు. అయితే 2003 సెప్టెంబర్ 19న రాయ్బరేలీలోని స్పెషల్ మెడిస్ట్రేట్ అద్వానీ, జోషీలకు విచారణ నుంచి విముక్తి కల్పించింది. అయితే దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 2017లో తీర్పును వెలువరిస్తూ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్వానీ, జోషీ, ఉప భారతి, కళ్యాణ్ సింగ్లను కూడా విచారించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో సీబీఐ వీరందరినీ విచారిస్తోంది. కేసు విచారణ తుది దశతో ఉన్న నేపథ్యంలో.. నేరం రుజువైతే శిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. తాజా ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 30న తుది తీర్పు వెలువడాల్సి ఉంది. -
‘ఉరి తీసినా ఆశీర్వాదంగానే భావిస్తాను’
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు గురించి తనకు ఎలాంటి పట్టింపు లేదన్నారు బీజేపీ నాయకురాలు ఉమా భారతి. తీర్పు ఎలా ఉన్నా.. దాన్ని అంగీకరిస్తానని ఆమె తెలిపారు. ఈ కేసులో కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకులలో ఉమా భారతి, ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉమా భారతి మాట్లాడుతూ.. ‘నా స్టేట్మెంట్ కోసం కోర్టు నన్ను పిలిచింది. నిజం ఏంటో కోర్టుకు వెల్లడించాను. ఇక తీర్పు ఎలా వస్తుంది అనే దాని గురించి నాకు చింత లేదు. ఒక వేళ నన్ను ఉరి తీయాలనుకున్నా.. దాన్ని కూడా నేను ఆశీర్వాదంగానే భావిస్తాను. నా స్వస్థలంలో కూడా ఎంతో ఆనందిస్తారు’ అని తెలిపారు. (5 శతాబ్దాల సమస్య!) ఉమా భారతి ఈ నెల ప్రారంభంలో లక్నోలోని ప్రత్యేక సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రముఖ బీజేపీ నాయకుడు ఎల్కే అడ్వాణీ (92) శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరుకాగా.. మురళీ మనోహర్ జోషి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సీబీఐ కోర్టు, రోజువారీ విచారణల ద్వారా, దర్యాప్తును పూర్తి చేసి, ఆగస్టు 31 లోగా తన తీర్పును ఇవ్వాలి.(బాబ్రీ మసీదు కేసులో కొత్త మలుపు) రామ మందిరం నిర్మాణం గురించి శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై ఉమా భారతి స్పందించారు. ‘కరోనా, మందిర నిర్మాణం ఈ రెండు అంశాలకు అసలు ఎలాంటి సంబంధం లేదు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు కోవిడ్కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వీరితో ఎలాంటి సంబధం లేని ట్రస్ట్ ఆలయ నిర్మాణం చేపడుతోంది. పవార్ వ్యాఖ్యలు వ్యతిరేక అర్థాన్ని సూచిస్తాయి. ఎలాంటి గొడవ జరగకుండా మందిర నిర్మాణం జరగడం వారికి నచ్చడం లేదు. ఆ ఆందోళనలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మోదీ జీ అయోధ్యలో ఉన్నప్పుడు పవార్ జీ.. ‘జై శ్రీరామ్.. జై రామ్’ అని పాడాలని నేను కోరుకుంటున్నాను’ అన్నారు ఉమా భారతి. -
బాబ్రీ కేసులో సీబీఐ కోర్టు ముందుకు అడ్వాణీ
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రముఖ బీజేపీ నాయకుడు, మాజీ ఉప ప్రధాని, 92 ఏళ్ళ ఎల్కే అడ్వాణీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరవగా, ఆయన స్టేట్మెంట్ని రికార్డు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, నాలుగున్నర గంటలపాటు జరిగిన ఈ విచారణలో, ఎల్కే అడ్వాణీని సీబీఐ ప్రత్యేక కోర్టు 100కు పైగా ప్రశ్నలను అడిగింది. అడ్వాణీ తనపై వచ్చిన అన్ని ఆరోపణలను తిరస్కరించారని, ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. బుధవారం హోం మంత్రి అమిత్షా, ఎల్కే అడ్వాణీతో అరగంట పాటు సమావేశమయ్యారు. రోజువారీ విచారణ చేస్తున్న కోర్టు, ఆగస్టు 31లోగా తీర్పును ప్రకటించాల్సి ఉంది. -
సురేఖ హత్య కేసు.. హంతకునికి యావజ్జీవం
కర్ణాటక, యశవంతపుర: టెక్కీని హత్య చేసిన నిందితుడికి సీబీఐ కోర్టు యావజ్జీవ కారగార శిక్షతో పాటు రూ. లక్ష జరిమానా విధిస్తూ గురువారం తీర్పు చెప్పింది. 2010 డిసెంబర్ 17న టెక్కీ పాయల్ సురేఖను జిమ్ ఇన్స్ట్రక్టర్ జేమ్స్ కుమార్ రాయ్ జేపీ నగర 6వ స్టేజీ ఆర్బీఐ లేఔట్లో హత్య చేశాడు. వివరాలు... సురేఖ భర్త అనంత్నారాయణ మిశ్రా బెంగళూరు, భువనేశ్వర్లో జిమ్ నిర్వహిస్తున్నాడు. బెంగళూరులో పనిచేసే జిమ్లో రాయ్ ఇన్స్ట్రక్టర్గా పనిచేసేవాడు. సురేఖ సూచనల మేరకు రాయ్ను పనిలో నుంచి తొలగించాడు. దీంతో ఆమెపై ద్వేషం పెంచుకుని 2010 డిసెంబర్ 17న దంపతులు ఉంటున్న అపార్టుమెంట్కు వెళ్లి సురేఖను హత్య చేశాడు. హత్య చేయటానికి ముందు రెండు మూడు సార్లు నిందితుడు అపార్టుమెంట్కు వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఘటనా స్థలంలో సురేఖ వెంట్రుకలు, రక్తపు మరకలు నిందితుడు ఉపయోగించిన జాకెట్పై ఉండటంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే సురేఖను భర్త మిశ్రానే హత్య చేసి ఉంటాడని అనుమానించి బాధితురాలి కుటుంబ సభ్యులు ఆయనపై కూడా కేసు పెట్టారు. దీంతో కేసును సీబీఐకి అప్పగించాలని సురేఖ తల్లిదండ్రులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. బెంగళూరులోనే చదువుకున్న సురేఖ, మిశ్రాలు 2008లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సురేఖ ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ జేపీ నగరలో నివాసం ఉంటోంది. హత్యకేసును సీరియస్గా తీసుకున్న సీబీఐ అధికారులు అన్ని ఆధారాలు సేకరించి రాయ్ను అరెస్ట్ చేశారు. నిందితుడికి సీబీఐ కోర్టు యావజ్జీవ శిక్షతో పాటు రూ. లక్ష జరిమానా విధించింది. -
‘ఇష్రాత్’ కేసులో మాజీ పోలీసులకు విముక్తి
అహ్మదాబాద్: ఇష్రాత్ జహన్ను బూటకపు ఎన్కౌంటర్ చేశారన్న ఆరోపణలపై దాఖలైన కేసులో మాజీ పోలీసు అధికారులు డీజీ వంజరా, ఎన్కే అమిన్లకు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. కేసు విచారణను నుంచి తమను తప్పించాలంటూ వంజరా, అమిన్లు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు అనుమతించింది. ఈ కేసులో విచారణ జరిపేందుకు గానూ సీబీఐకి గుజరాత్ ప్రభుత్వం అనుమతివ్వని నేపథ్యంలో కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సీబీఐ విచారణకు ప్రభుత్వం అనుమతినివ్వలేదని.. దీంతో మాజీ పోలీసు అధికారులు దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు అనుమతిస్తున్నామని.. ఈ కేసులో వారికి వ్యతిరేకంగా ఏ చర్యలు తీసుకోరాదని ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి జేకే పాండ్యా చెప్పారు. -
సోహ్రబుద్దీన్ కేసు: నిందితులకు విముక్తి
సాక్షి, ముంబై : 2005లో సోహ్రబుద్దీన్ షేక్, తులసీరాం ప్రజాపతి ఎన్కౌంటర్ కేసులో మొత్తం 22 మంది నిందితులకు విముక్తి కల్పిస్తూ శుక్రవారం ముంబై కోర్టు తీర్పు వెలువరించింది. నిందితులపై నేరాన్ని రుజువు చేసేందుకు తగిన ఆధారాలు లేనందున వారిని కేసు నుంచి తప్పిస్తున్నట్టు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి స్పష్టం చేశారు. గుజరాత్, రాజస్ధాన్లకు చెందిన పోలీస్ అధికారులే నిందితుల్లో అధికంగా ఉన్నారు. రాజకీయ, ఆర్థిక లబ్ధి కోసమే ఈ హత్యలకు కుట్ర జరిగిందని కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఆరోపించింది. ఇదే కేసులో సీబీఐ నిందితుడిగా చేర్చిన బీజేపీ చీఫ్ అమిత్ షాకు గతంలో కేసు నుంచి ఊరట లభించింది. ఆయన పాత్రపై ఆధారాలు లేనందున అమిత్ షాతో గుజరాత్ మాజీ డీజీపీ వంజరాలకు కేసు నుంచి కోర్టు విముక్తి కల్పించింది. ఈ కేసులో మొత్తం 210 మంది సాక్షులను కోర్టు విచారించగా వీరిలో 92 మంది అప్రూవర్లుగా మారారు. సోహ్రబుద్దీన్ అపహరణ, ఎన్కౌంటర్ బూటకమని నిరూపించేందుకు ప్రాసిక్యూషన్ గట్టిగా కృషి చేసినా సాక్షులు అప్రూవర్లుగా మారడంతో వారు నోరుమెదపలేదని, ఇందులో ప్రాసిక్యూషన్ తప్పేమీ లేదని కోర్టు పేర్కొంది. సోహ్రబుద్దీన్, తులసీరామ్ ప్రజాపతి కుటుంబాలకు న్యాయస్ధానం విచారం వెలిబుచ్చుతోందని, కోర్టులు కేవలం సాక్ష్యాల ఆధారంగానే పనిచేయాలని వ్యవస్థ, చట్టం నిర్దేశిస్తాయని తీర్పును చదువుతూ న్యాయమూర్తి జస్టిస్ ఎస్జే శర్మ వ్యాఖ్యానించారు. కాగా, ఈ కేసును తొలుత గుజరాత్ సీఐడీ విచారించగా తదుపరి 2010లో దర్యాప్తును సీబీఐకి బదలాయించారు. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ సహా ఈ ఘటనలు జరిగిన సమయంలో గుజరాత్ హోంమంత్రిగా వ్యవహరించిన అమిత్ షాను నిందితుల్లో ఒకరిగా చేర్చగా ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు లేవంటూ 2014లో కేసు నుంచి విముక్తి కల్పించారు. అసలేం జరిగింది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన హత్యకు కుట్రపన్నిన సోహ్రబుద్దీన్ షేక్ 2005 నవంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడని గుజరాత్ పోలీసులు వెల్లడించారు. అదే ఏడాది నవంబర్ 22న సోహ్రబుద్దీన్, ఆయన భార్య కౌసర్ బి, సహచరుడు తులసీరాం ప్రజాపతిలు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని సంగ్లీకి బస్సులో వెళుతుండగా గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీబీఐ తెలిపింది. నాలుగు రోజుల తర్వాత సోహ్రబుద్దీన్ను అహ్మదాబాద్ వద్ద హతమార్చారని, అదృశ్యమైన కౌసర్ బీని నవంబర్ 29న బనస్కంత జిల్లాలోని ఓ గ్రామానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడి అనంతరం హతమార్చారని సీబీఐ ఆరోపించింది. ఇక 2006 డిసెంబర్ 27న గుజరాత్-రాజస్ధాన్ సరిహద్దుల్లో ఇరు రాష్ట్రాల పోలీసులు చాప్రి ప్రాంతం వద్ద కాల్చిచంపారని పేర్కొంది. అయితే ప్రజాపతిని ఓ కేసు విచారణ నిమిత్తం అహ్మదాబాద్ నుంచి రాజస్ధాన్కు తీసుకువెళుతుండగా పారిపోయేందుకు ప్రయత్నించగా అతడిని ఆపే క్రమంలో జరిపిన కాల్పుల్లో మరణించాడని పోలీసులు చెబుతున్నారు. నిర్ధోషులుగా బయటపడిన ప్రముఖులు సోహ్రబుద్దీన్ కేసులో బీజేపీ చీఫ్ అమిత్ షాతో పాటు గుజరాత్ పోలీసు అధికారి అభయ్ చుడాసమ, రాజస్ధాన్ మాజీ హోంమంత్రి గులాబ్చంద్ కటారియా, మాజీ గుజరాత్ డీజీపీ పీసీ పాండే, సీనియర్ పోలీస్ అధికారి గీతా జోహ్రి తదితరులున్నారు. ఇక తాజా తీర్పులో కేసు నుంచి విముక్తి పొందిన వారిలో అత్యధికులు గుజరాత్, రాజస్ధాన్లకు చెందిన దిగువస్ధాయి పోలీసు అధికారులే ఉండటం గమనార్హం. -
అగస్టా కేసు : సీబీఐ కస్టడీకి మైకేల్
సాక్షి, న్యూఢిల్లీ : అగస్టా వెస్ట్ల్యాండ్ కేసులో మధ్యవర్తిగా భావిస్తున్న క్రిస్టియన్ మైకేల్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం బుధవారం ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతించింది. అగస్టా కేసులో విచారణ కొనసాగుతోందని, ఈ డీల్లో రెండు దుబాయ్ ఖాతాలకు సొమ్మును చేరవేసినందున మైకేల్ కస్టడీ తమకు అవసరమని సీబీఐ న్యాయవాది కోర్టుకు నివేదించారు. మరోవైపు ప్రత్యేక న్యాయస్ధానంలో బెయిల్ కోరుతూ మైకేల్ పిటిషన్ దాఖలు చేసుకోగా ఆయనను ఐదు రోజులు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ బెయిల్ పిటిషన్పై విచారణ తదుపరి చేపడతామని న్యాయస్ధానం పేర్కొంది. మైకేల్ను ఉదయం, సాయంత్రం గంట పాటు కలుసుకునేందుకు ఆయన న్యాయమూర్తికి కోర్టు అనుమతించింది. అగస్టా ఒప్పందంలో అభియోగాలు ఎదుర్కొంటున్న బ్రిటన్ పౌరుడు మైకేల్ను మంగళవారం రాత్రి దుబాయ్ ప్రభుత్వం భారత్కు అప్పగించిన సంగతి తెలిసిందే. అగస్టా కేసులో విచారణ జరుపుతున్న ముగ్గురు దళారీల్లో ఆయన ఒకరు. మరో ఇద్దరు మధ్యవర్తులు గైడో హస్కే, కార్లో గెరోసాలను ఈడీ, సీబీఐ విచారిస్తున్నాయి. మైకేల్కు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఆయనపై సీబీఐ, ఈడీ రెడ్కార్నర్ నోటీసు జారీచేయాలని కోరుతూ ఇంటర్పోల్ను ఆశ్రయించాయి. కాగా, బ్రిటన్ జాతీయుడైన మైకేల్ అగస్టా వెస్ట్ల్యాండ్ కంపెనీ నుంచి రూ.225 కోట్ల ముడుపులు స్వీకరించినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 2016లో చార్జిషీటు దాఖలు చేసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యవేక్షణలో చేపట్టిన ఆపరేషన్ మూలంగానే మైఖేల్ను భారత్కు అప్పగించేందుకు యూఏఈ అంగీకరించిందని సీబీఐ తెలిపింది -
బ్యాంక్ మేనేజర్కు జైలు
సాక్షి, హైదరాబాద్: బ్యాంకును మోసగించిన కేసులో హైదరాబాద్ అమీర్పేటలోని విజయా బ్యాంకు మేనేజర్ కె.దేవేందర్రావు, మరోవ్యక్తి ఎం.వెంకటేశ్వరరావుకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, భారీ జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ మేరకు సీబీఐ కోర్టు అదనపు ప్రత్యేక జడ్జి బీవీఎల్ఎన్ చక్రవర్తి ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాంక్ మేనేజర్ ఫోర్జరీ సంతకాలు, బోగస్ పత్రాల ఆధారంగా 12 మందికి ఇళ్ల రుణాలు మంజూరు చేశారు. రుణాల నిమిత్తం ఇచ్చిన బ్యాంక్ డ్రాఫ్ట్లను నగదుగా మార్పు చేసి రుణాలు పొందిన వారికి ఆ మొత్తాలను అందజేయడంలో వెంకటేశ్వరరావు సహకరించారు. ఫలితంగా బ్యాంకుకు రూ.90 లక్షలు నష్టం వచ్చిందంటూ 2006 జనవరి 4న సీబీఐ కేసు నమోదు చేసింది. విచారణ అనంతరం సీబీఐ కోర్టు బ్యాంక్ మేనేజర్ దేవేందర్రావు, వెంకటేశ్వరరావుకు ఐదేళ్ల కఠిన కారాగారం తోపాటుగా వీరిద్దరికీ వరుసగా రూ.3 లక్షలు, రూ.1.5లక్షల జరిమానాను విధించింది. అది చెల్లించకపోతే 6 నెలలు సాధారణ జైలు గడపాలని పేర్కొంటూ; 17 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. -
సీబీఐ కోర్టులో లొంగిపోయిన లాలూ
రాంచీ : పశుగ్రాస కుంభకోణం కేసుల్లో దోషిగా తేలడంతో జైలు శిక్ష అనుభవించేందుకు బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం ఎదుట లొంగిపోయారు. మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు వెంటరాగా లాలూ సీబీఐ న్యాయస్ధానానికి చేరుకున్నారు. రాంచీ హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఆయన ఈ రోజు సీబీఐ న్యాయస్ధానంలో లొంగిపోయారు. లాలూకు వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం ఆసియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ (ముంబై) వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకు నివేదిస్తారని లాలూ న్యాయవాది ప్రభాత్ కుమార్ వెల్లడించారు. జార్ఖండ్ హైకోర్టు లాలూను త్వరగా ప్రత్యేక న్యాయస్ధానంలో లొంగిపోవాలని ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ముంబైలో మూడు వారాల పాటు వైద్య చికిత్సలు పొందిన లాలూ శనివారం అక్కడినుంచి పట్నా చేరుకున్నారు. లాలూ ప్రాధమిక బెయిల్ను పొడిగించేందుకు నిరాకరించిన జార్ఖండ్ హైకోర్టు ఆగస్ట్ 30లోగా సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానంలో లొంగిపోవాలని కోరింది. వైద్యపరమైన కారణాలతో మే 11న లాలూకు ఆరు వారాల ప్రాధమిక బెయిల్ను మంజూరు చేసిన హైకోర్టు ఆ తర్వాత పలు సందర్భాల్లో ఆగస్ట్ 27 వరకూ పొడిగించింది. మరోవైపు రాంచీ విమానాశ్రమయంలో పార్టీ అనుచరులతో కలిసి వెలుపలికి వచ్చిన లాలూ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. తన ఆరోగ్యం బాగాలేదని, తానిప్పుడు మాట్లాడేదేమీ లేదన్నారు. -
30న సీబీఐ కోర్టులో లొంగిపోండి
రాంచీ: దాణా కుంభకోణం కేసుల్లో దోషి, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్కు జార్ఖండ్ హైకోర్టులో చుక్కెదురైంది. తాత్కాలిక బెయిల్ను పొడిగించేందుకు కోర్టు నిరాకరించింది. ఈనెల 30వ తేదీలోగా సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని లాలూను ఆదేశించింది. దాణా కుంభకోణానికి సంబంధించిన 4 కేసుల్లో లాలూ దోషిగా తేలడంతో ఆయనకు సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించడం తెల్సిందే. జైలులో లాలూ అనారోగ్యానికి గురి కావడంతో చికిత్సకోసం బెయిలివ్వాలంటూ హైకోర్టును కోరారు. దీంతో మే 11న ఆయనకు 6 వారాల తాత్కాలిక బెయిలిచ్చింది. తర్వాత ఆ బెయిల్ను పొడిగించింది. తాజాగా మరో 3 నెలలపాటు బెయిల్ను పొడిగించాలంటూ లాలూ కోరారు. అందుకు హైకోర్టు జడ్జి నిరాకరించారు. అవసరమైనప్పుడు వైద్యం అందించాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మరోవైపు, ఐఆర్సీటీసీ కుంభకోణం కేసులో లాలూ, ఆయన భార్య రబ్రీదేవిలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. -
చిదంబరానికి ఊరట
న్యూఢిల్లీ: ఎయిర్సెల్–మ్యాక్సిస్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంనకు ఊరట లభించింది. ఆయన్ను ఆగస్ట్ 7వ తేదీ వరకు అరెస్ట్ చేయరాదంటూ సీబీఐ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదే విధంగా ఈ కేసుకు సంబంధించి చిదంబరం పెట్టుకున్న దరఖాస్తుకు 3 వారాల్లోగా బదులివ్వాలని స్పెషల్ కోర్టు జడ్జి సీబీఐను ఆదేశించారు. ఎయిర్సెల్–మ్యాక్సిస్ కేసులో చిదంబరంతోపాటు ఆయన కొడుకు కార్తీపై సీబీఐ చార్జిషీటు వేసింది. దీంతో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. విదేశాలకు వెళ్లేందుకు కార్తీకి అనుమతి ఎయిర్సెల్–మ్యాక్సిస్, ఐఎన్ఎక్స్ మీడియా కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న చిదంబరం కొడుకు కార్తీ విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు ఓకేచెప్పింది. వ్యక్తిగత కారణాల రీత్యా ఈనెల 23 నుంచి 31వ తేదీ వరకు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలకు వెళ్లేందుకు కోర్టు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. చిదంబరం కుటుంబంపై అసంతృప్తి సాక్షి ప్రతినిధి, చెన్నై: విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను దాచిన కేసులో చిదంబరం కుటుంబం విచారణకు హాజరు కాకపోవడాన్ని చెన్నై ఎగ్మూరు న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భార్య నళిని, కొడుకు కార్తీ, కోడలు శ్రీనిధిలకు బ్రిటన్, అమెరికాలో ఉన్న ఆస్తులకు సంబంధించి నల్లధనం చట్టం కింద ఐటీ శాఖ కేసు వేసింది. ఈ కేసు సోమవారం విచారణకు రాగా ఆ ముగ్గురూ హాజరు కాలేదు. దీంతో వారిపై న్యాయమూర్తి మలర్విళి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 30వ తేదీన వారంతా తప్పనిసరిగా కోర్టుకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. -
యూరియా స్కాంలో 100 కోట్ల జరిమానా!
న్యూఢిల్లీ: 23 ఏళ్లనాటి రూ.133 కోట్ల యూరియా కుంభకోణంలో తీస్ హజారీ ప్రత్యేక సీబీఐ కోర్టు దోషులకు భారీ జరిమానాతోపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. ఇద్దరు టర్కీ దేశస్తులకు ఆరేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బంధువు, మాజీ కేంద్ర మంత్రి తనయుడు సహా ఈ కేసుతో సంబంధమున్న భారతీయులకు భారీ జరిమానా విధించింది. టర్కీ దేశస్తులు టుంకే అలంకుస్, సిహాన్ కరాంచీ (వీరిద్దరూ కర్సాన్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు)లతోపాటు ఆ కంపెనీ భారతీయ ప్రతినిధి ఎం సాంబశివరావు, నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్) మాజీ సీఎండీ రామకృష్ణన్, ఎన్ఎఫ్ఎల్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిల్బాగ్ సింగ్ కన్వర్, మల్లేశం గౌడ్, మాజీ కేంద్ర మంత్రి రామ్లఖన్ సింగ్ యాదవ్ కుమారుడు ప్రకాశ్ చంద్ర, మాజీ ప్రధాని పీవీ బంధువు సంజీవ రావు ఈ కేసులో దోషులుగా ఉన్నారు. రామకృష్ణ, కన్వర్లకు మూడేళ్ల జైలు, రూ.6లక్షల జరిమానా, సాంబశివరావుకు మూడేళ్ల జైలు, రూ.5కోట్ల జరిమానా, మల్లేశం గౌడ్కు మూడేళ్ల జైలు, రూ.5కోట్ల జరిమానా, సంజీవరావ్, యాదవ్లకు కోటి రూపాయల జరిమానా మూడేళ్ల జైలు శిక్ష విధించారు. కుంభకోణం కేసేంటి? ఈ కేసులో పేర్కొన్న వారంతా నేరపూరిత కుట్రతో ఎన్ఎఫ్ఎల్ను రూ.133 కోట్ల మేర మోసం చేశారంటూ 1996, మే 19న సీబీఐ కేసు నమోదు చేసింది. ‘టర్కీ దేశస్తుడైన అలంకుస్ ఎన్ఎఫ్ఎల్కు యూరియా సరఫరా చేసేందుకు కర్సాన్ లిమిటెడ్ కంపెనీ తరపున ఒప్పందం చేసుకున్నాడు. మెట్రిక్ టన్నుకు 190 డాలర్ల చొప్పున 2లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకోసం ముందుగానే 100% చెల్లించాలని ఒప్పందంలో ఉంది. దీని విలువ దాదాపుగా రూ.133 కోట్లు. నవంబర్ 2, 1995న అలంకుస్కు 3.8లక్షల డాలర్లు బీమా అడ్వాన్స్గా చెల్లించారు. మిగిలిన 3.76 కోట్ల డాలర్లను కర్సాన్ కంపెనీ అకౌంట్లోకి 1995లో జమచేశారు. అయితే ఈ కంపెనీ ఎన్ఎఫ్ఎల్కు యూరియాను పంపలేదు. కుంభకోణం నేపథ్యం.. 1995,సెప్టెంబర్: యూరియా సరఫరాకు అంతర్జాతీయ టెండర్ల ఆహ్వానం 1996 మార్చి: టర్కీ కంపెనీ కార్సాన్కు రూ.133 కోట్ల చెల్లింపు 1996 మే: యూరియా సరఫరా చేయకపోవడంపై సీబీఐ విచారణకు ఆదేశం 1996 ఆగస్టు: కంభకోణంలో వెలుగులోకి పీవీ కొడుకు ప్రభాకర్ రావు పేరు 1998 నవంబర్: ప్రభాకర్ రావు అరెస్టు -
పీఎన్బీ స్కామ్ కేసు మోదీకి నాన్ బెయిలబుల్ వారెంట్
-
దినకరన్ సోదరి, బావలకు పీటీ వారెంట్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత, ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ సోదరి సీతలాదేవి, బావ ఎస్ఆర్ భాస్కరన్లకు చెన్నై సిబిఐ కోర్టు పీటి వారెంట్ జారీ చేసింది. 2008లో సీతలాదేవి, భాస్కరన్లపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయింది. విచారణలో ఆధారాలతో సహా నిరూపితం కావడంతో సీతలాదేవికి మూడు, భాస్కరన్కు ఐదు సంవత్సరాల జైలు శిక్షను సిబిఐ కోర్టు విధించింది. దీనిపై వారు ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకోగా చుక్కెదురైంది. దీంతో జైలు శిక్ష అనుభవించేందుకు కోర్టులో లొంగిపోయేందుకు వారికి అవకాశం కల్పించారు. అయితే, వారు లొంగిపోని దృష్ట్యా చెన్నై సిబిఐ కోర్టు శుక్రవారం సాయంత్రం పిటీ వారెంట్ జారీ చేసింది. ఆ ఇద్దరిని అరెస్టు చేయాలని సిబిఐను ఆదేశించింది. -
గడ్డిమేతకు మూడున్నరేళ్ల జైలు
రాంచీ: 21 ఏళ్ల నాటి దాణా కుంభకోణంలో బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్యాదవ్కు సీబీఐ కోర్టు మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటుగా రూ.10 లక్షల జరిమానా కూడా లాలూ చెల్లించాలని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శివ్పాల్సింగ్ శనివారం తీర్పునిచ్చారు. లాలూ జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆర్నెల్లు అదనంగా జైల్లో గడపాల్సి ఉంటుంది. ఆర్జేడీ చీఫ్ సహా మరో ఏడుగురికి మూడున్నరేళ్ల పాటు జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించారు. లాలూతోపాటుగా మరో 15 మంది దోషులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. శనివారం మధ్యాహ్నం శిక్ష ఖరారుకు సంబంధించిన వాదనలు ముగియగా.. నాలుగు గంటలకు న్యాయమూర్తి శివ్పాల్సింగ్ తీర్పు చెప్పారు. ‘ఇటువంటి దోషులకు ఓపెన్ జైలు సరిగా సరిపోతుంది. ఎందుకంటే వాళ్లకు గతంలో ఆవులను పెంచిన అనుభవం ఉంది’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. డిసెంబర్ 23నే వీరిని కోర్టు దోషులుగా గుర్తించినప్పటికీ మూడ్రోజులుగా శిక్షల ఖరారు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. మరో 15 మందికీ శిక్షలు ఖరారు మోసం, నేరపూరిత కుట్ర, తప్పుడు పత్రాల వినియోగంతో నిధుల విడుదలతోపాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద లాలూకు మూడున్నర ఏళ్ల జైలు శిక్ష విధించారని సీబీఐ న్యాయవాది వెల్లడించారు. అయితే, ఈ శిక్షను వచ్చే వారం జార్ఖండ్ హైకోర్టులో అప్పీలు చేయనున్నట్లు లాలూ తరపు న్యాయవాది చిత్తరంజన్ సిన్హా తెలిపారు. దేవ్గఢ్ ట్రెజరీకి సంబంధించిన కేసులో మరో 15 మందికీ ఐపీసీ, పీసీఏ (అవినీతి నిరోధక చట్టం) కింద ఆర్నెల్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షలను కూడా న్యాయమూర్తి ప్రకటించారు. కుంభకోణం జరిగిన సమయంలో ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా ఉన్న జగదీశ్ శర్మకు ఏడేళ్ల జైలు, రూ. 20 లక్షల జరిమానా, ఆర్జేడీ నేత ఆర్కే రాణాకు ఆర్నెల్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధించారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులు బెక్ జూలియస్, ఫూల్చంద్ సింగ్, మహేశ్ ప్రసాద్లకు మూడున్నరేళ్ల జైలు, రూ.5 లక్షల జరిమానాను న్యాయమూర్తి విధించారు. మాజీ ప్రభుత్వాధికారి కృష్ణ కుమార్కు ఏడేళ్ల జైలు, రూ. 20 లక్షల జరిమానా, మాజీ అధికారి సుబీర్ భట్టాచార్యకు మూడున్నరేళ్ల జైలు రూ. 10 లక్షల జరిమానా, సప్లయర్ మోహన్ ప్రసాద్కు ఏడేళ్ల జైలు, రూ. 10 లక్షల జరిమానా విధించారు. మిగిలిన వారికి కూడా దాదాపుగా ఇవే శిక్షలు పడ్డాయి. చట్టం ముందు అందరూ ఒకటే! లాలూ శిక్షపై బీజేపీ, జేడీయూ, కాంగ్రెస్లు స్పందించాయి. చట్టం ముందు అందరూ సమానులేనని బీజేపీ నేత షానవాజ్ వ్యాఖ్యానించారు. ‘కోర్టు తన పని తాను చేసింది. దేశ సంపదను దోచుకునే వారికి ఇదో కీలకమైన గుణపాఠం. ఎట్టకేలకు బిహార్ ప్రజలకు న్యాయం జరిగింది’ అని షానవాజ్ పేర్కొన్నారు. రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైందని.. రాజకీయ నేతలు ఇకపై తప్పు చేసేందుకు భయపడాల్సిందేనని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి పేర్కొన్నారు. లాలూ అరెస్టయినంత మాత్రాన ఆర్జేడీతో సంబంధాలు తగ్గే ప్రసక్తే లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. లౌకికవాదం, సామాజిక న్యాయం కోసం తమ పోరాటం సాగుతుందని వెల్లడించింది. కాగా, బీజేపీ, నితీశ్ కుమార్ కుట్రపన్ని మరీ లాలూను జైలుకు పంపారని ఆర్జేడీ ఆరోపించింది. బెయిల్ కోసం హైకోర్టుకెళ్తామని లాలూ కుమారుడు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తెలిపారు. జైలుకు రెండోసారి దాణా కుంభకోణంలో లాలూ జైలు శిక్ష అనుభవించటం ఇది రెండోసారి. 21 ఏళ్ల క్రితం దేవగఢ్ ట్రెజరీ నుంచి రూ.89.27 లక్షల నిధులను అక్రమంగా తీసుకున్నారనే కేసుపై లాలూ జైలుకెళ్తుండగా.. దంకా ట్రెజరీ నుంచి రూ.3.97 కోట్లు, చైబాసా ట్రెజరీ నుంచి రూ.36 కోట్లు, దోరండా ట్రెజరీ నుంచి రూ. 184 కోట్లు అక్రమంగా కొల్లగొట్టారనే 3 కేసుల్లోనూ లాలూ విచారణ ఎదుర్కొంటున్నారు. 1996లో పట్నా హైకోర్టు దాణా స్కామ్పై విచారణకు ఆదేశించగా.. దేవ్గఢ్ ట్రెజరీకి సంబంధించిన కేసులో 1997, అక్టోబర్ 27న 38 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. కాలక్రమేణా 11 మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. -
ప్లీజ్.. తక్కువ శిక్ష విధించండి: లాలూ
రాంచీ: అనారోగ్యం, వయోభారం దృష్టిలో ఉంచుకుని మానవీయ కోణంలో తనకు తక్కువ శిక్ష విధించాలని బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సీబీఐ కోర్టు న్యాయమూర్తిని కోరారు. దాణా కుంభకోణం కేసులో డిసెంబర్ 23 నుంచి బిర్సా ముండా జైలులో ఉంటున్న లాలూను సీబీఐ జడ్జి శివపాల్ సింగ్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. తుది తీర్పు శనివారం చెప్తామని జడ్జి తమకు తెలియజేసినట్లు లాలూ తరఫు న్యాయవాది చిత్తరంజన్ చెప్పారు. అయితే, తనకు తక్కువ శిక్ష విధించాలంటూ జడ్జికి లాలూ లిఖితపూర్వకంగా విజ్ఞప్తి పంపారని లాయర్ తెలిపారు. దియోగర్ ట్రెజరీ నుంచి రూ.89.27లక్షలు అక్రమంగా డ్రా చేసిన కేసుకు సంబంధించి లాలూతోపాటు మరో 10 మందిపై కోర్టు విచారణ ఇప్పటికే పూర్తి చేసింది. -
సంచలన కేసు : లాలూకు శిక్ష ఖరారు వాయిదా
రాంచి : దావా కుంభకోణం కేసులో దోషిగా తేలిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ శిక్ష ఖరారు రేపటికి(గురువారానికి) వాయిదా పడింది. లాలూతో పాటు ఈ కుంభకోణంలో దోషిగా తేలిన 15 మందికి రేపే శిక్ష ఖరారు చేయనున్నట్టు సీబీఐ ప్రత్యేక కోర్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దావా కుంభకోణం రెండో కేసులో వీరందరిని గతేడాది డిసెంబర్ 23న దోషులుగా తేలుస్తూ సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు ప్రకటించిన సంగతి తెలిసిందే. న్యాయవాది విందేశ్వరి ప్రసాద్ మరణించడంతో అతడి కేసు తీర్పును గురువారానికి వాయిదా వేస్తున్నట్లు రాంచీ స్పెషల్ సీబీఐ కోర్టు తెలిపింది. మరోవైపు ఈ కేసు విషయంలో కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడ్డారంటూ రఘువన్ష్ ప్రసాద్ సింగ్, తేజస్వి యాదవ్, మనోజ్ ఝాలకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వీరు ముగ్గురు ఈ నెల 23న కోర్టుకు హాజరుకావాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు నోటీసులు పంపింది. దీనిపై స్పందించిన మనోజ్ ఝా ఈ కేసు తీర్పు గురించి తాము ఒక్క మాట మాట్లాడకపోయినా కోర్టు తమకు నోటీసులు పంపడం దారుణమని అన్నారు. దోషిగా తేలిన అనంతరం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ రాంచిలోని బిర్సా ముంద్రా సెంట్రల్ జైలులో ఉన్నారు. దావా కుంభకోణం తొలి కేసులో కూడా లాలూ దోషిగా తేలారు. కానీ సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం రెండో కేసు విచారణలోనూ లాలూ దోషే అని తేలింది. మొత్తం ఈ కుంభకోణానికి సంబంధించి 5 కేసులు నమోదయ్యాయి. 1991-96 కాలంలో దియోగఢ్(ప్రస్తుతం జార్ఖండ్లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.84.5 లక్షలకుపైగా అక్రమంగా డ్రాచేశారు. లాలూతో పాటు 22 మందిపై సీబీఐ అభియోగాలు దాఖలు చేసింది. 1997, అక్టోబర్ 27న దీనిపై సీబీఐ చార్జిషీట్ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. -
దాణా కేసులో లాలూ దోషి
-
సంచలన తీర్పుపై లాలూ స్పందన
రాంచీ : దాణా కుంభకోణం కేసులో సీబీఐ వెలువరిచిన సంచలన తీర్పుపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. తనను దోషిగా తేల్చడంపై లాలూ బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ డర్టీ గేమ్ ఆడుతుందంటూ విమర్శల వర్షం కురిపించారు. కోర్టు తీర్పు ఏకపక్షంగా ఉందని.. న్యాయకోసం తమ పోరాటం కొనసాగిస్తామంటూ పేర్కొన్నారు. చివరికి న్యాయమే గెలుస్తుందంటూ చెప్పుకొచ్చారు. నిజం చెప్పులేసుకునే లోపే.. అబద్ధం సగం ప్రపంచాన్ని చుట్టి వస్తుందంటూ ఆరోపించారు. కోర్టు తీర్పు ఓ రాజకీయ ఎత్తుగడ మాత్రమే అంటూ లాలూ ప్రసాద్ పార్టీ ఆర్జేడీ కూడా మండిపడుతోంది. సాక్ష్యాలను తారుమారు చేశారని, ఈ కేసులో న్యాయం కోసం హైకోర్టుకు వెళ్తామంటూ పేర్కొంది. కాగ, నేడు వెలువరిచిన దాణ కుంభకోణం కేసులో లాలూని సీబీఐ స్పెషల్ కోర్టు దోషిగా తేల్చింది. లాలూతో పాటు 15 మందిని దోషులుగా తేల్చింది. లాలూ ప్రసాద్ యాదవ్ను కోర్టులోనే అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. రాంచీ జైలుకు ఆయన్ను తరలించనున్నారు. జనవరి 3న లాలూకు శిక్ష ఖరారు చేయనున్నారు. 1991-96 కాలంలో దియోగఢ్(ప్రస్తుతం జార్ఖండ్లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.84.5 లక్షలకుపైగా అక్రమంగా డ్రా చేసిన క్రమంలో సీబీఐ ఈ కేసు నమోదుచేసింది. 1997, అక్టోబర్ 27న దీనిపై సీబీఐ చార్జిషీట్ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. -
దాణా స్కామ్ కేసులో సంచలన తీర్పు
-
దాణా కుంభకోణం కేసులో సంచలన తీర్పు
రాంచీ : దాణా కుంభకోణం కేసులో బిహార్ బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ను దోషిగా తేల్చుతూ రాంచీలోని సీబీఐ స్పెషల్ కోర్టు శనివారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువడే క్రమంలో లాలూ ప్రసాద్ యాదవ్, తన కొడుకు తేజస్వి యాదవ్తో కలిసి కోర్టుకు హాజరయ్యారు. ఆర్జేడీ కార్యకర్తలు కూడా భారీ ఎత్తున్న కోర్టు వచ్చారు. రెండు దశాబ్దాల అనంతరం ఈ కేసుపై నేడు సీబీఐ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. అయితే బిహార్ మరో మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. జగన్నాథ్ మిశ్రాతో పాటు ఏడుగురిని నిర్దోషులు ప్రకటించగా.. లాలూతో సహా 15 మందిని దోషులుగా తేల్చింది. లాలూ ప్రసాద్ యాదవ్ను కోర్టులోనే అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. రాంచీ జైలుకు ఆయన్ను తరలించనున్నారు. జనవరి 3న లాలూకు శిక్ష ఖరారు చేయనున్నారు. 2013లో ఓ కేసులో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష పడగా.. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు పడింది. ఇప్పటికే అనర్హత వేటు ఎదుర్కొంటున్న లాలూకు ఈ తీర్పు మరింత ప్రతికూలంగా మారింది. 1991-96 కాలంలో దియోగఢ్(ప్రస్తుతం జార్ఖండ్లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.84.5 లక్షలకుపైగా అక్రమంగా డ్రాచేసినట్లు బిహార్ మాజీ సీఎంలు లాలూ, జగన్నాథ మిశ్రాలతో సహా 22 మందిపై సీబీఐ అభియోగాలు దాఖలు చేసింది. 1997, అక్టోబర్ 27న దీనిపై సీబీఐ చార్జిషీట్ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. -
కేంద్రం మెడకు '2జీ'!
న్యూఢిల్లీ: తాజాగా 2జీ స్పెక్ట్రమ్ కేసు తీర్పుతో కేంద్ర ప్రభుత్వం చిక్కుల్లో పడేటట్లు కనిపిస్తోంది. 2జీ కుంభకోణం కేసు అంతా ఊహాజనితమేనని, అభియోగాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేనందున అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పునివ్వటం తెలిసిందే. దీంతో 2జీ కుంభకోణం కేసులో అభియోగాలు ఎదుర్కొన్న వారితోపాటు, సుప్రీంకోర్టు తీర్పు కారణంగా టెలికం లైసెన్స్లు కోల్పోయిన కంపెనీలు పరిహారం కోరుతూ న్యాయబాట పట్టే అవకాశాలు లేకపోలేదని న్యాయనిపుణులు అంటున్నారు. టెలికం వివాదాల పరిష్కార అప్పిలేట్ ట్రిబ్యునల్కు (టీడీ శాట్) లేదా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ను ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. లూప్ టెలికం... 2జీ కేసులో వాదించిన న్యాయనిపుణుల అభిప్రాయాల ప్రకారం... లూప్ టెలికం కంపెనీ తాను దేశవ్యాప్త లైసెన్స్ కోసం చెల్లించిన రూ.1,658 కోట్లను తిరిగి చెల్లించాలని కోరుతూ 2012లోనే టీడీ శాట్ను ఆశ్రయించింది. 22 టెలికం సర్కిళ్లకూ కలిపి దేశవ్యాప్త లైసెన్స్ ఫీజు రూ.1,658 కోట్లుగా ఉంది. ఈ ఫీజుతోపాటు లైసెన్స్ రద్దు చేసిన దరిమిలా తమ ప్రతిష్టకు జరిగిన నష్టానికి గాను మరో రూ.1,000 కోట్లు కూడా ఇప్పించాలని లూప్ టెలికం డిమాండ్ చేసింది. ఈ వాదనను టీడీ శాట్ కొట్టేసింది. ‘మీపై నేరపూరిత విచారణ’ పెండింగ్లో ఉందని టీyీ శాట్ నాడు పేర్కొంది. నిర్ధోషులు అంటూ ఇప్పుడు సీబీఐ ప్రత్యేక కోర్టు క్లీన్చిట్ ఇచ్చినందున ఈ సంస్థ మరోసారి పరిహారం కోసం డిమాండ్ చేసే అవకాశాలున్నాయి. టెలినార్, ఎతిసలాట్ కూడా... విదేశీ టెలికం సంస్థలైన టెలినార్, ఎతిసలాట్, లూప్ టెలికంలో ఇన్వెస్ట్ చేసిన విదేశీ సంస్థలు (ఇందులో కొన్ని గతంలో ఆర్బిట్రేషన్కు ప్రయత్నించాయి) కూడా పరిహారం కోరే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ద్వైపాక్షిక పెట్టుబడుల ఒడంబడికలకు లోబడి ఆర్బిట్రేషన్ మార్గాన్ని చాలా వరకు విదేశీ కంపెనీలు ఎంచుకునే అవకాశాలున్నాయని ఓ న్యాయవాది అభిప్రాయం తెలిపారు. టెలికం కార్యకలాపాల కోసం చేసిన పెట్టుబడులు, గడువు ప్రకారం కార్యకలాపాలు ప్రారంభించలేకపోయినందున ప్రభుత్వానికి చెల్లించిన పెనాల్టీలతోపాటు పరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. భారత్లో టెలికం వ్యాపారంపై భారీగా ఇన్వెస్ట్ చేసిన టెలినార్ కూడా గతంలో కేంద్ర సర్కారుకు నోటీసులు జారీ చేసింది. 1.4 బిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని సింగపూర్తో మన దేశం చేసుకున్న సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం కింద కోరింది. రద్దయిన స్పెక్ట్రమ్ కోసం చేసిన చెల్లింపులను తిరిగి వెనక్కిచ్చేందుకు కేంద్రం అంగీకరించడంతో నోటీసును వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత టెలినార్ పలు సర్కిళ్లలో మళ్లీ లైసెన్స్లు దక్కించుకుంది. చివరికి తన వ్యాపారాన్ని భారతీ ఎయిర్టెల్కు అమ్మేసి వెళ్లిపోయిన టెలినార్ భారత్లో వ్యాపారం కారణంగా రూ.10,000 కోట్లను నష్టం కింద రద్దు చేసుకుంది. అలాగే, లూప్ టెలికంలో పెట్టుబడులు పెట్టిన ఖైతాన్ హోల్డింగ్స్ అయితే, 2జీ లైసెన్స్లను రద్దు చేసిన కారణంగా తమకు 2.5 బిలియన్ డాలర్లను నష్ట పరిహారం కింద చెల్లించాలని కోరుతూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ను ఆశ్రయించింది. తుది తీర్పు అనంతరమే... ‘‘పరిహారం కోసం కేసుల నమోదుకు ఈ తీర్పు వీలు కల్పిస్తుంది. కాకపోతే, అదంతా తుది తీర్పు తర్వాతే వీలవుతుంది. ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని ఇప్పటికే నిర్ణయించింది. కనుక కంపెనీలు దేశంలో వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించొచ్చు’’ అని ఓ టెలికం కంపెనీకి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. సుప్రీం తీర్పునకు భిన్నంగా... ఐదేళ్ల క్రితం సుప్రీంకోర్టు 122 లైసెన్స్లను రద్దు చేసింది. అయితే, తాజాగా సీబీఐ కోర్టు తీర్పు, సుప్రీం తీర్పులోని అంశాలను ప్రతిఫలించడం లేదని మరి కొందరు న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన లైసెన్స్ల కేటాయింపు అన్నది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఉల్లంఘన అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిష్పక్షపాతంగా ఉందని అద్వైతా లీగల్ సంస్థ పార్ట్నర్ అతుల్దువా అన్నారు. ప్రజలకు ధర్మకర్త అయిన ప్రభుత్వం సహజన వనరులను మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదిక పేరుతో అసమంజసంగా పంపిణీ చేసిందని సుప్రీంకోర్టు నాటి తీర్పులో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. -
2జీ స్కామ్ లేకపోతే మోదీ, కేజ్రివాల్ ఎక్కడుండేవారు!?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో రాజకీయంగా, ఆర్థికంగా ప్రకంపనలు సష్టించిన ‘2జీ స్పెక్ట్రమ్’ స్కామ్ కేసుపై ఏళ్ల తరబడి సుదీర్ఘంగా విచారణ జరిపిన అనంతరం ఇందులో స్కామూ లేదు, గీము లేదంటూ ప్రత్యేక సీబీఐ కోర్టు తేల్చి చెప్పడం పట్ల సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తం అవుతోంది. ఈ స్కామ్ వల్ల కేంద్ర ప్రభుత్వం ఖజానాకు దాదాపు 1.76 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక పేర్కొనడం, ఇదే స్కామ్పై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని పురస్కరించుకొని 122 టెలికామ్ లైసెన్స్లను సుప్రీం కోర్టు రద్దు చేయడం సంగతి ఏమిటీ? 122 టెలికామ్ లైసెన్స్లను రద్దు చేయడం వల్ల అనేక కంపెనీలు నష్టపోయాయి. కొన్ని కంపెనీలు పూర్తిగా దివాలాతీసి కంపెనీలనే మూసివేశాయి? వాటి సంగతేమిటీ? వాటికి జరిగిన నష్టాన్ని ఇప్పుడు ఎవరు భర్తీ చేస్తారు? అందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? లైసెన్స్ల రద్దు ప్రభావం 5.3 కోట్ల టెలిఫోన్ కనెక్షన్లపై ప్రభావం చూపిందన్నది ఓ అంచనా. ఆ నష్టానికి ఎవరు బాధ్యులు ? టైమ్ మేగజైన్ పది అత్యంత అధికార దుర్వినియోగం కేసుల్లో ఒకటిగా పేర్కొన్న ‘2జీ స్పెక్ట్రమ్’ కారణంగా అప్రతిష్టపాలైన యూపీఏ ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? కేవలం ఈ కుంభకోణం కారణంగానే అవినీతి నిర్మూలన నినాదంతో 2014 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు రావడం, ఆ పార్టీకి ప్రజలు పట్టం కట్టారన్న విషయం తెల్సిందే. ఇలా ఓ ప్రభుత్వాన్నే మార్చేసిన కుంభకోణం కేసులో ఏమీ లేదని కోర్టు తేల్చడం వల్ల ఏర్పడిన శూన్యాన్ని ఎవరు భర్తీ చేశారు ? 2జీ స్కామ్ కారణంగానే దేశంలోని అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించిన అన్నా హజారే ఇప్పుడు కోర్టు తీర్పు సరైనదేనంటూ సమర్థించడం ఎంతవరకు సబబు? ఆయన ఉద్యమం నుంచే అరవింద్ కేజ్రీవాల్, ఆయన పార్టీ పుట్టుకొచ్చిన విషయం తెల్సిందే. అసలు 2జీ స్కామ్ అనేది అప్పుడే లేకపోతే నేడు ప్రధానిగా మోదీ, ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రివాల్ ఉండేవారు కాదేమో! -
బొగ్గు స్కామ్లో మధు కోడాను దోషిగా తేల్చిన కోర్టు
-
మాజీ ముఖ్యమంత్రిని దోషిగా తేల్చిన కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా ప్రకటించింది. బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్సీ గుప్తా, జార్ఖండ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసులతో పాటుగా మరొకరిని కోర్టు బుధవారం దోషులుగా తేల్చింది. కోర్టు వీరిని రేపు (గురువారం) శిక్షలు ఖరారు చేయనుంది. కాగా కోల్కతాకు చెందిన సంస్థకు బొగ్గు బ్లాకుల కేటాయింపునకు సంబంధించి కోడాతో పాటు మాజీ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసు, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్సీ గుప్తా, మరో ఐదుగురిపైనా చార్జిషీట్ దాఖలు అయిన విషయం తెలిసిందే. -
శశికళ భర్తకు జైలు శిక్ష : వెంటనే ఆస్పత్రి పాలు
సాక్షి, చెన్నై : శశికళ భర్త నటరాజన్ మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. పన్ను ఎగవేత కేసులో ట్రయల్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సమర్థిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఆయన మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. దీంతో నటరాజన్ను వెనువెంటనే ఆస్పత్రికి తరలించారు. నటరాజన్ ఇటీవలే చెన్నై హాస్పిటల్లో కిడ్నీ ఆపరేషన్తో పాటు, కాలేయ మార్పిడి చేయించుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఏ వ్యాధితో ఆసుపత్రి పాలయ్యారో ఇంకా తెలియరాలేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత పదవిలో ఉన్న కాలంలో నటరాజన్ తమిళనాడు ప్రభుత్వంలో బ్యూరోక్రాట్గా పనిచేసేవారు. అనంతరం నటరాజన్, శశికళ ఇద్దరూ పోయెస్ గార్డెన్లోకి మారిపోయారు. నటరాజన్తో పాటు మరో ముగ్గురు కూడా కుట్ర, మోసం, ఫోర్జరీ, పన్ను ఎగవేతలకు పాల్పడ్డారని తెలిసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కొత్త కారు సెకండ్హ్యాండ్ అని చెప్పి కస్టమ్ శాఖను మోసగించడంతో నటరాజన్తో పాటు, శశికళ అక్క కుమారుడు భాస్కరన్, మరో ఇద్దరికీ సీబీఐ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షలను మద్రాస్ హైకోర్టు సమర్థించింది. 1994 సెప్టెంబర్ 6వ తేదీన నటరాజన్ లండన్ నుంచి లెక్సెస్ అనే లగ్జరీకారును తమిళరసి పబ్లికేషన్ పేరిట దిగుమతి చేసుకున్నారు. కాగ, తమిళనాడు మాజీ సీఎం జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్లోని వేద నిలయంలో శుక్రవారం రాత్రి ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జయ, శశికళ వ్యక్తిగత గదుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. -
టీడీపీ నేత ‘కందికుంట’కు ఐదేళ్ల జైలు
సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ)లతో రూ.కోట్లు డ్రా చేసుకున్న కేసులో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ ఇన్చార్జి కందికుంట వెంకట ప్రసాద్కు ఇక్కడి సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. అదే సమయంలో రూ.5.10 లక్షల జరిమానా కూడా విధించింది. ఇదే కేసులో ఎస్బీఐ హుస్సేనీఆలం బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ నరసింగరావుకు ఐదేళ్లు జైలుశిక్ష, రూ.45 వేల జరిమానా, అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ వెంకటమోహన్కు మూడేళ్ల జైలుశిక్ష, రూ.35 వేల జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. గతంలో హైదరాబాద్ సనత్నగర్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)ను కూడా ఇదే రీతిలో మోసం చేసిన కేసులో కందికుంటకు ఏడేళ్ల జైలుశిక్ష వి«ధిస్తూ 2016లో కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కేసు పూర్వాపరాలివీ..: కాగా 2003లో ఎస్బీఐ హుస్సేనీఆలం బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసిన నరసింగరావు ఉన్నతాధికారులకు తెలియకుండా బ్యాంకు నుంచి ఖాళీ డీడీలు తీసుకొచ్చారు. వీటిని ఆ ప్రాంతంలో ఎస్.ఐ.గాపనిచేస్తున్న వెంకటమోహన్కు ఇచ్చారు. వాటిని ఆయన కందికుంట ప్రసాద్కు అందచేశారు. ఈ ఖాళీ డీడీలతో పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేయాలన్న కుట్రకు కందికుంట తెరతీశారు. ఆ డీడీల్లో కొన్నింటిని నగదుగా మార్చుకోకపోవడంపై అనుమానం వచ్చిన బ్యాంకు మేనేజర్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. తీర్పు అనంతరం నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: డీడీల ఫోర్జరీ కేసులో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్కు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. కందికుంటతో పాటు మరో ఇద్దరికి జైలుశిక్ష విధించింది సీబీఐ కోర్టు. వివరాలివి.. హుస్సేనీ అలం ఎస్బీఐలో నకిలీ డీడీలతో మోసం చేసినట్లు కందికుంటపై ఆరోపలున్నాయి. ఈ కేసును సీబీఐ కోర్టు విచారణ చేసింది. కందికుంటతోపాటు అసిస్టెంట్ మేనేజర్ నర్సింగరావుకు ఐదేళ్లు శిక్ష, ఇన్స్పెక్టర్ వెంకటమోహన్కు మూడేళ్లు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. కందికుంట వెంకట ప్రసాద్ 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కదిరి నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష
-
నవంబర్ 6 నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక, ప్రజావ్యతిరేక విధానాలు, హామీల అమలులో పూర్తి వైఫల్యంతో అన్ని వర్గాల ప్రజలు కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న నేపథ్యంలో... వారికి అండగా ఉంటూ భరోసా కల్పించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన పాదయాత్ర నవంబర్ ఆరో తేదీనుంచి ప్రారంభం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర ప్రజలకు భరోసాగా తాను పాదయాత్ర చేస్తున్నందున ఆరునెలల పాటు కోర్టుకు వ్యక్తిగత హాజరునుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టును అభ్యర్థించారు. అందుకు అనుమతించని సీబీఐ కోర్టు ప్రతి శుక్రవారం హాజరుకావాలని సోమవారం పేర్కొంది. ఈ నేపథ్యంలో పాదయాత్ర చేపట్టేందుకు ముందు నిర్ణయించిన రెండో తేదీ గురువారం కావడం, మరునాడే శుక్రవారం రావడంతో యాత్ర తేదీలో స్వల్ప మార్పులు చేసినట్లు పార్టీవర్గాల సమాచారం. చేపట్టిన మరునాడే పాదయాత్ర నిలిచిపోయేలా కాకుండా మూడు, నాలుగు రోజులు కొనసాగింపు ఉండేందుకు వీలుగా నవంబర్ ఆరో తేదీ నుంచి యాత్రను చేపట్టాలని పార్టీ నిర్ణయించిందని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. ఈ మేరకు జగన్ పాదయాత్రకు రెండు రోజుల ముందు తిరుమలకు వెళ్లి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, అనంతరం కడప దర్గా, కడప చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం పాదయాత్రను చేపట్టనున్నారని ఆయన వివరించారు. జగన్ పిటిషన్ కొట్టివేత సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 2 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రతీ శుక్రవారం జరిగే విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపునివ్వాలన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభ్యర్థనను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. ప్రతీ శుక్రవారం జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో కేసులపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రతీ శుక్రవారం విచారణ జరుపుతోంది. ఈ విచారణకు జగన్తో పాటు మిగిలిన వారందరూ వ్యక్తిగతంగా హాజరు కావాల్సి వస్తోంది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలతో పాటు సామాన్యుల కష్టనష్టాలను తెలుసుకునేందుకు నవంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో తనకు ఆరు నెలల పాటు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ జగన్ ఇటీవల సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు తన బదులు తన న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతినివ్వాలని సీఆర్పీసీ సెక్షన్ 371 కింద దాఖలు చేసిన పిటిషన్లో కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపి తీర్పును వాయిదా వేసిన ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తన నిర్ణయాన్ని వెలువరించింది. -
అక్టోబర్ 25న తేలనున్న స్పెక్ట్రమ్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీః 2జీ స్పెక్ట్రం కేసులు ఎట్టకేలకు కొలిక్కివచ్చాయి. ఈ కేసుల్లో తుది విచారణను సీబీఐ కోర్టు అక్టోబర్ 25న చేపట్టనుంది. స్పెక్ట్రం కేటాయింపుల కేసులో మాజీ టెలికాం మంత్రి ఏ రాజా, డీఎంకే రాజ్యసభ సభ్యులు కనిమొళి ఇతరులు నిందితులుగా ఉన్నారు. కేసులో సమర్పించిన పత్రాలు భారీగా ఉండటం, సాంకేతిక అంశాలతో ముడిపడిన క్రమంలో వీటిని ఇంకా పరిశీలించాల్సి ఉందని విచారణను వాయిదా వేస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ పేర్కొన్నారు. తదుపరి విచారణ సందర్భంగా తీర్పును ఎప్పుడు వెలువరించేదీ వెల్లడిస్తామని చెప్పారు. స్పెక్ర్టం కేసులకు సంబంధించి రెండు వేర్వేరు కేసులను కోర్టు విచారిస్తుంది. వీటిలో ఒక కేసును సీబీఐ, మరో కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు నిర్వహించాయి. ఏప్రిల్ 26న కోర్టులో ఈ కేసులపై తుది వాదనలు ముగిశాయి. 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో మాజీ మంత్రి రాజా కొన్ని టెలికాం సంస్థల పట్ల పక్షపాత వైఖరి ప్రదర్శించడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపిస్తోంది. -
నేను నపుంసకుడిని: గుర్మీత్
-
నేను నపుంసకుడిని: గుర్మీత్
సాక్షి, న్యూఢిల్లీ/చండీగఢ్ : అత్యాచారాల కేసులో 20 ఏళ్ల జైలుశిక్షకు గురైన ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్ఛా సౌధా అధినేత గుర్మీత్ సింగ్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడించాడు. కీలకాంశం ఏంటంటే.. శిక్ష నుంచి బయటపడేందుకు తానో నపుంసకుడినని ఈ రాక్స్టార్ బాబా చెప్పుకున్నారు. అయితే తాను 1990 నుంచి నపుంసకుడిగా మారానని, అలాంటిది 1999 ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో తాను ఇద్దరు మహిళలను అత్యాచారం చేశానన్నది అసత్య ప్రచారమేనని పేర్కొన్నారు. అసలు ఆ ఆరోపణల్లో ఇసుమంతైనా నిజంలేదని సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణలో భాగంగా జస్టిస్ జగ్దీప్ కుమార్కు ఆయన చెప్పుకొచ్చారు. తాను అమాయకుడినని, ఎలాంటి తప్పులు చేయలేదని న్యాయమూర్తికి విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోయింది. గుర్మీత్ చెప్పేవన్నీ అసత్యాలేనని సీబీఐ న్యాయస్థానం గుర్తించింది. మీకు ఇద్దరు కూతుళ్లున్నారు కదా.. దీనిపై మీ సమాధానం ఏంటని ప్రశ్నించగా గుర్మీత్ మౌనం వహించినట్లు సమాచారం. ఆపై ఈ కేసులో బాధితురాలు గుర్మీత్ గురించి మరిన్ని విషయాలు తెలిపారు. అశ్రమంలో తమపై జరిగిన లైంగిక దాడుల గురించి ఇంట్లో వాళ్లకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్మీత్ బెదిరించేవారని చెప్పారు. కుటుంబ సభ్యులను హత్య చేయిస్తానని పలుమార్లు హెచ్చరించినట్లు కోర్టుకు బాధితురాలు వెల్లడించారు. నిందితుడు బాబాకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నట్లు చెప్పడంతో పాటు బాధితురాలి ఫిర్యాదు వివరాలను పరిశీలించిన తర్వాతే సీబీఐ కోర్టు గుర్మీత్కు 20 ఏళ్ల జైలుశిక్షతో పాటుగా ఒక్కో కేసులో రూ. 15 లక్షల చొప్పున జరిమానా విధించిన విషయం తెలిసిందే. -
ఈ ఉన్మాదం ఇంకెన్నాళ్లు?
విశ్వాసాలతో ముడిపడిన హింసకు సంబంధించి నెలరోజుల వ్యవధిలో మూడోసారి ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడవలసి వచ్చింది. ప్రత్యేకించి హరియాణా, పంజాబ్, ఢిల్లీల్లో భయానక హింస జరగడానికి కారణమైన బాబా గుర్మీత్ సింగ్ ఉదంతంలో ఆయన మూడు రోజుల వ్యవధిలోనే రెండో దఫా మాట్లాడక తప్ప లేదు. విశ్వాసాల కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఏ ఒక్కరికీ లేదని ‘మన్ కీ బాత్’లో జాతినుద్దేశించి మాట్లాడుతూ హెచ్చరించారు. ఏ దేశంలోనైనా పౌరు లందరికీ సమానంగా వర్తించే చట్టాలే ఉంటాయి. ఆ చట్టాలను ఎంత ఉన్నతస్థాయి లోని వారైనా, సామాన్యులైనా గౌరవించాల్సిందే. అవి తమకు వర్తించబోవని చెప్పినా, ఆ చట్టాలున్న సంగతే తమకు తెలియదని చెప్పినా అది చెల్లదు. ఒక వ్యక్తి లేదా గుంపు చట్టాన్ని ఉల్లంఘించే అవకాశం ఉన్నదని సమాచారం అందినప్పుడు దాన్ని నిరోధించడం... అయినా చోటు చేసుకుంటే తగిన విధంగా స్పందించి చర్య లకు ఉపక్రమించడం శాంతిభద్రతల యంత్రాంగం చేయాల్సిన పని. ఇదంతా సవ్యంగా అమలవుతున్న చోట ఎవరూ వికృత పోకడలకు పోయే ప్రయత్నం చేయరు. సాధారణ పౌరుల్లో సైతం ప్రభుత్వాలపట్ల నమ్మకమూ... చట్టాలంటే గౌరవమూ ఏర్పడతాయి. కానీ డేరా సచ్చా సౌదా అధిపతి బాబా గుర్మీత్సింగ్ రెండు అత్యాచారం కేసుల్లో, ఒక హత్య కేసులో శిక్షార్హుడని చెప్పిన వెంటనే మూడు రాష్ట్రాలు భగ్గున మండాయి. 38మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా వందలాదిమంది గాయపడ్డారు. భారీయెత్తున ఆస్తులు విధ్వంస మయ్యాయి. హింసోన్మాదం ఏ స్థాయిలో ఉన్నదంటే నేరస్తుడికి ఎంత శిక్ష పడిందో ప్రకటించడానికి సోమవారం న్యాయస్థానమే జైలుకు తరలవలసి వచ్చింది. పంజాబ్, హరియాణాల్లో ఇంటర్నెట్ సేవలను నిషేధించారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునివ్వడానికి మూడు రోజుల ముందునుంచే హరియాణా, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంభాషించడం ప్రారంభించారు. ముందు జాగ్రత్త చర్యలను సూచించారు. కానీ జరి గిందేమిటి? వందలాదిమంది వీధుల్లోకొచ్చి వీరంగం వేస్తుంటే ప్రభుత్వాలు నిస్సహాయమయ్యాయి. పంజాబ్ ఎంతో కొంత నయం. హరియాణా అయితే పూర్తిగా చేష్టలు డిగిపోయింది. ఇలాంటి దుస్థితి అంతర్జాతీయంగా మన పరువును బజారుకీడుస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే నరేంద్రమోదీ అంతగా స్పందిం చారు. హింసాకాండ చెలరేగిన శుక్రవారం రాత్రే ఆయన మూడు ట్వీట్లు చేశారు. హింసను తీవ్రంగా ఖండించడంతోపాటు పరిస్థితిని ప్రభుత్వం సమీక్షిస్తున్నదని ప్రజలకు హామీ ఇచ్చారు. రెండోసారి ఆదివారం ‘మన్ కీ బాత్’లో ఆయన పరోక్షంగా డేరా విధ్వంసాన్ని ప్రస్తావించారు. తప్పు చేసినవారిని వదిలేది లేదని హెచ్చరించారు. గత నెలలో ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో సైతం ఆవు పేరిట వివిధ ప్రాంతాల్లో సాగుతున్న దాడుల గురించి ఆందోళన వ్యక్తంచేశారు. గాంధీ పుట్టిన గడ్డపై జన్మిం చామన్న స్పృహను కూడా ఈ హింసకు పాల్పడేవారు కోల్పోతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వాలు పకడ్బందీగా ఉన్నచోట, చట్టపాలన సవ్యంగా సాగుతున్నచోట ప్రైవేటు వ్యక్తులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే సాహసం చేయరు. అది లేకపోబట్టే కొందరు చెలరేగుతున్నారు. సాక్షాత్తూ డిప్యూటీ అడ్వొకేట్ జనరల్ స్థాయిలో ఉన్న వ్యక్తి శిక్షపడిన గుర్మీత్తో కలిసి న్యాయస్థానానికి రావడం మాత్రమే కాదు... ఆయనగారి సూట్కేసును కూడా మోశారంటే కారణమెవరు? గుర్మీత్ను అదుపులోకి తీసుకోవడానికెళ్లిన పోలీసులను ఆయనకు భద్రత కల్పిస్తున్న కమాండోలు ప్రతిఘటించడం దేన్ని సూచిస్తోంది? స్వయంగా కేంద్ర హోంమంత్రి చాలా ముందుగా సీఎంలతో మాట్లాడినా ఫలితం లేకపోవడం ఎందువల్ల? అన్నిటికీ ఒకటే జవాబు... పాలకులు సక్రమంగా లేకపోవడం వల్ల! పదిహేనేళ్ల క్రితం అప్పటి ప్రధాని వాజపేయికి ఇద్దరు మహిళలు రాసిన లేఖ రాస్తే, దానిపై విచారణ జరిపించాలని ఆయన సీబీఐకి ఆదేశాలిస్తే నేరగాడికి శిక్ష పడటానికి ఇన్నేళ్లుపట్టింది. ఈలోగా ఆ ఇద్దరు మహిళలకూ సాయపడ్డాడన్న అనుమానంతో డేరా సంస్థల వ్యవహారాలు చూసే మేనేజర్ ఒకరిని ‘గుర్తు తెలియని వ్యక్తులు’ హతమార్చారు. ఆ ఉదంతంపై పరిశోధన సాగించే పాత్రికేయుడు సైతం అదే తరహాలో ప్రాణాలు కోల్పోయాడు. వీటితోపాటు అనేక ఘటనలకు సంబంధించి నమోదైన కేసుల్లో గుర్మీత్ నిందితుడు. కానీ పాలకులుగా ఉన్నవారు మాత్రం ఈ పదిహేనేళ్లనుంచీ ఆయన ఆశ్రమం ముందు సాగిలపడ్డారు. నోరారా కీర్తించారు. ఆయనతో వేదికలు పంచుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నరరూప రాక్షసుడు నయీముద్దీన్తో అధికారంలో ఉన్నవారు అంటకాగినట్టే ఇదంతా సాగింది. స్వయంగా వాజపేయి స్థాయి నాయకుడే తనకొచ్చిన ఫిర్యాదులు చూసి ఆందో ళనపడి విచారణకు ఆదేశించినా ఆ పార్టీకి చెందిన నేతలకు జ్ఞానోదయం కాలేదు. అప్పట్లో విపక్షంగానూ, ఆ తర్వాత అధికార పక్షంగానూ ఉన్న కాంగ్రెస్ నేతలు సైతం అలాగే ప్రవర్తించారు. కనీసం శిక్షపడ్డాకైనా గుర్మీత్ ప్రవర్తనను తప్పు బట్టలేకపోయారు సరిగదా...బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ ఆయన ‘గొప్ప ఆత్మ’ అంటూ పొగిడారు. గోరక్షణ పేరుతో ఏర్పడి, హింసకు పాల్పడే బృందాలకు సైతం ఇలాంటి ప్రశంసలే లభిస్తున్నాయి. అందువల్లే ప్రధాని పదేపదే చెప్పినా ఫలితం ఉండటం లేదు. హింసకు పాల్పడేవారిని వెనువెంటనే అరెస్టు చేయలేక పోవడం, చేసినా కఠినమైన సెక్షన్లకింద కేసులు పెట్టలేకపోవడం చాలాచోట్ల కనబడుతోంది. కనుక ప్రకటనలతో సరిపెట్టకుండా సీఎంల, హోంమంత్రుల సమావేశం ఏర్పాటుచేసి చట్టబద్ధ పాలనపై శ్రద్ధవహించాలన్న సంగతి ప్రధాని గుర్తుచేయాలి. పార్టీలకతీతంగా వ్యవహరించమని హితవుచెప్పాలి. సంతృప్తిక రంగా లేనివారి లోపాలు ఎత్తి చూపాలి. లేనట్టయితే ఇలాంటి ఉదంతాలకు అంతూ పొంతూ ఉండదు. -
గుర్మీత్కు జైలు: అనూహ్య మలుపు
-
గుర్మీత్కు జైలు: అనూహ్య మలుపు
రోహతక్: డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ కేసు తీర్పులో మరో ట్విస్ట్. లైంగిక వేధింపుల కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు పదేళ్ల జైలు శిక్ష విధించినట్టు మీడియా ప్రచారం చేసింది. అయితే ఆయనకు 20 ఏళ్లు జైలు శిక్ష విధించినట్టు తేలింది. రెండు కేసుల్లో దోషిగా తేలిన ఆయనకు ఒక్కో కేసులో కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిందని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాళ్ వెల్లడించారు. ఈ రెండు శిక్షలు దాని తర్వాత ఒకటి అమలు చేస్తారని వెల్లడించారు. ఈ విషయాన్ని గుర్మీత్ సింగ్ తరపు న్యాయవాదులు కూడా ధ్రువీకరించారు. అయితే రెండు శిక్షలు ఒకేసారి అమలవుతాయని గుర్మీత్ సింగ్ తరపు లాయర్ ఎస్కే నార్వానా అన్నారు. శిక్షతో పాటు రూ.15 లక్షల చొప్పున మొత్తం రూ. 30 లక్షల న్యాయస్థానం జరిమానా విధించిందని తెలిపారు. రూ. 14 లక్షల చొప్పున మొత్తాన్ని ఇద్దరు బాధితురాళ్లకు ఇవ్వాలని కోర్టు ఆదేశించినట్టు చెప్పారు. తీర్పు పాఠం పూర్తిగా చదివిన తర్వాత ఉన్నత న్యాయస్థానాల్లో కచ్చితంగా అప్పీలు చేస్తామని ప్రకటించారు. 15 ఏళ్ల క్రితం తన ఆశ్రమంలో ఇద్దరు మహిళలను అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్ దోషిగా ఇదివరకే నిర్ధారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. ఆ మేరకు సోమవారం మధ్యాహ్నం కఠిన శిక్షను ఖరారు చేసింది. తీర్పు సందర్భంగా గుర్మీత్ చేతులు కట్టుకుని తనను క్షమించి వదిలేయాలని న్యాయమూర్తిని వేడుకున్నారు. ప్రాథమిక కథనాలు: అత్యాచారం కేసులో గుర్మీత్కు కఠిన శిక్ష గుర్మీత్ సింగ్ కేసు: జడ్జి ఏమన్నారంటే? తీర్పుపై బాబా రాందేవ్ స్పందన ఇలా... 'ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడు' -
గుర్మీత్ సింగ్ కేసు: జడ్జి ఏమన్నారంటే?
-
గుర్మీత్ సింగ్ కేసు: జడ్జి ఏమన్నారంటే?
రోహతక్: లైంగిక వేధింపుల కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం పదేళ్ల కఠిన కారాగార శిక్ష జైలు శిక్ష విధించింది. తీర్పు సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ జగదీప్ సింగ్ పలు అంశాలు ప్రస్తావించారు. ఇది క్షమించరాని నేరమని పేర్కొన్నారు. తనను నమ్మి వచ్చిన అమాయకులపై అత్యాచారానికి పాల్పడడం దారుణమని వ్యాఖ్యానించారు. గుర్మీత్ రాం రహీమ్ సింగ్కు జీవితఖైదు విధించాలని బాధితురాలు కోరినట్టు వెల్లడించారు. తనను క్షమించాలన్న గుర్మీత్ విజ్ఞప్తిని జడ్జి తోసిపుచ్చారు. గుర్మీత్ను సాధారణ ఖైదీలాగే చూడాలని ఆదేశించారు. అతడిని వీఐపీలాగా చూడటంతో పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపిస్ట్కు అదనపు సౌకర్యాలు కల్పిస్తారా అని చివాట్లు పెట్టారు. కాగా, కోర్టు తీర్పుపై బాధితురాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గుర్మీత్కు పదేళ్ల జైలు శిక్ష సరిపోదని అన్నారు. గుర్మీత్ సింగ్ చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని నిరపరాధిగా విడిచిపెట్టాలని లేదా శిక్షను తగ్గించాలని ఆయన తరపు న్యాయవాది చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించగానే గుర్మీత్ సింగ్ కోర్టులోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. కోర్టు హాలు నుంచి బయటకు రావడానికి నిరాకరించడంతో ఆయనను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి జైలుకు తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఖైదీ దుస్తులు ఇవ్వనున్నారు. తర్వాత జైల్లో సెల్ కేటాయిస్తారు. -
రేప్ కేసులో దోషిగా తేలిన గుర్మీత్ సింగ్
- సంచలన తీర్పు చెప్పిన పంచకుల సీబీఐ కోర్టు - హరియాణ, పంజాబ్లో హై అలర్ట్.. రోడ్లపైనే బాబా అనుచరులు పంచకుల: దేశవ్యాప్తంగా తీవ్ర ఉంత్కంఠ రేపిన అత్యాచారాల కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తనను తాను దేవుడి అవతారంగా చెప్పుకునే గుర్మీత్ సింగ్ అలియాస్ బాబా గుర్మీత్ సింగ్ రాం రహీంను అత్యాచారం కేసులో దోషిగా తేలారు. 2002లో గుర్మీత్ తన ఆశ్రమంలో సాధ్విలుగా ఉన్న ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలున్నాయన్న కోర్టు.. అతను ముమ్మాటికీ శిక్షార్హుడేనని పేర్కొంది. అయితే గుర్మీత్కు విధించే శిక్షలను సోమవారం ఖరారు చేయనున్నట్లు న్యాయమూర్తులు తెలిపారు. కోర్టు తీర్పును అనుసరిస్తూ హరియాణా పోలీసులు.. గుర్మీత్ సింగ్ను అదుపులోకి తీసుకుని, అంబాలా సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకు ముందు కోర్టుకు హాజరయ్యేందుకు గుర్మీత్ 300 వాహనాల కాన్వాయ్తో హల్చల్ చేశారు. రెండు రాష్ట్రాల్లో హై అలర్ట్: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్పై అత్యాచార ఆరోపణలకు సంబంధించిన కేసులో శుక్రవారం తీర్పు వెలువడనుండటంతో హరియాణా, పంజాబ్ నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. గుర్మీత్ మద్దతుదారులు, అభిమానులు దాదాపు లక్ష మంది వరకూ పంచకుల చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతో పంచకులతో పాటు పంజాబ్, హరియాణాల్లోని సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులకుతోడు 15 వేలమంది పారామిలిటరీ బలగాలను మోహరించారు. అన్ని జిల్లాల్లోనూ 144 సెక్షన్ విధించారు. డేరా సచ్చా సౌదాకు పంజాబ్, హరియాణాల్లో లక్షలాది మంది మద్దతుదారులు ఉన్నారు. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లోనూ హైఅలర్ట్ ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా ఇరు రాష్ట్రాల్లోనూ 72 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలుపుదల చేశారు. సోషల్ మీడియాలో పోస్టులపై అధికారులు నిఘా పెట్టారు. పంచకులకు వెళ్లే బస్సులు, రైళ్లపై ఆంక్షలు విధించారు. పంజాబ్, హరియాణా ప్రభుత్వాలకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తన ఆశ్రమంలో ఇద్దరు సాధ్వీలపై గుర్మీత్ రామ్రహీం సింగ్ అత్యాచారానికి పాల్పడ్డారని 2002లో ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి పంజాబ్, హరియాణా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ డేరా చీఫ్పై కేసు నమోదు చేసింది. తీర్పు నేపథ్యంలో సిస్రాలోని 3 గ్రామాల్లో కర్ఫ్యూ విధించారు. (ఆ బాబా సీక్రెట్ ఏంటి?) -
రేప్ కేసులో దోషిగా తేలిన బాబా గుర్మీత్ సింగ్
-
పంజాబ్, హరియాణాల్లో హైఅలర్ట్
-
పంజాబ్, హరియాణాల్లో హైఅలర్ట్
♦ ‘రాక్స్టార్ బాబా’ లైంగిక వేధింపుల కేసులో రేపే తీర్పు ♦ వేల సంఖ్యలో పంచకులకు చేరుకుంటున్న మద్దతుదారులు చంఢీగఢ్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్చా సౌదా చీఫ్, రాక్స్టార్గా పేరొందిన గుర్మీత్ రామ్ రహీం సింగ్పై నమోదైన లైంగిక వేధింపుల కేసులో సీబీఐ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. దీంతో ఆయన మద్దతుదారులు వేల సంఖ్యలో పంచకులకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇరు రాష్ట్రాల్లో 144 సెక్షన్ విధించారు. ఇప్పటికే 35 వేల మంది వరకు గుర్మీత్ మద్దతుదారులు పంచకుల బాబా ప్రార్థనా స్థలం నామ్ చర్చా ఘర్కు చేరుకున్నారు. రానున్న రెండు రోజుల్లో లక్ష మంది వరకు మద్దతుదారులు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్, హరియాణాల్లో భారీగా భద్రతా చర్యలు చేపట్టారు. వేల సంఖ్యలో పోలీసులు, భద్రతా దళాలను మోహరించారు. ముందుజాగ్రత్తగా గురు, శుక్రవారాల్లో పంచకులలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. పంచకులలోని జిల్లా కోర్టుకు వెళ్లే అన్ని మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. శుక్రవారం కోర్టు ముందుకు గుర్మీత్ బాబా కూడా హాజరవనున్నారు. తీర్పు నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశముందని నిఘావర్గాలు సైతం హెచ్చరించాయి. పంజాబ్కి ఇప్పటికే 75 కంపెనీల కేంద్ర బలగాలు చేరుకున్నాయి. అవాం ఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ల సహాయంతో నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. తాత్కాలిక జైలుగా క్రికెట్ స్టేడియం చంఢీగఢ్లోని క్రికెట్ స్టేడియాన్ని తాత్కాలిక జైలుగా మార్చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే అనుమానం వచ్చిన ప్రతిఒక్కరిని శుక్రవారం ఆ క్రికెట్ స్టేడియంలో ఉంచాలని చంఢీగఢ్ పరిపాలన విభాగం నిర్ణయించింది. 2002లో ఇద్దరు శిష్యురాళ్లను లైంగికంగా వేధించినట్లు గుర్మీత్ రామ్ రహీం సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
సీబీఐ కోర్టుకు హాజరైన లాలూ
రాంచీ: దాణా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు సాక్ష్యులను ఆయన ప్రవేశపెట్టారు. గత మంగళవారం కూడా లాలూ ఇదే కోర్టుకు హాజరై మరో కేసుకు సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చారు. రూ.900 కోట్ల దాణా కుంభకోణం ఆయన బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఐదు కేసులుండగా ఒక కేసుకు సంబంధించి దోషిగా తేలటంతో సీబీఐ న్యాయస్థానం గత మే నెలలో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. -
ఇంద్రాణిని కొట్టారు, దూషించారు!
సీబీఐ కోర్టులో ఆమె తరఫు న్యాయవాది ఫిర్యాదు ముంబై: షీనాబోరా హత్యకేసులో నిందితు రాలు ఇంద్రాణి ముఖర్జీని బైకల్లా జైలు సిబ్బంది కొట్టారని, దూషించారని ఆమె తరఫు న్యాయవాది గుంజన్ మంగ్లా సీబీఐ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆందోళన చేస్తే లైంగికదాడి చేస్తానంటూ జైలు సిబ్బంది, సూపరింటెండెంట్ బెదిరించారన్నారు. ఇంద్రాణి కాళ్లు, చేతులు, ముఖంపై గాయాలను తనకు చూపించారని, జైలు సిబ్బందిపై ఫిర్యాదు చేయాలని ఆమె కోరిందన్నారు. విచారణ జరిపిన కోర్టు బుధవారం ఇంద్రాణిని హాజరుపరచాలని ఆదేశించింది. బైకల్లా జైలు ఖైదీ మంజురా (45) ముంబైలోని జేజే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. జైలు సిబ్బంది తీవ్రంగా కొట్టడంతోనే మంజురా మృతిచెందిందని ఆరోపిస్తూ ఇంద్రాణి సహా ఖైదీలు ఆందోళన చేపట్టారు. జైలు డాబాపైకెక్కి వార్తా పత్రికలకు నిప్పు అంటిస్తూ జైలు సిబ్బందికి వ్యతిరేక నినాదాలు చేశారు. మరోవైపు మంజురాను జైలు సిబ్బంది తీవ్రంగా హింసించారని, జననాంగంలోకి లాఠీ జొప్పించారని పోలీసులు చెప్పారు. ఆందోళన విషయమై జైలు అధికారి ఒకరు స్పందిస్తూ.. ఆహారం తీసుకోవద్దని, ఆందోళనను ఆపడానికి ప్రయత్నిస్తే పిల్లలను అడ్డుగా ఉంచుకోవాలని ఖైదీలను ఇంద్రాణి ఉసిగొల్పారని ఆరోపించారు. -
కోర్టుకు బ్రదర్స్!
► చార్జ్షీట్ నకలు అప్పగింత ► మీడియాపై న్యాయవాదుల చిందులు ► మౌనంగా మారన్ ముందుకు సాక్షి, చెన్నై: మారన్ బ్రదర్స్ మంగళవారం చెన్నై సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. 2500 పేజీలతో కూడిన చార్జ్షీట్ నకలును వీరికి కోర్టు వర్గాలు అప్పగించాయి. తదుపరి విచారణ జూలై 28కి న్యాయమూర్తి జవహర్ వాయిదా వేశారు. యూపీఏ హయాంలో కేంద్ర టెలికాం మంత్రిగా ఉన్న సమయంలో దయానిధిమారన్ హై స్పీడ్ ఇంటర్నెట్ బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లను దుర్వినియోగం చేసినట్టుగా ఆరోపణలు బయలు దేరాయి. ఈ కనెక్షన్లను తమ కుటుంబానికి చెందిన సన్ టీవీ నెట్వర్క్కు అప్పగించడంతో ప్రభుత్వానికి కోటి 78 లక్షల మేరకు ఆదాయానికి గండి పడిందని సీబీఐ గుర్తించి కేసు నమోదు చేసింది. దయానిధిమారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్తో పాటు అప్పటి బీఎస్ఎన్ఎల్ అధికారులు బ్రహ్మనాథన్, వేలుస్వామి, మారన్ వ్యక్తిగత కార్యదర్శి గౌతమన్, సన్టీవీ సిబ్బందికన్నన్, రవి మీద అభియోగం మోపుతూ ఈ కేసులు దాఖలయ్యాయి. కేసు విచారణ చెన్నై సీబీఐ కోర్టులో సాగుతూ వస్తోంది. ఈ కేసుకు సంబంధించి డిసెంబర్ ఎనిమిదో తేదీన సీబీఐ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసింది. గత విచారణ సందర్భంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లందరూ కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి జవహర్ ఆదేశించారు. ఆ మేరకు మారన్ బ్రదర్స్ మంగళవారం కోర్టుమెట్లు ఎక్కారు. కోర్టుకు బ్రదర్స్ : కళానిధి మారన్, దయానిధి మారన్తో పాటు మిగిలిన వారు ఉదయాన్నే హైకోర్టు ఆవరణలోని సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. కోర్టుకు హాజరైన వీరిని వీడియో, ఫొటోలు తీయడానికి మీడియా ఉత్సాహాన్ని ప్రదర్శించింది. అయితే, ఆ బ్రదర్స్ తరఫు న్యాయవాదులు అడ్డుకోవడం వివాదానికి దారి తీసింది. కోర్టులో న్యాయమూర్తి జవహర్ ఆదేశాల మేరకు 2500 పేజీలతో కూడిన చార్జ్షీట్ నకలును ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ అందజేశారు. వీటిని పరిశీలించి, తదుపరి తమ వాదన వినిపించేందుకు తగ్గ సమయాన్ని కోర్టు కేటాయించింది. తదుపరి విచారణను జూలై 28వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు నుంచి వెలుపలకు వస్తున్న మారన్ బ్రదర్స్ను తమ కెమెరాల్లో బంధించేందుకు మీడియా యత్నించగా, వారి న్యాయవాదులు మళ్లీ అడ్డుకున్నారు. ఫొటోలు, వీడియోల్ని తీయనివ్వకుండా మీడియా మీద తిరుగబడ్డారు. మీడియా వర్గాలను బెదిరిస్తూ, కాస్త దూకుడు ప్రదర్శించారు. న్యాయవాదులు రవీంద్రన్, స్నేహ అయితే, కాస్త దూకుడుగా ప్రదర్శించడంతో మీడియా వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మీడియా మీద తమ న్యాయవాదులు దూకుడు ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నా, ఓ మీడియా సంస్థలకు అధిపతిగా ఉన్న మారన్ బ్రదర్స్ వారించకుండా మౌనంగా ముందుకు సాగడం గమనార్హం. -
సీబీఐ కోర్టు మెట్లెక్కిన లాలూ
పాట్నా: దాణా కుంభకోణం కేసుకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి హాజరయ్యారు. బిహార్ మరో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కూడా సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి దేవ్రాజ్ త్రిపాఠి కూడా కోర్టుకు వచ్చారు. దాణా పంపిణీకి సంబంధించి కోట్లలో కుంభకోణం జరిగినట్లు బయటపడటంతో 45మందిని నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. ఇందులో పలువురు చనిపోగా.. ప్రస్తుతం 27మంది విచారణను ఎదుర్కొంటున్నారు. గతంలో జార్కండ్ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్పై నమోదైన కుట్రపూరిత ఆరోపణలన్నింటిని కొట్టి వేయగా.. ఇటీవల విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు లాలూ విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఆదేశించిన విషయం తెలిసిందే. -
అడ్వాణీపై కుట్ర అభియోగాలు
♦ ‘బాబ్రీ’ విధ్వంసం కేసులో ఎంఎం జోషి, ఉమాభారతిలపై కూడా ♦ అనంతరం వారికి బెయిల్ మంజూరు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు లక్నో: బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో మంగళవారం బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీకి ఎదురుదెబ్బతో పాటు, కాస్త ఊరట కూడా లభించింది. అడ్వాణీ తదితరులపై నేరపూరిత కుట్ర అభియోగాలను నమోదుకు ఆదేశాలు జారీ చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. వారికి రూ. 50వేల వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ను సైతం మంజూరు చేసింది. ఈ కేసులో బీజేపీ అగ్రనేతలు అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, కేంద్రమంత్రి ఉమాభారతి సహా మొత్తం 12 మందిపై నేరపూరిత కుట్ర అభియోగాలను మళ్లీ నమోదు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న పలు ఇతర అభియోగాలకు ఇవి అదనం. అలాగే అడ్వాణీ(89), ఎంఎం జోషి(83), ఉమాభారతి(58), బీజేపీ ఎంపీ వినయ్ కటియార్(62), వీహెచ్పీ నేత విష్ణు హరి దాల్మియా(89), హిందూత్వవాది సాధ్వి రితంబర(53)లకు న్యాయమూర్తి ఎస్కే యాదవ్ బెయిలు మంజూరు చేశారు. మంగళవారం అడ్వాణీ, ఉమ సహా నిందితులంతా తమ ముందు హాజరు కావాల్సిందేనని గతంలో కోర్టు ఆదేశించడం తెలిసిందే. కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. ఈ విచారణకు అడ్వాణీ సహా అభియోగాలు ఎదుర్కొంటున్న నేతలంతా హాజరయ్యారు. కోర్టు హాల్లో మూడు గంటల పాటు ఉన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం అడ్వాణీ సహా ఆరుగురు నేతలకు బెయిల్ మంజూరు చేసింది. కుట్ర అభియోగాలను మోపవద్దంటూ నిందితుల తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. కాగా, కోర్టుకు వెళ్లేముందు అడ్వాణీని యూపీ సీఎం ఆదిత్యనాథ్ వీఐపీ గెస్ట్హౌజ్లో కలిశారు. మసీదు కూల్చివేత కేసులో సుప్రీంకోర్టు గతనెలలో కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అడ్వాణీ సహా బీజేపీ అగ్రనేతలపై కుట్ర కేసులను ట్రయల్ కోర్టు, అలహాబాద్ హైకోర్టులు గతంలో కొట్టివేయగా, వాటిని పునరుద్ధరించాలన్న సీబీఐ వాదనను సుప్రీం కోర్టు అంగీకరించింది. అలాగే లక్నోలో సీబీఐ ప్రత్యేక కోర్టులో రోజువారీ విచారణ చేపట్టి రెండేళ్లలో పూర్తి కేసును ముగించాలని ఆదేశించింది. అందులో భాగంగా బీజేపీ నేతలపై కుట్రపూరిత అభియోగాలను నమోదు చేయడంపై లక్నోలోని సీబీఐ కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఎవరూ ఆపలేరు: సాక్షి మహరాజ్ బాబ్రీ మసీదు విధ్వంసంలో కుట్ర ఏమీ లేదని, అదిబహిరంగ ఉద్యమంలా జరిగిందని కోర్టుకు హాజరయ్యేముందు ఉమ అన్నారు. ‘ఆ రోజు నేనక్కడే ఉన్నాను. నేనే కాదు లక్షలాది కార్యకర్తలు, రాజకీయ నేతలు అందులో పాలుపంచుకున్నారు’ అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరని బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ అన్నారు. గతంలో రామ మందిర నిర్మాణానికి ఎవరైతే అడ్డు చెప్పారో ఇప్పుడు వారే రామ భక్తులుగా మారిపోయారన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ముస్లింలూ అనుకూలంగా ఉన్నారన్నారు. అభియోగాలివీ... నిందితులపై ఇప్పటికే జాతీయ సమైక్యతకు హాని కలిగించడం, ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేయడం, ఉద్దేశపూర్వకంగా మతపరమైన భావాలను దెబ్బతీయడం, బహిరంగ అల్లర్లకు దారితీసేలా ప్రకటనలు చేయడం, అల్లర్లు చేయడం తదితర అభియోగాలు ఉన్నాయి. వీటికి అదనంగా కోర్టు మంగళవారం నేరపూరిత కుట్ర అభియోగాన్ని కూడా మోపింది. నేరం రుజువైతే నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని కోర్టులో ఈ కేసు విచారణను పరిశీలిస్తున్న ఓ న్యాయవాది పేర్కొన్నారు. -
హిమాచల్ సీఎంకు బెయిల్ మంజూరు
-
హిమాచల్ సీఎంకు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి వీరభద్రసింగ్తో పాటు, ఆయన భార్యకు సీబీఐ కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే వీరభద్రసింగ్ పాస్పోర్టును కోర్టులో సమర్పించాలని సూచించింది. కేసు తదుపరి విచారణ జూలై 27వ తేదీకి వాయిదా పడింది. -
17 ఏళ్లు అవుతోంది.. ఆ వ్యక్తి ఎక్కడా?
న్యూఢిల్లీ: తనకు బెయిల్ కోసం ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి మరణించి 17 సంవత్సరాలు గడిచిపోయినా నిందితుడికి తెలియకపోవడం నమ్మశక్యంగా లేదని సీబీఐ కోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను మే 22కు వాయిదా వేసింది. వివరాల్లోకెళితే ఢిల్లీకి చెందిన వినీత్ తివారీ, ఎల్.కె.కౌల్, ఏ ఎస్ మస్తర్లు 1982లో అప్పటి షిప్పింగ్, రవాణా మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సంతకంతో ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించారు. వాటి సాయంతో బాంబే పోర్ట్ ట్రస్టుకు చెందిన 39,846 చదరపు మీటర్ల భూమిని రూ.2.27 కోట్లకు విక్రయించారు. ఈ ఘటనపై 1983, మార్చి22న అప్పటి షిప్పింగ్, రవాణా మంత్రిత్వ శాఖ జాయింట్స సెక్రటరీ ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మస్తర్ అప్రూవర్గా మారడంతో 1985లో కోర్టు అతడిని విడుదల చేసింది. 2008 అక్టోబర్ 13న తివారీ, కౌల్లకు వ్యతిరేకంగా మోసం, ఫోర్జరీ, కుట్ర, తప్పుడు ధ్రువపత్రాల సమర్పణ అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశాలిచ్చింది. ప్రాథమిక ఆధారాల ప్రకారం నిందితులిద్దరూ అప్రూవర్తో కలిసి నేరం చేశారని కోర్టు అభిప్రాయపడింది. తివారీ బెయిల్కు మరో ష్యూరిటీని అంగీకరించిన ధర్మాసనం, విచారణను మే 22కు వాయిదా వేసింది. -
ఛోటా రాజన్కు జైలు శిక్ష
న్యూఢిల్లీ: నకిలీ పాస్ట్ పోర్ట్ కేసులో గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్తో పాటు మరో ముగ్గురికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. సోమవారం వీరిని దోషులుగా నిర్ధారించిన ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ రోజు (మంగళవారం) శిక్షలను ఖరారు చేసింది. వీరికి జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 15 వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వీరేందర్ కుమార్ గోయల్ తీర్పు చెప్పారు. ఫోర్జరీ పత్రాలతో మారుపేరుతో ఛోటా రాజన్ పాస్ పోర్టు పొందినట్టు గతేడాది జూన్ 8న సీబీఐ కోర్టులో అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. రాజన్తో పాటు పాస్ పోర్టు అధికారులు జయశ్రీ దత్తాత్రేయ్ రహతె, దీపక్ నట్వర్లాల్ షా, లలిత లక్ష్మణన్లపై కేసు నమోదైంది. 1998-99లో బెంగళూరులో ఛోటా రాజన్.. మోహన్ కుమార్ అనే పేరుతో నకిలీ పాస్ పోర్టు పొందాడని, ఇందుకు పాస్ట్ పోర్టు అధికారులు సహకరించారని సీబీఐ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. నేరం రుజువు కావడంతో రాజన్తో పాటు అతనికి సహకరించిన వారికి శిక్ష పడింది. 2015 అక్టోబర్లో ఇండోనేసియా పోలీసులకు పట్టుబడ్డ రాజన్ను ఆ ఏడాది నవంబర్లో భారత్కు అప్పగించారు. -
ఛోటా రాజన్కు మరో ఎదురు దెబ్బ
-
ఛోటా రాజన్కు మరో ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్కు మరో ఎదురుదెబ్బ తగలింది. నకిలీ పాస్ పోర్టు కేసులో సోమవారం ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఛోటా రాజన్ను దోషీగా ప్రకటించింది. రేపు (మంగళవారం) రాజన్కు శిక్షను ఖరారు చేయనున్నట్టు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వీరేందర్ కుమార్ గోయల్ ప్రకటించారు. ఫోర్జరీ పత్రాలతో మారుపేరుతో ఛోటా రాజన్ పాస్ పోర్టు పొందినట్టు గతేడాది జూన్ 8న సీబీఐ కోర్టులో అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. రాజన్తో పాటు పాస్ పోర్టు అధికారులు జయశ్రీ దత్తాత్రేయ్ రహతె, దీపక్ నట్వర్లాల్ షా, లలిత లక్ష్మణన్లపై కేసు నమోదైంది. 1998-99లో బెంగళూరులో ఛోటా రాజన్.. మోహన్ కుమార్ అనే పేరుతో నకిలీ పాస్ పోర్టు పొందాడని, ఇందుకు పాస్ట్ పోర్టు అధికారులు సహకరించారని సీబీఐ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. నేరం రుజువు కావడంతో రాజన్తో పాటు అతనికి సహకరించిన వారిని కోర్టులో దోషులుగా ప్రకటించింది. హత్యలు, స్మగ్లింగ్, కిడ్నాప్ సహా రాజన్పై 85కు పైగా కేసులున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్లతో అతనిపై దాఖలైన కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2015 అక్టోబర్లో ఇండోనేసియా పోలీసులకు పట్టుబడ్డ రాజన్ను ఆ ఏడాది నవంబర్లో భారత్కు అప్పగించారు. -
జగతి పబ్లికేషన్స్కు హైకోర్టు ఊరట
ఈ నెల 17 వరకు అభియోగాల నమోదు వద్దంటూ సీబీఐ కోర్టుకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: జగతి పబ్లికేషన్స్కు ఉమ్మడి హైకోర్టులో ఊరట లభించింది. జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఈ నెల 17వ తేదీ దాకా ఎలాంటి అభియోగాల నమోదు ప్రక్రియా చేపట్టొద్దని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఒకేసారి అభియోగాల నమోదు చేపట్టేందుకు నిరాకరిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జగతి పబ్లికేషన్స్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. వీటిపై న్యాయమూర్తి గురువారం మరోసారి విచారణ జరిపారు. వేర్వేరుగా అభియోగాల నమోదు ప్రక్రియ చేట్టడం వల్ల తమకు కలిగే నష్టాన్ని జగతి పబ్లికేషన్స్ తరఫున సీనియర్ న్యాయవాదులు టి.నిరంజన్రెడ్డి, డి.వి.సీతారామ్మూర్తి ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. తరువాత సీబీఐ తరఫు న్యాయవాది పి.కేశవరావు వాదనలు వినిపిస్తూ ఈ వ్యాజ్యాలకు విచారణార్హత లేదన్నారు. ఈ వ్యాజ్యాలపై విచారణకు సమయం పడుతున్నందున వారం పాటు అభియోగాల నమోదు ప్రక్రియను నిలిపేస్తే అభ్యంతరమేమైనా ఉందా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. వారం పాటైతే అభ్యంతరం లేదని కేశవరావు పేర్కొనడంతో 17 వరకు అభియోగాల నమోదు ప్రక్రియ చేపట్టవద్దని ఆదేశించారు. విచారణను ఈ నెల 14కు వాయిదా వేశారు. వ్యాజ్యాలన్నింటినీ రెగ్యులర్ కోర్టు ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. -
మాల్యాపై ఉచ్చు బిగిస్తున్న సీబీఐ
ముంబై: కష్టకాలంలో విదేశాల్లో కింగ్ లా ఎంజాయ్ చేస్తున్న రుణ ఎగవేతదారుడు విజయ్ మాల్యాకు మరిన్ని కష్టాలు తప్పేట్టు లేవు. ఆయన్ని స్వదేశానికి రప్పించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరో కీలక అడుగు ముందుకు వేయనుంది. ముఖ్యంగా ఆయనకు సాయం చేసారన్న ఆరోపణలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ప్రశ్నించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పెద్దమొత్తంలో రుణాలను ఎ గ్గొట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాకు దేశానికి రప్పించే విషయంలో సీబీఐ మరింత పట్టు బిగిస్తోంది. ఐడీబీఐ బ్యాంక్ లోన్ డీఫాల్ట్ కేసులో మాల్యాపై సీబీఐ ప్రత్యేక కోర్టులో మంగళవారం అఫిడవిట్ ను దాఖలు చేసింది. దీంతో సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రత్యేక న్యాయవాది హెచ్ ఎస్ మహాజన్ మాల్యాపై నాన్ బెయలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అతను వాంటెడ్ క్రిమినల్ అని పేర్కొంది. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది. ఐడిబిఐ బ్యాంకు లోన్ డిఫాల్ట్ సందర్భంలో ఇబ్బందులతో పడ్డ వ్యాపారవేత్త విజయ్ మాల్యా పై అఫిడవిట్ దాఖలు చేశామని సిబీఐ అధికారి తెలిపారు. లండన్ నుంచి వెనక్కి రప్పించాలని కోరినట్టు తెలిపారు. ఈ వారెంట్ ను దౌత్య మార్గాల ద్వారా ఆ దేశానికి పంపిస్తామన్నారు. ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసిన ఐడీబీఐ అధికారులు, కింగిఫిషర్ ఉద్యోగుల తదితర నిందితుల బెయిల్ దరఖాస్తులను బెయిల్ దరఖాస్తులను కూడా కోర్టు పరిశీలించింది. గతంలో కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినప్పటికీ అతని ఎడ్రస్ తెలియలేదని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం విజయ్ మాల్యాకు సహకరించారన్న బీజేపీ ఆరోపణల నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సీబీఐ ప్రశ్నించనున్నట్టు సమాచారం. కాగా జనవరి 24న ముంబై కోర్టులో 1000 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. "వ్యక్తిగత ఖర్చులు" కోసం ఈ నిధులను మళ్లించినట్టు సిబిఐ చార్జిషీట్లో ఆరోపించింది. మోసం, కుట్ర అభియోగాలను కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పటికే పలుసార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ, తనపై అక్రమ ఆరోపణలు చేస్తున్నారని ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసిన బిజినెస్ టైకూన్ మాల్యాను వెనక్కి రప్పిస్తారా? వేచి చూడాల్సిందే. -
రాత్రంతా కోర్టులోనే.. వ్యక్తి హల్చల్!
హైదరాబాద్: గగన్ విహార్ సీబీఐ కోర్టులో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. నిన్న(గురువారం) సాయంత్రం కోర్టులోకి ప్రవేశించిన వ్యక్తి.. రాత్రి మొత్తం కోర్టు భవనంలోనే ఉన్నాడు. సిబ్బంది గురువారం సరిగ్గా చెక్ చేయకుండా తాళాలు వేయడంతో.. జనగామకు చెందిన శివ అనే వ్యక్తి అందులోనే ఉండిపోయాడు. మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో.. రాత్రంతా కోర్టులోనే ఉండిపోయిన ఆ వ్యక్తి కోర్టులో ఉన్న కొన్ని దస్తావేజులు చించివేశాడు. శుక్రవారం కోర్టుకు వచ్చిన సిబ్బంది తాళాలు తెరిచిచూడగా ఓ వ్యక్తిని వారు గుర్తించారు. ఆ వెంటనే సిబ్బంది అబిడ్స్ పోలీసులకు సమాచారం అందించారు. సీబీఐ కోర్టుకు చేరుకున్న పోలీసులు శివను అదుపులోకి తీసుకున్నారు. అతను చింపివేసిన దస్తావేజుల గురించి మేజిస్ట్రేట్ ఆరా తీస్తున్నారు. -
గగనవిహార్కు సీబీఐ ప్రధాన కోర్టు తరలింపు
నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో ఉన్న సీబీఐ ప్రధాన కోర్టును గాంధీభవన్ ఎదురుగా ఉన్న గగన్విహార్ భవన సముదాయంలోకి మార్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం ఈ కోర్టు సామాగ్రిని తరలించారు. గగన్విహార్లోనే 12వ అంతస్తులో ప్రస్తుతం న్యాయమూర్తి లేకుండా ఖాళీగాఉన్న సీబీఐ రెండో అదనపు ప్రత్యేక కోర్టులోనే ప్రధాన కోర్టుకు ఏర్పాటు చేస్తున్నారు. గురువారం నుంచి న్యాయమూర్తి కేసులను ఇక్కడి నుంచే విచారించనున్నారు. -
సీఎం సీరియస్లో మర్మమిదే!
► మంత్రి ప్రత్తిపాటిపై రహస్య నివేదిక తెప్పించుకున్న చంద్రబాబు ► నకిలీ విత్తనాలు, పురుగు మందులను అదుపు చేయలేకపోతున్నారనే విమర్శలు ► సొంత నియోజకవర్గంలో ఆయన సతీమణి చక్రం తిప్పుతుందనే ఆరోపణలు సాక్షి, అమరావతి: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గురించి పూర్తిస్థాయి సమాచారం తెప్పించుకున్న తర్వాతే సీఎం చంద్రబాబు తన అసంతృప్తిని వీడియోకాన్ఫరెన్స్లోవెల్లడించినట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఉద్యోగుల బదిలీల సమన్వయం సాకుతో మూడు రోజుల కిందట జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పేర్కొంటున్నాయి. నకిలీ పురుగు మందులు, కల్తీ విత్తనాలకు జిల్లా అడ్డగా మారినా అదుపు చేయలేకపోతున్నారనే విమర్శలు ఉన్నట్లు చెబుతున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో పూర్తిగా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను కాదని పుల్లారావు భార్యే చక్రం తిప్పుతుందన్న ఆరోపణలూ వెల్లువెత్తుతు న్నాయి. ఏ పని చేయాలన్నా ఆమె అనుమతి తప్పనిసరని కార్యకర్తలు వాపోతున్నారు. మంత్రి పేరు చెప్పి కొందరు అనుచరులు అడ్డంగా దోచుకొంటున్నారని సొంత పార్టీ వారే ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యేలతోనూ సఖ్యత నిల్..: జిల్లాలోని అధికార పార్టీకి చెందిన పలువురు సీనియర్ ఎమ్మెల్యేలతోనూ మంత్రి పుల్లారావుకి సఖ్యత కొరవడినట్లు సమాచారం. పలుచోట్ల ఆయనే ఎమ్మెల్యేల ప్రమేయం లేకుం డా కలుగజేసు కోవడం వల్లే సమస్యలు తలెత్తినట్లు చర్చ సాగుతోంది. గుంటూరు నగరంలో ఎమ్మెల్యే మోదుగుల నియోజకవర్గంలో మంత్రి జోక్యం ఎక్కువైనట్లు తెలిసింది. మార్కెట్ యార్డు చెర్మైన్ పదవి విషయంలో మోదుగుల మాటను మంత్రి పరిగణనలోకి తీసుకోకుండా ఏక పక్షంగా వ్యహరించడంతోనే మార్కెట్ యార్డు చైర్మన్ భర్తీ ఆగిపోయినట్లు సమాచారం. సీసీఐ కుంభకోణంలో ఆరోపణలు.... గత ఏడాది సీసీఐ కొనుగోళ్లలో రూ. 450 కోట్ల కుంభకోణం బహిర్గతమైంది. మార్కెటింగ్ ఉద్యోగులు 15 మంది పైనా సీబీఐ కోర్టు విశాఖపట్నంలో కేసులు దాఖలయ్యాయి. వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సిఫార్సు చేసినా మంత్రి ప్రత్తిపాటి పట్టించుకోలేదు. ఫైలును తొక్కిపెట్టినట్లు అ శాఖ వర్గాలే పేర్కొంటున్నాయి. సీసీఐ కుంభకోణంలో అప్పట్లో మంత్రి పాత్రపై పలు ఆరోపణలు వినిపించాయి. వ్యవసాయ శాఖలో ఏవోలు, ఏడీలు, ఎంపీఈఓల తదితర ఉద్యోగుల ప్రమోషన్లు ఏడాదిగా ఆగిపోయినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం బదిలీలకూ బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. వివిధ అంశాలపై నిఘా వర్గాల నుంచి సీఎంకు సమాచారం అందడం వల్లే పుల్లారావుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. -
సీబీఐ కోర్టుకు హాజరైన లాలూ ప్రసాద్
రాంచీ: ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. రూ.900 కోట్ల దాణా కుంభకోణం కేసుకు సంబంధంచి ఆయన విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చారు. చైబాసా జిల్లా ట్రెజరీ నుంచి 37.70 కోట్ల రూపాయలను అక్రమంగా విత్ డ్రా చేశారనే ఆరోపణపై లాలూ సహా 38మందికి జూన్ 2న న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఈ కేసులో లాలూ దోషిగా రుజువుకావడంతో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా కోల్పోయారు. ఆయన ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. కాగా లాలూ ఆదివారం సాయంత్రమే పట్నా నుంచి రాంచీ చేరుకున్నారు. -
కోల్గేట్లో దాసరిపై అభియోగాలు
♦ మరో 14 మందిపైనా నమోదుకు సీబీఐ కోర్టు ఆదేశం ♦ ఈ అక్రమాలకు నవీన్ జిందాల్ సూత్రధారి అని వ్యాఖ్య న్యూఢిల్లీ: బొగ్గు స్కాంలో కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా సహా 15 మందిపై నేరాభియోగాలు నమోదు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. జార్ఖండ్లోని అమర్కొండ ముర్గదంగల్ గని కేటాయింపులో అవకతవకల కేసులో శుక్రవారం విచారణ కొనసాగింది. కేటాయింపులో అక్రమాలు జరిగాయని, జిందాల్, గగన్ ఇన్ఫ్రా ఎనర్జీ సంస్థలకు మేలు చేసేలా మాజీ సీఎం కోడా వ్యవహరించారని కోర్టుకు సీబీఐ విన్నవించింది. ఇరు వర్గాలు కుమ్మక్కయ్యాయని ఆరోపించింది. బ్లాకు కేటాయింపు మెరిట్ ప్రకారమే జరిగిందని, సీబీఐ ఆరోపణలన్నీ వాస్తవ దూరమని దాసరి, జిందాల్, కోడా న్యాయవాదులు పేర్కొన్నారు. వాదనలు విన్న జడ్జి భరత్ పరాశర్.. ప్రాథమిక ఆధారాలు, సాక్ష్యాల ఆధారంగా ఈ అవకతవకల వ్యవహారంలో నవీన్ జిందాల్ సూత్రధారి అని తేల్చారు. అప్పటి కేంద్ర మంత్రి దాసరికి రూ.2కోట్లు ఇచ్చినవిషయాన్ని కప్పి పుచ్చేందుకు జిందాల్ కంపెనీలను అడ్డుపెట్టుకున్నారన్నారు. ఈ వ్యవహారంలో అంతిమంగా ప్రయోజనం పొందే అవకాశమున్నదీ ఆయనకేనన్నారు. దాసరి, జిందాల్ సహా 15 మంది నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120బీ (నేరపూరిత కుట్ర), 409, 420లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని 13(1సీ), 13(1డీ) సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ... 136 పేజీల ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఈ కేసులో న్యూఢిల్లీ ఎక్సిమ్ ప్రైవేట్ లిమిటెడ్ డెరైక్టర్ సురేశ్ సింఘాల్ అఫ్రూవర్గా మారుతూ.. తనకు క్షమాభిక్ష కోసం పిటిషన్ వేశారు. దీనిని ఇప్పటికే కోర్టు ఇప్పటికే వాంగ్మూలం కూడా నమోదు చేసింది. ఆ వాంగ్మూలాన్ని పరిశీలించి, పిటిషన్ను పరిష్కరించిన తర్వాత... ప్రధాన కేసులో విచారణ చేపడతామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మిగతా 14 మంది నిందితులతోపాటు సీబీఐకి నోటీసులు జారీ చేశారు. మే 11వ తేదీలోగా అభిప్రాయాలను వెల్లడించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. తమపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని జిందాల్ స్టీల్, విద్యుత్ లిమిటెడ్ తెలిపింది. -
ఈడీ కేసు సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ..
♦ జగతి, విజయసాయిరెడ్డి పిటిషన్ల అనుమతి ♦ హైకోర్టు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: జగతి పబ్లికేషన్స్లో రూ.34.65 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసును మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి(ఎంఎస్జే) కోర్టు నుంచి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఎస్జే కోర్టులో జరుగుతున్న ఈడీ కేసు విచారణను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసుకున్న పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. జగతి పబ్లికేషన్స్లో ఎ.కె.దండమూడి, టి.ఆర్.కన్నన్, మాధవ్ రామచంద్రన్లు పెట్టిన పెట్టుబడులకు సంబంధించి సీబీఐ కేసు నమోదు చేసి చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. అలాగే ఈడీ కూడా కేసు నమోదు చేయగా.. దీనిపై ఎంఎస్జే కోర్టు విచారణ జరుపుతోంది. ఒకే అంశానికి సంబంధించి రెండు కోర్టులు వేర్వేరుగా విచారణ జరపడం వల్ల తమకు నష్టం జరుగుతుందని, అందువల్ల ఈడీ కేసును సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలంటూ జగతి పబ్లికేషన్స్, విజయసాయిరెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. జగతిలో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ కేసును ఎంఎస్జే కోర్టుకు బదిలీ చేయాలన్న ఈడీ అభ్యర్థనను సీబీఐ కోర్ట్టు తిరస్కరించిందన్నారు. ఈడీ కేసుల్ని విచారించే పరిధిని సీబీఐ కోర్టుకు కల్పిస్తూ ఇటీవల కేంద్రం జారీచేసిన ఉత్తర్వుల్ని న్యాయస్థానం దృష్టికి ఆయన తీసుకొచ్చారు. ఈడీ కేసును సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేసేందుకు తమకు ఎలాం టి అభ్యంతరం లేదని ఈడీ తరఫు న్యాయవాది పి.ఎస్.పి.సురేష్కుమార్ తెలిపారు. అయితే సీబీఐ కేసుతోపాటు ఈడీ కేసునూ విచారించేలా సీబీఐ కోర్టును ఆదేశించాలన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎంఎస్జే కోర్టులో ఉన్న ఈడీ కేసును సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. అయితే సీబీఐ కేసుతోపాటు ఈడీ కేసును కూడా విచారించాలని ఆదేశాలివ్వడం సాధ్యం కాదని, దీనిపై సీబీఐ కోర్టే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. -
బొగ్గు కుంభకోణం కేసులో దోషుల గుర్తింపు..
ఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో సోమవారం డిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తొలి తీర్పు వెలువరించింది. ఈ కేసులో జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్(జేఐపీఎల్), ఆ సంస్థ ఇద్దరు డైరెక్టర్లు ఆర్ఎస్ రంగ్తా, ఆర్సీ రంగ్తాలను కోర్టు దోషులుగా తేల్చింది. తప్పుడు ద్రువపత్రాలను సమర్పించి వీరు విలువైన గనులను దక్కించుకున్నట్లు కోర్టు నిర్థారించింది. ప్రస్తుతం బెయిల్పై ఉన్న వీరిని కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. మార్చి 31న వెలువరించనున్న తుది తీర్పులో వీరికి శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. -
దాల్మియా పిటిషన్లు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్ : జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ కోర్టులో విచారణ జరుగుతుండగానే, తమ ముందు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు జారీ చేసిన సమన్లను కొట్టివేయాలని దాల్మియా సిమెంట్ లిమిటెడ్ ప్రతినిధి పునీత్ దాల్మియా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు సోమవారం కొట్టేసింది. ఈ వ్యాజ్యంలో పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది చిదంబరం చేసిన వాదనలతో తాము ఏకీభవించడం లేదని కోర్టు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ తీర్పు వెలువరించారు. ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ పునీత్ దాల్మియా హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను ఇటీవల విచారించి తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి జస్టిస్ పుర్కర్ సోమవారం తీర్పు వెలువరించారు. -
సీబీఐ కోర్టుకు హాజరైన ప్రభుదేవా
హైదరాబాద్: సినీ హీరో, దర్శకుడు ప్రభుదేవా గగన్ విహార్లోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అవినీతి నిరోధక శాఖ అధికారి హరిప్రసాద్ అక్రమాస్తుల కేసులో సాక్షిగా ఉన్న ఆయన సోమవారం కోర్టుకు హాజరై ఈ కేసుకు సంబంధించిన వివరాలు కోర్టుకు తెలిపారు. సుమారు అరగంట పాటు కోర్టులో ఉన్న ఆయన విచారణ పూర్తయిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరారు. -
ఈడీ కోర్టులో విచారణపై హైకోర్టు స్టే
ఈడీ బదిలీ పిటిషన్పై 29లోపు నిర్ణయం తీసుకోండి సీబీఐ కోర్టుకు హైకోర్టు ఆదేశం జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) కోర్టులో జరుగుతున్న విచారణపై హైకోర్టు స్టే విధించింది. సీబీఐ కేసులను కూడా ఈడీ కోర్టుకు బదిలీ చేయాలంటూ ఈడీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ న్యాయస్థానం నిర్ణయం తీసుకునేంత వరకు జగన్ కేసులో విచారణ జరపవద్దని ఈడీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. కేసుల బదిలీ నిమిత్తం ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 29వ తేదీలోపు తగిన నిర్ణయం తీసుకోవాలని సీబీఐ న్యాయస్థానాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటివరకు జగన్ కేసులో విచారణ చేపట్టవద్దని ఈడీ కోర్టును ఆదేశిస్తూ ఈ వ్యాజ్యాలను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. జగతి పబ్లికేషన్స్లో కన్నన్, మాధవ రామచంద్ర తదితరులు పెట్టిన రూ.36 కోట్ల పెట్టుబడులకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. దీంతో ఈడీ కోర్టు కేసు విచారణ ప్రారంభించింది. సీబీఐ కోర్టులో విచారణ జరుగుతుండగా, అందుకు సమాంతరంగా ఈడీ కోర్టు విచారణ జరపడం సరికాదని, సీబీఐ కోర్టులో కేసు తేలేంతవరకు ఈడీ కేసు విచారణను వాయిదా వేయాలని జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులు ఈడీ కోర్టును కోరారు. అయితే వీరి అభ్యర్థనను ఈడీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలను న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం మరోసారి విచారించారు. -
'మా అన్నను కలుస్తాం.. అనుమతించరూ..'!
న్యూఢిల్లీ: ఇండోనేషియాలోని బాలిలో అరెస్టయి ప్రస్తుతం ఢిల్లీలో సీబీఐ అధికారుల అదుపులో ఉన్న చోటా రాజన్ను కలిసేందుకు ఆయన సోదరిమణులు వచ్చారు. శుక్రవారం తన సోదరుడిని కలిసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన ఇద్దరు సోదరీలు సీబీఐ కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అండర్వరల్డ్ డాన్, గ్యాంగ్స్టర్ అయిన చోటా రాజన్ ను అరెస్టు చేసేందుకు ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో అతడిని ఇండోనేషియాలోని ప్రముఖ పర్యాటక ద్వీపం బాలిలో ఆ దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి బాలికి వచ్చిన రాజన్ను ఆస్ట్రేలియా పోలీసులిచ్చిన సమాచారంతో బాలి విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. అంతర్జాతీయంగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్లో ఒకడైన రాజన్ మరో ప్రముఖ డాన్ దావూద్ ఇబ్రహీంకు ఒకప్పుడు కుడిభుజం.. దావూద్ డీ కంపెనీలో నంబర్ 2 పొజిషన్ లో ఉన్నాడు. అయితే 1993 ముంబై పేలుళ్ల అనంతరం దావూద్కు, డీ కంపెనీకి ప్రధాన ప్రత్యర్థిగా మారాడు. -
మన్మోహన్ సింగ్కు ఊరట
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఊరట లభించింది. మన్మోహన్ సింగ్కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను శుక్రవారం సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో మన్మోహన్ సింగ్ను నిందితుడిగా చేర్చరాదని, సమన్లు జారీ చేయబోమని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో మాజీ పీఎం ప్రమేయం ఉందని, ఆయనకు సమన్లు జారీ చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో సీబీఐ మన్మోహన్ సింగ్కు క్లీన్ చిట్ ఇచ్చింది. కోల్ గేట్ స్కాంలో కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావుతో పాటు మొత్తం 14 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి ఎస్సీ గుప్తాల్పై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. -
‘కామన్వెల్త్’లో తొలి తీర్పు
ఆరుగురు దోషులకు శిక్షలు ఖరారు చేసిన సీబీఐ కోర్టు న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల స్కాంలో తొలితీర్పు వెలువడింది. బుధవారమిక్కడి సీబీఐ న్యాయస్థానం మొత్తం ఆరుగురు దోషులకు శిక్షలు ఖరారు చేసింది. వీరిలో నలుగురు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ)కి చెందిన అధికారులు కాగా, మరో ఇద్దరు స్వేకా పవర్టెక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనే ప్రైవేటు కంపెనీ ఉన్నత ఉద్యోగులు. నలుగురు ఎంసీడీ అధికారులు, పవర్టెక్ కంపెనీ డెరైక్టర్కు నాలుగేళ్లు, అదే కంపెనీ ఎండీకి ఆరేళ్ల కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్జి బ్రిజేష్ గార్గ్ తీర్పు వెలువరించారు. 2010 కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి రూ.1.4 కోట్ల వీధి దీపాల కుంభకోణంలో ఆయన ఈ శిక్షలు ఖరారు చేశారు. స్ట్రీట్లైట్ల కొనుగోలు టెండర్ ప్రక్రియలో ఎంసీడీ అధికారులు పక్షపాతం చూపి స్వేకా పవర్టెక్ కంపెనీకి లబ్ధి చేకూర్చినట్టు విచారణలో తేలింది. నాలుగేళ్ల శిక్ష పడినవారిలో ఎంసీడీ సూపరింటెండెంట్ ఇంజనీర్ డీకే సుగాన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఓపీ మాహ్లా, అకౌంటెంట్ రాజు, క్లర్క్ గురుచరణ్ సింగ్, స్వేకా పవర్టెక్ ఇంజనీరింగ్ కంపెనీ డెరైక్టర్ జేపీ సింగ్ ఉన్నారు. స్వేకా పవర్టెక్ కంపెనీ ఎండీ టీపీ సింగ్కు కోర్టు ఆరేళ్ల శిక్ష విధించింది. వీరిపై సీబీఐ మోపిన అభియోగాలన్నీ రుజువైనట్లు జడ్జి ప్రకటించారు. కామన్వెల్త్ క్రీడల స్కాంలో నమోదైన 10 అవినీతి కేసుల్లో స్ట్రీట్లైట్ కుంభకోణం ఒకటి. -
కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు సమన్లు
హైదరాబాద్: అరకు ఎంపీ కొత్తపల్లి గీత సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 19న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం రుణం పొందారని ఆమెపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. సుమారు రూ.42 కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు మోపింది. హైదరాబాద్కు చెందిన విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన నాటి మేనేజింగ్ డెరైక్టర్, తన భర్త అయిన పి.రామకోటేశ్వరరావుతో కలసి గీత ఈ మోసానికి పాల్పడినట్లు చార్జిషీట్లో పేర్కొంది. హైదరాబాద్లోని సీబీఐ కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి కోర్టులో ఈ చార్జిషీట్ను దాఖలు చేసింది. వీరు తప్పుడు ధ్రువపత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.25 కోట్ల రుణం తీసుకున్నారని ఆరోపించింది. అనంతరం నిందితులు రుణ మొత్తాన్ని ఇతర అవసరాలకు మళ్లించి బ్యాంకును మోసం చేశారని, ఫలితంగా బ్యాంకుకు రూ.42.79 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీబీఐ మీడియా సమాచార అధికారి ఆర్కే గౌర్ చెప్పారు. బ్యాంకు అధికారులు కేకే అరవిందక్షణ్ (పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెడ్ ఆఫీస్లోని నాటి జనరల్ మేనేజర్), బీకే జయప్రకాశం(అప్పటి అసిస్టెంట్ జనరల్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్)లతో నిందితులు కుమ్మక్కై ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారంటూ వీరి పేర్లను కూడా సీబీఐ చార్జిషీట్లో పొందుపర్చింది. నిందితులపై సెక్షన్ 120 బీ (నేరపూరిత కుట్ర) రెడ్విత్ 420 (చీటింగ్), 468 (ఫోర్జరీ), ఐపీసీ 471 కింద, పీసీ యాక్ట్ 1988లోని సెక్షన్ 13(2) రెడ్విత్ 13(1)(డీ) కింద అభియోగాలు నమోదు చేసినట్లు గౌర్ తెలిపారు. -
నా ప్రమేయం లేదు.. అంతా ప్రధానే: దాసరి
-
నా ప్రమేయం లేదు.. అంతా ప్రధానే: దాసరి
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపులో తన ప్రమేయమేదీ లేదని కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు చెప్పారు. కేసు విచారణ నిమిత్తం సోమవారం ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తాను బొగ్గు గనుల శాఖ సహాయమంత్రిగా ఉన్నప్పటికీ క్షేత్రాల కేటాయింపులకు సంబంధించిన అన్ని నిర్ణయాలూ నాటి ప్రధాని మన్మోహన్ సింగే తీసుకునేవారని తెలిపారు. కోర్టులోనూ ఇదే విషయాన్ని చెప్పానన్నారు. కేటాయింపులపై నిర్ణయం తీసుకొనే 'స్క్రీనింగ్ కమిటీ' ని ప్రభావితం చేసేందుకే బొగ్గుశాఖ సహాయమంత్రి హోదాలో దాసరి జిందాల్ గ్రూపు సంస్థలకు అనుకూలంగా లేఖ రాశారని సీబీఐ తన అభియోగ పత్రంలో పేర్కొంది. 120-బి (నేరపూరిత కుట్ర), 420 (చీటింగ్), అవినీతి నిరోధక చట్టంలోని ఇతర సెక్షన్ల కింద దాసరి సహా కేంద్ర బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్.సి.గుప్తా, జ్ఞాన స్వరూప్ గార్గ్, సురేష్ సింఘాల్, రాజీవ్ జైన్, గిరీష్కుమార్ సునేజా, ఆర్.కె.సరాఫ్, కె.రామక్రిష్ణ ప్రసాద్లపై అభియోగాలు నమోదయ్యాయి. అలాగే జిందాల్ సంస్థలతో పాటు దాసరికి చెందిన సౌభాగ్య మీడియాపై కూడా చార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
'నాపై పడిన మచ్చను త్వరలో తుడుచుకుంటా'
హైదరాబాద్ : తనపై పడిన మచ్చను త్వరలో తుడుచుకుంటానని ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు అన్నారు. ఎవరినో కాపాడుకునేందుకు తనను బలి చేశారని ఆయన సోమవారమిక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. కుంభకోణానికి సంబంధించి అప్పట్లో బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావుపై సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కోల్గేట్ స్కామ్లో ఈ నెల 22న దాసరి కోర్టుకు హాజరు కానున్నారు. బొగ్గు గనుల కేటాయింపులో భారీ స్థాయిలో కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. -
ఎన్ కౌంటర్ కేసు నుంచి అమిత్ షాకు ఊరట
న్యూఢిల్లీ: షహాబుద్దీన్ షేక్ ఎన్ కౌంటర్ కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఊరట లభించింది. మంగళవారం ముంబై సీబీఐ కోర్టులో విచారణకు వచ్చిన ఈ కేసులో అమిత్ షా పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలు లేవని కోర్టుకు సీబీఐ తెలిపింది. దీంతో ఈ కేసు నుంచి అమిత్ షా కు విముక్తి కలగనుంది. అమిత్ షా గుజరాత్ హోం మంత్రిగా ఉన్న సమయంలో షహాబుద్దీన్ షేక్ ఎన్ కౌంటర్ కేసు సంచలనం రేపింది. ఆ ఘటన జరిగిన ఐదు సంవత్సరాల అనంతరం 2010 లో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఇందులో నాటి గుజరాత్ డీజీపీ వంజర, హోం మంత్రి అమిత్ షా సహా పలువురిపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వాటినుంచి బీజేపీ అధ్యక్షుడికి విముక్తి లభించింది. -
అమిత్షాకు మినహాయింపు
ముంబై: సోహ్రాబుద్దీన్ షేక్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా కోర్టు విచారణకు హాజరు కాకుండా మినహాయింపు లభించింది. ముంబైలోని సీబీఐ కోర్టు సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో శాశ్వత మినహాయింపు కోసం అమిత్షా అభ్యర్థించగా, కోర్టు మాత్రం అభియోగాలు నమోదయ్యే వరకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. 2005లో జరిగిన గ్యాంగ్స్టర్ సోహ్రాబుద్దీన్ షేక్, ఆయన భార్య కౌసర్ బీ నకిలీ ఎన్కౌంటర్ కేసులో అమిత్ షా కిడ్నాప్, హత్య ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జ్షీటు ఇంగ్లిష్ కాపీ ఇప్పించాలని కోరుతూ సోహ్రాబుద్దీన్ సోదరుడు రుబాబుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు స్వీకరించింది. ఇంగ్లిష్ కాపీ ఇవ్వాలని సీబీఐని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ** -
కోలీకి నేడే ఉరి ?
మీరట్: ఎందరో బాలికలను దారుణంగా హతమార్చి, అత్యాచారం చేసిన సురీందర్ కోలీకి సోమవారం ఉరిశిక్ష విధించవచ్చని తెలుస్తోంది. ఇతడు పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడంతో ఉరితీయడం ఖాయమని మీరట్ జైలువర్గాలు తెలిపాయి. సీబీఐ కోర్టు డెత్ వారంటు జారీ చేయడంతో శిక్ష అమలు కోసం ఇతణ్ని ఈ నెల నాలుగున ఘజియాబాద్ దస్నా జైలు నుంచి మీరట్ జైలుకు తరలించారు. ఇతణ్ని ఈ నెల 7-12 తేదీల్లో ఎప్పుడైనా ఉరితీయవచ్చని అధికారులు ఇంతకుముందు ప్రకటించారు. ఉరి అమలుపై అధికారికంగా ఎవరూ నోరు విప్పకున్నా.. సోమవారం ఉదయం 5.30 గంటలకు శిక్షను అమలు చేస్తారని జైలువర్గాలు తెలిపాయి. కోలీని ఉరి తీయడానికి అవసరమైన పరికరాలను ఇది వరకే తెప్పించామని జైలుసూపరింటెండెంట్ తెలిపారు. యజమాని పంధేర్తో కలసి నోయిడాలోని నిఠారీ బాలిక రింపా హల్దార్ను 2006లో హత్య చేసినందుకు సీబీఐ కోర్టు ఇతనికి మరణశిక్ష విధించింది. -
సీబీఐ కోర్టుకు హాజరైన జగన్
తదుపరి విచారణ ఆగస్టు 11కి వాయిదా సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించిన కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. అలాగే ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణతోపాటు పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, శ్యాంప్రసాద్రెడ్డి, పెన్నా ప్రతాప్రెడ్డి, సీనియర్ ఐఏఎస్లు బీపీ ఆచార్య, శ్యాంబాబు, ఆదిత్యనాథ్దాస్, మన్మోహన్సింగ్ తదితరులు హాజరు కాగా మిగిలిన వారు హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో దాఖలు చేసిన మొదటి చార్జిషీట్ (సీసీ 8)లో నిందితులపై అభియోగాల నమోదు ప్రక్రియను చేపట్టాలని సీబీఐ స్పెషల్ పీపీ సురేంద్ర కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి బాలయోగి...డిశ్చార్జ్ పిటిషన్లపై ముందుగా వాదనలు వినిపించాలని, వాటిపై నిర్ణయం తీసుకున్న తర్వాతే అభియోగాల నమోదు ప్రక్రియపై వాదనలు వింటామని సీబీఐ స్పెషల్ పీపీకి స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 11కి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా సీనియర్ ఐఏఎస్ అధికారి రత్నప్రభపై మోపిన అభియోగాలను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆ తీర్పును రత్నప్రభ తరఫు న్యాయవాది ప్రత్యేక కోర్టుకు సమర్పించారు. -
సీబీఐ ప్రత్యేక కోర్టులో అమిత్ షా కు ఊరట!
ముంబై: సీబీఐ ప్రత్యేక కోర్టులో బీజేపీ నేత అమిత్ షాకు ఊరట లభించింది. సోహ్రాబుద్దీన్ షేక్, తులసిరాం ప్రజాపతి ఎన్ కౌంటర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమిత్ షాకు కోర్టుకు వ్యకిగత హాజరు నుంచి మినహాయింపు లభించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వ్యవహారాల్లో అమిత్ షా బిజీగా ఉంటున్నారని.. సీబీఐ ప్రత్యేక కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావడానికి ఇబ్బందులున్నందున మినహాయింపు ఇవ్వాలని అమిత్ షా తరపు లాయర్ సీబీఐ ప్రత్యేక కోర్టును అభ్యర్ధించారు. అమిత్ షా డిశ్చార్జ్ దరఖాస్తును కోర్టు జూలై 14 తేదిన విచారణ చేపట్టనుంది. Follow @sakshinews -
గులాబీలో గుబులు!
సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: గులాబీ దళంలో సీబీఐ గుబులు నెలకొన్నట్టు సమాచారం. ఎన్నికల వేళ ఇవేం చిక్కులు అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి సైతం ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ సీనియర్ నాయకుడు హరీష్రావు, అలాగే విజయశాంతిపై అక్రమాస్తుల ఆరోపణలపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని నాంపల్లి సీబీసీ ప్రత్యేక కోర్టు సీబీఐ ఎస్పీని ఆదేశించడంతో మెతుకుసీమలో రాజకీయ కలకలం రేగుతోంది. ఇదే జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు(మాజీ టీఆర్ఎస్ నేత) రఘునందన్రావు చేసిన ఆరోపణల ఆధారంగా హైదరాబాద్కు చెందిన బాలాజీ వడేరా అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు.. పిటిషనర్ ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో రాజకీయ విశ్లేషకుల దృష్టి జిల్లా రాజకీయాల మీద పడింది. 2001 తర్వాత కేసీఆర్ ఉద్యమం పేరుతో అక్రమంగా డబ్బు కూడబెట్టారని కోర్టుకు విన్నవించారు. అప్పట్లో టీఆర్ఎస్లో ఉన్న విజయశాంతి ఇంట్లోనే రూ. 100 కోట్ల లావాదేవీలు నడిచాయని, ఇదంతా అక్రమంగా వసూలు చేసిన మొత్తం అని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజానికి పైముగ్గురు నాయకులు కూడా ఇటీవలే ఎన్నికల కమిషన్కు తమ ఆస్తుల అఫిడవిట్లను సమర్పించారు. ఈ ముగ్గురు ఆస్తులు అన్నీ కలిపి కనీసం రూ. 40 కోట్లు కూడా దాటలేదు. కానీ కోర్టు ఏకంగా రూ. 100 కోట్ల అక్రమ ఆస్తులపై విచారణ జరపాలని ఆదేశించడంతో మిగిలిన ఆస్తులు ఎక్కడ నుంచి బయట పడతాయోనని జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్లో కేసీఆర్ తనకు కారు లేదని చూపించారు. జగదేవ్పూర్ మండలం ఎర్రవ ల్లి గ్రామంలో 37 ఎకరాల 70 గుంటల వ్యవసాయ భూమి ఉన్నట్టు కేసీఆర్ చూపించారు. ప్రస్తుతం మార్కెట్ విలువ రూ 4.5 కోట్లు అని పేర్కొన్నారు. దీనితో పాటు సిద్దిపేట మండలం మిట్టపల్లిలో 2 ఎకరాల భూమి ఉందని దీని మార్కెట్ విలువ రూ. 50 లక్షలు ఉంటుందని చెప్పారు. బంజారాహిల్స్లో 584 గజాల స్థలం, కరీంనగర్లో 1,449 గజాల స్థలం ఉందని వీటి మార్కెట్ విలువ రూ. 8.65 కోట్లు అని చెప్పారు. వీటితో పాటు రూ. 7.88 కోట్లు అప్పులు ఉన్నట్లు కేసీఆర్ చూపించారు. ఆయన భార్య పేరిట 650 గ్రాముల బంగారం ఉన్నట్లు చూపించారు. విజయశాంతి ఆస్తులు: ఇక విజయశాంతి , ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ పేరిట రూ. 29.87 కోట్లు స్థిరాస్తి ఉన్నట్లు చూపించారు. రూ 70.61 లక్షల చరాస్తి ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అప్పులు ఏమి లేవన్నారు. టయోటా(రూ.5.89 లక్షలు) వాహనం ఉన్నట్లు చూపించారు. హరీష్ ఆస్తుల వివరాలు: హరీష్రావు తన పేరిట రూ. 1.35 కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తి ఉందని, తన భార్య శ్రీనిత పేరిట రూ. 1.60 కోట్ల చరాస్తులు ఉన్నాయని చూపించారు. వాటితో పాటు తన భార్యకు రూ 1.21 కోట్ల అప్పుందని పేర్కొన్నారు. 16 లక్షల విలువ చేసే ఇన్నోవా కారు ఉందని చూపించారు. -
కేసీఆర్ ఆస్తులపై విచారణకు ఆదేశం
-
కేసీఆర్ ఆస్తులపై విచారణకు ఆదేశం
టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఆస్తులపై సీబీఐ కోర్టు విచారణకు ఆదేశించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని సీబీఐ ఎస్పీని కోర్టు ఆదేశించింది. కేసీఆర్తో పాటు విజయశాంతి, హరీష్రావు ఆస్తులపై విచారణ జరిపించాలంటూ బాలాజీ వధేరా అనే న్యాయవాది సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు, కాంగ్రెస్ నేత విజయశాంతి ముగ్గురూ పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టారని, సీబీఐతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని వధేరా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.దీంతో సీబీఐ కోర్టు ఎస్పీకి ఆదేశాలు జారీచేసింది. -
డీఎంకే ఎంపీకి జైలు శిక్ష
సాక్షి, చెన్నై:డీఎంకే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టీఎం సెల్వగణపతి ఒక్కప్పుడు అన్నాడీఎంకే నేత. ఆ పార్టీ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యూరు. 1991-96 కాలంలో అన్నాడీఎంకే ప్రభుత్వ కేబినెట్లో ఈయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో జవహర్ రోజ్గార్ యోజన పథకం నిధులను ఆయన దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కాలంలో సీఎం జయలలిత, ఆమె నెచ్చెలి శశికళతో పాటుగా మంత్రుల అవినీతి భాగోతాల్ని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డీఎంకే సర్కారు ఒక్కొక్కటిగా వెలికి తీసింది. ఇందులో సెల్వగణపతి భాగోతం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించడంతో పాటుగా శ్మశానాల్లో షెడ్ల పేరిట అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఐఏఎస్ అధికారుల సహకారంతో ఒకే సంస్థకు కాంక్రీట్ షెడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించినట్టు తేలింది. దీంతో సెల్వగణపతి, అప్పట్లో గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్గా ఉన్న ఐఏఎస్ అధికారి ఆచార్యులు, ఆ శాఖ డెరైక్టర్గా ఉన్న సత్యమూర్తి, ప్రాజెక్టు అధికారి కృష్ణమూర్తి, ఓం మురుగా సిమెంట్స్ ప్రతినిధి టీ భారతితో పాటుగా మరొకరిపై కేసు నమోదు అయింది. విచారణ : ఈ కేసు విచారణ పదిహేను సంవత్సరాలుగా చెన్నై ప్రత్యేక సీబీఐ కోర్టులో సాగుతోంది. సీబీఐ విచారణను ముగించి చార్జ్ షీట్ను కోర్టులో దాఖలు చేసింది. వాదనలు ముగియడంతో విచారణ తుది దశకు చేరింది. నాగపట్నం జిల్లాలో 100 షెడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్టు, ఒక్కో షెడ్డుకు రూ.30 వేలు చొప్పున 30 లక్షలు ఏకకాలంలో మంజూరు చేసినట్టు విచారణలో తేలింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని జవహర్ రోజ్గార్ పథకం ఈ షెడ్ల నిర్మాణానికి వర్తించదని నిర్ధారణ అయింది. ఈ షెడ్ల నిర్మాణాల్లో ప్రభుత్వ నిధులు రూ.23 లక్షలు దుర్వినియోగం అయినట్టు, శ్మశాన షెడ్ల నిర్మాణంలో అవినీతి చోటు చేసుకున్నట్టు ఆధారాలతో సహా సీబీఐ నిరూపించింది. సీబీఐ తరపున న్యాయవాది భాస్కరన్ తన వాదనను ముగించడంతో తీర్పు వెలువరిచేందుకు ప్రత్యేక న్యాయ స్థానం న్యాయమూర్తి ఎస్ మాలతి నిర్ణయించారు.తీర్పు: గురువారం న్యాయమూర్తి ఎస్ మాల తి తీర్పు వెలువరించారు. అవినీతి నిరూపణ కావడంతో సెల్వగణపతి, ఆచార్యులు, సత్యమూర్తి, కృష్ణమూర్తి, భారతీలకు మూడేళ్లకు పైగా శిక్ష పడొచ్చని సర్వత్రా భావించారు. అయితే, శిక్ష కేవలం రెండేళ్లకు పరిమితం అయింది. రూ. 25 వేలు జరిమానా విధిం చారు. ఈ జరిమానా చెల్లించని పక్షంలో నాలుగు నెలలు అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆదేశించారు. ఈ తీర్పుకు సీబీఐ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శిక్షకాలాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ శిక్ష మూడేళ్ల కన్నా, తక్కువగా ఉండడంతో అమలును తాత్కాలికంగా వాయిదా వేసినట్టు సమాచారం. ఈ కేసు విచారణ సమయంలో ఒకరు మరణించడంతో ఆయనపై కేసును కొట్టి వేశారు. డీఎంకేకు షాక్: ఒకప్పుడు అన్నాడీఎంకే నాయకుడిగా ఉన్న సమయంలో సెల్వగణపతిపై తాము వేసిన కేసు ఇప్పుడు తమ మెడకే చుట్టుకోవడం డీఎంకే వర్గాలకు షాక్ తగిలినట్టు అయింది. ప్రస్తుతం సెల్వగణపతి తమ పార్టీలో ఉండడం, ఇటీవలే ఆయనకు రాజ్య సభ పదవిని సైతం డీఎంకే అధిష్టానం కట్టబెట్టింది. ఇప్పుడు డీఎంకే ఎంపీకి శిక్ష పడ్డట్టు ప్రచారం సాగుతుండడం ఆ పార్టీ వర్గాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. ఎన్నికల వేళ ఈ శిక్ష వ్యవహారం కాస్త ప్రతి పక్షాలకు ఆయుధంగా మారింది. -
సమైక్య నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వండి సీబీఐ కోర్టుకు న్యాయవాది వినతి జగన్ పిటిషన్ విచారణార్హం కాదు.. మినహాయింపు ఇవ్వొద్దు: సీబీఐ నిర్ణయాన్ని ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని, పార్టీ విధానాన్ని ప్రజలకు వివరించాల్సి ఉందని.. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడైన వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తరచుగా కోర్టు వాయిదాలకు హాజరుకావడం అసౌకర్యంగా ఉందని ఆయన తరఫు న్యాయవాది అశోక్రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేశారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరుగనున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడిగా జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉందని తెలిపారు. జగన్మోహన్రెడ్డి తరఫున ఆయన న్యాయవాదిగా తాను కోర్టు విచారణకు హాజరవుతానని, జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. తన సంస్థల్లో పెట్టుబడుల కేసు విచారణకు సంబంధించి జగన్మోహన్రెడ్డి దాఖలు చేసుకున్న హాజరు మినహాయింపు (స్పెషల్ వకాలత్) పిటిషన్ను సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి బుధవారం విచారించారు. జగన్ తరఫున అశోక్రెడ్డి వాదనలు వినిపించారు. నిందితుని హాజరు అవసరం లేదని భావించినప్పుడు మినహాయింపు ఇచ్చే అధికారం న్యాయమూర్తికి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ఉటంకించారు. ప్రస్తుతం కేసు విచారణ అభియోగాల నమోదు దశలోనే ఉందని.. ఈ దశలో జగన్ హాజరు అవసరం లేదని, సీఆర్పీసీ సెక్షన్ 205 ప్రకారం ఆయన హాజరుకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. కోర్టు ఎప్పుడు ఆదేశించినా జగన్ హాజరవుతారని నివేదించారు. ఇదే కేసులో నిందితునిగా ఉన్న హెటిరో డెరైక్టర్ శ్రీనివాసరెడ్డి హాజరుకు కోర్టు ఇప్పటికే మినహాయింపు ఇచ్చిందని ప్రస్తావించారు. సీబీఐ తరఫున వాదన వినిపించిన స్పెషల్ పీపీ సురేంద్ర.. జగన్మోహన్రెడ్డికి హాజరు మినహాయింపు ఇవ్వడం కుదరదని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం సమన్లు జారీ చేసే కేసుల్లో మాత్రమే హాజరుకు మినహాయింపు ఇస్తారని.. ఇది వారెంట్ కేసు కాబట్టి జగన్ వేసిన పిటిషన్ విచారణార్హం కాదని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేశారు. మరోవైపు.. ఈ కేసు నుంచి తనను తొలగించాలంటూ మంత్రి గీతారెడ్డి సమర్పించిన డిశ్చార్జ్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయటానికి సీబీఐ గడువు కోరిన నేపధ్యంలో విచారణను కోర్టు ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది. -
జగదీశ్ శర్మకు నాలుగేళ్ల జైలు
రాంచీ: దాణా కుంభకోణంలో చిక్కుకుని అనర్హతకు గురైన జేడీయూ మాజీ ఎంపీ జగదీశ్ శర్మకు ఇక్కడి ప్రత్యేక సీబీఐ కోర్టు శుక్రవారం నాలుగేళ్ల కఠిన జైలు శిక్ష, రూ.4 లక్షల జరిమానా విధించింది. మరో 18 మంది అధికారులు, దాణా వ్యాపారులకు కూడా జడ్జి సీతారాం ప్రసాద్ శిక్షలు వేశారు. దాణా స్కాంకు సంబంధించి 1990లలో గోడా ఖజానా నుంచి 1.16 కోట్లను అక్రమంగా విత్డ్రా చేసిన కేసులో కోర్టు వీరిని బుధవారం దోషులుగా తేల్చింది. -
ఐఏఎస్ మన్మోహన్సింగ్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: వాన్పిక్ భూముల వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారి మన్మోహన్సింగ్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అభియోగాల నమోదు సమయంలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికే అభ్యంతరాలను చెప్పుకోవాలని ఆయనకు స్పష్టం చేసింది. తాను నిందితుడిగా సీబీఐ దాఖలుచేసిన చార్జిషీట్ను విచారణకు స్వీకరిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని, నిందితుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ మన్మోహన్సింగ్ గత ఏడాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విని గత డిసెంబర్ 6న తీర్పు వాయిదా వేసిన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవికుమార్... ఆ పిటిషన్ను కొట్టివేస్తూ బుధవారం తీర్పు వెలువరించారు. వాన్పిక్ వ్యవహారంలో చార్జిషీట్ను ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించడం అన్యాయమన్న పిటిషనర్ వాదనల్లో అర్థం లేదని పేర్కొన్నారు. అభియోగాల నమోదు సమయంలో పిటిషనర్ లేవనెత్తే అభ్యంతరాలను పరిశీలించాలని సీబీఐ కోర్టుకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ తీర్పు ప్రభావానికి లోనుకుండా నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. -
అశోక్ చవాన్ పేరు తొలగించవద్దన్న కోర్టు
ముంబై: ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో నిందితుల జాబితా నుంచి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పేరును తొలగించాలన్న సీబీఐ అభ్యర్థనను సిబిఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన చార్జిషీట్లో పేర్కొన్న 13 మంది నిందితుల పేర్ల నుంచి అశోక్ చవాన్ పేరును తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని ఈ నెల 15న సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. అమర జవాన్ల కుటుంబాల కోసం ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ 31 అంతస్తుల భవన సముదాయం నిర్మించింది. అప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఈ భవనంలో తన బంధువులకు ఫ్లాట్లు ఇప్పించడంతో ఈ కేసులో ఇరుక్కున్నారు. 2010లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన అనంతరం అశోక్ చవాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంతో సిబిఐ ఈ కుంభకోణంలో నిందితుడిగా చవాన్ను పేర్కొంది. ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపిన జ్యుడీషియల్ కమిటీ హౌసింగ్ సొసైటీ ఇళ్ల కేటాయింపుల్లో అశోక్ చవాన్, ఈ కేటాయింపుల ద్వారా లబ్ధి పొందిన ఆయన సమీప బంధువులు కుమ్మక్కుకు పాల్పడ్డారని తేల్చి చెప్పింది. -
రూ.13 లక్షల అవినీతికి రూ.75 లక్షల జరిమానా!
న్యూఢిల్లీ: రూ. 13 లక్షల అవినీతికి రూ. 75 లక్షల జరిమానా విధించి స్థానిక సీబీఐ కోర్టు సంచలనం సృష్టించింది. 17 ఏళ్ల కిందటి ఈ కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అవినీతి ఏ స్థాయిలో జరిగినా ఉపేక్షించడం సరికాదని, అది దేశాభివృద్ధినే అడ్డుకోగలదని సోమవారం వ్యాఖ్యానించింది. ఆరోగ్య, కుటుంబ సంరక్షణ శాఖలో అసిస్టెంట్ డెరైక్టర్ జనరల్(ఏడీజీ) హోదాలో పనిచేసిన విశ్వ విభూతి(67) ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని సీబీఐ 1996లో కేసు నమోదు చేసింది. -
తల్వార్ దంపతులకు జీవితఖైదు
ఘజియాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్య కేసులో దోషులుగా తేలిన రాజేశ్, నూపుర్ తల్వార్ దంపతులకు సీబీఐ కోర్టు మంగళవారం జీవితఖైదు శిక్ష విధించింది. జంట హత్యలకు సంబంధించిన ఈ కేసును అత్యంత అరుదైనదిగా పరిగణించి దోషులకు ఉరిశిక్ష విధించాలన్న సీబీఐ తరఫు వాదనలను కోర్టు తోసిపుచ్చింది. పద్నాలుగేళ్ల తమ కుమార్తె ఆరుషి, ఇంటి పనిమనిషి హేమరాజ్ హత్య కేసులో వైద్య దంపతులు రాజేశ్(49), నూపుర్(48)లను కోర్టు సోమవారం దోషులుగా తేల్చిన సంగతి తెలిసిందే. శిక్ష ఖరారుపై మంగళవారం కేవలం ఐదు నిమిషాల పాటు వాదనలు సాగాయి. అనంతరం అదనపు సెషన్స్ జడ్జి శ్యామ్లాల్.. సాయంత్రం 4.30 గంటల సమయంలో తల్వార్ దంపతులకు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించారు. సాక్ష్యాలను ధ్వంసం చేసినందుకు దంపతులిద్దరికీ మరో ఐదేళ్ల కారాగార శిక్ష, ఎఫ్ఐఆర్ నమోదు సందర్భంగా పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు రాజేశ్కు అదనంగా మరో ఏడాది జైలు శిక్ష విధించారు. ఈ కేసులో పక్కా సాక్ష్యాలు లేకపోవడంతో జడ్జి ప్రాసంగిక సాక్ష్యం (సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్)పై ఆధారపడ్డారు. నేరం జరిగిన చోట పరిస్థితులను ఆధారంగా చేసుకొని పోలీసులు చెప్పిన 26 కారణాలను పరిగణనలోకి తీసుకున్నారు. అంతకుముందు సీబీఐ తరఫున ఆర్కే సైనీ వాదిస్తూ.. అత్యంత కిరాతకంగా ఇద్దరిని హతమార్చిన తల్వార్ దంపతులకు మరణశిక్షే సరైనదని అన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును అత్యంత అరుదైనదిగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. తల్వార్ దంపతుల తరఫున తన్వీర్ మిర్ వాదిస్తూ.. నిందితులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు లేవని, అందువల్ల వారిపై దయ చూపాలని కోరారు. ఏయే సెక్షన్ల కింద శిక్షలు.. ఐపీసీ సెక్షన్ 302(హత్య), 201(సాక్ష్యాల ధ్వంసం), 34(ఉమ్మడి నేర లక్ష్యం) కింద రాజేశ్, నూపుర్ దంపతులకు శిక్ష ఖరారు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. వీటితోపాటు పనిమనిషి హేమ్రాజే తన కూతురు ఆరుషిని హత్య చేశాడని పోలీసులకు చెప్పినందుకు రాజేశ్ను సెక్షన్ 203 కింద దోషిగా తేల్చినట్లు స్పష్టంచేసింది. సెక్షన్ 302 ప్రకారం దంపతులకు జీవితఖైదుతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తున్నట్లు కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. జరిమానా కట్టని పక్షంలో ఆరు నెలలపాటు అదనంగా జైలు శిక్ష అనుభవించాలని తెలిపింది. అలాగే సెక్షన్ 201 ప్రకారం ఐదేళ్ల కఠిన కారాగారం, రూ.5 వేల జరిమానా విధించింది. రాజేశ్ ఒక్కడికి సెక్షన్ 203 కింద ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా ఖరారు చేసింది. వివిధ సెక్షన్ల కింద ఖరారు చేసిన ఈ శిక్షలన్నింటినీ ఏకకాలంలో అమలు చేయాలని జడ్జి తన ఉత్వర్వుల్లో స్పష్టంచేశారు. హైకోర్టులో సవాలు చేస్తాం.. సీబీఐ కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను అలహాబాద్ హైకోర్టులో సవాలు చేస్తామని తల్వార్ దంపతుల తరఫు న్యాయవాదులు తెలిపారు. ‘‘ఇది సరైన తీర్పు కాదు. దీన్ని కచ్చితంగా పైకోర్టులో సవాలు చేస్తాం. రాజేశ్ దంపతులను కావాలని ఇందులో ఇరికించారు’’ అని వారి తరఫు న్యాయవాది రెబెక్కా జాన్ తెలిపారు. ఈ కేసు విచారణలో సీబీఐ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, కావాలనే తల్వార్ దంపతులను వేధించిందని ఆమె చెప్పారు. ఈ కేసులో సీబీఐ మీడియాకు ఒక వాదననే వినిపిస్తూ లీకులు ఇచ్చిందని తల్వార్ దంపతుల తరఫు మరో న్యాయవాది సత్యకేతు శర్మ ఆరోపించారు. మీడియా ముందు లాయర్ల తన్నులాట తీర్పు వెలువడ్డ వెంటనే కోర్టు ఆవరణలో మీడియాకు వివరాలు వెల్లడించేందుకు లాయర్లు పోటీపడ్డారు. టీవీ కెమెరాల ముందే తన్నులాటకు దిగారు. ఒకరినొకరు తోసుకుంటూ దూషించుకున్నారు. ఇంతకూ వీరు అటు తల్వార్ దంపతుల తరఫు న్యాయవాదులు కాదు.. ఇటు సీబీఐ తరఫు న్యాయవాదులు కాదు! తీర్పు అనంతరం నరేష్ యాదవ్ అనే లాయర్ ముందుగా వచ్చి చానెళ్లతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఈయన గతంలో సీబీఐకి సహాయ లాయర్గా పనిచేశారు. నరేష్ మాట్లాడుతున్న సమయంలో ఆయన వెనకాలే నిలబడ్డ సంజయ్ త్యాగి... మరో లాయర్ కూడా మాట్లాడేందుకు యత్నించారు. దీంతో నరేష్ వ్యక్తిగత భద్రత సిబ్బంది ఒకరు సంజయ్ నుదుటిపై తుపాకీ ఎక్కుపెట్టాడు. మా లాయర్ మాట్లాడుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నావంటూ బూతు పురాణం ఎత్తుకున్నాడు. చివరికి ఇరు వర్గాలు ఒకరినొకరు నెట్టుకుంటూ పిడిగుద్దులు కురిపించుకున్నారు. కాసేపటికి వేరేవారు వచ్చి సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
‘పరువు కాపాడుకునేందుకే మమ్మల్ని బలి చేశారు’
న్యూఢిల్లీ: ఆరుషి, హేమరాజ్ హత్య కేసుల్లో రాజేశ్, నూపుర్ తల్వార్లకు యావజ్జీవ శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు మంగళవారం వెలువరించిన తీర్పుపై వారి స్నేహితులు, బంధువులు, న్యాయవాదులు తీవ్రంగా స్పందించారు. ఈ కేసు పూర్తి బలహీనంగా ఉన్నా, సీబీఐ తన పరువును దక్కించుకోవడానికే తల్వార్లను ఇరికించిందని ఆరోపించారు. సీబీఐ పూర్తిస్థాయిలో అధికారాన్ని దుర్వినియోగం చేసి, కేసును తప్పుదోవ పట్టించిందని తల్వార్ దంపతుల న్యాయవాది రెబెక్కా జాన్ ఆరోపించారు. సీబీఐ కుట్రలకు తల్వార్లు బలయ్యారని, ఈ కోర్టు తీర్పు పైకోర్టులో నిలవబోదని చెప్పారు. వృత్తిరీత్యా వైద్యులైన రాజేశ్, నూపర్ ఆస్పత్రికి వచ్చే రోగులు కూడా ఇదే తరహాలో స్పందించారు. ‘శిక్ష వేసేందుకు అవసరమైన సాక్ష్యం ఒక్కటి కూడా లేదు. పోలీసులు, సీబీఐవి అన్నీ నిరాధార ఆరోపణలు’ అని రాజేశ్ కుటుంబ స్నేహితుడు మేయర్ బల్వంత్ సింగ్ అన్నారు. ఆరుషి దగ్గరి బంధువు శ్రీ పరాడ్కర్ మాట్లాడుతూ ‘సీబీఐ సమర్పించిన సాక్ష్యాలు, తీర్పును పరిశీలిస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది. అసలు హత్యకు గల కారణమేంటో కూడా సీబీఐ వివరించలేదు. సీబీఐ తన పరువును కాపాడుకోవడానికే ఇంతగా దిగజారింది’ అని ఆరోపించారు. తన అన్నయ్య, వదినలు ఈ హత్య చేయలేదని నిరూపించేందుకు అవసరమైన సాక్ష్యాధారాలు ఎన్నో ఉన్నా వాటిని పట్టించుకోలేదని రాజేశ్ సోదరుడు దినేశ్ అన్నారు. ఆరుషి, హేమ్రాజ్ను ఇంకెవరో హత్య చేశారని, నిజమైన సాక్ష్యాలను సీబీఐ దాచిపెట్టిందని ఆరోపించారు. దొంగ సాక్ష్యా లు ద్వారా సీబీఐ కేసును తప్పుదారి పట్టించిందని దినేశ్ భార్య వందన ఆరోపించారు. హేమరాజ్ రక్తం రాజేశ్ ఆస్పత్రి కాంపౌండర్ కృష్ణ దిండుపై ఉన్న విషయాన్ని సీబీఐ వదిలేసిందన్నారు. హైబీపీ ఉన్నట్టు తెలిపిన నూపుర్ ఘజియాబాద్: దోషిగా నిర్ధారణ కావడంతో ఘజియాబాద్ దాస్నా జైలుకు వెళ్లిన నూపుర్ తల్వార్ తాను అధిక రక్తపోటు, ఆందోళనతో బాధపడుతున్నట్టు తెలిపింది. ఆమె సోమవారం రాత్రి 9.30 గంటలకు అనారోగ్యంపై ఫిరాదు చేసినట్టు జైలు వర్గాలు తెలిపాయి. ఆమెకు బీపీ, ఆందోళనతోపాటు ఎసిడిటీ ఉన్నట్టు డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఆమెకు సూచించామని, ఆరోగ్యం బాగుపడ్డాకే కోర్టుకు తరలిస్తామని జైలర్ విశేష్రాజ్ శర్మ చెప్పారు. -
సంచలనాల కేసు
న్యూఢిల్లీ:తరచూ వివాదాస్పదంగా మారడం, దర్యాప్తులో వైఫల్యం, మీడియా జోక్యం తదితర అంశాల కారణంగా ఆరుషి, హేమ్రాజ్ హత్యోదంతం దేశవిదేశాల్లో చర్చనీయాంశంగా మారడం తెలిసిందే. ఇంతగా సంచలనం సృష్టించిన ఈ కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శ్యాంలాల్ సోమవారం ప్రకటించిన తీర్పులో తల్లిదండ్రులే దోషులని ప్రకటించారు. వీరికి మంగళవారం శిక్ష ఖరారు చేస్తామని పేర్కొనడంతో పోలీసులు తల్వార్లను ఘజియాబాద్లోని దస్నా జైలుకు తరలించారు. తమ 14 ఏళ్ల కూతురు ఆరుషి, నౌకరు హేమ్రాజ్ను (45) ఆమె తల్లిదండ్రులు రాజేశ్, నూపుర్ గొంతుకోసి హతమార్చారని సీబీఐ బలంగా వాదించింది. 2008, మే 16న ఈ హత్యలు జరగడం తెలిసిందే. కేసు దర్యాప్తు పోలీసుల నుంచి సీబీఐకి చేతికి వెళ్లడం, నౌకర్ల ప్రమేయంపై వార్తలు రావడం, తరచూ కీలక మలుపులు సంభవించడంతో దీనిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆరుషి హేమ్రాజ్ ‘అభ్యంతరకర’ స్థితిలో కనిపించడాన్ని సహించలేక తల్లిదండ్రులే హతమార్చారని దర్యాప్తు అధికారులు వాదించారు. దర్యాప్తులో లోపాలు, మీడియా జోక్యం కారణంగా తాము ఈ కేసులో ఇరుక్కుపోయామని తల్వార్ దంపతులు మొదటి నుంచి పేర్కొన్నారు. అయితే వీళ్లు నేరం చేసినట్టు నిరూపించగల ఫోరెన్సిక్, భౌతిక సాక్ష్యాలేవీ తమ వద్ద లేవని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. ఆరుషి, హేమరాజ్ మరణానికి ముందు తల్వార్ దంపతులతో కనిపించారు కాబట్టే ఈ నిర్ణయానికి వచ్చామన్న సీబీఐ వాదనతో ప్రత్యేక కోర్టు ఏకీభవించింది. ఐదేళ్ల క్రితం.. 2008 మే 16 తెల్లవారుజామున ఆరుషి మృతదేహం వారి పడక గదిలోనే కనిపించింది. ఇంటి నౌకరు హేమ్రాజ్ కనిపించకపోవడంతో అతడే హంతకుడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మరునాడు హేమ్రాజ్ మృతదేహం డాబాపై కనిపించడం కేసు కీలక మలుపు తిరిగింది. అతని గొంతుపై కత్తిగాట్లు, తలపై బలమైన గాయం ఉంది. దీంతో పోలీసులు రాజేశ్ తల్వార్ను అరెస్టు చేశారు. ఇది పరువుహత్యగా భావిస్తున్నట్టు ప్రకటించారు. అయితే పోలీసులపై దర్యాప్తుపై తీవ్ర విమర్శలు రావడంతో, అప్పటి ముఖ్యమంత్రి మాయావతి ఈ కేసును సీబీఐకి అప్పగించారు. రంగంలోకి దిగిన సీబీఐ మొదట రాజేశ్ను అరెస్టు చేసింది. తదనంతరం అతని ఉద్యోగితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసింది. దర్యాప్తులో ఎటువంటి బలమైన సాక్ష్యాలూ లభించకపోవడంతో అందరూ బెయిల్పై విడుదలయ్యారు. పేలవమైన దర్యాప్తు, పలువురు జర్నలిస్టులను ఆ ఇంట్లోకి అనుమతించడంతో ఘటనాస్థలంలోని ఆధారాలు మాయమయ్యాయి. దీంతో అప్పటి సీబీఐ డెరైక్టర్ అశ్వనీకుమార్ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని నియమించారు. తల్వార్ దంపతులే హత్యలకు కారకులని ఈ బృందం స్పష్టం చేసింది. హత్య జరిగిన 19 నెలల తరువాత అంటే ఈ నెల 12న కోర్టు విచారణ ముగిసింది. ఆరుషి తల్లిదండ్రులే దోషులని నిరూపించడానికి సీబీఐ 90 మంది సాక్షులను ప్రవేశపెట్టింది. ఊహాజనిత కారణాలతోనే సీబీఐ ఈ నిర్ధారణకు వచ్చిందని తల్వార్ దంపతులు మొదటి నుంచి వాదించారు. కోర్టు వద్ద భారీ భద్రత సంచలనం సృష్టించిన కేసు కావడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఘజియాబాద్ కోర్టు వద్ద సోమవారం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా మీడియాను కూడా కోర్టు గదిలోకి అనుమతించలేదు. పోరాటం కొనసాగిస్తాం: సీబీఐ కోర్టు తీర్పు వినగానే తల్వార్ దంపతులు కోర్టు గదిలోనే విలపించారు. తాము అమాయకులమని, న్యాయపోరాటం కొనసాగిస్తామని కాసేపటికి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నూపుర్ తల్వార్ సోదరి వందన కూడా ఇదే మాట చెప్పారు. సీబీఐ దర్యాప్తు లోపభూయిష్టమని కోర్టు బయట విలేకరులకు స్పష్టం చేశారు. అబద్ధాలన్నింటినీ అల్లి సీబీఐ వాదనలను వినిపించిందని ఆరోపించారు. సీబీఐ న్యాయవాది ఆర్కే సైనీ స్పందిస్తూ ప్రాసంగిక సాక్ష్యాల ఆధారంగానే కోర్టు తల్వార్లను దోషులగా తేల్చిందన్నారు. తల్వార్ల న్యాయవాది రెబెక్కా మాట్లాడుతూ పైకోర్టులో తమకు తప్పక న్యాయం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎప్పడేం జరిగింది 2008, మే 16: ఆరుషి ఇంట్లోనే ఆమె మృతదేహం కనిపించింది. గొంతు కోసి ఆమెను చంపినట్టు తేలింది. నౌకరు హేమ్రాజే హంతకుడని భావించారు. మే 17: తల్వార్ భవంతి డాబాపై హేమ్రాజ్ మృతదేహం కూడా కనిపించింది. మే 18: శస్త్రచికిత్సలకు వినియోగించే కత్తులతో హత్యలు చేశారని పోలీసుల ప్రకటన. ఇంట్లోని వారిపైనే అనుమానాలున్నాయని వెల్లడి. మే 23: ఆరుషి తండ్రి రాజేశ్ తల్వార్ అరెస్టు మే 31: కేసు దర్యాప్తు సీబీఐ చేతికి జూన్ 13: తల్వార్ల కాంపౌడర్లు కృష్ణ, రాజేశ్ను సీబీఐ అరెస్టు చేసింది. తల్వార్ల పొరుగింట్లో పనిచేసే విజయ్ మండల్ను కూడా మరో పది రోజుల తరువాత అరెస్టు చేశారు. జూలై 12: సాక్ష్యాల లేమి కారణంగా ఘజియాబాద్ కోర్టు రాజేశ్కు బెయిల్ ఇచ్చింది. జనవరి 5: తల్వార్ దంపతులకు నార్కో పరీక్షలు నిర్వహించాలని కోర్టును సీబీఐ కోరింది. డిసెంబర్ 29: కోర్టుకు కేసు ముగింపు నివేదిక సమర్పణ. తగిన సాక్ష్యాధారాలు లేనప్పటికీ రాజేశే ప్రధాన నిందితుడని ప్రకటన 2011, జనవరి 25: ఘజియాబాద్ కోర్టు పరిసరాల్లో రాజేశ్పై దాడి జరిగింది. ఫిబ్రవరి 9: సీబీఐ ముగింపు నివేదికను తిరస్కరించిన ప్రత్యేక కోర్టు తల్వార్ దంపతులపై దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. సాక్ష్యాలను ధ్వంసం చేసినట్టు కూడా తల్వార్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2012, మార్చి 14: రాజేశ్ బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ వాదనలు వినిపించింది. ఏప్రిల్ 30: నూపుర్ తల్వార్ అరెస్టు మే 3: నూపుర్ బెయిల్ను సెషన్స్కోర్టు తిరస్కరించింది మే 25: నిందితులపై ఘజియాబాద్ కోర్టు హత్య, సాక్ష్యాల విధ్వంసం, కుట్ర అభియోగాలు నమోదు చేసింది. సెప్టెంబర్ 25: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నూపుర్కు బెయిల్ 2013, ఏప్రిల్: తల్వార్లే ఆరుషి, హేమ్రాజ్ను చంపారని సీబీఐ వాదించింది. హత్యకు ముందు ఆరుషి, హేమ్రాజ్ ‘అభ్యంతరకర స్థితి’ కనిపించారని కోర్టుకు తెలిపింది. మే 3: సీబీఐ మాజీ జేడీ అరుణ్కుమార్ సహా 14 సాక్షుల హాజరు కోసం సమన్లు జారీ చేయాలన్న డిఫెన్స్ న్యాయవాది విజ్ఞప్తిని సీబీఐ వ్యతిరేకించింది. మే 6: డిఫెన్స్ న్యాయవాది అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. తల్వార్ దంపతుల వాంగ్మూలాల నమోదుకు ఆదేశించింది. అక్టోబర్ 18: సీబీఐ తన వాదనలను ముగించింది. తల్వార్లు తమను తప్పుదోవ పట్టించారని కూడా తెలిపింది. నవంబర్ 12: న్యాయమూర్తి తన నిర్ణయాన్ని ఈ నెల 25కు వాయిదా వేశారు. నవంబర్ 25: రాజేశ్, నూపుర్ తల్వార్ దోషులేనని న్యాయమూర్తి ప్రకటన. శిక్షను మంగళవారం ఖరారు చేస్తామని వెల్లడి. -
వైఎస్ జగన్కు ఊరట
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెన్నై వెళ్లేందుకు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయనకు ఈ అనుమతితో కొంత ఊరట లభించింది. చెన్నై వెళ్లేందుకు వీలుగా తన బెయిలు నిబంధనలు సడలించాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. జగన్ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ జాతీయ, ప్రాంతీయ నాయకులను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సహకరించమని కోరుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా జగన్ చెన్నై వెళ్లి ముఖ్యమంత్రి జయలలితను, ఇతర నాయకులను కలుస్తారు. -
ముంబై,భువనేశ్వ్ర్ వెళ్లేందుకు జగన్కు అనుమతి
-
కోల్కతా, లక్నో వెళ్లేందుకు జగన్కు కోర్టు అనుమతి
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి కోల్కతా, లక్నో వెళ్లేందుకు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. జగన్ రేపు కోల్కతా వెళతారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలుస్తారు. అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్లోని లక్నో వెళతారు. అక్కడ సమాజ్వాది పార్టీ అధినేత మూలాయం సింగ్ యాదవ్ను, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ను కలుస్తారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ జాతీయ నాయకులను కలుస్తున్నదానిలో భాగంగా జగన్ వారిని కలుస్తారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను జగన్ వారికి వివరిస్తారు. పార్లమెంటులో విభజన బిల్లును వ్యతిరేకించాలని వారిని కోరతారు. -
మమత, అఖిలేష్ లను కలవనున్న జగన్
-
అబూసలేం దోషి
సాక్షి, హైదరాబాద్: నకిలీ పాస్పోర్టు కేసులో మాఫియా డాన్ అబూసలేంను దోషిగా సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. అబూసలేంకు విధించే శిక్ష ఈనెల 28న ఖరారవుతుందని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రమణ నాయుడు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో 39 మంది సాక్షుల వాంగ్మూలాలను, 60 డాక్యుమెంట్లను పరిశీలించి అనంతరం, భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లోని 420, 419, 471, 468 రెడ్విత్ 120(బి) సెక్షన్ల కింద అబూసలేంను దోషిగా నిర్ధారించినట్టు కోర్టు సోమవారం పేర్కొంది. కర్నూలు చిరునామాతో రమిల్కమిల్ మాలిక్ అన్న పేరుతో అబూసలేం, అతని భార్య సమీరాజుమానీ, ప్రియురాలు సినీ నటి మోనికాబేడీ 2001లో నకిలీ పాస్పోర్టులను పొందారు. అనంతరం వారు పోర్చుగల్కు పరారయ్యారు. వారిపై రెడ్కార్నర్ నోటీసులు జారీ కావడంతో పోర్చుగల్ రాజధాని లిస్బన్లో 2002 సెప్టెంబర్లో అక్కడి పోలీసులు వారిని అరెస్టు చేశారు. అనంతరం 2005 నవంబర్ 11న వారిని పోర్చుగల్ నుంచి సీబీఐ అధికారులు మనదేశానికి తీసుకొచ్చారు. ఇదే కేసులో మోనికాబేడీకి కోర్టు గతంలో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. నిందితులుగా ఉన్న కర్నూలు ఎస్పీ కార్యాలయ ఉద్యోగి శ్రీనివాస్, హెడ్కానిస్టేబుల్ సత్తార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహ్మద్ యూనస్, పోస్టుమన్ గోకారీ సాహెబ్లకు ఇప్పటికే సీబీఐ కోర్టు శిక్ష విధించింది. కేసులో రెండో నిందితురాలైన అబూసలేం భార్య సమీరా జుమానీ ఆచూకీని వరకు సీబీఐ కనిపెట్టదు. దీనితో ఆమెపై విచారణ పెండింగ్లో ఉంది. ఇక, ముంబై జైల్లోని అబూసలేంను సోమవారం ప్రత్యేక కోర్టులో హాజరుపర్చాల్సి ఉన్నా...భద్రతా కారణాల రీత్యా హాజరుపర్చలేదు. ఈనెల 28న శిక్ష ఖరారు చేయనున్న నేపథ్యంలో అబూసలేంను కోర్టులో హాజరుపర్చనున్నారు. -
అబూసలేంను దోషిగా నిర్ధారించిన సిబిఐ కోర్టు
హైదరాబాద్: నకిలీ పాస్పోర్టు కేసులో అండర్ వరల్డ్ డాన్ అబూసలేంను సిబిఐ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ నెల 28న కోర్టు శిక్ష ఖరారు చేస్తుంది. ఉత్తరప్రదేశ్లోని అజామ్ఘర్ జిల్లాకు చెందిన అబూసలేం కర్నూలు వాసిగా నకిలీ పత్రాలు సృష్టించి పాస్పోర్టు పొంది విదేశాలకు పారిపోయాడు. దాంతో అతని పేరు మోస్టు వాంటెడ్ జాబితో చేరింది. 2002 సెప్టెంబర్ 20న పోర్చ్గల్లో సినీనటి మోనికాబేడీతోపాటు అతనిని అరెస్టు చేశారు. 2004లో ఇతర కేసుల విచారణ నిమిత్తం పోర్చ్గల్ కోర్టు అతనిని భారతదేశం పంపడానికి అనుమతి ఇచ్చింది. అబూసలేంపై దాదాపు 50 కేసులు ఉన్నాయి. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో కూడా అతను నిందితుడు. -
కోర్టుకు హాజరైన జగన్, సబిత
సాయిరెడ్డి, నిమ్మగడ్డ, శ్యాంప్రసాద్రెడ్డి, ఐఏఎస్లు కూడా.. ‘ఇందూ ప్రాజెక్టు’ కేసు విచారణ డిసెంబర్ 3కు వాయిదా సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో ఇందూ ప్రాజెక్టు పెట్టుబడులకు సంబంధించిన కేసులో వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సీబీఐ ప్రధాన కోర్టుల ఇన్చార్జి న్యాయమూర్తి, మూడో అదనపు ప్రత్యేక జడ్జి రమణనాయుడు ముందు హాజరయ్యారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డి, ఇందూ గ్రూపు సంస్థల చైర్మన్ ఐ.శ్యామ్ప్రసాద్రెడ్డి, సీనియర్ ఐఏఎస్లు కె.రత్నప్రభ, బీపీ ఆచార్య, ఏపీఐఐసీ మాజీ సీఈ దామెర పార్థసారధి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఇందూ సంస్థల ఆడిటర్ సీవీ కోటేశ్వరరావులు కూడా కోర్టు ఎదుట హాజరయ్యారు. కోర్టు నిర్దేశించిన మేరకు వ్యక్తిగత పూచీకత్తుతో పాటు రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లను జగన్, సాయిరెడ్డిల తరఫు న్యాయవాది అశోక్రెడ్డి.. శ్యాంప్రసాద్రెడ్డి, ఆయనకు చెందిన కంపెనీలు ఇందూ టెక్జోన్, ఎస్పీఆర్, భూమి రియల్ ఎస్టేట్ల తరఫు న్యాయవాది ఎంజే శివరామకృష్ణ సమర్పించారు. సబిత, నిమ్మగడ్డ, ఆయన కంపెనీ జీ-2 కార్పొరేట్ సర్వీస్ల తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు, బీపీ ఆచార్య తరఫు న్యాయవాది సురేందర్రావు, రత్నప్రభ తరఫు న్యాయవాది వీర్రాజు, పార్థసారధి తరఫు న్యాయవాది కిరణ్కుమార్, కోటేశ్వరరావు తరఫు న్యాయవాది నళినీ కుమార్లు పూచీకత్తు బాండ్లు సమర్పించారు. వాటిని ఆమోదించిన న్యాయమూర్తి తదుపరి విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేశారు. కాగా, లేపాక్షి సంస్థపై దాఖలైన చార్జిషీట్కు సంబంధించి జగన్, మంత్రి గీతారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సహా నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారులు, ఇతర నిందితులు ఈ నెల 15న కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే మొహర్రం సందర్భంగా 15న ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో 14న హాజరయ్యేందుకు అనుమతించాలని జగన్ తరఫు న్యాయవాది నివేదించారు. ఈనెల 16 నుంచి ఢిల్లీ వెళ్లి జాతీయ పార్టీల నేతలను కలవాలని జగన్ నిర్ణయించుకున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి... ఈ కేసును విచారిస్తున్న రెండో అదనపు ప్రత్యేక కోర్టు జడ్జి దృష్టికి గురువారం ఈ విషయాన్ని తీసుకెళ్లాలని సూచించారు. జగన్ను చూసి కన్నీరు పెట్టిన మహిళ కోర్టు విచారణకు హాజరై తిరిగి వెళ్తున్న జగన్ను చూసిన ఓ మహిళ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టింది. ఇది గమనించిన జగన్ ఆ మహిళను ఆప్యాయంగా పలకరించి ఓదార్చారు. జై జగన్ అంటూ కొందరు మహిళలు నినాదాలు చేయడంతో వారి దగ్గరకు కూడా వెళ్లి పలకరించారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి సామాన్యులెవరినీ న్యాయస్థానం ఉన్న గగన్విహార్ భవన సముదాయంలోకి అనుమతించలేదు. అయినప్పటికీ అతికష్టంగా భవన ప్రవేశమార్గం వద్దకు చేరుకున్న కొందరు ప్రజలు జగన్ను చూసేందుకు, కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. అందరికీ అభివాదం చేసిన జగన్ అక్కడి నుంచి నిష్ర్కమించారు. -
25న ఆరుషి హత్య కేసుపై తీర్పు
ఘజియాబాద్: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఆరుషి-హేమరాజ్ జంట హత్యల కేసులో సీబీఐ కోర్టు ఈ నెల 25న తీర్పు వెలువరించనుంది. కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుషి తల్లిదండ్రులు రాజేశ్ తల్వార్, నుపుర్ తల్వార్ల తరఫు న్యాయవాది తుది వాదనలు వినిపించారు. ఈ కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి సెషన్స్ జడ్జీ శ్యామ్లాల్ తీర్పును 25కు వాయిదా వేశారు. ఆది నుంచి ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో సీబీఐ కూడా అనేక సందర్భాల్లో భిన్నమైన ప్రకటనలు చేసింది. చివరకు తల్వార్ దంపతులే ఆరుషి-హేమరాజ్లను చంపారన్న తన వాదనకు కట్టుబడడంతో విచారణ తుది అంకానికి చేరింది. ఇక డిఫెన్స్ న్యాయవాది మాత్రం తల్వార్ దంపతులకు కావాలనే ఈ కేసులో ఇరికించారని వాదించారు. ఇలా 15 నెలలుగా విచారణ సాగుతున్న ఈ కేసుపై మరో 12 రోజుల్లో తీర్పు వెలువడనుంది. -
జగన్ పిటిషన్పై ముగిసిన విచారణ: తీర్పు 15కు వాయిదా
హైదరాబాద్: దేశవ్యాప్త పర్యటనకు అనుమతించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ ప్రత్యేక కోర్టులో ఈరోజు వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే లక్ష్యంతో ఈనెల 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. సమైక్యాంద్రకు మద్దతు కూడగట్టేందుకు తాను పశ్చిమబెంగాల్తో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉందని, అందువల్ల బెయిల్ షరతులను ఆ మేరకు సడలించాలని కోరుతూ ఈ నెల 6న జగన్ పిటిషన్ దాఖలు చేశారు. తన బెయిల్ షరతులను గత నెల 30న సీబీఐ ప్రత్యేక కోర్టు సడలించిన విషయాన్ని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగాను, ఢిల్లీ వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా జాతీయ పార్టీల నేతలను, పార్లమెంట్ సభ్యులను కలిసి మద్దతు కూడగట్టాల్సి ఉందని వివరించారు. పార్లమెంట్ సభ్యునిగా నియోజకవర్గంతో పాటు పార్టీ అధ్యక్షునిగా ప్రజలకు సేవలు అందించే హక్కును కాలరాయకూడదని పేర్కొన్నారు. తనపై సీబీఐ మోపినవన్నీ ఆరోపణలేనని, నేరం రుజువు కాలేదని తెలిపారు. కోర్టు విధించిన షరతులను పాటిస్తానని, రాజకీయ కారణాల రీత్యా ఇతర రాష్ట్రాల్లో పర్యటించేందుకు వీలుగా బెయిల్ షరతులు సడలించాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్పై విచారణను సీబీఐ కోర్టు ఈ రోజుకు వాయిదా వేసింది. ఈరోజు వాదనలు ముగిసిన తరువాత తీర్పు కోర్టు 15వ తేదీకి వాయిదా వేసింది. -
పెన్నా కేసులో కోర్టుకు హాజరైన జగన్
సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెన్నా సిమెంట్స్ పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సీబీఐ రెండో అదనపు ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డి, పెన్నా సంస్థల చైర్మన్ పి.ప్రతాప్రెడ్డిలు కూడా కోర్టు ముందు హాజరయ్యారు. న్యాయమూర్తి నిర్దేశించిన మేరకు వ్యక్తిగత పూచీకత్తుతోపాటు రూ.25వేల చొప్పున వీరి తరఫున ఇద్దరు పూచీకత్తు బాండ్లను సమర్పించారు. నిందితుల జాబితాలో ఉన్న పీఆర్ ఎనర్జీస్, పెన్నా సిమెంట్స్, పయనీర్ హోల్డింగ్స్ సంస్థల తరఫున ప్రతాప్రెడ్డి పూచీకత్తు బాండ్లు సమర్పించారు. వాటిని ఆమోదించిన న్యాయమూర్తి ఎంవీ రమేష్.. తదుపరి విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేశారు. ఇందూ సంస్థ పెట్టుబడుల వ్యవహారంపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లో ఈనెల 13న జగన్ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. -
బెయిల్ షరతులు సడలించండి: నిమ్మగడ్డ
సాక్షి, హైదరాబాద్: వ్యాపార అవసరాల కోసం నెల రోజులపాటు హైదరాబాద్ విడిచి వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటషన్ దాఖలు చేశారు. వ్యాపార కార్యకలాపాల కోసం ఇతర ప్రాం తాలకు వెళ్లాల్సి ఉన్నందున హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న షరతును సడలించాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణను కోర్టు ఈనెల 7కు వాయిదా వేసింది. విజయరాఘవకు బెయిల్ షరతుల సడలింపు: ఎమ్మార్ కేసులో నిందితునిగా ఉన్న ఎమ్మార్ ఎంజీఎఫ్ ఫైనాన్స్ విభాగం ఉన్నతాధికారి విజయరాఘవ బెయిల్ షరతులను సీబీఐ కోర్టు శుక్రవారం సడలించింది. శనివారం నుంచి 2014 ఏప్రిల్ 26 వరకు రాష్ట్ర వ్యాప్తంగా, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రలో పర్యటించేందుకు కోర్టు అనుమతించింది. -
వైఎస్ జగన్ బెయిల్ షరతులు సడలించిన కోర్టు
-
జగన్ బెయిల్ షరతులు సడలించిన కోర్టు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి బెయిలు షరతులను నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు సడలించింది. రాష్ట్రమంతటా పర్యటించేందుకు కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా ఆయన ఢిల్లీ వెళ్లేందుకు కూడా కోర్టు అవకాశం కల్పించింది. అయితే ఎక్కడికి వెళ్లేది రెండు రోజులు ముందు కోర్టుకు, సీబీఐకి తెలపాలని, అలాగే ఫోన్లో అందుబాటులో ఉండాలని షరతు విధించింది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్ష్యుడుగా తనపై ఉందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు విన్నవించారు. ఓ పార్టీ అధ్యక్షుడిగా ప్రజల మనోభావాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఎంపీగా ఉన్నందును ఢిల్లీ వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. విన్నపాన్ని పరిశీలించిన కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. దీంతో జగన్ రాష్ట్రమంతటా పర్యటించి వరద బాధితులను పరామర్శించే అవకాశం ఉంది. -
రక్షణశాఖ మాజీ అధికారులకు జైలు
న్యూఢిల్లీ: ఇద్దరు మాజీ రక్షణ శాఖ అధికారులతో పాటు ఓ మాజీ సైనికాధికారికి ఢిల్లీ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. సైన్యంలో డిప్యూటీ డెరైక్టర్ జనరల్గా పనిచేసిన మాజీ లెఫ్టినెంట్ కల్నల్ పీఆర్ఎస్ రావు, అసిస్టెంట్ ఆడిట్ అఫీసర్ ఏకే శర్మ, భారత సైన్యం నుంచి 1991లో పదవీ విరమణ పొందిన ఐబీ ఉప్పల్లు ప్రభుత్వానికి 7.3 కోట్ల రూపాయల నష్టం కలిగించారని అభియోగం. సరఫరా కాని సరుకులకు చెల్లింపులు చేసినట్లు బిల్లులు సృష్టించారనే అభియోగంతో సీబీఐ 1998లో 12 మందిని అరెస్టు చేసింది. విచారణ క్రమంలో 2005లో వీరిలో సీనియర్ ఆడిటర్, అకౌంట్స్ ఆఫీసర్, గుమస్తాలను ఈ కేసులోంచి మినహాయిం చింది. మోసపూరిత కుట్రతో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని రావు, శర్మలతో పాటు మరో ఇద్దరి మీద అభియోగ విచారణ కొనసాగింది. ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాలతో నేరం రుజువు కావడంతో సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి దోషులకు నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధించారు. -
విజయసాయి రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు కోర్టు అనుమతి
హైదరాబాద్: ఆడిటర్ విజయసాయి రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతించిన ప్రకారం 2014 మార్చి 31 వరకు ఆయన ఢిల్లీ వెళ్లిరావడానికి అవకాశం ఉంటుంది. సిబిఐ కోర్టు విజయసాయి రెడ్డికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసిన విషయం తెలసిందే. -
ఆడిటర్ విజయసాయి రెడ్డికి బెయిల్ మంజూరు
హైదరాబాద్: ఆడిటర్ విజయసాయి రెడ్డికి నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల రూపాయలు, ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ వదిలి వెళ్లకూడదని కూడా కోర్టు షరతు విధించింది. -
నాంపల్లి కోర్టుకు బయలుదేరిన జగన్
-
చట్టం తన పని చేసింది
న్యూఢిల్లీ: దాణా కుంభకోణం కేసులో లాలూతోపాటు 43 మందిని దోషులుగా నిర్ధారిస్తూ రాంచీ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ స్వాగతించగా, కాంగ్రెస్ ఆచితూచి స్పందించింది. 10 కోట్ల బీహార్ ప్రజల పక్షాన న్యాయం నిలిచిందని బీజేపీ పేర్కొంది. బీహార్ సీఎం నితీశ్కుమార్ తీర్పుపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. చట్టం అందరికీ ఒకేలా ఉంటుందని, ఇందులో ఎలాంటి వివక్ష ఉండదని కాంగ్రెస్ పేర్కొంది. జార్ఖండ్లో లాలూ పార్టీ ఆర్జేడీతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈకేసులో చట్టం తనపని తాను చేసుకుపోయిందని కాంగ్రెస్ చెప్పింది. భవిష్యత్తులో ఆర్జేడీతో పొత్తు విషయంలో ఇప్పుడే ఇతమిత్థంగా చెప్పలేమంది. ‘భవిష్యత్తులో బీహార్లో, జార్ఖండ్లో ఆర్జేడీతో పొత్తుపై ఇప్పుడే స్పందించడం తొందరపాటవుతుంది. పొత్తు విషయంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ ఢిల్లీలో మీడియాతో పేర్కొన్నారు. మాకెన్ స్పందనతో భవిష్యత్లో కాంగ్రెస్... లాలూకు చెందిన ఆర్జేడీతోగానీ లేదా ఆయన ప్రత్యర్థి పార్టీ అయిన జేడీయూ(ఎన్డీఏ మాజీ భాగస్వామి)తోగానీ పొత్తుపెట్టుకోవచ్చన్న ఊహాగానాలు చెలరేగాయి. చరిత్రాత్మకం: రాజీవ్ ప్రతాప్ రూఢీ, బీజేపీ ‘ఈ తీర్పు చరిత్రాత్మకం. గత పదేళ్ల నుంచి యూపీఏ ప్రభుత్వంతో, ప్రధాని మన్మోహన్, సోనియా, రాహుల్గాంధీలతో రాజీ కుదుర్చుకొని రాజకీయంగా రాజీలు పడుతూ లాలూప్రసాద్ తనను తాను రక్షించుకుంటున్నట్లు అందరూ చూస్తున్నారు. ప్రభుత్వంతో ఉంటూ చట్టం నుంచి తప్పించుకొంటున్నారు. 2జీ, కామన్వెల్త్, రైల్గేట్, బొగ్గు కుంభకోణాల్లోనూ ఇలాంటి తీర్పే వస్తుందా?’ బాధాకరం: దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ లాలూను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు ఇవ్వడం బాధాకరంగా ఉంది. ఆయన పైకోర్టులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారన్న ఆశాభావం ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎంతోకాలంగా నమ్మకమైన భాగస్వామి. విశ్వసనీయతకు సవాల్: రాజ్నాథ్సింగ్, బీజేపీ అధ్యక్షుడు నాయకుల విశ్వసనీయతకు ఈ తీర్పు పెద్ద సవాల్లాంటిది. దీనిని బీజేపీ చాలెం జ్గా స్వీకరిస్తుంది. ప్రజలు అవినీతిరహిత రాజకీయాలను కోరుకుంటున్నారు. అత్యాశకు పోయారు: శరద్ యాదవ్, జేడీయూ అధ్యక్షుడు అత్యాశకుపోయి ప్రజాధనాన్ని దోచుకున్నందుకు లాలూ తగిన మూల్యం చెల్లించుకున్నారు. అధికారాన్ని వ్యక్తిగతానికి వాడుకునే వారికి ఇదో గుణపాఠం. ముగ్గురిపై ‘అనర్హత’ వేటు! దోషులుగా నిర్ధారణ అయిన ఎంపీలు తక్షణమే పదవులకు అనర్హులవుతారన్న సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో అనర్హత వేటు ఎదుర్కోనున్న ఎంపీల సంఖ్య మూడుకు చేరింది. దాణా కేసులో దోషులుగా తేలిన లాలూ అనర్హత వేటు పడనున్న రెండో ఎంపీగా, జేడీయూ ఎంపీ జగదీశ్ శర్మ మూడో ఎంపీగా రికార్డులకెక్కే అవకాశముంది. త్రిపుర ఎంబీబీఎస్ సీట్ల కోటాకు సంబంధించిన అవినీతి కేసులో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రషీద్ మసూద్ ను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు రెండు వారాల కిందట దోషిగా నిర్ధారించడం తెలిసిందే. -
ఇడుపులపాయ వెళ్లేందుకు జగన్ కు కోర్టు అనుమతి
-
ఇడుపులపాయ వెళ్లేందుకు జగన్కు అనుమతి
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ వెళ్లేందుకు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. తన బెయిల్ షరతులను సడలించాలని, వచ్చే నెల 1, 2 తేదీలలో ఇడుపులపాయ, 4న గుంటూరు వెళ్లేందుకు అనుమతించాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు ఈరోజు విచారించింది. జగన్ పిటిషన్పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. జగన్ బెయిల్పై ఆంక్షలు సడలించవద్దని కోరారు. సాక్షులంతా హైదరాబాద్ వెలుపలే ఉన్నారని, జగన్ పలుకుబడి ఉన్న వ్యక్తి అయినందున వారిని ప్రభావితం చేయవచ్చనని సిబిఐ న్యాయస్థానానికి తెలిపింది. ఈ కేసులో నిందితులు ఇంకా జైల్లోనే ఉన్నారని, వారి బెయిల్ పిటిషన్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని తెలిపింది. బెయిల్ షరతులు సడలిస్తే తమ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని కౌంటర్ పిటిషన్లో వెల్లడించింది. సీబీఐ కౌంటర్ పిటిషన్పై జగన్ తరపు న్యాయవాది సుశీల్ కుమార్ కోర్టులో వాదనలు వినిపించారు. జగన్పై ఉన్నది హైలీ టెక్నికల్ కేసు అని, సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం లేదని, ప్రతి సాక్ష్యం డాక్యుమెంట్గా రికార్డు అయిందన్నారు. 70 మంది నిందితుల్లో 2౦ మందిని నిర్దోషులని సీబీఐ పేర్కొన్నట్లు వివరించారు. 9 కంపెనీల్లో క్విడ్ ప్రో కోనే లేదని సీబీఐ చెప్పిందన్నారు. కోర్టు కల్పించిన స్వేచ్చను తాము కోల్పోమని, ఎట్టి పరిస్థితుల్లోనూ షరతులు ఉల్లంఘించమని సుశీల్ కుమార్ న్యాయస్థానానికి విన్నవించారు. తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించడానికే జగన్ ఇడుపులపాయకు వెళ్లనున్నారని తెలిపారు. ఇడుపులపాయ నుంచి తిరిగి హైదరాబాద్ వస్తారని ఆ తర్వాత 4వ తేదీన గుంటూరు వెళ్తారని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఇడుపులపాయకు వెళ్లేందుకు జగన్కు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో సుదీర్ఘ కాలం తరువాత జగన్ ఇడుపులపాయ వెళ్లనున్నారు. తన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధివద్ద జగన్ నివాళులర్పించనున్నారు. -
బీసీసీఐ ప్రెసిడెంట్ శ్రీనివాసన్కు సమన్లు జారీ
హైదరాబాద్: నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఇండియా సిమెంట్ ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకుంది. బీసీసీఐ ప్రెసిడెంట్ శ్రీనివాసన్తో సహా మిగతా నిందితులకు సమన్లు జారీ చేసింది. నవంబర్ 1న కోర్టు ఎదుట హాజరుకావాలని వారిని నాంపల్లి కోర్టు ఆదేశించింది. విజయసాయిని పీటీ వారెంట్పై హాజరుపర్చాలని సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఏడోసారి బెయిల్ ఇచ్చిన సిబిఐ కోర్టు
-
నేటి మధ్యాహ్నం 2 గంటల తర్వాత జైలు నుంచి విడుదల
-
జన ఘన సంబరలు
కారుమబ్బులు తొలిగాయి. సుదీర్ఘ గ్రహణం వీడింది. న్యాయం నిలిచింది. ధర్మం గెలిచింది. రాహు కేతువుల్లా కాంగ్రెస్, టీడీపీలు అటు సీబీఐతో, ఇటు తమ తాబేదారు మీడియాతో కలిసి పన్నుతూ వచ్చిన కుయుక్తులకు తెరపడింది. 484 చీకటి రాత్రులను చీల్చుకుంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు తిరిగి జనం మధ్యకు రానున్నారు. ఆయనకు సీబీఐ కోర్టు బెయిల్ ఇచ్చింది. సోమవారం జగన్కు బెయిల్ వచ్చిన ఆనందంలో వైఎస్ విజయమ్మ, షర్మిల, భారతిసోమవారం లోటస్పాండ్లో మీడియాతో మాట్లాడుతున్న విజయమ్మ. చిత్రంలో గురునాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి తదితరులుషర్మిల, భారతిల ఆలింగనంమనవరాళ్లతో సంతోషం పంచుకుంటున్న విజయమ్మవిశాఖలో.. నృత్యాలతో మహిళ కార్యకర్తలుకర్నూలు స్టేట్బ్యాంక్ సర్కిల్లో..మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో.. ప్రకాశం జిల్లా ఒంగోలులో..ప్రకాశం జిల్లా ఒంగోలులో...నిజామాబాద్లో స్వీట్లు తినిపించుకుంటున్న కార్యకర్తలుకరీంనగర్లో..వైఎస్ఆర్ జిల్లా కడపలో...వరంగల్ జిల్లా హన్మకొండలో..పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో..ఖమ్మంలో..తమిళనాడులోని చెన్నైలో..అనంతపురంలో సంబరాలువిజయనగరంలో కొబ్బరికాయలు కొడుతున్న కార్యకర్తలుజగన్ అరెస్ట్ను నిరసిస్తూ నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో 483 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్న అభిమానుల్లో ఆనందోత్సాహం -
జై జగన్..
వరంగల్ సిటీ, న్యూస్లైన్ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డికి సోమవారం సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జిల్లావ్యాప్తంగా సంబరాలు పెద్ద ఎత్తున సాగాయి. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. యువనేతకు బెరుుల్ రావడం ప్రజావిజయమని పేర్కొంటూ డోర్నకల్ మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. నున్నా రమణ, ఉన్నం సత్యం, పోటు జనార్ధన్, పోకల శేఖర్ పాల్గొన్నారు. కురవిలో బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. మహబూబాద్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. స్వీట్లు పంపిణీ చేసి... టపాసులు కాల్చుతూ.. బ్యాండ్ మేళా మధ్య సంతోషాన్ని పంచుకున్నారు. వైఎస్సార్ విగ్రహం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టారు. జెన్నారెడ్డి మహేందర్రెడ్డి, కర్నావత్ రాధావెంకన్న నాయక్, బోళ్ల రాకేష్రెడ్డి, రాములు నాయక్, గురుమూర్తి, శ్రీనివాస్రెడ్డి, గూడూరులో రవీందర్యాదవ్, సర్ధార్ తదితరులు పాల్గొన్నారు. కేసముద్రంలో సంకెపల్లి శ్రీనివాసరెడ్డి, బషీర్, లాలూ నాయక్ మిఠాయిలు పంపిణీ చేశారు. హన్మకొండ బాలసముద్రంలో వైఎస్సార్ సీపీ యూత్ నేతల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. హన్మకొండ చర్చి, జులైవాడ, ఎస్డీఎల్సీఈ సెంటర్లో బాణసంచా కాల్చి, ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. యూత్ జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్రెడ్డి, జిల్లా నాయకులు కల్యాణ్రాజ్, సాల్మన్రాజు, యెడ్ల రఘువీర్రెడ్డి, దయాకర్, ఆశం కళ్యాణ్, గుండ్ల రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ మండిబజార్లో పార్టీ నాయకుడు సయ్యద్ మసూద్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. జనగామ ఆర్టీసీ చౌరస్తాలో విద్యార్థి సంఘం, వైఎస్సార్సీపీ నాయకులు టపాసులు కాల్చడంతోపాటు స్వీట్లు పంపిణీ చేశారు. పట్టణ నాయకుడు చెప్పాల అగస్తీన్ తుమ్మ భాస్కర్, కరుణాకర్, గుగ్గిల్ల శ్రీధర్ పాల్గొన్నారు. స్టేషన్ఘన్పూర్ మండల కేంద్రం, ఇప్పగూడెం, పల్లగుట్ట గ్రామాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు దైద కిష్టఫర్, కందికొండ బిక్షపతి, అకినపెల్లి రవీందర్, యేసుబాబు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ములుగులో పార్టీ నాయకుడు మావూరపు సమ్మిరెడి ఆధ్వర్యంలో, మంగపేటలో పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. గోనె తిరుపతి, యూనిస్ తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట పట్టణంలో వైఎస్సార్సీపీ నాయకుడు నాడెం శాంతికుమార్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. పార్టీ నాయకులు బిల్ల ఇంద్రారెడ్డి, బండి రమేష్ పాల్గొనగా... చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ములుగు ఘనపురం, మొగుళ్లపల్లి మండలాల్లో పార్టీ నాయకులు కొత్తూరు విజయేందర్రెడ్డి, కుంచాల సుబ్బారావు, మోటపోతుల చందర్గౌడ్, తడక శ్రీధర్, బాలకృష్ణ తదితరులు బాణసంచా కాల్చి, సంబరాలు జరుపుకున్నారు. -
జగన్ పోరాటం కొనసాగిస్తారు: భారతి
సాక్షి, హైదరాబాద్: జగన్ బయటకు వచ్చాక తన పోరాటాన్ని కొనసాగిస్తారని ఆయన సతీమణి వైఎస్ భారతి చెప్పారు. జగన్కు బెయిల్ మంజూరైన అనంతరం ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ఇకపై ఆయనకు ప్రజలతో మమేకం కావడానికి ఇబ్బందులేమీ ఉండవన్నారు. సీబీఐ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినందువల్ల జగన్ హైదరాబాద్లో ఉన్నా జిల్లాల నుంచి పార్టీ వారు వచ్చి ఆయనను కలుస్తారని, పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు. ‘నిజంగా దేవుడు చాలా గొప్పవాడు... ఆయన దయతో ఇవాళ జగన్ బయటకు వస్తున్నారు. ఈరోజు కూడా బెయిల్ వస్తుందో లేదో అనే ఉత్కంఠతో గడిపాం... కోర్టులో ఆదేశాలు వెలువడటానికి ముందు కూడా మా న్యాయవాది బెయిల్కు ఫిఫ్టీ- ఫిఫ్టీ అవకాశాలు మాత్రమే ఉన్నాయన్నారు. తీర్పు వెలువడుతున్న తరుణంలో నా కాళ్లు వణికాయి. నేనూ వణికిపోయాను. ఏడెనిమిదిసార్లు జగన్ బెయిల్ కోసం న్యాయస్థానాలకు వెళ్లాం కదా... ఏమవుతుందో అనుకున్నాం... బెయిల్ వచ్చింది...’ అని ఆమె ఆనందంతో అన్నారు. నాలుగైదు రోజులుగా వ్యతిరేక మీడియాలో వచ్చిన కథనాలు తమను కలవరపాటుకు గురిచేశాయని చెప్పారు. ‘బెయిల్ వచ్చిందని నా బిడ్డకు ఫోన్ చేసి చెప్పినపుడు ఆమె ఏడ్చేసింది... మా అత్తగారు కూడా ఉద్వేగానికి లోనయ్యారు’ అని భారతి ఉద్వేగంతో చెప్పుకొచ్చారు. వాస్తవానికి నాలుగు నెలల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలే తమకు సానుకూలంగా పరిణమించాయన్నారు. అపుడు మాకు బెయిల్ రాలేదని బాధ కలిగినప్పటికీ కేసుల దర్యాప్తు పూర్తయిన తరువాత బెయిల్ ఇచ్చే విషయం ట్రయల్ కోర్టు(సీబీఐ కోర్టు) పరిశీలించవచ్చునని అత్యున్నత న్యాయస్థానం అపుడు ఇచ్చిన ఆదేశాలే ఇపుడు బెయిల్ రావడానికి మార్గం సుగమం చేశాయన్నారు. -
ధర్మ విజేత
* వైఎస్ జగన్కు బెయిల్ * మంజూరు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు * నేటి మధ్యాహ్నం 2 గంటల తర్వాత జైలు నుంచి విడుదల * ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారనడానికి సీబీఐ ఆధారాలు చూపలేదు: న్యాయమూర్తి * కొన్ని షరతులతో బెయిల్ మంజూరు కారుమబ్బులు తొలిగాయి. సుదీర్ఘ గ్రహణం వీడింది. న్యాయం నిలిచింది. ధర్మం గెలిచింది. రాహు కేతువుల్లా కాంగ్రెస్, టీడీపీలు అటు సీబీఐతో, ఇటు తమ తాబేదారు మీడియాతో కలిసి పన్నుతూ వచ్చిన కుయుక్తులకు తెరపడింది. 484 చీకటి రాత్రులను చీల్చుకుంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు తిరిగి జనం మధ్యకు రానున్నారు. ఆయనకు సీబీఐ కోర్టు బెయిల్ ఇచ్చింది. సీబీఐ నాలుగు నెలల్లో దర్యాప్తును పూర్తి చేయాలని, ఆ తర్వాత బెయిల్ కోసం జగన్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని 2013 మే 9న సుప్రీంకోర్టు పేర్కొనడం తెలిసిందే. ఆ మేరకు జగన్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను పరిశీలించిన సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి దుర్గాప్రసాద్రావు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత జగన్ చంచల్గూడ జైలు నుంచి విడుదల కానున్నారు. సాక్షి, హైదరాబాద్: పెట్టుబడుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కోరుతూ ఇటీవల జగన్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాదరావు సోమవారం తీర్పు వెలువరించారు. బెయిల్పై విడుదల చేస్తే జగన్ సాక్షులను ప్రభావితం చేస్తారని ఆందోళన వ్యక్తం చేసిన సీబీఐ అందుకు బలమైన ఆధారాలను చూపలేదని తెలిపారు. జగన్ తరఫు సీనియర్ న్యాయవాది సుశీల్కుమార్ వాదనతో ఏకీభవిస్తూ జగన్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. రూ.2 లక్షల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించి బెయిల్ పొందాలన్నారు. న్యాయస్థానం అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని, ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేయరాదని సూచించారు. కోర్టు వాయిదాలకు క్రమం తప్పకుండా హాజరుకావాలని చెప్పారు. న్యాయస్థానం విధించిన షరతులను జగన్ ఉల్లంఘిస్తే ఆయన బెయిల్ రద్దు చేయాలని సీబీఐ ఎప్పుడైనాసరే కోరవచ్చని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కోర్టు విధించిన షరతుల మేరకు పూచీకత్తు బాండ్లను జగన్ తరఫు న్యాయవాదులు మంగళవారం కోర్టుకు సమర్పించనున్నారు. దీంతో దాదాపు పదహారు నెలల (484 రోజులు) తర్వాత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల తరువాత చంచల్గూడ జైలు నుంచి విడుదల కానున్నారు. సీబీఐది అపోహ మాత్రమే జగన్కు బెయిల్ ఇస్తే, ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారని, సాక్ష్యాలను తారుమారు చేస్తారనేది కేవలం సీబీఐ అపోహ మాత్రమేనని సుశీల్కుమార్ గతవారం వాదనల సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ‘సీబీఐ ఈ తరహా ఆరోపణలు గతంలో ఎప్పుడూ చేయలేదు. జగన్ బెయిల్ పిటిషన్లు గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణకు వచ్చినప్పుడు కూడా... దర్యాప్తు పెండింగ్లో ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వరాదని మాత్రమే సీబీఐ చెప్పింది. దర్యాప్తు పూర్తి కాని అంశాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకొన్న ఉన్నత న్యాయస్థానాలు ఆ మేర జగన్కు బెయిల్ నిరాకరించాయి. అయితే తాజాగా జగన్ బెయిల్ను వద్దనేందుకు సీబీఐ ఎటువంటి ఆధారాలను కోర్టు ముందుంచలేదు. కేవలం ఆపోహలు, అనుమానాల ఆధారంగా బెయిల్ ఇవ్వరాదని కోరుతోంది. కేవలం బెయిల్ను అడ్డుకునేందుకే, నిందితుల హక్కులను కాలరాసేందుకే సీబీఐ ఈ తరహా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది..’ అని వివరించారు. దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత నిందితులకు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో స్పష్టమైన తీర్పులు ఇచ్చిందని తెలిపారు. పారదర్శకమైన తుది విచారణ (ట్రయల్) జరగాలంటే నిందితులకు బెయిల్ ఇవ్వాలని, నిందితులు బయట ఉన్నప్పుడే వారు తమ వాదనను సమర్థవంతంగా వినిపించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో స్పష్టం చేసినట్లు సుశీల్కుమార్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 2జీ కేసులో కూడా నిందితులుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి సహా నిందితులందరికీ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందని, సుప్రీం తీర్పుల ప్రకారం బెయిల్ పొందేందుకు అర్హుడు కాబట్టి జగన్కు బెయిల్ ఇవ్వాలని కోరారు. సీబీఐ ఆధారాలు చూపలేదు: కోర్టు ‘బెయిల్ మంజూరు చేసే సమయంలో నిందితుడు దర్యాప్తు దశలోనే కాక, విచారణ (ట్రయల్) దశలో కూడా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందా? లేదా? అన్న విషయాన్ని న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఈ విషయంలో ఎటువంటి సందేహాలకు తావు లేదు. అయితే అటువంటి భయాందోళనలు వ్యక్తం చేసే ముందు ప్రాసిక్యూషన్ అందుకు సంబంధించిన బలమైన ఆధారాలను న్యాయస్థానాల ముందుంచాలి. సంజయ్ చంద్ర వర్సెస్ సీబీఐ కేసులో 2012లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ‘పిటిషనర్ సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ చెబుతున్నప్పటికీ, అందుకు సంబంధించి ఎటువంటి ఆధారాలను ఉంచలేదు. విచారణ సమయంలో పిటిషనర్ సాక్ష్యాలను తారుమారు చేస్తారనేందుకు కూడా ఎటువంటి ఆధారాలను సమర్పించలేదు. కాబట్టి ఈ దశలో సీబీఐ వాదనను ఆమోదించడం కష్టం..’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే రామలింగరాజు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ ప్రస్తావించింది. కేసు పరిస్థితులు, అసాధారణ వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని రామలింగరాజు బెయిల్ను రద్దు చేసినట్లు సీబీఐ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెబుతున్నారు. కానీ ఈ కేసులో పిటిషనర్ (జగన్) తరఫు సీనియర్ న్యాయవాది వాదించినట్లుగా ప్రాసిక్యూషన్ ఎటువంటి అసాధారణ వాస్తవాలను కోర్టు ముందుంచలేదు. కాబట్టి ప్రాసిక్యూషన్ భయాందోళనలను ఈ దశలో ఆమోదించడం కష్టసాధ్యం. బలమైన ఆధారాలను చూపి, పిటిషనర్ బెయిల్ను రద్దు చేయాలని కోరే స్వేచ్ఛ ప్రాసిక్యూషన్కు ఎప్పుడూ ఉంటుంది.’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. -
'ఉదయించే సూర్యుడు' వస్తున్నాడు!
సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. 484 రోజులుగా ఆ కుటుంబం పడ్డ వేదన తీరింది. వాళ్ల ఎదురుచూపులు ఫలించాయి. 16 నెలలుగా నిద్రలేని రాత్రులు గడిపిన ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఒక్కగానొక్క తనయుడి కోసం తల్లడిల్లుతున్న కన్నపేగుకు స్వాంతన లభించింది. భర్త కోసం భార్య చేసిన ప్రార్థనలు ఫలించాయి. నాన్నప్రేమ కోసం పరితపిస్తున్న పిల్లల ఆనందం అంబరమంటింది. అన్న రాకకై ఎదురుచూస్తున్న చెల్లికి కొండంత ధైర్యం వచ్చింది. ధర్మం గెలిచింది. న్యాయం పలికింది. హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ న్యాయస్థానం జగన్కు బెయిల్ మంజూరు చేసింది. క్విడ్ ప్రో కో కేసులో ప్రత్యేక న్యాయస్థానం జడ్జి దుర్గా ప్రసాద్ తీర్పు వెలువరించారు. బెయిల్పై సీబీఐ అభ్యంతరాలను తోసిపుచ్చారు. ఆస్తుల కేసులో జగన్కు బెయిల్ లభించింది. శంకర్రావుతో పాటు టిడిపి నేతలు ఆశ్రయించడంతో ఆగస్టు 2011లో దర్యాప్తునకు ఆదేశించింది హైకోర్టు. దీనిపై పది అంశాలపై దర్యాప్తు చేసిన సిబిఐ జగన్మోహన్రెడ్డితో పాటు 73 మందిని నిందితులుగా చేర్చింది. ఈ కేసులో సాధారణానికి భిన్నంగా.. ఏకంగా పది ఛార్జ్షీట్లు నమోదు చేసింది. వేర్వేరు సమయాల్లో వేర్వేరు ఛార్జ్షీట్లు దాఖలు చేస్తూ.. దర్యాప్తును సాగదీస్తూ జగన్ ఆరుసార్లు చేసిన బెయిల్ ప్రయత్నాలను అడ్డుకుంది సిబిఐ. దీనిపై జగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ ఏడాది మేలో దర్యాప్తుకు గడువు విధించింది. నాలుగు నెలల్లో పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ తన దర్యాప్తును ముగించామంటూ సోమవారం సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసింది. పదింట ఎనిమిది అంశాల్లో ఎలాంటి క్విడ్ప్రోకోకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పింది. సండూర్, కార్మెల్ ఏషియా హోల్డింగ్, పీవీపీ బిజినెస్ వెంచర్స్, జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్, క్లాసిక్ రియాల్టీ, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్, సరస్వతి పవర్&ఇండస్ట్రీస్, మంత్రి డెవలపర్స్లలో క్విడ్ప్రోకోకు ఎలాంటి ఆధారాలు వెల్లడించింది. దీంతో పాటు 16 కోల్కతా కంపెనీలకు సంబంధించి ఈడీ, ఐటీ మాత్రం దర్యాప్తు చేస్తున్నాయని తెలిపింది. ఉదయం సిబిఐ దాఖలు చేసిన మెమో అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నం నాంపల్లిలోని సిబిఐ కోర్టు హాలు కిక్కిరిసిపోయింది. తీవ్ర ఉత్కంఠ మధ్య.. అందరూ ఎదురుచూస్తుండగా.. సిబిఐ కోర్టు జడ్జి దుర్గాప్రసాద్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నగరం విడిచి వెళ్లొద్దని, రెండు లక్షల రూపాయల చొప్పున రెండు పూచీకత్తులు అందజేయాలని సూచించింది. సాక్షులుగా ఉన్నవారితో మాట్లాడొద్దని, పాస్పోర్టును కోర్టుకు సమర్పించాలని సూచించింది. బెయిల్ మంజూరయిన విషయం తెలియగానే రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. మరోవైపు ష్యూరిటీల ప్రక్రియ మంగళవారం పూర్తికానుంది. మంగళవారం బెయిల్ ప్రక్రియ పూర్తయి జగన్ విడుదల అవుతారు. జననేత రాక కోసం అభిమానులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎదురుచేస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయించే సూర్యుడని ఆయనను ఎవరూ ఆపలేరంటూ సంబరాలు జరుపుకున్నారు. -
జగన్ రేపు ఉదయం విడుదల
-
జగన్ రేపు ఉదయం విడుదల
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి చంచల్గూడ జైలు నుంచి రేపు ఉదయం విడుదలవుతారని ఆయన తరపు న్యాయవాది అశోక్ రెడ్డి చెప్పారు. నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు జగన్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ రోజు సమయం మించిపోయినందున జగన్ రేపు విడదల అవుతారని చెప్పారు. జగన్ హైదరాబాద్ వదిలి వెళ్లరాదని కోర్టు షరతు విధించింది. అలాగే రెండు లక్షల రూపాయల విలువైన రెండు పూచీకత్తులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. జగన్ తరపు న్యాయవాదులు పూచీకత్తులను రేపు సమర్పిస్తారు. -
'క్విడ్ ప్రోకో కేసులో కోర్టు ఆదేశాల మేరకు విచారణ పూర్తి'
హైదరాబాద్ : క్విడ్ ప్రోకో కేసులో కోర్టు ఆదేశాల మేరకు విచారణ పూర్తి అయ్యిందని సీబీఐ అధికారులు సోమవారం నాంపల్లి కోర్టుకు తెలియచేశారు. సీబీఐ మెమో ద్వారా ఈ మేరకు కోర్టుకు తెలిపింది. శ్యాం ప్రసాద్ రెడ్డికి సంబంధించిన విషయం మాత్రం తుది నివేదిక ఇవ్వాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. కాగా జగన్ బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి కాగా న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించనుంది. దాంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
వైఎస్ జగన్ కేసులోదర్యాప్తు పూర్తి
ప్రత్యేక కోర్టుకు నివేదించిన సీబీఐ సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో అన్ని అంశాలపై దర్యాప్తు పూర్తయిందని ప్రత్యేక కోర్టుకు సీబీఐ నివేదించింది. ఈ మేరకు సోమవారం కోర్టుకు రాతపూర్వకంగా నివేదిస్తామని తెలిపింది. కొన్ని అంశాల్లో దర్యాప్తు పెండింగ్లో ఉందని గతంలో సీబీఐ చెప్పిందని, దీంతో దర్యాప్తు పూర్తయ్యే వరకూ అభియోగాల నమోదు ప్రక్రియను ఆపాలంటూ గతంలో నిందితులు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం ఆ పిటిషన్లపై కోర్టు వాదనలు విని నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చిన సమయంలో నిందితుల తరఫు న్యాయవాదులు... కొన్ని పిటిషన్లు పెండింగ్లో ఉన్న విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో దర్యాప్తు పురోగతిని స్పష్టం చేయాలని న్యాయమూర్తి సీబీఐ తరఫున న్యాయవాది సురేంద్రను ప్రశ్నించారు. ఈ కేసులో అన్ని అంశాల్లో దర్యాప్తు పూర్తయ్యిందని సురేంద్ర నివేదించారు. వాన్పిక్ కేసు సహా ఇతర అంశాల్లో ఎలాంటి అనుబంధ చార్జిషీట్లూ దాఖలుచేయబోమని చెప్పారు. అయితే ఇదే విషయంతో మెమోను కోర్టులో దాఖలు చేయాలని సురేంద్రకు న్యాయమూర్తి సూచించారు. -
సీబీఐ కస్టడీకి కంప్లి ఎమ్మెల్యే
సాక్షి, బెంగళూరు: ఉత్తర కన్నడ జిల్లా బెలెకెరె ఓడ రేవు నుంచి ఇనుప ఖనిజాన్ని అక్రమంగా ఎగుమతి చేశారన్న కేసులో కంప్లి ఎమ్మెల్యే సురేశ్ బాబుకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 27 వరకు సీబీఐ కస్టడీకి ఆదేశించింది. ఆయనను సీబీఐ శుక్రవారం భారీ బందోబస్తు మధ్య సిటీ సివిల్ కోర్టు సముదాయంలోని ప్రత్యేక కోర్టులో హాజరు పరిచింది. సురేశ్ను 15 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయాధికారి సోమరాజును సీబీఐ అధికారులు కోరారు. అయితే సురేశ్ న్యాయవాది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పాత సాక్ష్యాధారాలతో సురేశ్ను అరెస్టు చేశారని, ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ అభ్యర్థనను న్యాయాధికారి తిరస్కరించారు. -
పరాకాష్టకు చేరిన రామోజీ రాతలు
-
పదే పదే అదే విషం.. పరాకాష్టకు చేరిన రామోజీ రాతలు
* పరాకాష్టకు చేరిన రామోజీ రాతలు * జగన్ బెయిల్పై తీర్పు వెలువడే ముందు విషపు రాతలు * భారతి సిమెంట్పై వాస్తవాల్ని వదిలిపెట్టి ఏకపక్ష కథనం * ప్రైవేటు భూమి కొనుగోలు చేస్తే... ప్రభుత్వానికి నష్టమంటూ రాతలు * లీజు పొందిన గుజరాత్ అంబుజా ఐదేళ్లుగా ఫ్యాక్టరీ పెట్టనే లేదు అందుకే రద్దు; మూడేళ్లలో ఫ్యాక్టరీని సాకారం చేసిన జగన్ * దానిద్వారా ప్రస్తుతం 8 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి * కావాలనే వాస్తవాలను విస్మరించి రామోజీ రంకెలు * దర్యాప్తు ఆరంభం నుంచీ ఇవే తరహా విషపు రాతలు * దానికి ఎల్లో మీడియా, చంద్రబాబు తందాన తాన * విచారణకే స్వీకరించని చార్జిషీటు రామోజీకెలా అందింది? వైఎస్ కుటుంబంపై విషంగక్కేలా దారుణ వ్యాఖ్యలు చేస్తూ... మళ్లీ దానికి ‘సీబీఐ చార్జిషీట్’ అనే రంగు పులిమారు. అయినా సీబీఐ కోర్టుకిచ్చిన పత్రాలు ఈనాడు చేతికెలా వచ్చాయి? అవిభక్త కవలల్లాంటి రామోజీ-చంద్రబాబులు సీబీఐతో కుమ్మక్కయిన ఫలితమా ఇది? నిత్యం ఉషోదయంతోపాటే జగన్ నామ జపం చేయనిదే పొరపాటున కూడా పొద్దు గడవని ‘ఈనాడు’.. వైఎస్సార్సీపీ అధినేతపై షరామామూలుగానే మళ్లీ విషం కక్కింది. ఈసారి మరింతగా దిగజారిపోయింది. ఆ క్రమంలో నైచ్యానికే నయా అర్థం చెప్పింది. ‘సీబీఐ వేసిన చార్జిషీట్’ అంటూ గురువారం పతాక శీర్షికల్లో అది వండి వార్చిన కథనాన్ని చూస్తే గోబెల్స్ కూడా గుండెలు బాదుకోవాల్సిందే! ఇంకా బయటికి వెల్లడేకాని, న్యాయమూర్తి విచారణకైనా స్వీకరించని, నిందితుడికి కాపీ కూడా ఇవ్వని చార్జిషీట్లోని వివరాలు ఇవేనంటూ శివాలెత్తిపోయి రామోజీ రాసిన రోత రాతలపై.. బరితెగించడానికైనా, దిగజారిపోవటానికైనా ఒక హద్దుంటుంది అరాచకానికైనా, నైచ్యానికైనా పరాకాష్టంటూ ఒకటుంటుంది కానీ రామోజీరావు, ఆయన విషపుత్రిక ‘ఈనాడు’ వాటన్నిటినీ ఎప్పుడో దాటేశారు!. న్యాయస్థానాల్లో ప్రమాణం చేసి మరీ అవలీలగా అబద్ధాలాడేస్తారు రామోజీ! బంధువుల్ని కూడా వదలకుండా నమ్మినవారిని నిలువునా వంచిస్తారు రామోజీ! ఫోర్జరీ, చీటింగ్ కేసులు ఎదుర్కొంటున్నా... పన్ను కట్టలేదన్న కేసులు పెండింగ్లో ఉన్నా... ‘మార్గదర్శి’ పునాదులే అక్రమమని చెప్పే కేసులు న్యాయస్థానాల్లో నడుస్తున్నా... కనీస విలువలు పాటించాలన్న జ్ఞానం ఆయనకు రాకపోవటమే దారుణం. సీబీఐ వేసిన ‘చార్జిషీట్’ అంటూ గురువారం పతాక శీర్షికల్లో ‘ఈనాడు’ వండి వార్చిన కథనమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. అసలు ఏ దర్యాప్తు సంస్థయినా కోర్టుకు చార్జిషీటు సమర్పిస్తే ఆ చార్జిషీటును తొలుత న్యాయమూర్తి విచారణకు స్వీకరించాలి. అప్పుడే అది బహిరంగమవుతుంది. పెపైచ్చు నిందితుడికి కాపీ ఇస్తారు. కానీ రెండు రోజుల కిందట వేసిన చార్జిషీట్ను ఇంకా జడ్జి విచారణకు స్వీకరించనేలేదు. నిందితుడైన వైఎస్ జగన్మోహన్రెడ్డికీ దాని కాపీ అందలేదు. కానీ ఇంతలోనే రామోజీ శివాలెత్తేశారు. జగన్మోహన్రెడ్డి బెయిలు పిటిషన్పై న్యాయస్థానం తీర్పు వెలువరించనుండటంతో... ‘దాన్ని ప్రభావితం చేయడానికా?’ అనే రీతిలో అడ్డగోలు రాతలు రాసేశారు. వైఎస్ కుటుంబంపై విషం గక్కేలా దారుణ వ్యాఖ్యలు చేస్తూ... మళ్లీ దానికి ‘సీబీఐ చార్జిషీట్’ అనే రంగు పులిమారు. అయినా సీబీఐ కోర్టుకిచ్చిన పత్రాలు ఈనాడు చేతికెలా వచ్చాయి? అవిభక్త కవలల్లాంటి రామోజీ-చంద్రబాబులు సీబీఐతో కుమ్మక్కయిన ఫలితమా ఇది? బాబుపై దర్యాప్తుకు చేతులు రావు! దర్యాప్తు సంస్థతో రామోజీ-చంద్రబాబు కలయిక ప్రభావాన్ని ఇప్పటికే ఈ రాష్ట్రం ప్రత్యక్షంగా చూసింది. చంద్రబాబు, రామోజీల అక్రమాలపై విచారణ జరపండంటూ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులిచ్చినా సరే... సీబీఐ మాత్రం వాళ్ల జోలికే వెళ్లలేదు. ఆఖరికి ఈ మిత్రద్వయం సుప్రీంకోర్టుకు వెళ్లి, అక్కడా కాదన్నాక మళ్లీ హైకోర్టుకు వచ్చి... కేసు రెండు మూడు బెంచిలు మారేలా నాటకమాడేదాకా సీబీఐ కదిలితే ఒట్టు! చివరకు హైకోర్టులో జస్టిస్ రోహిణి నేతృత్వంలోని బెంచ్... అంతకుముందు ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేయటంతో ఆ దర్యాప్తు ఆగిపోయింది. దానికన్నా ముందు ఐఎంజీ కేసులోనూ ఇంతే. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తే... ఇదే సీబీఐ తనకు తగినంత సిబ్బంది లేరనే సాకుతో బాబును వదిలిపెట్టేసింది!! అదే సీబీఐ వైఎస్ జగన్మోహన్రెడ్డి విషయానికొచ్చేసరికి మాత్రం ఎక్కడలేని సత్తువనూ కూడగట్టుకుని ‘నభూతో...’ అన్న రీతిలో రెచ్చిపోయింది. 29 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరీ... ఇళ్లు, ఆఫీసులు, ఇన్వెస్టర్ల కార్యాలయాలు అన్నిటిపై ఏకకాలంలో దాడులు చేసి మరీ... 14 రోజుల్లోనే కోర్టుకు నివేదిక సమర్పించింది. బాబు-రామోజీ ద్వయం సీబీఐతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలకు ఇవన్నీ బలం చేకూర్చేవే కాదా? బాబు దొరికినా వదిలేశారందుకే!! బాబు అడ్డంగా దొరికింది ఐఎంజీ కేసులో మాత్రమే కాదు... ఎమ్మార్, రాంకీ కేసుల్లో కూడా. ఎందుకంటే శ్రీమంతుల గోల్ఫ్ కోర్సుకు ప్రభుత్వ భూమి ఇవ్వాలన్న ఆలోచన బాబుదే. 200 ఎకరాలివ్వాలనుకున్నా... అది చాలదని దాన్ని 435 ఎకరాలకు పెంచిందీ బాబే. ఎమ్మార్కు టెండరు దక్కేలా చక్రం తిప్పటమే కాక... అంత భూమినీ పప్పుబెల్లాలకు కట్టబెట్టేసిందీ ఈ బాబే. అన్ని చేసినా ఎమ్మార్పై దర్యాప్తులో మాత్రం బాబును వదిలేసింది దర్యాప్తు సంస్థ. అదేమని కోర్టు అడిగితే... 2004 కన్నా ముందు జరిగిన దాన్ని తాము దర్యాప్తు చేయటం లేదని కూడా చెప్పింది!! ఏమనుకోవాలి ఈ బంధాన్ని? రాంకీ సంస్థకు విశాఖ ఫార్మా సిటీలో 2,142 ఎకరాలను సింగిల్ టెండర్పై కట్టబెట్టింది కూడా బాబే. కానీ ఈ అంశంపై దర్యాప్తు చేసినపుడు... గ్రీన్బెల్ట్ పెంచుతామని ప్రతిపాదించి పెంచనందుకు వైఎస్ ప్రభుత్వాన్నే సీబీఐ తప్పుబట్టింది తప్ప... 2,142 ఎకరాల్ని సింగిల్ టెండర్పై ఎలా కట్టబెట్టారని బాబును అడిగితే ఒట్టు! బాబుకెందుకు ఈ నజరానాలు? రాజ్యసభలో ఎఫ్డీఐ బిల్లుకు పరోక్షంగా మద్దతిచ్చినందుకా? రైతులు, చిన్న వ్యాపారుల ప్రయోజనాలను గాలికొదిలేసినందుకా? రూ.32,000 కోట్ల కరెంటు భారం మోపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టిన దెబ్బకు మండిపడుతూ ప్రతిపక్షాలన్నీ అవిశ్వాస తీర్మానం పెడితే విప్ జారీ చేసి మరీ కాంగ్రెస్ను కాపాడినందుకా? బెయిల్ అనగానే ఢిల్లీకెందుకో? కాంగ్రెస్తో కలిసి చంద్రబాబు ఇలా ఎన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తారు? చనిపోయిన నాయకుడిపై... అది కూడా మరణించిన ఏడాదిన్నర తరవాత... అది కూడా ఆయన తనయుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పాక... ఇద్దరూ కుమ్మక్కయి కేసులు వేయటం నిజం కాదా? చట్టప్రకారం 90 రోజుల్లో రావాల్సిన బెయిల్ను సాక్షుల్ని ప్రభావితం చేస్తారనే సాకుతో అడ్డుకోవటం అబద్ధమా? అయినా జగన్ బెయిల్ పిటిషన్ ఎప్పుడు విచారణకు వచ్చినా చంద్రబాబు ఢిల్లీకెందుకు వెళతారు? తన మనుషుల్నెందుకు పంపిస్తారు? ఏదో ఒక సంచలనాన్ని సృష్టిస్తూ... దాన్ని ఎల్లో మీడియా ద్వారా తాటికాయలంత అక్షరాలతో ఏదో జరిగిపోయినట్టుగా రాయించటం... న్యాయస్థానాల్ని ప్రభావితం చేసే రీతిలోనే ఆ రాతలుండటం... ఇవన్నీ ఎందుకు? ఏం! జగన్మోహన్రెడ్డికి బెయిలొస్తుందంటే బాబుకు అంత భయమెందుకు? రామోజీకి అంత ఉలుకెందుకు? జగన్ జనం గుండెల్లో ఉన్న నేత కనుక ఆయన బయటికొస్తే తమ చిరునామాలు గల్లంతౌతాయనా? కొనగలవా రామోజీ? ఇక్కడ రామోజీ గమనించాల్సిందేంటంటే... వైఎస్ రాజశేఖరరెడ్డి గనక నిజంగా తన కుమారుడికి మేలు చేయాలనుకుంటే ఎల్ అండ్ టీకి బాబు కట్టబెట్టినట్లుగా హైదరాబాద్ నడిబొడ్డున ఎకరా ఏ రూ.4 వేలకో ఇస్తారు గానీ... ఇలా ప్రైవేటు భూములను ఎకరా రూ.3 లక్షలు పై చిలుకు పెట్టి కొనుక్కునేలా ఎందుకు చేస్తారు? నిజం చెప్పాలంటే ప్రభుత్వ భూముల్లో ఉంటేనే మైనింగ్ లీజులకు విలువ. ఎందుకంటే కారుచౌకగా కట్టబెట్టే అవకాశం ఉంటుంది. అదే ప్రైవేటు భూముల్లోనైతే కొనుగోలుదారే డిమాండ్కు తగ్గ ధర చెల్లించి మరీ కొనాలి. రామోజీ గనక సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే అలాంటి భూములు చాలానే ఉంటాయి. అయినా సున్నపురాయి నిక్షేపాలు సిమెంట్ కంపెనీకి కాక దేనికైనా పనికొస్తాయా? సిమెంట్ కంపెనీకి వాటిని లీజుకిస్తే తప్పేంటి? అంబుజా ఎందుకు ఫ్యాక్టరీ పెట్టలేదు? గుజరాత్ అంబుజా కంపెనీ 2000 నుంచి 2005 వరకూ సిమెంట్ ఫ్యాక్టరీ కట్టలేదన్న విషయం రామోజీ రాతల్లో కనిపిస్తుంది. దాన్ని ఏమాత్రం ప్రశ్నించని రామోజీ.. అలా చేయనందుకే ఆ లీజును జగన్కుఇచ్చారని. జగన్ మూడేళ్లలో ఫ్యాక్టరీ కట్టి చూపించారని మాత్రం చెప్పరు. ఎందుకంటే తన ‘పాలసీ’ పుట్టలో అది పట్టదు మరి! మరీ ఇంత దారుణమా రాజ గురివిందా!! ఈరోజు భారతి సిమెంట్ సంస్థ ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 వేల పైచిలుకు మందికి ఉద్యోగాలు కల్పిస్తోందిగా! గుజరాత్ అంబుజా అక్కడ ప్లాంటు పెట్టని నేపథ్యంలో, జగన్ కూడా ముందుకు రాకపోతే ఇవన్నీ సాధ్యమయ్యేవా? కడప జిల్లాలో ‘భారతి’ వచ్చేదాకా పాతికేళ్లుగా ఒక్క సిమెంట్ కంపెనీ అయినా వచ్చిందా? అయినా ప్రైవేటు భూమిని కొనుక్కుని కంపెనీ పెడితే ప్రభుత్వానికి పన్నులు, ఇతర సుంకాల వల్ల భారీ ఆదాయమే తప్ప నష్టమెలా వస్తుంది? ఇదేమీ ఫిల్మ్ సిటీ మాదిరిగా పేద రైతుల్ని బెదిరించి, ప్రభుత్వ యంత్రాంగం సాయంతో కబ్జాలు చేసి సాధించుకున్న భూమి కాదు కదా! ఇప్పటికీ ఫిల్మ్ సిటీ భూముల్ని పోగొట్టుకుని వేదన అనుభవిస్తున్న రైతులు రామోజీ ఫిల్మ్ సిటీ చుట్టూ కోకొల్లలు. కానీ భారతి సిమెంట్ వల్ల నష్టపోయామనే వారిని ఒక్కరినైనా చూపించగలరా రామోజీ? మరెందుకీ దగుల్బాజీ రాతలు? ఈ మాత్రం ఇంగితం లేదా? జగన్మోహన్రెడ్డి బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. సోమవారం తీర్పు రానుంది. దర్యాప్తు పూర్తయిందని సీబీఐ చెప్పింది కనక ఇక బెయిల్కు అడ్డు ఉండకపోవచ్చన్నది న్యాయ వర్గాలు సైతం చెబుతున్న మాట. ఈ తరుణంలో ఇంకా ఎవరికీ అందని చార్జిషీటు సమాచారం ఎల్లో బ్రదర్స్ పత్రికల్లోనే ఎలా వచ్చింది? పోనీ ఆ చార్జిషీట్లోని సమాచారాన్ని యథాతథంగా ప్రచురిస్తారా అంటే అదీ లేదు. నాణేనికి ఒకవైపును మాత్రమే చూపిస్తూ... దానికి తమ తిక్క కామెంట్లు జోడిస్తూ నోటికొచ్చినట్టుగా వండి వార్చేస్తారు రామోజీ!! తీర్పుకు ముందు ఇంతటి భ్రష్టుపట్టిన రాతలు రాశారంటే రామోజీకి దురుద్దేశాలు లేవని నమ్మేదెవరు? ఇరికించాలన్నదే మీ లక్ష్యమా? కేసు లేకపోయినా... తప్పు జరగకపోయినా... ప్రతి విషయంలోనూ ఏదో జరిగిపోయినట్టుగా రాసి అందరినీ ప్రభావితం చేయాలన్న దురుద్దేశంతో ఎల్లో కూటమి దిగజారి చేస్తున్న యుద్ధమిది. అందుకే ఇండియా సిమెంట్స్కు చంద్రబాబు ప్రభుత్వం నీళ్లివ్వటం రామోజీ దృష్టిలో గానీ, సీబీఐ దృష్టిలో గానీ తప్పు కాదు. అదే కంపెనీకి, అవే నీళ్లను రెన్యువల్ చేస్తూ వైఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం తప్పు!! అయినా నీళ్లు, కరెంటు ఇవ్వకపోతే కంపెనీలొస్తాయా? కంపెనీలు లేకుంటే ఉద్యోగాలొస్తాయా? పెన్నా సిమెంట్స్ అధిపతి తన సొంత భూమిలో హోటల్ కట్టుకుంటానంటే... మిగతా హోటళ్లలానే దానికి అనుమతి ఇస్తే... అది వైఎస్ ప్రభుత్వం ఇచ్చింది కనక తప్పేననే రీతిలో సాగిన దర్యాప్తు కాదూ ఇది!!?. దర్యాప్తు అధికారి నేరుగా మీడియాకు ఐదారు వందల ఫోన్ కాల్స్ చేసి... వైఎస్ కుటుంబంపై బురద చల్లటమే లక్ష్యంగా చేసిన దర్యాప్తు కాదూ ఇది? దాన్ని భూతద్దంలో చూపిస్తూ... వక్రీకరించి పతాక కథనాలు వండుతూ అటు ఎల్లో మీడియా... దానికి మద్దతుగా అపవిత్ర పొత్తులతో చెలరేగుతున్న ఎల్లో పార్టీ... ఇవన్నీ కలిసి ఈ రాష్ట్రం విభజన పేరిట రావణ కాష్టంలా మారినా దాంట్లోనే చలికాచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి భ్రష్టుపట్టిన వ్యవస్థల రాతల్ని ఈ రాష్ట్ర ప్రజలే తిరగరాస్తారు. సాయిరెడ్డి ఆ సమావేశాల్లో ఉన్నారా? భారతి సిమెంట్కు ఒక్క ఓబీసీ మాత్రమే రుణమిచ్చినట్టు... అది కూడా విజయసాయిరెడ్డి వల్లే వచ్చినట్టు ఎందుకీ కుట్రపూరిత రాతలు? ఆ సంస్థకు ఆరేడు బ్యాంకులు రుణాలిచ్చాయి. వాటిలో ఓబీసీ ఒకటి. మరి వాటన్నిటినీ సాయిరెడ్డి మేనేజ్ చెయ్యగలరా? అయినా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు బ్యాంకు బోర్డు ముందుకు వచ్చినప్పుడు సాయిరెడ్డి తనంత తనే సమావేశాల నుంచి బయటికెళ్లిపోయారు. అవన్నీ రికార్డులు చూస్తే తెలుస్తాయి. మరి దానర్థం కంపెనీ ప్రమోటర్లతో తనకున్న సంబంధాలు చెప్పినట్టు కాదా? అయినా బ్యాంకులు రుణాలిస్తే తప్పా? జగన్ తను వ్యక్తిగత గ్యారంటీ ఇవ్వటంతో పాటు షేర్లు కూడా తనఖా పెట్టారు. అంతేకాక ఆ రుణాన్ని అణా పైసల్తో సహా సకాలంలో చెల్లించారు. ఇందులో తప్పేముంది? అప్పటికే ఒక కంపెనీని విజయవంతంగా నడుపుతున్న జగన్కు బ్యాంకులు రుణాలిస్తే తప్పా? ఏం... మీలా చిత్తు కాగితాలు, పాత సీరియళ్ల పేటెంట్ హక్కుల్ని తనఖా పెట్టి వేల కోట్లు రుణం తీసుకోకపోవటమే తప్పా? ముఖ్యమంత్రి ఇంట్లో సంతకాలు జరగటమూ తప్పేనా? దానర్థం అప్పట్లో జగన్ ఇక్కడ లేరనేగా! బెంగళూరులో ఉండే జగన్మోహన్రెడ్డి నెలకు ఒకటిరెండు రోజులు ఇక్కడకు వస్తే... ఆ రెండు మూడ్రోజులు తన తల్లిదండ్రులతో ఉంటే అది తప్పా? బ్యాంకు అధికారులు బెంగళూరుకు ఖర్చులు పెట్టుకుని వచ్చే బదులు... ఇక్కడే సంతకాలు తీసుకుంటే అది అక్రమమా? కొన్ని సంతకాలు బెంగళూరులో కూడా పెట్టినా ఆ విషయం మాత్రం ఎందుకు రాయరు? ఎందుకీ కుట్రలు? న్యాయమూర్తి నివేదికా పట్టదా? రాష్ట్ర ప్రభుత్వం గనక ఈ భూ కేటాయింపులో తప్పు చేసి ఉంటే ట్రిబ్యునల్లో గుజరాత్ అంబుజా వాదనలు వినిపించింది కదా! కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈ ట్రైబ్యునల్ తీర్పు ఇవ్వటం రామోజీకి తెలియదా! ఆ తరవాత హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ రాజు నేతృత్వంలో కమిషన్ వేయడం.. ఆయన నివేదికనిస్తూ దీన్లో ఏ తప్పూ జరగలేదని చెప్పడం... ఇవేవీ రామోజీకి పట్టవా? ఒకవేళ పట్టినా, ‘కళ్లు మూసుకుని అబద్ధాలు చెబితే చాలు, ఎవరినైనా తప్పుదోవ పట్టించొచ్చు’ అన్న కుయుక్తా!? లీజు గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? మైనింగ్ లీజుల గురించి మాట్లాడుతున్న రామోజీకి... అసలు లీజు అనే పదాన్ని పలికే నైతిక అర్హత ఉందా? హైదరాబాద్ నుంచి విశాఖపట్నం దాకా ఎక్కడ చూసినా రామోజీది గ‘లీజు’ చరిత్రేగా!! హైదరాబాద్లో లీజుకు తీసుకున్న భూమిని ఖాళీ చేయనంటూ భీష్మించుకుంటే చివరికి రాజకీయ జోక్యంతో స్థల యజమాని సెటిల్ చేసుకోవటం అబద్ధమా? అదే యజమానికి చెందిన విశాఖ స్థలాన్ని లీజు గడువు ముగిసినా ఇంకా ఖాళీ చెయ్యలేదు రామోజీ. అంతేగాక దాన్ని తన సొంత స్థలమని చెప్పి... కొంత భాగం ప్రభుత్వానికిచ్చి, పరిహారంగా ఇచ్చిన భూమిని తనే భోంచేసిన చరిత్ర ఆయనది. ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవటానికి చీటింగ్, ఫోర్జరీ వంటి ఇతర నేరాలకు పాల్పడ్డారనే కేసులూ నమోదయ్యాయి. ఇక విశాఖలో డాల్ఫిన్ హోటల్ కోసం లీజుకిచ్చిన వారిని బెదిరించి మరీ కారుచౌకగా కొట్టేసిన ఘనుడాయన. విజయవాడలో సొంత బంధువుల స్థలాన్ని లీజుకు తీసుకుని, గడువు ముగిసినా తిరిగివ్వకుండా న్యాయ పోరాటానికి దిగిన ఘనుడు కూడా! ఇలాంటి వ్యక్తికి ఎదుటివారు ఏం చేసినా అది అక్రమంగానే కనిపించటంలో చిత్రమేముంది? ఫిల్మ్ సిటీ భూముల మాటేంటి? నగరానికి అత్యంత సమీపంలో 2,500 ఎకరాలకు పైగా స్థలాన్ని... పేద రైతుల పొట్టగొట్టి, బెదిరింపులకు పాల్పడి మరీ ఫిల్మ్ సిటీ కోసం సొంతం చేసుకున్న రామోజీకి... ఇతరులు ఏం చేసినా అన్యాయంగా కనిపించటం ఆశ్చర్యం అనిపించదు. ఎకరాకు రూ.10-15 వేలు విదిలించి, పేద రైతుల్ని బెదిరించి మరీ భూముల్ని స్వాధీనం చేసుకున్న రామోజీకి భూముల క్రయ విక్రయాలన్నీ అక్రమాలుగానే కనిపించొచ్చు. ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని, అసైన్డ్ భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, ఆఖరికి భూ దాన భూముల్ని కూడా భోంచేసిన రామోజీకి ప్రైవేటు వ్యక్తులకు భారీ ధర చెల్లించి కొనుక్కోవటం కూడా నేరమనే అనిపించొచ్చు. రామోజీ కట్టాల్సిన పన్ను 1,117 కోట్లు! ఇతరులపై బురద జల్లటానికి చెలరేగిపోయే రామోజీకి... తన ఒంటికున్న మకిలి కనిపించకపోవటమే విచిత్రం. ఎందుకంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరిట అక్రమంగా డిపాజిట్లు తీసుకున్నందుకు ఆయనపై భారీగా ఐటీ కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీని ప్రకారం 2001-02 నుంచి 2005-06 మధ్య ఆయన రూ.1,117 కోట్ల పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టారు. దీన్ని చెల్లించాలని ఐటీ నోటీసులివ్వడంతో రామోజీ కోర్టుకు వెళ్లారు. తనకు నోటీసులిచ్చిన అధికారికి దురుద్దేశాలు ఆపాదించటంతో కోర్టు కోపగించింది. రామోజీపై జరిమానా వేసింది. దాంతో జరిమానా చెల్లించి పిటిషన్లు విత్ డ్రా చేసుకున్నారు. అయినా మళ్లీ కొత్త పిటిషన్లు వేసి.. ఐటీ పేర్కొన్న చట్టాలేవీ తనకు వర్తించవన్నారు. హైకోర్టులో ఇది పెండింగ్లో ఉంది. కాకపోతే దీన్ని వెకేట్ చేయించడానికి 2009 నుంచి ఇప్పటిదాకా ఐటీ శాఖ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఏటా కనీసం రూ.120 కోట్ల మేరకు వడ్డీ నష్టపోతున్నా ఐటీ శాఖ ఎందుకు మిన్నకుందనేది ఎవరికీ అర్థం కాదు!