పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీకి పాట్నా హైకోర్టు షాక్ ఇచ్చింది. జేడీయూ కు చెందిన ఎనిమిది మంది రెబల్ అభ్యర్థుల ఓటు వేసే అవకాశాన్ని రద్దుచేస్తూ హైకోర్టు డబుల్ బెంచ్ ఆర్డర్ జారీ చేసింది. దీంతో ముఖ్యమంత్రి ఇరకాటంలో పడ్డట్టయింది. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవడానికి ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉండగా సంభవించిన ఈ పరిణామం మాంఝీకి పెద్ద ఎదురు దెబ్బ. ఫిబ్రవరి 20న విశ్వాస పరీక్షను ఎదుర్కో బోతున్న తరుణంలో కోర్డు ఆర్డర్ గణనీయమైన ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే నితీష్, మాంఝీ ఇద్దరూ తమ బలాన్ని పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారు.