వైఎస్ జగన్కు ఊరట | CBI Court permitted YS Jagan to go to Chennai | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్కు ఊరట

Published Mon, Nov 25 2013 7:28 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

వైఎస్ జగన్కు ఊరట - Sakshi

వైఎస్ జగన్కు ఊరట

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెన్నై వెళ్లేందుకు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెన్నై వెళ్లేందుకు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక  కోర్టు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయనకు ఈ అనుమతితో కొంత ఊరట లభించింది. చెన్నై వెళ్లేందుకు వీలుగా తన బెయిలు నిబంధనలు సడలించాలని  కోరుతూ  జగన్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది.

జగన్ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ జాతీయ, ప్రాంతీయ నాయకులను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సహకరించమని కోరుతున్న విషయం తెలిసిందే.  అందులో భాగంగా జగన్ చెన్నై వెళ్లి  ముఖ్యమంత్రి జయలలితను, ఇతర నాయకులను కలుస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement