ముంబైలో భవనం కూలి ఆరుగురు మృతి | Building collapses in Mumbai; 6 dead, several trapped | Sakshi
Sakshi News home page

ముంబైలో భవనం కూలి ఆరుగురు మృతి

Apr 30 2016 4:42 PM | Updated on Nov 6 2018 4:37 PM

ముంబైలో ఓ మూడంతస్తుల భవనం కూలి ఆరుగురు దుర్మరణం చెందారు.

ముంబై: నగరంలో ఓ మూడంతస్తుల భవనం కూలి ఆరుగురు దుర్మరణం చెందారు. కమతిపూర ప్రాంతంలోని గ్రాంట్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శిథిలాల కింద పలువురు చిక్కుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరిని చికిత్స నిమిత్తం జేజే, నాయర్ ఆసుపత్రులకు తరలించినట్లు బీఎంసీ డిజాస్టర్ కంట్రోల్ రూమ్ అధికారులు తెలిపారు. రక్షణ చర్యల కోసం ఎనిమిది ఫైర్ ఇంజన్లతో పాటు మూడు అంబులెన్సులను రంగంలోకి దింపినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement