సీజేఐ వేధింపులపై వాంగ్మూలమిచ్చిన మహిళ | Complainant In Harassment Case Against CJI Appears Before Inquiry Panel | Sakshi
Sakshi News home page

సీజేఐ వేధింపులపై వాంగ్మూలమిచ్చిన మహిళ

Published Tue, Apr 30 2019 9:29 AM | Last Updated on Tue, Apr 30 2019 9:31 AM

Complainant In Harassment Case Against CJI Appears Before Inquiry Panel - Sakshi

జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌

సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ అంతర్గత విచారణ కమిటీ ముందు హాజరై తన వాంగ్మూలం ఇచ్చింది.

న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ సోమవారం అంతర్గత విచారణ కమిటీ ముందు హాజరై తన వాంగ్మూలం ఇచ్చింది. సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని అయిన ఆమె ఈ విచారణకు హాజరుకావడం ఇది రెండోసారి. ఆమె చేసిన ఆరోపణలపై జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఈ విచారణ చేపట్టింది.

జస్టిస్‌ ఇందు మల్హోత్రా, జస్టిస్‌ ఇందిరా బెనర్జీ ఈ కమిటీలోని ఇతర సభ్యురాళ్లు. విచారణ సందర్భంగా బాధితురాలు ఒక్కరినే అనుమతించారని సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి. ఆమె తరపు న్యాయవాది సమర్పించిన ఫిర్యాదును స్వీకరించేందుకు న్యాయమూర్తులు నిరాకరించారు. తదుపరి విచారణ మంగళవారం జరగనుందని తెలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement