విరిగిపడ్డ కొండ చరియలు: 17 మంది మృతి | Arunachal: At least 17 killed in landslide in Tawang, rescue operation underway | Sakshi

విరిగిపడ్డ కొండ చరియలు: 17 మంది మృతి

Published Fri, Apr 22 2016 1:09 PM | Last Updated on Sun, Sep 3 2017 10:31 PM

అరుణాచల్ ప్రదేశ్లో విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని భారీ వర్షాల కారణంగా తవాంగ్ జిల్లా ఫామ్లా గ్రామంలో గురువారం రాత్రి కొండ చరియలు విరిగిపడ్డాయి.

ఈటానగర్ : అరుణాచల్ ప్రదేశ్లో విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని భారీ వర్షాల కారణంగా తవాంగ్ జిల్లా ఫామ్లా గ్రామంలో గురువారం రాత్రి కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఎన్టీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది.

ఆ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి తవాంగ్ జిల్లా డిప్యూటీ కలెక్టర్కు ఫోన్ చేసి... వివరాలు కనుకున్నారు. అయితే మృతులంతా భవన నిర్మాణ కార్మికులను తెలిసింది. వీరంతా ఫామ్లాలో హోటల్ నిర్మాణం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులను ప్రభుత్వాధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement