CJI
-
జస్టిస్ యశ్వంత్కు ఏ పనీ ఇవ్వొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలతో చిక్కుల్లో పడ్డ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాసేపటికి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ కేవలం బదిలీపై మాత్రమే అలహాబాద్ హైకోర్టుకు వస్తున్నారని, ఆయనకు ప్రస్తుతానికి ఏ విధమైన జ్యుడిషియల్ వర్క్ అప్పచెప్పవద్దని సీజేఐ సంజీవ్ ఖన్నా కోరారు. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జస్టిస్ యశ్వంత్ పై విచారణ పెండింగ్ లో ఉన్న క్రమంలోనే ఆయనకు ఏ పనీ అప్పచెప్పవద్దని సీజేఐ సూచించారు. అంతకుముందు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఈ తరహా ఆదేశాలనే జారీ చేశారు సీజేఐ.కేంద్రానికి సిఫార్సు.. గ్రీన్ సిగ్నల్జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీ అంశానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే క్రమంలో కేంద్రానికి ప్రతిపాదన పంపింది సీజేఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం. దీనికి ఈరోజు(శుక్రవారం) గ్రీన్ సిగ్నల్ లభించడంతో యశ్వంత్ వర్మ.. అలహాబాద్ హైకోర్టుకు వెళ్లనున్నారు. 2021లో అలహాబాద్ హైకోర్టు నుంచి బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చిన యశ్వంత్ మళ్లీ అక్కడికే వెళ్లనున్నారు.ఆరు రాష్ట్రాల బార్ అసోసియేన్స్ తో సీజేఐ భేటీఅయితే యశ్వంత్ వర్మ సచ్ఛీలురుగా బయటకొచ్చేవరకూ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయొద్దంటూ అక్కడ బార్ అసోసియేషన్ తో పలు రాష్ట్రాల బార్ అసోయేషన్స్ కూడా కోరాయి. గుజరాత్ హైకోర్టు బార్ అసోసియేషన్, కేరళ హైకోర్టు బార్ అసోసియేషన్, కర్ణాటక హైకోర్టు బార్ అసోసియేషన్, లక్నో బార్ అసోసియేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సీజేఐ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పలు బార్ అసోసియేషన్ హెడ్స్ తో సీజేఐ సంజీవ్ ఖన్నా నిన్న(గురువారం)ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రస్తుతానికి జస్టిస్ యశ్వంత్ బదిలీని నిలుపుదల చేయాలని సదరు బార్ అసోసియేషన్స్ కోరిన తరుణంలో వారితో సీజేఐ భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సీజేఐ సమావేశమై వారితో చర్చించారు. వారి డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంటామని సీజేఐ సంజీవ్ ఖన్నా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇంట్లో నోట్ల కట్టలు..!కాగా, ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాని విలువ సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని అంచనాలు కూడా వేశారు. ఒక న్యాయమూర్తి వద్ద అంత డబ్బు ఎలా వచ్చిందంటూ చర్చ మొదలైంది. అదే సమయంలో ఇది కచ్చితంగా అవినీతి చేసే కూడపెట్టిందని వాదన బలంగా వినిపించింది.ఈ క్రమంలోనే ఆరు రాష్ట్రాలకు చెందిన బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సీజేఐ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీని కొన్నాళ్లపాటు నిలుపుదల చేయడమే సమంజసమా?, బదిలీ చేసి అక్కడ జ్యుడిషియల్ వ్యవహారాలు అప్పగించకుండా ఉండేలా చేయడమే కరెక్టా అనే కోణంలో వీరు చర్చించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే జస్టిస్ యశ్వంత్ పై విచారణ పూర్తయ్యేవరకూ ఎటువంటి బాధ్యతలు కేటాయించవద్దని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించినట్లు సమాచారం. -
జస్టిస్ యశ్వంత్ వివాదంపై ఏం చేద్దాం..? వారితో సీజేఐ ప్రత్యేక భేటీ
న్యూఢిల్లీ: ఒకవైపు ఢిల్లీ హైకోర్టులో బాధ్యతలు ఏమీ అప్పగించడం లేదు.. మరొకవైపు అలహాబాద్ హైకోర్టేమో వద్దంటోంది. ఇది జస్టిస్ యశ్వంత్ వర్మ ప్రస్తుత పరిస్థితి. ఢిల్లీలోని తన ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయన ఆరోపణల నేపథ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మ చిక్కుల్లో పడ్డారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయడానికి పూనుకున్న సుప్రీంకోర్టు.. ముగ్గురు ప్రధాన న్యాయమూర్తలతో కూడిన కమిటీని ఇప్పటికే నియమించింది.అయితే యశ్వంత్ వర్మ సచ్ఛీలురుగా బయటకొచ్చేవరకూ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయొద్దంటూ అక్కడ బార్ అసోసియేషన్ తో పలు రాష్ట్రాల బార్ అసోయేషన్స్ కూడా కోరాయి. గుజరాత్ హైకోర్టు బార్ అసోసియేషన్, కేరళ హైకోర్టు బార్ అసోసియేషన్, కర్ణాటక హైకోర్టు బార్ అసోసియేషన్, లక్నో బార్ అసోసియేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సీజేఐ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పలు బార్ అసోసియేషన్ హెడ్స్ తో సీజేఐ సంజీవ్ ఖన్నా ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రస్తుతానికి జస్టిస్ యశ్వంత్ బదిలీని నిలుపుదల చేయాలని సదరు బార్ అసోసియేషన్స్ కోరిన తరుణంలో వారితో సీజేఐ భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సీజేఐ సమావేశమై వారితో చర్చించారు. వారి డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంటామని సీజేఐ సంజీవ్ ఖన్నా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. #WATCH | Presidents of Bar Associations of High Court of Allahabad, Lucknow bench, Gujarat, Karnataka, and Jabalpur bench of Madhya Pradesh have come to Supreme Court to meet Chief Justice of India Sanjiv Khanna and other senior judges on the issue of Justice Yashwant Varma.… pic.twitter.com/JuX6sLgsl3— ANI (@ANI) March 27, 2025 ఢిల్లీ హైకోర్టు ‘ దూరం’ పెట్టేసింది..!జస్టిస్ యశ్వంత్ వర్మపై అవినీతి ఆరోపణల అనంతరం ఏం జరుగుతుందా అని ఉత్కంఠ ఏర్పడింది. యశ్వంత్ యధావిధిగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతారా.. లేక అలహాబాద్ హైకోర్టు వెళతారా అనే సందిగ్థంలో ఉండగా సుప్రీంకోర్టు కొలీజియం ,, అలహాబాద్ హైకోర్టుకు పంపడానికే మొగ్గుచూపింది. ఢిల్లీ హైకోర్టులో యశ్వంత్ కు ఎటువంటి బాధత్యలు అప్పగించకపోవడంతోనే.. సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ నిరసనలు..అయితే అలహాబాద్ హైకోర్టు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తొలుత తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్.. దీనిపై తీవ్రంగా మండిపడింది. అవినీతి ఆరోపణలు ఉన్న యశ్వంత్ ను ఇక్కడకు ఎలా బదిలీ చేస్తారంటూ నేరుగా సీజేఐకే లేఖ రాసింది. ఆ ‘ చెత్త’ మాకొద్దంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే బదిలీకి, అవినీతి అంశానికి ఎటువంటి సంబంధం లేదని సీజేఐ చెప్పుకొచ్చారు. యశ్వంత్ పై దర్యాప్తు జరుగుతుందంటూనే బదిలీని సమర్ధించుకుంది ధర్మాసనం. అయినా మళ్లీ అలహాబాద్ హైకోర్టుకే యశ్వంత్ వర్మ అంటూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని.. అక్కడ బార్ అసోసియేషన్ ఖండించింది. జస్టిస్ యశ్వంత్ గతంలో ఇచ్చిన తీర్పులన్నీ రివ్యూ చేయాలంటూ నిరసన వ్యక్తం చేసింది. ప్రజల్లో నమ్మకం చూరగొనాలంటే ఆయన తీర్పులపై మళ్లీ సమీక్షలు అవసరమని, సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దర్యాప్తు చేయించాలని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ డిమాండ్ చేశారు.ఇంట్లో నోట్ల కట్టలు..!కాగా, ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాని విలువ సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని అంచనాలు కూడా వేశారు. ఒక న్యాయమూర్తి వద్ద అంత డబ్బు ఎలా వచ్చిందంటూ చర్చ మొదలైంది. అదే సమయంలో ఇది కచ్చితంగా అవినీతి చేసే కూడపెట్టిందని వాదన బలంగా వినిపించింది. ఈ తరుణంలో జస్టిస్ యశ్వంత్ పై సుప్రీంకోర్టు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే ఆరు రాష్ట్రాలకు చెందిన బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సీజేఐ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీని కొన్నాళ్లపాటు నిలుపుదల చేయడమే సమంజనమా అనే కోణంలో సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. -
ఇంకెన్ని పిటిషన్లు వేస్తారు?.. ప్రార్థనా స్థలాల అంశంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ : ప్రార్థన స్థలాలకు సంబంధించిన అంశంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. సోమవారం ప్రార్థనా స్థలాల చట్టం 1991 కింద దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టే సమయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లకు ఒక ముగింపు ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై దాఖలైన కొత్త పిటిషన్లను విచారణ చేపట్టదని స్పష్టం చేశారు.అయితే అదనపు అంశాలను జతచేస్తూ కొత్తగా పిటిషన్ దాఖలు చేయడం అనుమతించింది. కానీ ఇప్పటివరకు దాఖలు చేసిన కొత్త పిటిషన్లపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాంగ్రెస్, మజ్లిస్తో పాటు ఇతర రాజకీయ పార్టీలు 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. పిటిషన్ల తరుఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తన వాదనల్ని వినిపిస్తున్నారు.ఇక విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడానికి అనుమతించామని, కానీ ఇలాంటి వ్యాజ్యాలకు ఒక పరిమితి ఉండాలని గుర్తు చేసింది. ప్రార్థన స్థలాలకు సంబంధించిన కొత్త పిటిషన్లు దాఖలు చేస్తే.. అందులో కొత్త అంశాలను జోడించాలని, అలా అయితేనే వాటిని విచారణ చేపడతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది. -
మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కరించుకోవాలి
ముంబై: అన్ని రకాల వివాదాలను కోర్టురూమ్ల దాకా తీసుకురావాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా చెప్పారు. కొన్ని వివాదాలు కోర్టురూమ్ల్లో విచారణకు సరిపడవని అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. మధ్యవర్తులతో చాలాసార్లు అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో సృజనాత్మక పరిష్కారాలు లభిస్తాయని, మనుషుల మధ్య బంధాలు బలపడతాయని వెల్లడించారు. వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం కూడా ఒక చక్కటి మార్గమని పేర్కొన్నారు. శనివారం నాగపూర్లో మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ(ఎంఎన్ఎల్యూ) మూడో స్నాతకోత్సవంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడారు. ప్రతి కేసునూ చట్టపరమైన అంశం అనే కోణంలో చూడొద్దని, వాటిని మానవీయ కథనాలుగా పరిగణించాలని చెప్పారు. మన దేశంలో కక్షిదారులకు న్యాయ సహాయం అందించే వ్యవస్థ చాలా బలంగా ఉందన్నారు. ప్రపంచంలో ఇలాంటిది బహుశా ఎక్కడా లేకపోవచ్చని వ్యాఖ్యానించారు. మన దగ్గర కక్షిదారులందరికీ ఏదోరకంగా న్యాయ సహాయం లభిస్తోందన్నారు. ఏవైనా వివాదాలు తలెత్తగానే కోర్టుల్లో వ్యాజ్యాలు, విచారణల వరకూ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమం అని వివరించారు. అక్కడ కొన్నిసార్లు అవును లేదా కాదు అనే మాటలతోనే వివాదాలు పరిష్కారమవుతుంటాయని గుర్తుచేశారు. మధ్యవర్తిత్వం అనే మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా మనుషుల మధ్య, వ్యాపార సంస్థల మధ్య సంబంధాలు బలపడతాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉద్ఘాటించారు. -
నియామకాల్లో సీజేఐ ప్రమేయమా?
భోపాల్: సీబీఐ డైరెక్టర్ వంటి ఉన్నతస్థాయి కార్యనిర్వాహక పదవుల నియామకాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భాగస్వామి కావడం ఏ మేరకు సబబని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రశ్నించారు. ‘‘చట్టప్రకారమే అయినా సరే, భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాల్లో ఇలాంటి ప్రక్రియలో సీజేఐ ఎలా పాల్గొంటారు? నాటి పాలకులు న్యాయతీర్పు తాలూకు ఒత్తిడికి లొంగడంతో ఈ నిబంధన పుట్టుకొచ్చింది. దీనికి చట్టపరంగా హేతుబద్ధత ఉందా?’’ అని ప్రశ్నించారు. శుక్రవారం భోపాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కార్యనిర్వాహక కార్యకలాపాలు న్యాయవ్యవస్థ నిర్ణయాలు, తీర్పుల ద్వారా జరగడం రాజ్యాంగ విరుద్ధం. ఇలాంటి నిబంధనలను పునఃపరిశీలించాల్సిన సమయం వచ్చింది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. పాలనపరమైన వ్యవహారాల్లో శాసన, న్యాయవ్యవస్థల జోక్యం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమన్నారు. కోర్టులకున్న న్యాయసమీక్ష అధికారం సముచితమే అయినా రాజ్యాంగాన్ని సవరించే అధికారం మాత్రం అంతిమంగా పార్లమెంటుదేనని ధన్ఖడ్ స్పష్టం చేశారు. విచారణ సందర్భంగా పలు అంశాలపై న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలను కూడా ఆయన పరోక్షంగా తప్పుబట్టారు. ‘‘న్యాయవ్యవస్థ తీర్పుల రూపంలో ప్రజల ముందుకు రావాలే తప్ప ఇతరేతర వ్యక్తీకరణలకు పూనుకోవడం ఆ వ్యవస్థ గౌరవాన్నే భంగపరుస్తుంది. సామాజికాంశాలపై న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేయడం ప్రపంచంలో మరెక్కడా జరగదు’’ అన్నారు. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే సాకుతో అధికారపు అతిశయం ప్రదర్శించరాదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. -
జస్టిస్ హృషికేశ్ రాయ్కి ఘనమైన వీడ్కోలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హృషికేశ్ రాయ్కి శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో పలువురు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాతోపాటు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. జస్టిస్ హృషికేశ్ రాయ్ చాలా విశిష్టమైన న్యాయమూర్తి అని జస్టిస్ ఖన్నా కొనియాడారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రశంసించారు. క్విజ్ మాస్టర్గా, జర్నలిస్టుగా, స్టాండప్ కమేడియన్గానూ రాణించారని చెప్పారు. జస్టిస్ హృషికేశ్ రాయ్ 2019 సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. శుక్రవారం ఆయన పదవీ కాలం ముగిసింది. ఆయన చివరి పని దినంగా సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రత్యేకంగా సమావేశమైంది. న్యాయ వ్యవస్థకు జస్టిస్ హృషికేశ్ రాయ్కి అందించిన సేవలను ధర్మాసనం సభ్యులు గుర్తుచేసుకున్నారు. -
సంభాల్ మసీదు బావి వివాదం.. యథాతథ స్థితిని కొనసాగించండి
న్యూఢిల్లీ: సంభాల్లోని మొఘలుల నాటి జామా మసీదు సమీపంలోని వివాదాస్పద బావిపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని శుక్రవారం సుప్రీంకోర్టు భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ)తోపాటు ఉత్తరప్రదేశ్ అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి జామా మసీదు నిర్వహణ కమిటీ వేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కేంద్రం, ఏఎస్ఐలతోపాటు సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్కు, హరి శంకర్ జైన్ తరపున ఉన్న హిందూ కక్షిదారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 21వ తేదీన ఉంటుందని, రెండు వారాల్లోగా అక్కడి పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. బావికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్ట రాదని స్పష్టం చేసింది. మసీదు కమిటీ వేసిన పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకు మసీదులో చేపట్టిన సర్వే నివేదికను సీల్డ్ కవర్లోనే ఉంచాలంది. -
అలహాబాద్ హైకోర్టు నిర్ణయంతో అన్యాయం జరగదు
న్యూఢిల్లీ: శ్రీ కృష్ణ జన్మభూమి– షాహి ఈద్గా మసీదు వివాదానికి సంబంధించి హిందూ పిటిషనర్లు వేసిన 15 పిటిషన్లపై ఒకేసారి విచారణ చేపట్టాలన్న అలహాబాద్ హైకోర్టు నిర్ణయం సహేతుకంగానే ఉందని, ఇరువర్గాల వారికీ న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. 1991నాటి ప్రార్థనాస్థలాల చట్టానికి సంబంధించిన కేసుల విచారణలో ఉన్నామని, ఈ దశలో ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అవసరమనిపిస్తే తర్వాత దీనిపై విచారణ చేపడతామని పేర్కొంది. అయితే, హైకోర్టులో దాఖలైన పిటిషన్లన్నీ ఒకే అంశానికి సంబంధించినవి కాకున్నా అన్నిటినీ కలిపి విచారించనుండటంతో తమకు అన్యాయం జరుగుతుందని మసీదు తరఫు లాయర్ వాదించారు. ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులు తలెత్తేందుకు అవకాశం లేదని స్పష్టం చేసిన ధర్మాసనం.. ఏప్రిల్ మొదటి వారంలో ఈ పిటిషన్పై విచారణ చేపడతామని తెలిపింది. మసీ దులు, దర్గాలు తదితర ప్రార్థనాస్థలాలకు సంబంధించిన పిటిషన్లపై ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వొద్దని అన్ని కోర్టులకు సుప్రీంకోర్టు డిసెంబర్ 12న ఆదేశాలివ్వడం తెలిసిందే. అదేవిధంగా, మందిరం– మసీదు వివాదంపై హిందూ పక్షం వేసిన 15 అప్పీళ్లపై ఒకే దఫాలో విచారణ చేపడతామని గతేడాది జనవరి 11వ తేదీన అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది. -
‘సుప్రీం’ జడ్జిగా జస్టిస్ మన్మోహన్ ప్రమాణం
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్(61) గురువారం సుప్రీంకోర్టు జడ్జీగా ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు కాంప్లెక్స్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ మన్మోహన్ చేరికతో సీజేఐతో కలిపి సుప్రీంకు మంజూరైన 34 మంది జడ్జీలకు గాను ప్రస్తుతం 33 మంది ఉన్నట్లయింది. జస్టిస్ మన్మోహన్ను అత్యున్నత న్యాయస్థానానికి నవంబర్ 28న కొలీజియం సిఫారసు చేయడం, డిసెంబర్ 3న ఆయన్ను రాష్ట్రపతి ముర్ము నియమించడం తెల్సిందే. ఆల్ ఇండియా హైకోర్టు జడ్జీల్లో సీనియారిటీ పరంగా జస్టిస్ మన్మోహన్ రెండో స్థానంలోనూ, ఢిల్లీ హైకోర్టులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగాను ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పుచ్చుకున్న ఈయన 1987లో న్యాయవాదిగా పేరు నమోదుచేసుకున్నారు. సుప్రీంకోర్టు జడ్జీల రిటైర్మెంట్ వయస్సు 65 ఏళ్లు కాగా, హైకోర్టు జడ్జీల విరమణ వయస్సు 62 ఏళ్లు. -
కేంద్ర ఎన్నికల సంఘం కేసు.. వైదొలగిన సీజేఐ
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంలో నియామకాలకు సంబంధించిన వివాదాల ప్యానెల్ కేసు విచారణ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వైదొలిగారు. సీజేఐ ఈ పిటిషన్ నుంచి తప్పుకోవడంతో.. ఇది మరో బెంచ్కు వెళ్లనుంది. అయితే వచ్చే ఏడాది జనవరి 6వ తేదీన విచారణ మొదలుకానుంది.ఈ ప్యానెల్లో ప్రధాని, లోక్సభలో ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలని గతంలో సర్వోన్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం అనేది పారదర్శకంగా జరగాలన్నదే తమ అభిప్రాయం అని ఆ టైంలో కోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకానికి సంబంధించి ప్రత్యేక చట్టాన్ని పార్లమెంటు ఆమోదించేంత వరకు.. ఈ కమిటీ అమలులో ఉంటుందని ఆ సమయంలో స్పష్టం చేసింది. కానీ..కొన్ని నెలలకే కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద రీతిలో ఓ నిర్ణయం తీసుకుంది. సీజేఐ స్థానంలో ఓ కేంద్ర మంత్రిని ప్రధాన మంత్రి ఈ ప్యానెల్కు కేటాయించారు. ఈ మేరకు సీఈసీ బిల్లును శీతాకాలం సమావేశాల్లో ప్రతిపక్షాలు లేకుండానే ఆమోదింపజేసుకున్నారు. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలతో పాటు కొన్ని సంఘాలు సుప్రీం కోర్టులో సవాల్ చేశాయి. ఈ పిటిషన్ను నాడు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆ బెంచ్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా ఉండడం గమనార్హం. ఇక ఆ సమయంలో కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ.. మధ్యంతర ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ ధర్మాసనం. అయితే.. సీఈసీ బిల్లు వివాదాన్ని పట్టించుకోకుండానే.. కేంద్రం ఇద్దరిని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లుగా నియమించింది. ఇక.. ప్రస్తుత పరిస్థితుల్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా సీజేఐగా ఉండడంతో ఈ కేసు నుంచి త్ప్పుకోవాల్సి వచ్చింది. -
కొలీజియం సభ్యునిగా జస్టిస్ అభయ్ ఓకా
న్యూఢిల్లీ: ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియంలో న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్.ఓకాకు స్థానం దక్కింది. జస్టిస్ డి.వై.చంద్రచూడ్ రిటైర్ కావడంతో ఏర్పడిన ఖాళీలో ఆయన నియమితులయ్యారు. నూతన సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎంపిక చేసే ఐదుగురు సభ్యుల కొలీజియంలో ప్రస్తుతం సీజేఐ ఖన్నాతో పాటు న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషీకేశ్ రాయ్ ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తులను ఎంపిక చేసే ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియంలో సీజేఐతో పాటు జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ సభ్యులు. -
సీజేఐగా జస్టిస్ ఖన్నా బాధ్యతల స్వీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: భారత సర్వోన్నత న్యాయస్థానం 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం చేశారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఆంగ్లంలో దైవసాక్షిగా ఆయన పదవీస్వీకార ప్రమాణం చేశారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, మాజీ సీజేఐలు జస్టిస్ జె.ఎస్.ఖేహర్, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ఈ మేరకు ఎక్స్లో కూడా పోస్టు చేశారు. సీజేఐగా ఆదివారం రిటైరైన జస్టిస్ చంద్రచూడ్ స్థానంలో జస్టిస్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 183 రోజుల పాటు పదవిలో కొనసాగుతారు. 2025 మే 13న పదవీ విరమణ చేస్తారు. అయితే కృష్ణమీనన్ మార్గ్లోని సీజేఐ అధికారిక నివాసంలోకి మారకూడదని జస్టిస్ ఖన్నా నిర్ణయించుకున్నారు. పదవీ కాలం తక్కువగా ఉండడంతో ప్రస్తుత నివాసంలోనే కొనసాగనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.కీలక తీర్పుల్లో భాగస్వామి జస్టిస్ ఖన్నా 1960 మే 14న న్యాయమూర్తుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి దేవ్రాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా చేశారు. ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రాథమిక హక్కులపై ఆయన పెదనాన్న జస్టిస్ హన్స్రాజ్ ఖన్నా ఇచ్చిన తీర్పు భారత న్యాయ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోయింది! తండ్రి తనను అకౌంటెంట్గా చూడాలనుకున్నా జస్టిస్ ఖన్నా న్యాయవాద వృత్తికేసి మొగ్గుచూపేందుకు పెదనాన్న స్ఫూర్తే కారణమంటారు. ఆయన 2019 జనవరి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. ఈ ఆరేళ్లలో 117 తీర్పులిచ్చారు. 456 తీర్పుల్లో సభ్యుడిగా భాగస్వాములయ్యారు. తొలి రోజే 45 కేసుల విచారణ! సీజేఐగా తొలి రోజే జస్టిస్ ఖన్నా 45 కేసులను విచారించారు. న్యాయాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రాధాన్యమిస్తానని జస్టిస్ ఖన్నా పేర్కొన్నారు. దేశ న్యాయ వ్యవస్థకు సారథ్యం వహించే అవకాశం దక్కడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ‘‘న్యాయ వ్యవస్థ పాలన యంత్రాంగంలో అంతర్భాగమే. అయినా అది స్వతంత్ర వ్యవస్థ. రాజ్యాంగానికి కాపలాదారుగా, ప్రాథమిక హక్కుల పరిరక్షకురాలిగా న్యాయ వ్యవస్థ తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించేలా చూసేందుకు కృషి చేస్తా’’ అని తెలిపారు. న్యాయ వ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు.పెదనాన్న కోర్టు గదిలోనే... జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా న్యాయమూర్తిగా తీర్పులు వెలువరించిన సుప్రీంకోర్టులోని రెండో నంబర్ గదిలో ఆయన నిలువెత్తు చిత్రపటం ఇప్పటికీ సమున్నతంగా వేలాడుతూ ఉంటుంది. సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా సీజేఐగా తన తొలి రోజు కేసుల విచారణను అదే గదిలో చేపట్టడం విశేషం. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన కెరీర్ మొదలైంది కూడా ఇదే కోర్టు గదిలో! సీజేఐగా ఆయన పదవీకాలం ఫలవంతంగా సాగాలని మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ తదితర న్యాయవాదులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. విచారణకు కేసుల సీక్వెన్సింగ్కు సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టు బార్ నేత ఒకరు లేవనెత్తగా ఆ అంశం తన దృష్టిలో ఉందని, దాన్ని పరిశీలిస్తానని పేర్కొన్నారు. లెటర్ ఆఫ్ సర్క్యలేషన్ ద్వారా కూడా వాయిదాలు కోరే విధానాన్ని పునరుద్ధరించాలన్న ఒక లాయర్ విజ్ఞప్తిని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు నూతన సీజేఐ పేర్కొన్నారు. #WATCH | Delhi: President Droupadi Murmu administers the oath of Office of the Chief Justice of India to Sanjiv Khanna at Rashtrapati Bhavan. pic.twitter.com/tJmJ1U3DXv— ANI (@ANI) November 11, 2024పూర్వీకుల ఇంటికోసం అన్వేషణజస్టిస్ సంజీవ్ ఖన్నా తన పూర్వీకుల ఇంటికోసం చిరకాలంగా అన్వేషిస్తున్నారు! ఆయన తాతయ్య సరవ్దయాల్ బ్రిటిష్ ఇండియాలో లాయర్గా చేశారు. పంజాబ్లోని అమృత్సర్లో జలియన్వాలాబాగ్ సమీపంలోని కట్రా షేర్సింగ్ ప్రాంతంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారట. జస్టిస్ ఖన్నా ఐదేళ్ల వయసులో తండ్రితో కలిసి ఆ ఇంటికి వెళ్లారు. తాతయ్య మరణానంతరం 50 ఏళ్ల కింద ఆ ఇంటిని అమ్మేశారట. ఇన్నేళ్లలో కొత్త నిర్మాణాలు తదితరాలతో ఆ ప్రాంతం రూపురేఖలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. కానీ ఆ ఇంటి తాలూకు తన చిన్ననాటి జ్ఞాపకాలు జస్టిస్ ఖన్నా మదిలో అలాగే ఉండిపోయాయి. అందుకే దాన్ని వెతకడానికి జస్టిస్ ఖన్నా ఇప్పటికీ ప్రయతి్నస్తూనే ఉంటారట. అమృత్సర్ వెళ్లినప్పుడల్లా విధిగా కట్రా షేర్సింగ్ ప్రాంతానికి వెళ్తారని ఆయన సన్నిహితులు తెలిపారు. వేసవి సెలవుల్లో తాతయ్యతో గడిపిన జ్ఞాపకాలను కూడా జస్టిస్ ఖన్నా ఇప్పటికీ నెమరేసుకుంటూ ఉంటారు. పెదనాన్నకు ఇందిర నిరాకరించిన పీఠంపై... అది 1976. ఎమర్జెన్సీ రోజులు. సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హన్స్రాజ్ ఖన్నా హరిద్వార్లో గంగా తీరాన సోదరితో కలిసి సేదదీరుతున్నారు. ‘‘నేనో తీర్పు ఇవ్వబోతున్నా. దానివల్ల బహుశా నాకు సీజేఐ పదవి చేజారవచ్చు’’ అని ఆమెతో అన్నారు. సరిగ్గా అలాగే జరిగింది. ప్రధాని ఇందిరాగాంధీ సిఫార్సు మేరకు పౌరుల ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేస్తూ నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఉత్తరు్వలిచ్చారు. వాటిని పలు రాష్ట్రాల హైకోర్టులు కొట్టేశాయి. ఆ తీర్పులను ఇందిర సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అది పౌరుల హక్కులకు సంబంధించి కీలక ప్రశ్నలు లేవనెత్తిన ఏడీఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసుగా చరిత్రలో నిలిచిపోయింది. రాష్ట్రపతి ఉత్తర్వులను సమర్థిస్తూ సీజేఐ ఏఎన్ రే సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4–1 మెజారిటీతో తీర్పు వెలువరించింది. జస్టిస్ ఖన్నా ఒక్కరే దానితో విభేదించారు. ఎమర్జెన్సీ కాలంలోనైనా సరే, ప్రాథమిక హక్కులను నిషేధించే అధికారం కేంద్రానికి లేదంటూ మైనారిటీ తీర్పు వెలువరించారు. ఇది భారత న్యాయ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోయింది. ప్రాథమిక హక్కుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పును అనివార్యంగా ఉటంకిస్తారు. అప్పట్లో విదేశీ మీడియా కూడా జస్టిస్ ఖన్నా తీర్పును ఎంతగానో కొనియాడింది. అత్యంత నిర్భీతితో కూడిన తీర్పులిచ్చిన భారత న్యాయమూర్తుల్లో అగ్రగణ్యులుగా జస్టిస్ ఖన్నా నిలిచిపోయారు. దీనిపై ఆగ్రహించిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి అయిన ఆయన్ను కాదని జస్టిస్ హమీదుల్లా బేగ్ను 15వ సీజేఐగా ఎంపిక చేశారంటారు. అందుకు నిరసనగా అదే రోజున న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసిన అరుదైన వ్యక్తిత్వం జస్టిస్ ఖన్నాది. అలా 48 ఏళ్ల క్రితం చేజారిన అత్యున్నత న్యాయ పీఠం తాజాగా ఆయన కుమారుని వరసయ్యే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు దక్కింది. ఈ ఉదంతంపై చర్చోపచర్చలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. దీన్ని ప్రకృతి చేసిన న్యాయంగా నెటిజన్లు అభివరి్ణస్తున్నారు. జబల్పూర్ కేసులో మెజారిటీ తీర్పు వెలువరించిన నలుగురు న్యాయమూర్తుల్లో తాజా మాజీ సీజేఐ డి.వై.చంద్రచూడ్ తండ్రి జస్టిస్ వై.వి.చంద్రచూడ్ కూడా ఉండటం విశేషం. ఆయన జస్టిస్ బేగ్ అనంతరం 16వ సీజేఐ అయ్యారు. ఇక జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా ఎమర్జెన్సీ అనంతరం లా కమిషన్ చైర్మన్గా సేవలందించారు. అనంతరం చరణ్సింగ్ మంత్రివర్గంలో కేంద్ర న్యాయ మంత్రిగా నియమితులైనా మూడు రోజులకే రాజీనామా చేశారు. 1982లో విపక్షాల ఉమ్మడి అభ్యరి్థగా రాష్ట్రపతి పదవికి పోటీ చేసి జైల్సింగ్ చేతిలో ఓడిపోయారు. చదవండి: ట్రంప్ విజయంపై భారత్ ఆందోళన?.. జైశంకర్ రిప్లై ఇదే.. -
రేపు సీజేఐగా సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం
ఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం ఇవాళ్టి(ఆదివారం)తో ముగిసింది. దీంతో సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.. 51వ భారత ప్రధాన న్యాయమూర్తిగా రేపు(సోమవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక.. ఆయన వచ్చే ఏడాది మే 13 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. ఇవాళ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ విరమణ చేశారు.జస్టిస్ ఖన్నా 1960 మే 14న జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించారు. 1983లో న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో అడ్వొకేట్గా నమోదయ్యారు. వేర్వేరు కోర్టుల్లో పనిచేశారు. తీస్ హజారీ జిల్లా కోర్టు, ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా వ్యవహరించారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2006లో అదే కోర్టులో శాశ్వత జడ్జిగా చేరారు. ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ చైర్మన్గా సేవలందించారు. వృత్తిలో అంచెలంచెలుగా ఎదుగుతూ 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా, భోపాల్లోని నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ గవరి్నంగ్ కౌన్సిల్ సభ్యుడిగానూ పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఖన్నా పలు కీలక తీర్పులు వెలువరించారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలకు(ఈవీఎంలు) సంబంధించి వీవీప్యాట్లలోని 100 శాతం ఓట్లను లెక్కించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసిన పిటిషన్ను 2024లో కొట్టివేసిన డివిజన్ బెంచ్కు ఆయన నేతృత్వం వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని 2024లో చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఆరి్టకల్ 370ని రద్దు చేయడాన్ని సమర్థిస్తూ 2023లో తీర్పు ఇచ్చిన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా సభ్యుడిగా ఉన్నారు. వివాహ బంధం పూర్తిగా విఫలమైన సందర్భాల్లో దంపతులకు నేరుగా విడాకులు మంజూరు చేసే అధికారం ఆరి్టకల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉందని 2023లో స్పష్టంచేశారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి సుప్రీంకోర్టు కార్యాలయం వస్తుందంటూ 2019లో మరో కీలక తీర్పు వెలువరించారు. -
సీజేఐ చంద్రచూడ్ను ‘సర్ప్రైజ్’ చేసిన A.I. లాయర్
ఢిల్లీ: నేషనల్ జ్యుడీషియల్ మ్యూజియం అండ్ ఆర్కైవ్(ఎన్జేఎంఏ)ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై చంద్రచూడ్ ప్రారంభించారు. గురువారం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) న్యాయవాదితో సీఎం మాట్లాడ్లారు. ఈ సందర్భంగా సీజేఐ చంద్రబూడ్.. ఏఐ లాయర్కు ఉన్న న్యాయపరమైన పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు ఓ ఆసక్తిరమైన ప్రశ్నను సంధించారు. అయితే, అంతే అలవోకగా ఏఐ న్యాయవాది.. సమాధానం చెప్పి సీజేసీ ఆశ్చర్యపరిచారు. ‘భారతదేశంలో మరణశిక్ష రాజ్యాంగబద్ధమా?’ అని సీజేఐ.. ఏఐ లాయర్ను అడిగారు. అడ్వకేట్ బో టై , కోటు ధరించిన కళ్లద్దాలతో ఉన్న ఏఐ లయర్.. అ సీజేఐ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘‘అవును.. మరణశిక్ష భారతదేశంలో రాజ్యాంగబద్ధం. నేరం నిరూపించబడిన చాలా అరుదైన కేసుల్లో దోషుకులకు మరణ విధిస్తారు. అయితే.. హేయమైన కేసుల్లో అటువంటి శిక్షకు రాజ్యాంగబద్ధత ఉంది’’ అని చెప్పారు. ఏఐ లాయర్ స్పందనతో.. ప్రధాన న్యాయమూర్తి ముగ్ధులయ్యారు. సీజేఐతో పాటు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.AI भारत सहित दुनिया को बदल रहा है।सुनिए जब AI जज से CJI ने भारत में डेथ पैनालिटी के बारे में पूछा।जवाब सुनकर सीजेआई भी हैरान रह गए pic.twitter.com/7w9aNZYZtO— Sandeep Tevatia (@Adsandeept) November 7, 2024 ఇక.. ప్రారంభోత్సవం అనంతరం.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడారు. ‘‘ కొత్త మ్యూజియం సుప్రీంకోర్టు ధర్మాన్ని, దేశానికి ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. ఈ మ్యూజియం యువ తరానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నా. పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులను న్యాయవాదులు, న్యాయమూర్తులు తప్పనిసరిగా ఇక్కడకు తీసుకువచ్చి న్యాయస్థానం, చట్టబద్ధమైన పాలన ప్రాముఖ్యత ప్రత్యక్ష అనుభవాన్ని అందించాలి’’ అని అన్నారు. -
అన్ని ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి రాష్ట్రాలకు అధికారం లేదు
ఆర్టికల్ 39(బి)లో పేర్కొన్న సామాజిక వనరులు అన్న పదబంధం ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని ఆస్తులు, వనరులకు వర్తిస్తుందా అన్నది మా ముందున్న ప్రశ్న. సైద్ధాంతికంగా చూస్తే అవుననే సమాధానమే వస్తుంది. కానీ ఆ మేరకు జస్టిస్ కృష్ణయ్యర్ ఇచ్చిన తీర్పు, దాని ఆధారంగా సంజీవ్ కోక్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించలేకపోతున్నాం. కేవలం భౌతిక అవసరాల నిర్వచన పరిధిలోకి వచ్చినంత మాత్రాన ప్రతి ప్రైవేట్ ఆస్తినీ సామాజిక వనరుగా పరిగణించడం కుదరదు.– సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ న్యూఢిల్లీ: ప్రైవేట్ ఆస్తులపై ప్రభుత్వాల అధికార పరిధికి సంబంధించిన అతి కీలకమైన అంశంపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. అన్ని ప్రైవేట్ ఆస్తులూ సామాజిక వనరుల నిర్వచన పరిధిలోకి రావని స్పష్టం చేసింది. ‘‘కనుక రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని ప్రైవేట్ ఆస్తుల మీదా హక్కులు ఉండబోవు. సమాజ హితం, ఉమ్మడి ప్రయోజనాలు, సామాజిక పంపకం నిమిత్తం ఏ ప్రైవేట్ ఆస్తినైనా స్వాదీనం చేసుకునేందుకు వాటికి అధికారం లేదు’’ అని తేల్చి చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ మేరకు 7–2 మెజారిటీతో చరిత్రాత్మక తీర్పు వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(బి) ఆధారంగా ప్రైవేట్ యాజమాన్యంలోని అన్ని వనరులను స్వా«దీనం చేసుకునే హక్కు రాష్ట్రాలకు లేదని పేర్కొంది. వాటికి ఆ అధికారం ఉందంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి తదితరులు ఇచ్చిన గత తీర్పులతో విభేదించింది. వాటిలో వెలిబుచ్చిన అభిప్రాయాలను లోపభూయిష్టమైనవిగా, కాలదోషం పట్టినవిగా పేర్కొంది. ఆ తీర్పులను కొట్టేసింది. ఆర్థిక ప్రజాస్వామ్యానికి కూడా రాజ్యాంగం అనుమతిస్తోందంటూ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే, ‘‘కొన్ని ప్రైవేట్ ఆస్తులు మాత్రం ఆర్టికల్ 39(బి)లో పేర్కొన్న ‘సామాజిక వనరులు, సమాజ హితం’ పరిధిలోకి వస్తాయి. ఆ నిర్దిష్ట అవసరాల నిమిత్తం వాటిని ప్రభుత్వాలు స్వాదీనం చేసుకోవచ్చు’’ అని స్పష్టం చేసింది. సీజేఐతో పాటు జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీ ఈ మేరకు మెజారిటీ తీర్పు వెలువరించారు. వారి తరఫున సీజేఐ 193 పేజీల తీర్పును రాశారు. ఈ తీర్పుతో జస్టిస్ బి.వి.నాగరత్న పాక్షికంగా, జస్టిస్ సుధాన్షు ధూలియా పూర్తిగా విభేదించారు. కాలానుగుణంగా మారాలి: సీజేఐ ఆర్టికల్ 39(బి) కింద కేవలం ప్రైవేట్ ఆస్తులను కూడా సామాజిక వనరులుగా భావించవచ్చా అన్న అంశం 1992 నుంచి న్యాయస్థానాల్లో నలుగుతోంది. దీనికి సంబంధించి 16 పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. దీన్ని 2002లో తొమ్మిది మంది సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు. 2024లో సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం దీన్ని విచారణకు చేపట్టింది. ప్రైవేట్ ఆస్తులన్నింటినీ సామాజిక వనరులుగా భావించడానికి వీల్లేదని సీజేఐ తన తీర్పులో స్పష్టం చేశారు. అలా భావించవచ్చని, వాటిని సమాజ హితం కోసం స్వాదీనం చేసుకోవచ్చని పేర్కొన్న గత తీర్పులు సామ్యవాద ధోరణితో కూడినవని అభిప్రాయపడ్డారు. ‘‘ఆర్టికల్ 39(బి)లో పేర్కొన్న సామాజిక వనరులు అన్న పదబంధం ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని ఆస్తులు, వనరులకు వర్తిస్తుందా అన్నది మా ముందున్న ప్రశ్న. సైద్ధాంతికంగా చూస్తే అవుననే సమాధానమే వస్తుంది. కానీ ఆ మేరకు జస్టిస్ కృష్ణయ్యర్ ఇచ్చిన తీర్పు, దాని ఆధారంగా సంజీవ్ కోక్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించలేకపోతున్నాం. కేవలం భౌతిక అవసరాల నిర్వచన పరిధిలోకి వచ్చినంత మాత్రాన ప్రతి ప్రైవేట్ ఆస్తినీ సామాజిక వనరుగా పరిగణించడం కుదరదు. సదరు ఆస్తి తాలూకు స్వభావం, సమాజ శ్రేయస్సుపై దాని ప్రభావం, వనరుల అలభ్యత, అది ప్రైవేటు చేతుల్లో ఉంటే తలెత్తే పరిణామాలు తదితరాలన్నింటినీ బేరీజు వేసిన మీదట మాత్రమే అది సామాజిక వనరో, కాదో తేల్చాలి. ప్రజా విశ్వాస సిద్ధాంతాన్ని కూడా దీనికి వర్తింపజేయాల్సి ఉంటుంది. అడవులు, చెరువులు, చిత్తడి నేలలు, సహజ వనరులతో కూడిన భూముల వంటివి ప్రైవేట్ స్వాదీనంలో ఉంటే ఆర్టికల్ 39(బి) కింద వాటిని సమాజ అవసరాల నిమిత్తం ప్రభుత్వాలు సేకరించవచ్చు. అదే సమయంలో స్పెక్ట్రం, ఎయిర్వేవ్స్, సహజ వాయువు, గనులు, ఖనిజాల వంటి కొరతతో కూడిన పరిమిత వనరులు కొన్నిసార్లు ప్రైవేట్ అజమాయిషీలో ఉండేందుకు ఆస్కారముంది. కనుక పంపకం అనే మాటకున్న అర్థం విస్తృతమైనది’’ అని సీజేఐ పేర్కొన్నారు. ‘‘గత తీర్పుల్లో జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి నిర్దిష్ట ఆర్థిక సిద్ధాంతాల ప్రాతిపదికన అభిప్రాయాలు వెలిబుచ్చారు. కానీ స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో సంక్షేమ ఆధారిత విధానాలున్నాయి. తర్వాత మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, జాతీయీకరణ వంటివాటి కాలం నడిచింది. ఇది పెట్టుబడుల ఉపసంహరణల యుగం. ప్రైవేట్ పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. కనుక గత పరిస్థితులను ఇప్పుడు ప్రాతిపదికగా తీసుకోరాదు. ప్రస్తుత, భావి అవసరాలను తగ్గట్టుగా తీర్పులుండాలి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం కూడా ఫలానా ఆర్థిక విధానాన్నే పాటించాలని సూచించలేదన్నారు. ఇద్దరు న్యాయమూర్తులు ఏమన్నారంటే... ఏ ప్రైవేట్ ఆస్తులనైనా సమాజ హితానికి స్వా«దీనం చేసుకునే అధికారం ప్రభుత్వాలకు ఉందన్న జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి తదితర తీర్పులకు నేటికీ కాలదోషం పట్టలేదని జస్టిస్ ధూలియా అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఆర్టికల్ 38, 39ల్లో పేర్కొన్న సూత్రాలను పక్కన పెట్టడం సబబు కాదన్నారు. అలా చేయడం ప్రభుత్వాల చేతులను కట్టేయడమే అవుతుందని 97 పేజీల తీర్పులో స్పష్టం చేశారు. ‘‘ఎందుకంటే అంబేడ్కర్ హెచ్చరించిన సామాజిక, ఆర్థిక అసమానతలు మన దేశంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పేద, సంపన్న వర్గాల మధ్య ఆదాయ, సంపదపరమైన భారీ అసమానతలు నానాటికీ మరింతగా పెరుగుతున్నాయి’’ అన్నారు. జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి తీర్పులకు పూర్తిగా కాలదోషం పట్టలేదని జస్టిస్ నాగరత్న కూడా అభిప్రాయపడ్డారు. అయితే, ‘‘భౌతిక వనరులను ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యంలోవిగా విభజించవచ్చు. పూర్తిగా వ్యక్తిగత అవసరాలను తీర్చేవాటిని మినహాయించి ఇతర ప్రైవేటు ఆస్తులను సమాజ హితం కోసం ప్రభుత్వం సేకరించవచ్చు. ఆ మీదట సమాజ హితం కోసం అర్హులకు వాటిని చట్టపరమైన మార్గాల్లో తాత్కాలిక/శాశ్వత ప్రాతిపదికన బేషరతుగానో, షరతులతోనో పంపకం చేయవచ్చు’’ అని ఆమె పేర్కొన్నారు. అయితే జస్టిస్ కృష్ణయ్యర్ తీర్పుపై సీజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యలను ‘పరుషమైనవి, అనవసరమైనవి’గా జస్టిస్ ధూలియా, జస్టిస్ నాగరత్న అభివర్ణించడం విశేషం. వాటితో తాము గట్టిగా విభేదిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. కృష్ణయ్యర్, చిన్నపురెడ్డి తీర్పులు... సమాజహితం కోసం ప్రైవేట్ ఆస్తులను సేకరించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుందని 1977లో కర్నాటక ప్రభుత్వం వర్సెస్ రంగనాథరెడ్డి కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణయ్యర్ పేర్కొన్నారు. ప్రైవేట్ యాజమాన్యంలోని ఆస్తులు సామాజిక వనరుల నిర్వచనంలోకి రావంటూ ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన మెజారిటీతో తీర్పును వ్యతిరేకించారు. ప్రైవేట్ ఆస్తులు కూడా ఆ నిర్వచనం పరిధిలోకి వస్తాయంటూ ఆయన మైనారిటీ తీర్పు వెలువరించారు. ఆస్తులపై భూస్వాములు, పెట్టుబడిదారుల ఆస్తుల కోటలను బద్దలు కొట్టడానికి ఆర్టికల్ 39(బి)ని రాజ్యాంగంలో ఉద్దేశపూర్వకంగానే చేర్చారని అభిప్రాయపడ్డారు. 1983లో సంజీవ్ చోక్ కేసులో సీజేఐ చిన్నపరెడ్డి కూడా జస్టిస్ కృష్ణయ్యర్ మైనారిటీ తీర్పును పూర్తిగా సమర్థించారు. సామ్యవాద సిద్ధాంతకర్తల ఆదర్శాలే ఆర్టికల్ 39(బి)లో ప్రతిఫలించాయని ఆయన పేర్కొన్నారు. ఆర్టికల్ 39(బి) ఏం చెబుతోందంటే... ‘‘సామాజిక వనరులు సమాజ విశాల హితం కోసం పంపిణీ అయేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. ఇందుకు వీలుగా సదరు వనరులపై యాజమాన్యం, నియంత్రణకు అవసరమైన విధానాలను రూపొందించాలి’’. -
CJI DY Chandrachud: జూనియర్లకు సరైన వేతనాలివ్వండి
న్యూఢిల్లీ: ‘‘న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి, నైపుణ్యాలు పెంచుకోవడానికి మీ వద్ద పనిచేసే యువతకు సరైన వేతనాలు, పారితోషికాలు చెల్లించడం మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి’’ అని న్యాయవాదులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సూచించారు. న్యాయవాద వృత్తి చాలా సంక్లిష్టమైందని చెప్పారు. ప్రాథమిక స్థాయిలో నేర్చుకున్న నైపుణ్యాలే యువ న్యాయవాదులను ముందుకు నడిపిస్తాయని, అవి వారికి జీవితాంతం తోడ్పడుతాయని తెలిపారు. పునాది బలంగా ఉండాలని పేర్కొన్నారు. తాజాగా ఆలిండియా రేడియో ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ పలు విషయాలు వెల్లడించారు. ఈ వృత్తిలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు ఉంటాయని, ప్రారంభంలో వేతనాలు ఎక్కువగా ఉండకపోవచ్చని వెల్లడించారు. న్యాయవాద వృత్తిలోకి వచ్చేవారు కష్టపడి పనిచేయాలని, నిజాయతీగా ఉండాలని పేర్కొన్నారు. యువ లాయర్లను ప్రోత్సహించడం చాలా ముఖ్యమని స్పష్టంచేశారు. జూనియర్లకు సీనియర్ లాయర్లు గురువులుగా కొత్త విషయాలు నేరి్పస్తూనే సంతృప్తికరమైన వేతనాలు చెల్లించడం తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. తాను కాలేజీలో చదువుకొనే రోజుల్లో ఆలిండియా రేడియోలో ప్రయోక్తగా పనిచేశానని జస్టిస్ చంద్రచూడ్ గుర్తుచేసుకున్నారు. శాస్త్రీయ సంగీత కళాకారిణి అయిన తన తల్లి తనను ముంబైలోని ఆలిండియా రేడియో స్టూడియోకు తీసుకెళ్తూ ఉండేవారని చెప్పారు. 1975లో ఢిల్లీకి వచ్చాక ఆకాశవాణిలో హిందీ, ఇంగ్లిష్ కార్యక్రమాలు నిర్వహించానని వివరించారు. చిన్నప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి రేడియోలో హిందీ, ఇంగ్లి‹Ù, సంస్కృత కార్యక్రమాలు విన్నానని తెలిపారు. దేవకి నందన్ పాండే, పమేలా సింగ్, లోతికా రత్నం గొంతులకు తాను అభిమానినని చెప్పారు. -
CJI Chandrachud: అయోధ్య సమస్య పరిష్కారం కోసం దేవుడిని ప్రార్థించా
పుణే: రామ జన్మ భూ మి–బాబ్రీ మసీదు వి వాదం పరిష్కారం కోసం భగవంతుడిని ప్రార్థించానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. భగవంతుడి పట్ల విశ్వాసం ఉంటే ఆయన కచ్చితంగా పరిష్కార మార్గం చూపిస్తాడని అన్నారు. జస్టిస్ చంద్రచూడ్ వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన స్వస్థలం మహారాష్ట్రలోని ఖేడ్ తాలూకా కన్హేర్సార్. ఈ గ్రామ ప్రజలు ఆదివారం ఆయనను సత్కరించారు. కేసుల విచారణ సమయంలో న్యాయమూర్తులకు కొన్నిసార్లు పరిష్కార మార్గాలు కనిపించవని ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. అయోధ్య వ్యవహారంపై విచారణ జరుగుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితి తనకు ఎదురైందన్నారు. అప్పుడు భగవంతుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థించానని, సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకున్నానని తెలిపారు. తాను తరచుగా దేవుడిని ప్రార్థిస్తుంటానని పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా 2019 నవంబర్ 9న అప్పటి సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్ కూడా ఒక సభ్యుడే. -
కేసుల పరిష్కారానికి గడువు పెట్టలేం
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని కోర్టుల్లో కేసులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలా ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఇది అమెరికా సుప్రీంకోర్టు కాదని వ్యాఖ్యానించింది. అలా గడువు పెట్టలేమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టుతో సహా దేశంలోని అన్ని కోర్టుల్లో దాఖలయ్యే కేసులను 12 నుంచి 36 నెలల్లోగా పరిష్కరించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ కోరారు. విదేశాల్లో కేసుల పరిష్కారానికి నిర్దిష్ట గడువు ఉన్న విషయాన్ని పిటిషనర్ ఎత్తిచూపగా.. ‘మాది అమెరికా సుప్రీంకోర్టు కాదు’ అని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టులో అన్ని కేసుల్లోనూ 12 నెలల్లో విచారణా పూర్తికావాలని కోరుకుంటున్నారా? అని పిటిషనర్ను ప్రశ్నించింది. ఇది అత్యంత అభిలషణీయమైనా.. ఆచరణసాధ్యం కాదని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, జడ్జిల సంఖ్య పెంచడం.. లాంటివెన్నో అవసరమవుతాయన్నారు. అమెరికా, ఇతర పాశ్చాత్యదేశాల్లో ఒక ఏడాదిలో సుప్రీంకోర్టులు ఎన్ని కేసులు పరిష్కరిస్తాయో మీకు తెలుసా? అని పిటిషనర్ను అడిగారు. కొన్ని పాశ్చాత్యదేశాల సుప్రీంకోర్టులు ఏడాది మొత్తం పరిష్కరించే కేసుల కంటే భారత సుప్రీంకోర్టు ఒక్కరోజు వినే కేసులే ఎక్కువన్నారు. భారత్లో అందరికీ న్యాయం పొందే అవకాశాన్ని మన వ్యవస్థ కల్పిస్తోందని, ఎవరినీ అడ్డుకోలేమని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. -
తూచా తప్పకుండా అమలవాల్సిందే
న్యూఢిల్లీ: బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు పేర్కొంది. దాని అమలులో వ్యక్తిగత వివాహ చట్టాలతో పాటు మరే ఇతర చట్టాలూ అడ్డంకి కాజాలవని స్పష్టం చేసింది. వాటిలో ఏది ముందనే ప్రశ్న తలెత్తే సందర్భంలో బాల్య వివాహాల నిషేధ చట్టమే అమలవుతుందని పేర్కొంది. సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు 141 పేజీల తీర్పు వెలువరించింది. బాల్య వివాహాల కట్టడికి మరింత సమర్థమైన విధానాలను అమలు చేయాలంటూ దాఖలైన పిల్పై ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘బాల్య వివాహాలు ఒక సామాజిక రుగ్మత. బాలలకు, ముఖ్యంగా బాలికలకు ఆరోగ్యం, విద్య, ఉపాధితో పాటు జీవించే అవకాశాలనే ప్రశ్నార్థకం చేస్తుంది. కానీ భారత్లో బాల్య వివాహాలు ఇంకా ప్రబలంగా ఉండటం దురదృష్టకరం’’ అంటూ ఆవేదన వెలిబుచ్చింది. వాటి కట్టడికి జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా బాల్య వివాహాల నిషేధ అధికారులను నియమించాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. చట్టం అమలు తీరుతెన్నులపై మహిళా, శిశు సంక్షేమ, హోం శాఖలు మూడు నెలలకు ఓసారి సమీక్ష జరపాలని సూచించింది. బాల్య వివాహాలు తప్పని, వాటికి కఠిన శిక్షలు తప్పవని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ‘‘వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలపై ఉంటుంది. ఇందుకోసం పోలీసు శాఖలో జువనైల్ విభాగాన్ని ఏర్పాటు చేయాలి’’ అని పేర్కొంది. -
తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
-
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా సంజీవ్ కన్నా పేరు సిఫార్సు
-
తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న సీజేఐ
సాక్షి,తిరుపతి:తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డి.వై చంద్రచూడ్ శనివారం(సెప్టెంబర్28) దర్శించుకున్నారు.సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ డాక్టర్ డీవై చంద్రచూడ్కు టీటీడీ ఈవో శ్యామలరావు స్వాగతం పలికారు.ఆలయ అర్చకులు బాబు స్వామి, మణికంఠ స్వామి, శ్రీనివాస ఆచార్యులు సాంప్రదాయబద్ధంగా సీజేఐకి స్వాగతం పలికారు.అమ్మవారి దర్శనం అనంతరం చీఫ్ జస్టిస్ దంపతులకు వేద పండితులు వేదశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు. -
చైల్డ్పోర్నోగ్రఫీ వీక్షణ ముమ్మాటికీ నేరమే: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: చైల్డ్ పోర్నోగ్రఫీ వీక్షణ నేరమా? కాదా? అనే అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. అదేం నేరం కాదని గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ.. ముమ్మాటికీ నేరమేనంటూ సీజేఐ ధర్మాసనం సోమవారం తుది తీర్పు వెల్లడించింది. పోక్సో చట్టం సెక్షన్ 15 ప్రకారం.. చైల్డ్ పోర్నోగ్రఫీ మెటీరియల్ను(ఫొటోలు, వీడియోలు) వీక్షించడం మాత్రమే కాదు నిల్వ చేసుకోవడం కూడా నేరమే అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పును తీవ్ర తప్పిదంగా పేర్కొంటూ.. దాన్ని పక్కన పెట్టేసింది. అలాగే ఈ కేసులో నిందితుడికి ఇచ్చిన ఊరటను ఎత్తేస్తూ.. క్రిమినల్ ప్రాసిక్యూషన్ కొనసాగించాలని స్పష్టం చేసింది. పనిలో పనిగా.. కోర్టులు కూడా చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని ఉపయోగించొద్దు అని సుప్రీం కోర్టు సూచించింది. కేసు ఏంటంటే..తమిళనాడుకు చెందిన 28ఏళ్ల యువకుడు ఛైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్లోడ్ చేసుకుని వీక్షించాడన్న అభియోగాలపై క్రిమినల్ చర్యలను నిలిపివేస్తూ మద్రాస్ హైకోర్టు ఈ ఏడాది జనవరి 11వ తేదీన సంచలన తీర్పు వెల్లడించింది. అతను కేవలం వీడియోలు కేవలం చూసాడని,ఇతరులకు పంపలేదని పేర్కొంది. ఐటీ యాక్ట్ సెక్షన్ 67బీ కింద అతని చర్య నేరం కాదని స్పష్టం చేసింది. అలాగే.. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం.. ఛైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం తప్పేమీ కాదంటూ జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో.. ఇలాంటి కేసుల్లో శిక్షించే బదులు, వారికి సరైన మార్గం చూపడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే.. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఫరీబాద్కు చెందిన జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయెన్, ఢిల్లీకి చెందిన బచ్పన్ బచావో ఆందోళన్ అనే ఎన్జీవోలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా,జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఏప్రిల్లో వాదనలు ముగించి.. తీర్పును రిజర్వ్ చేసింది. అయితే విచారణ సందర్భంలోనే.. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా తప్పుబట్టింది. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ నేరమేనని గతంలో పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. ఈ ఏడాది జులైలో కర్ణాటక హైకోర్టు సైతం చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం ఐటీ యాక్ట్ కింద నేరం కాదని తెలిపింది. అయితే రెండు వారాలు తిరగకముందే ఆ తీర్పును రీకాల్ చేస్తూ మరో తీర్పు ఇచ్చింది.ఇదీ చదవండి: జడ్జిల్లారా.. జాగ్రత్త! అన్ని కళ్లు మన మీదే!! -
న్యాయమూర్తులు హద్దు మీరొద్దు
న్యూఢిల్లీ: కర్ణాటక హైకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానందాపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది. ‘‘న్యాయమూర్తులు నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. హద్దు మీరడం తగదు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంది’’ అని హితవు పలికింది. దీన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. 25న విచారణ చేపడతామని వెల్లడించింది.అసలేం జరిగింది? బెంగళూరులో ఓ ఇంటి యజమాని, కిరాయిదారుకు వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది. బెంగళూరులోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాన్ని జస్టిస్ శ్రీశానందా పాకిస్తాన్తో పోల్చారు. అంతేగాక, ‘‘ప్రత్యర్థి వర్గంతో మీకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లున్నాయి. వారి లోదుస్తుల రంగు కూడా మీకు తెలిసే ఉంటుంది’’ అని మహిళా న్యాయవాదిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. కోర్టుల్లో న్యాయమూర్తుల వ్యాఖ్యలపై మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరం కనిపిస్తోందని సీజేఐ పేర్కొన్నారు. ‘‘కోర్టుల కార్యకలాపాలను గమనించడంలో సోషల్ మీడియా చురుగ్గా ఉంది. కనుక న్యాయమూర్తుల వ్యాఖ్యలు చట్టాలకు లోబడి మర్యాదపూర్వకంగా ఉండాలి’’ అన్నారు. -
గణపతి పూజలో పాల్గొన్నా కాంగ్రెస్కు నచ్చట్లేదు
భువనేశ్వర్: సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజలో పాల్గొన్నందుకు తనపై విమర్శలు పెంచిన కాంగ్రెస్కు ప్రధాని మోదీ మంగళవారం దీటుగా బదులిచ్చారు. ఒడిశాలోని భువనేశ్వర్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ గణేశ్ ఉత్సవం దేశంలో కేవలం మత విశ్వాసాలకు సంబంధించిన వేడుక కాదు. దేశ స్వాతం్రత్యోద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉత్సవం. ఆకాలంలో బ్రిటిష్ పాలకులు సైతం గణేశ్ ఉత్సవాలను ద్వేషించాలంటూ భారత్లో విభజించు, పాలించు కుట్రను అమలుచేశారు. ఇప్పుడు కూడా అధికార దాహంతో కొట్టుమిట్టాడుతున్న కొందరు గణపతి పూజలో పాల్గొంటే సమస్యలొస్తాయంటూ సమాజాన్ని విభజించే పనిలో బిజీగా మారారు. గణపతి పూజలో పాల్గొన్న నాపై కాంగ్రెస్, దాని మిత్రపక్షాల్లో పీకలదాకా కోపముంది. కాంగ్రెస్పాలిత కర్ణాటకలో గొడవలు జరుగుతాయంటూ ఏకంగా గణపతి విగ్రహాన్నే కటాకటాల వెనక్కి నెట్టారు. పోలీస్వ్యాన్లో గణపతి విగ్రహం ఫొటో చూసి యావత్భారతావని బాధపడింది. ఇక ఇలాంటి విద్వేష శక్తుల ఆట కట్టించాల్సిందే. దేశాన్ని కుల, మత ప్రాతిపదికన బ్రిటిషర్లు విభజించాలని చూస్తే లోకమాన్య తిలక్ గణేశ్ ఉత్సవాలతో దేశ సమైక్య స్ఫూర్తిని మరింతగా రగిల్చారు. కుల మతాలకతీతంగా ఐక్యంగా ఎలా ఉండాలో గణేష్ ఉత్సవాలు మనకు చాటిచెప్పాయి’’ అని మోదీ అన్నారు. రూ.2,871 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభం తన నాయకత్వంలో మూడోదఫా పాలన మొదలై 100 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా మంగళవారం మోదీ ఒడిశాలో రూ.2,871 కోట్ల విలువైన రైల్వే, జాతీయరహదారులకు సంబంధించిన పలు ప్రాజెక్టుల్లో కొన్నింటికి శంకుస్థాపనలు చేసి కొన్నింటిని ప్రారంభించారు. ఒడిశా బీజేపీ ప్రభుత్వ కీలక పథకం ‘ సుభద్ర యోజన’ను ప్రారంభించారు. భువనేశ్వర్లోని సబర్ సాహీ మురికివాడలో ప్రధానమంత్రి ఆవాస్యోజన(పట్టణ) 20 మంది లబి్ధదారుల ఇళ్లను మోదీ స్వయంగా ప్రారంభించి వారితో మోదీ ముచ్చటించారు. పుట్టినరోజున తమ ఇంటికొచి్చన మోదీకి ఆ గిరిజనులు అంగవస్త్రం ఇచ్చి ఆహా్వనించి నుదుటిన గంధం»ొట్టు పెట్టారు. ప్రేమతో తనకు వారు ఇచి్చన తీపి వంటకం ఖీర్ను మోదీ రుచిచూశారు. -
నైట్ షిఫ్టులు వద్దంటారా?
న్యూఢిల్లీ: మహిళా వైద్యులు నైట్ డ్యూటీలు చేయొద్దన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్దేశాలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అలా చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ‘‘పైలట్లుగా, సైనికులుగా మహిళలు రాత్రి విధులు నిర్వహించడం లేదా? మీ నిర్దేశాలు మహిళా వైద్యుల కెరీర్పై ప్రభావం చూపుతాయి. రాత్రి విధుల్లో సమస్యలు ఎదుర్కోకుండా వారికి అవసరమైన భద్రత కలి్పంచడం ప్రభుత్వ బాధ్యత. అంతే తప్ప వాటిని మానుకోవాలని చెప్పడం సరికాదు’’ అంటూ సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం మందలించింది. దాంతో సదరు నోటిఫికేషన్ను ఉపసంహరించుకుంటామని బెంగాల్ సర్కారు విన్నవించింది. కోల్కతాలో ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రిలో ట్రైనీ వైద్యురాలు రాత్రి విధుల్లో ఉండగా హత్యాచారానికి గురవడం, ఈ ఉదంతం దేశవ్యాప్త ఆందోళనలకు దారితీయడం తెలిసిందే. దాంతో నెల రోజులకు పైగా మమత సర్కారు ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో మహిళా వైద్యుల భద్రత నిమిత్తం సలహాలు, సూచనలతో ‘రాతిరేర్ సాథి’ పేరిట ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. వైద్యురాలి హత్యాచారోదంతంపై విచారణ సందర్భంగా మంగళవారం ఈ అంశం ధర్మాసనం దృష్టికి రావడంతో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆక్షేపించింది. ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది భద్రత నిమిత్తం కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రైవేట్ సెక్యూరిటీని నియమించాలన్న నిర్ణయాన్ని కూడా తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘వైద్యులకు భద్రతే లేని పరిస్థితి నెలకొని ఉంది. కనుక ప్రభుత్వాసుపత్రుల్లో పోలీసు సిబ్బందినైనా నియమించడం రాష్ట్ర ప్రభుత్వ కనీస బాధ్యత. వాటిలో యువ వైద్య విద్యార్థులు, ఇంటర్న్లు పని చేస్తున్నారు’’ అని గుర్తు చేసింది. మా లాయర్లకు బెదిరింపులు: సిబల్ ఈ కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ విజ్ఞప్తి చేశారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది. ‘‘ఇది ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉన్న కేసు. దీని విచారణ ఎలా జరుగుతోందో దేశ ప్రజలంతా తెలుసుకుని తీరాలి’’ అని స్పష్టం చేసింది. ప్రత్యక్ష ప్రసారం తమ లాయర్ల బృందానికి సమస్యలు సృష్టిస్తోందని సిబల్ వాదించారు. ‘‘ఇది విపరీతమైన భావోద్వేగాలతో కూడిన కేసు. మేం వాదిస్తోంది బాధితురాలి తరఫున కాదు గనుక మా బృందంలోని మహిళా లాయర్లకు యాసిడ్ దాడులు, అత్యాచారాలు చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. పైగా మా క్లయింట్ (బెంగాల్ సర్కారు) గురించి ధర్మాసనం ఎలాంటి వ్యాఖ్యలు చేసినా లాయర్లుగా పేరుప్రఖ్యాతు లన్నీ మట్టిలో కలిసిపోతున్నాయి’’ అంటూ ఆందోళన వెలిబుచ్చారు. లాయర్లకు రక్షణ లభించేలా జోక్యం చేసుకుంటామని ధర్మాసనం హామీ ఇచి్చంది. ప్రత్యక్ష ప్రసారాన్ని మాత్రం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. మమత రాజీనామాకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది. ఇదేమీ రాజకీయ వేదిక కాదంటూ సదరు న్యాయవాదికి తలంటింది.సీరియస్ అంశాలివి! వైద్యురాలి కేసులో దర్యాప్తు ప్రగతిపై సీబీఐ సమరి్పంచిన స్థాయీ నివేదికను సీజేఐ ధర్మాసనం మంగళవారం పరిశీలనకు స్వీకరించింది. అందులోని అంశాలు తమనెంతగానో కలచివేశాయంటూ ఈ సందర్భంగా ఆవేదన వెలిబుచి్చంది. ‘‘నివేదికలో సీబీఐ పేర్కొన్నవి చాలా సీరియస్ అంశాలు. వాటిని చదివిన మీదట మేమెంతో ఆందోళనకు లోనవుతున్నాం. అయితే వాటిని ఈ దశలో వెల్లడించలేం. అది తదుపరి దర్యాప్తుకు విఘాతం కలిగించవచ్చు’’ అని పేర్కొంది. ‘‘జరిగిన దారుణానికి సంబంధించి మృతురాలి తండ్రి కొన్ని విలువైన అంశాలను కోర్టు దృష్టికి తెచ్చారు. వాటిపైనా దర్యాప్తు చేయండి’’ అని సీబీఐకి సూచించింది. ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రి ఆర్థిక అవకతవకల కేసు దర్యాప్తుపైనా స్థాయీ నివేదిక సమరి్పంచ్సాలిందిగా నిర్దేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.పేరు, ఫొటో తొలగించండి హతురాలి పేరు, ఫొటో ఇప్పటికీ వికీపీడియాలో కనిపిస్తున్నట్టు సీబీఐ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దాంతో వాటిని తక్షణం తొలగించాలని వికీపీడియాను ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంలో తామిచి్చన గత ఆదేశాలకు కట్టుబడాలని స్పష్టం చేసింది. సమ్మె, ఆందోళనలు చేస్తున్న జూనియర్ వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలూ చేపట్టబోమని బెంగాల్ ప్రభుత్వం ఈ సందర్భంగా హామీ ఇచి్చంది. వైద్యురాలిపై అఘాయిత్యం జరుగుతుండగా అక్కడ ఎవరెవరున్నదీ జూనియర్ వైద్యులకు తెలుసని వారి తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ సమాచారాన్ని సీబీఐకి సీల్డ్కవర్లో అందజేస్తామన్నారు. తక్షణం విధుల్లో చేరాల్సిందిగా డాక్టర్లకు ధర్మాసనం మరోసారి సూచించింది. -
‘కొంచెం గొంతు తగ్గించి మాట్లాడండి’: న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం
కోల్కతా: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్జీకర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో జరిగిన జూనియర్ వైద్యురాలి హత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా న్యాయవాదిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ నేత, న్యాయవాది కౌస్తవ్ బాగ్చి మాట్లాడుతున్న సందర్భంలో జోక్యం చేసుకున్న సీజేఐ.. న్యాయవాదిని గొంతు తగ్గించి మాట్లాడాలని హెచ్చరించారు.ఈసలేం జరిగిందంటే.. కోల్కతా ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా బెంగాల్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. ఆగష్టు 9న ప్రభుత్వ ఆధీనంలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై నిరసనలు చేస్తున్న వారిపై న్యాయవాది కౌస్తవ్ బాగ్చి రాళ్లు రువ్వుతున్నట్లు నిరూపించేందుకు తన వద్ద వీడియోలు, ఫోటోలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా కౌస్తవ్ బాగ్చి బీజేపీ నేత.. ఈ ఏడాదిఫిబ్రవరిలో ఆయన కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. కపిల్ సిబల్ ఆరోపణలపై.. న్యాయవాది కౌస్తవ్ స్పందిస్తూ.. ఒక సీనియర్ న్యాయవాది కోర్టులో అలాంటి ప్రకటనలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో సీజేఐ కల్పించుకొని.. మీ ముందు ముగ్గురు న్యాయమూర్తులు ఉన్నారు. ముందు గొంతు తగ్గించుకొని మాట్లాడండి’ అంటూ హెచ్చరించారు.‘గత రెండు గంటలుగా మీ ప్రవర్తనను గమనిస్తున్నాను. మీ మీ పిచ్ని ముందు తగ్గించడండి. మీరు న్యాయమూర్తులను ఉద్ధేశించి మాట్లాడుతున్నారు. కోర్టు వెలుపల ఉన్న గ్యాలరీని ఉద్దేశించి కాదు.’ అంటూ మండిపడ్డారు. దీంతో న్యాయవాది కౌస్తవ్ త్రిసభ్య ధర్మాసనానికి క్షమాపణలు తెలియజేశారు.ఇక చీఫ్ జస్టిస్ బాగ్చీని మందలించడంపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ‘పార్ట్టైమ్ న్యాయవాది, ఫుల్టైం బీజేపీ కార్యకర్త అయిన కౌస్తవ్ బాగ్చి నుంచి ఇంకా ఏం ఆశించగలమని మండిపడింది. తమ(బీజేపీ) పాలనలో ఉన్న రాష్ట్రాల్లో మాదిరి కోర్టు గదిని బుల్డోజ్ చేయవచ్చని భావించే వీరి నుంచి ఇలాంటి ప్రవర్దనే ఉంటుందని విమర్శలు గుప్పించింది. నేడు సీజేఐ అతన్ని సరిగ్గా మందలించింది అంటూ తెలిపిందిఇదిలా ఉండగా మంగళవారం నాటికి నిరసనలు చేస్తున్న వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని సీజేఐ డీవే చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు ఆందోళనలు చేస్తున్న డాక్టర్లు విధుల్లో చేరితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, ఒక వేళ విధుల్లోకి రాకపోతే వారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని తెలిపింది.అలాగే బాధితురాలికి సంబంధించిన ఫొటోలు, దృశ్యాలు అన్నీ సోషల్ మీడియా వేదికల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఇక ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐని విచారణపై కొత్త నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఇందుకు సెప్టెంబర 17 వరకు గడువిచ్చింది. ఈ కేసు విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది -
హాయ్, నేను సీజేఐని... క్యాబ్కు రూ.500 పంపండి!
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా వదలడం లేదు. సీజేఐ పేరిట ఒక వ్యక్తిని రూ.500 అడిగారు! సదరు స్కామర్ తనను తాను సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్గా చెప్పుకున్నాడు. ‘‘హలో! నేను సీజేఐని. కొలీజియం అత్యవసర భేటీకి వెళ్లాల్సి ఉంది. కన్నాట్ ప్లేస్లో చిక్కుకున్నాను. క్యాబ్ కోసం రూ.500 పంపగలరా! కోర్టుకు చేరగానే తిరిగి పంపిస్తా’’ అంటూ మెసేజ్ చేశాడు. అది నిజమైందేనని నమ్మించడానికి ఐ పాడ్ నుంచి పంపుతున్నట్టు కూడా చెప్పుకొచ్చాడు. అయితే దాన్నిండా స్పెల్లింగ్, వ్యాకరణ దోషాలే ఉండటం విశేషం! ఈ నకిలీ మెసేజ్ వైరల్గా మారింది. దాన్ని కైలాశ్ మేఘ్వాల్ అనే వ్యక్తి ఎక్స్లో పోస్టు చేశారు. ‘ఫ్రెండ్స్, ఏం చేద్దాం మరి!’ అంటూ కామెంట్ చేశారు. ఈ వైరల్ పోస్టును సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. సీజేఐ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్స్కు ఫిర్యాదు చేసింది. -
‘నేను సీజేఐని.. రూ.500 పంపండి’ అంటూ స్కామర్ మెసేజ్!
సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని ఈ మధ్య సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడయా ప్రముఖుల పేరుతో నకిలీ ఖాతాలు క్రియేట్ చేసి డబ్బులు అడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రులు, మంత్రుల పేర్లతో తమను తాము పరిచయం చేసుకుంటున్నవారు.. ఇప్పుడు ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని టార్గెట్ చేశారు. తాజాగా, తనను సీజేఐగా పరిచయం చేసుకొని డబ్బులు అడగిన ఉదంతం చర్చనీయాంశంగా మారింది.సీజేఐ డీ.వై చంద్రచూడ్లా తనను తాను ఓ సైబర్ నేరస్తుడు పరిచయం చేసుకుంటూ.. క్యాబ్ ఛార్జీల కోసం డబ్బులు అడిగాడు. ఈ విషయం తమ దృష్టికి రావటంతో సైబర్ నేరగాడిపై సుప్రీంకోర్టు మంగళవారం ఢిల్లీ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసింది. తనపేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన మెసేజ్ స్క్రీన్షాట్ను చేసి.. సీజేఐ అవాక్కయ్యారు. సీజేఐ డీ.వై చంద్రచూడ్ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు భద్రతా విభాగం సైబర్ క్రైమ్ విభాగంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.‘‘హలో, నేను సీజేఐని కొలీజియం అత్యవసర సమావేశానికి వెళ్లాలి. నేను కన్నాట్ ప్రాంతంలో చిక్కుకున్నాను. క్యాబ్ కోసం మీరు నాకు రూ. 500 పంపగలరా? నేను కోర్టుకు చేరుకున్న తర్వాత వెంటనే డబ్బు తిరిగి ఇస్తాను’’ అని సైబర్ నేరగాడు సీజేఐ పేరుతో డబ్బులు అడిగాడు. ప్రస్తుతం ఈ స్క్రీన్షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
కోర్టులతో ప్రజలు విసిగిపోయారు: సీజేఐ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: న్యాయప్రక్రియపై చీఫ్జస్టిస్ఆఫ్ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టుల్లో కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంతో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. శనివారం(ఆగస్టు3) సుప్రీంకోర్టులో జరిగిన ప్రత్యేక లోక్అదాలత్ వారోత్సవాల కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. కేసుల సత్వర పరిష్కారానికి ప్రజలు సెటిల్మెంట్లు కోరుకుంటున్నారన్నారు. జడ్జిలకు ఇది ఆందోళన కలిగించే విషయమేనని అభిప్రాయపడ్డారు. కేసుల సెటిల్మెంట్లో లోక్అదాలత్లది కీలక పాత్ర అని చెప్పారు. లోక్అదాలత్లో సెటిల్ చేసుకున్న కేసుల్లో అప్పీల్ ఉండదని తెలిపారు. -
CJI D Y Chandrachud: వారం రోజుల స్పెషల్ లోక్ అదాలత్
న్యూఢిల్లీ: వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి, తద్వారా పెండింగ్ భారాన్ని తగ్గించుకునేందుకు సుప్రీంకోర్టు సోమవారం ప్రత్యేక లోక్ అదాలత్ను ప్రారంభించింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టులోని మొదటి ఏడు ధర్మాసనాలు మధ్యాహ్నం 2 గంటలకు కేసులను విచారిస్తాయి. సుప్రీంకోర్టు వజ్రోత్సవాల సంబరాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వెల్లడించారు. ప్రత్యేక లోక్ అదాలత్ వారం పాటు కొనసాగుతుందని తెలిపారు. సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్న కక్షిదారులు, లాయర్లు దీన్ని వినియోగించుకోవాలని కోరారు. వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడంలో కక్షిదారులకు సాయపడితే కలిగే తృప్తి వెల కట్టలేనిదని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారంలో లోక్ అదాలత్ల ప్రాధాన్యతకు సంబంధించి స్వీయానుభవాన్ని ఉదాహరించారు. ‘‘నా ముందుకు ఒక విడాకుల కేసు వచి్చంది. భార్య నుంచి విడాకులు కోరుతూ భర్త కింది కోర్టుకు వెళ్లాడు. అతడి నుంచి పరిహారం, పాప సంరక్షణ హక్కులు కోరుతూ భార్య కూడా కోర్టుకెక్కింది. వారితో సామరస్యపూర్వకంగా మాట్లాడిన మీదట మనసు మార్చుకున్నారు. కలిసుండేందుకు ఒప్పుకున్నారు. వైవాహిక జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తామని చెబుతూ కేసులు వెనక్కు తీసుకున్నారు’’ అని వివరించారు. ఇలా లోక్ అదాలత్లు ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి! పైగా సోమవారం జరిగిన విచారణల కవరేజీ కోసం మీడియాను కోర్టు రూముల లోపలికి అనుమతించడం విశేషం. -
నీట్ విచారణ.. న్యాయవాదిపై సీజేఐ తీవ్ర ఆగ్రహం
నీట్ పేపర్ లీకేజీపై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (సీజేఐ డీవై చంద్రచూడ్) నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి తుది తీర్పు మంగళవారం వెల్లడించింది.అయితే నీట్పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి చంద్రచూడ్.. నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషనర్ తరుపు సీనియర్ న్యాయవాది మాథ్యూస్ నెడుంపరపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు కోర్టు నుంచి బయటకు వెళ్లిపోవాలి. లేదంటే సెక్యూరిటీని పిలవాల్సి వస్తుందంటూ మండిపడ్డారు. ఇలా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహానికి న్యాయవాది మాథ్యూస్ నెడుంపర వ్యవహారశైలే కారణం. మాథ్యూస్ నెడుంపర ఏమన్నారు?అత్యున్నత న్యాయ స్థానంలో నీట్ పిటిషన్లపై విచారణ జరుగుతుంది. పేపర్ లీకేజీ, పరీక్ష రద్దు చేస్తే విద్యార్ధుల భవిష్యత్ పరిణామాలపై సీజేఐ మాట్లాడుతున్నారు. దాఖలైన పిటిషన్లపై పిటిషనర్లకు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. అదే సమయంలో మాథ్యూస్ నెడుంపర మధ్యలో కలగజేసుకున్నారు. కోర్టు హాలులో ఉన్న లాయర్లు అందరికంటే నేనే సీనియర్. బెంచ్ వేసిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. కోర్టులో నేనే అమికస్ (అమికస్ క్యూరీ)అని మాట్లాడగా..ఇక్కడ నేను ఎవర్ని అమికస్ గా నియమించలేదు అంటూ సీజేఐ స్పందించారు. అందుకు ప్రతిస్పందనగా.. మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతానంటూ సీజేఐ చంద్రుచూడ్ మాటలకు అడ్డు చెప్పారు నెండుపర .నెడుంపర మాటలకు వెంటనే చంద్రుచూడ్ మాట్లాడుతూ.. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు కోర్టు గ్యాలరీలో మాట్లాడకూదు. సెక్యూరిటీని పిలవండి. నెడుంపరను బయటకు తీసుకెళ్లండి అంటూ గట్టిగా హెచ్చరించారు.చంద్రుచూడ్ వ్యాఖ్యలకు.. నేను వెళ్తున్నాను.. నేను వెళ్తున్నాను. అంటూ నెడుంపర అక్కడి నుంచి కదిలే ప్రయత్నం చేశారు.మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వెళ్లిపోవచ్చు. నేను గత 24 ఏళ్లుగా న్యాయవ్యవస్థను చూస్తున్నాను. ఈ కోర్టులో న్యాయవాదులు విధి విధానాలను నిర్దేశించడాన్ని నేను అనుమతించలేను అని అన్నారు.కోర్టు నుంచి హాలు నుంచి బయటకు వెళ్తున్న నెడుంపర ఒక్కసారిగా చంద్రచూడ్ వ్యాఖ్యలకు మరోసారి తిరిగి సమాధానం ఇచ్చారు. నేను 1979 నుండి చూస్తున్నాను అని చెప్పడంతో ఆగ్రహానికి గురైన సీజేఐ చంద్రుచూడ్.. మీ వ్యవహార శైలిపై కఠిన చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుంది. మీరు ఇతర లాయర్లకు ఆటంకం కలిగించకూడదు అని అన్నారు.దీంతో నెడుంపర అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్ది సేపటికి మళ్లీ తిరిగి వచ్చారు. నన్ను క్షమించండి. నేనేమీ తప్పు చేయలేదు. నాకు అన్యాయం జరిగింది అని వ్యాఖ్యానించారు. మీ పట్ల అనుచితంగా మాట్లాడినందుకు క్షమించండి అని అన్నారు.సుప్రీం కోర్టులో నాటకీయ పరిణామాల నడుమ నీట్ పరీక్షను రద్దు చేసేందుకు వీలు లేదని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం తీర్పును వెలువరించింది. అంతేకాదు నీట్ పరీక్ష వ్యవస్థ లోపభూయుష్టంగా ఉందని వ్యాఖ్యానించింది. రీ ఎగ్జామ్ పెడితే 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని స్పష్టం చేసింది. లబ్ధిపొందిన 155 మందిపైనే చర్యలు తీసుకోవాలని నీట్పై సుప్రీం జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అమికస్ అంటేచట్టపరమైన సందర్భాలలో అమికస్ లేదా అమికస్ క్యూరీ అని సంబోధిస్తారు. సందర్భాన్ని బట్టి కోర్టులో పలు కేసులు విచారణ జరిగే సమయంలో ఒకే కేసుపై పదుల సంఖ్యలో పిటిషన్ దాఖలైనప్పుడు..పిటిషనర్ల అందరి తరుఫున సీనియర్ లాయర్ కోర్టుకు సమాధానం ఇస్తారు. అలా కోర్టుకు రిప్లయి ఇచ్చే లాయర్లను అమికస్ లేదా అమికస్ క్యూరీగా వ్యవహరిస్తారు. -
కేజ్రీవాల్ బెయిల్ నిలిపివేత.. సీజేఐకు 150 మంది న్యాయవాదుల లేఖ
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు నిలిపివేయడంపై 150 మంది న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులు ఆచరిస్తున్న అసాధారణ పద్ధతులపై జోక్యం చేసుకోవాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్కు లేఖ రాశారు.లిక్కర్ కేసులో కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్ ఉత్తర్వులు ఆప్లోడ్ చేయడానికి ముందే ఢిల్లీ హైకోర్టులో ఈడీ ఎలా సవాల్ చేసింది?, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ ఈడీ సవాల్పై ఎలా విచారణ చేపట్టి ఆర్డర్ను హోల్డ్లో ఉంచారు? బెయిల్ అమలును ఎలా నిలిపివేశారు? అని ప్రశ్నించారు. భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదని, ఇది న్యాయవాదుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించిందని 9 పేజీల లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.అదే విధంగా న్యాయవాదుల సమర్పణలను న్యాయమూర్తులు తమ ఆదేశాలలో రికార్డ్ చేయడం లేదని న్యాయవాదులు ఆరోపించారు. ఇది కోర్టు చరిత్రలో మొదటిసారి అని, ఇది చాలా అసాధారణమైనదని పేర్కొన్నారు. దీనిని సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. విచారణ సమయంలో చేసిన సమర్పణలను న్యాయవాదుల ముందు, కేసు వాయిదా వేయడానికి ముందు రికార్డ్ చేయాలని ఆదేశాలు జారీ చేయవలసిందిగా అభ్యర్ధించారు.బెయిల్ మంజూరులో జాప్యం గురించి ప్రస్తావిస్తూ.. ‘ముఖ్యంగా ఈడీ, సీబీఐకు సంబంధించిన కేసుల్లో న్యాయమూర్తులు ఎక్కువ వ్యవధిలో విచారణ తేదీలు ఇస్తారు. బెయిల్ విషయాలను త్వరగా పరిష్కరించరు. న్యాయ సూత్రాలకు, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హామీకి ఇది విరుద్ధం.ఈ దేశ ప్రజలు ఎంతో ఆశతో, విశ్వాసంతో న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఈ నమ్మకాన్ని న్యాయవ్యవస్థ, న్యాయ సంఘం సమర్థించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే మా ఆందోళనలను మీతో పంచుకుంటున్నాం. వీటిని త్వరగా సరిదిద్దుతారని ఆశిస్తున్నాం.’ అని లేఖలో ప్రస్తావించారు. -
సీజేఐ పరిశీలనకు.. కేజ్రీవాల్ పిటిషన్
న్యూఢిల్లీ: మధ్యంతర బెయిల్ గడువును పొడిగించాలంటూ ఆప్ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పరిశీలనకు పంపించనున్నట్లు వెల్లడించింది. మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన కేజ్రీవాల్కు అనారోగ్య కారణాలతో సుప్రీంకోర్టు జూన్ ఒకటో తేదీ వరకు బెయిలిచ్చిన విషయం తెల్సిందే.జూన్ 2వ తేదీన తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది. మంగళవారం కేజ్రీవాల్ పి టిషన్ వెకేషన్ బెంచ్లోని జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ విశ్వనాథన్ల ముందుకు వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కేజ్రీవాల్ కొన్ని అత్యవసర వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని, బెయిల్ మరో వారం పొడిగించాలంటూ ఆయన తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మనుసింఘ్వి కోరారు. పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టాలని తెలిపారు. అయితే, ధర్మాసనం ‘వాదనలు విన్నాం. తీర్పు రిజర్వు చేశాం. ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచుతున్నాం’ అని తెలిపింది. -
సీజేఐ డీవై చంద్రచూడ్ కు ప్రముఖ న్యాయవాదుల లేఖ
-
తెలంగాణ కొత్త హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్లో నూతన హైకోర్టు నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ శంకుస్థాపన చేశారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో సీజేఐతో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు. నూతన హైకోర్టు భవనానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సీజేఐ అన్నారు. ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో సకల హంగులతో 100 ఎకరాల్లో రాజేంద్రనగర్లో భవన నిర్మాణం చేపట్టనున్నారు. హైకోర్టుకు కేటాయించిన స్థలంలో ఆధునిక వసతులతో హైకోర్టు భవనంతో పాటు జడ్జిలకు నివాసాలను కూడా నిర్మించనున్నారు -
జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇచ్చిన కీలక తీర్పులు ఇవే..
అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు మనదేశంలో రాజ్యాంగపరంగా ఉన్నతమైన గౌరవం ఉంది. సుప్రీం కోర్టు తీర్పులు యావత్ సమాజంతో పాటు పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపెడుతుంటాయి. అటువంటి కీలకమైన తీర్పులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. ఆయన ఇచ్చిన తీర్పులను కొన్నింటిని పరిశీలిస్తే.. గోప్యత హక్కు: డీవై చంద్రచూడ్ జస్టిస్గా వ్యవహరించిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. గోప్యత హక్కుపై కీలకమైన తీర్పును వెలువరించింది. గోప్యతను ప్రథమిక హక్కుగా గుర్తిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు రాజ్యంగం.. వ్యక్తిగత గోప్యతకు కల్పించే రక్షిణ ప్రాధాన్యతను తెలియజేస్తుంది. స్వలింగ సంపర్కం నేరం కాదు: చారిత్రక నవ్తేజ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆప్ ఇండియా కేసులో భారతీయ శిక్షా స్మృతి( ఐపీసీ)లోని సెక్షన్ 377పై సుప్రీం కోర్టు వెల్లడించిన సంచలన తీర్పులో కీలక పాత్ర పోషించారు. సెక్షన్ 377ను రద్దు చేస్తూ.. సుప్రీం కోర్టు స్వలింగం సంపర్కం నేరం కాదని తీర్పనిచ్చింది. అదే విధంగా స్వలింగ సంపర్కానికి చట్టపబద్దత కల్పించింది. ఈ తీర్పు వెల్లడించిన ఐదుగురు న్యాయముర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ డీవై చంద్రచూడ్ కూడా ఉన్నారు. ఆధార్ చట్టబద్దత: కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆధార్ పథకం రాజ్యాంగపరంగా చట్టబద్దమైనది అని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో సైతం జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలకంగా వ్యవహిరించారు. ఈ కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఆధార్ పథకం చెల్లుబాటను పరిశీలించింది. సంక్షేమ పథకాలకు ఈ ఆధార్ స్కీమ్ను ఉపయోగించడాన్ని సుప్రీంకోర్టు బెంచ్ సమర్ధించింది. అయితే ప్రభుత్వ పథకాల్లో, ఇతరాత్ర కార్యక్రమాల్లో ప్రజలు సమర్పించిన ఆధార్ డేటా రక్షణ, గోపత్య భద్రత అవసరాన్ని కూడా కోర్టు గుర్తు చేసింది. ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్: ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతత్వంలోని ధర్మాసనం 2023 మే 11న ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ లెఫ్ట్నెంట్ గవర్నర్ కీలక తీర్పు ఇచ్చింది. దేశ రాజధానిలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) సేవలపై ఢిల్లీ ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుందని పేర్కొంది. రాజధాని పరిధిలోని భూములు, పోలీసు వ్యవస్థ, శాంతి భద్రత విషయంలో ప్రభుత్వ నియంత్రణ ఉండదని తెలిపింది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, లెఫ్ట్నెంట్ గవర్నర్ అధికారులను పంపిణీ చేయటంలో జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించిన తీర్పు కీలకంగా మారింది. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం: 34 ఎమ్మెల్యేల మద్దతు ఉన్న శివసేన చీలిక వర్గం (ఏక్నాథ్ షిండే) వర్గానికి బల పరీక్షకు అనుమతించిన మాజీ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ భగత్ సింగ్ కోష్యారీ నిర్ణయం సరికాదని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఇటువంటి సందర్భాల్లో సదురు విషయం తీవ్రతను పరిగణలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించిన తీర్పుల్లో రాజ్యాంగ నియమాలు, వ్యక్తిగత హక్కులు, న్యాయం ప్రధానంగా కనిపిస్తాయి. ఆయన తీర్పులు భారత్ న్యాయవ్యవస్థలో చెరిగిపోని ముద్ర వేశాయి. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ భారత దేశ 50వ ప్రధాన న్యాయమూర్తిగా 9 నవంబర్ 2022 ప్రమాణ స్వీకారం విషయం తెలిసిందే. -
నేనూ ట్రోల్స్కు గురయ్యా: సీజేఐ చంద్రచూడ్
బెంగళూరు: సోషల్ మీడియాలో తాను కూడా ట్రోలింగ్కు గురయ్యానని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. శనివారం బెంగుళూరులో జ్యుడీషియల్ అధికారుల 21వ ద్వైవార్షిక సమావేశంలో పాల్గొన్న సీజేఐ ఇటీవల తనపై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్కు సంబంధించి మాట్లాడారు. ‘4-5 రోజుల కింద ఓ కేసు వాదనల సమయంలో నాకు వెన్ను నొప్పి వచ్చింది. అయితే నేను కూర్చున్న చైర్ నుంచి మారి సౌకర్యం కోసం మరో చైర్లో కూర్చున్నా. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సోషల్ మీడియాలో నేను అహంకారి అని కామెంట్లతో నెటిజన్లు ట్రోల్ చేశారు. వాదనలు జరుగుతున్న మధ్యలోనే నేను లేచి కోర్టు నుంచి వెళ్లిపోయానని అన్నారు. అసలే నేను కోర్టు వదిలి వెళ్లలేదు. నేను కేవలం నా కుర్చిని మార్చుకోవటం కోసమే లేచానని వారికి తెలియదు. కుర్చి నుంచి లేచిన వీడియోను మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అయింది’ అని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వివరణ ఇచ్చారు. అయితే తాను చేసే పనిలో సామాన్య పౌరులకు అందించే విశ్వాసాన్ని మాత్రమే నమ్ముతానని పేర్కొన్నారు. న్యాయవవస్థలో పని చేసే.. న్యాయాధికారులు విధులను నిర్వహిస్తున్న సమయంలో పనితోపాటు ఒత్తిడిని సమానంగా జయంచడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పని, ఒత్తిడిని అధిగమించటం అనేవి రెండు వేరువేరు పనులు కాదని తెలిపారు. వైద్యులకు, సర్జన్లకు.. ‘మిమ్మల్ని మీరు నయం చేసుకోండి. మీరు(వైద్యులు) ఇతరులను నయం చేసే ముందు, మిమ్మల్ని మీరు ఎలా నయం చేసుకోవాలో నేర్చుకోవాలి’ అని చెబుతుంటామని గుర్తు చేశారు. మరి న్యాయమూర్తుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుందని సీజేఐ స్పష్టం చేశారు. -
సుప్రీంకోర్టులో వంటమనిషి కుమార్తె ప్రతిభ : ప్రశంసల వెల్లువ
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వంట మనిషి పుత్రికోత్సాహంతో మునిగి తేలు తున్నారు. తనను చదివించడానికి నాన్న కష్టాన్ని గమనించిన ఆయన కుమార్తె ప్రగ్యా పట్టుదలతో చదివింది. అమెరికాలోని రెండు వేర్వేరు విశ్వవిద్యాలయాలలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చదవడానికి ఎంపిక అయింది. అంతేకాదు స్కాలర్షిప్ కూడా సాధించింది. దీంతో ప్రగ్యా తండ్రి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రగ్యా తల్లిదండ్రులను సత్కరించారు. ప్రగ్యా ప్రతిభను కొనియాడారు. ఆమెకు స్వీట్లు అందించారు. దీంతో అక్కడున్న వారంతా కరతాళ ధ్వనులతో ఆమెను అభినందించారు. ఉన్నత చదువులకు కష్టపడి ముందుకు వెళ్లాలను కుంటే, అందుకున్న సంబంధిత అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రధాన న్యాయమూర్తి సూచించారు. VIDEO | Chief Justice of India DY Chandrachud felicitates Pragya, who is daughter of a cook in the Supreme Court. She recently got a scholarship to study masters in law in two different universities in the US. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/0S8RVMOxjN — Press Trust of India (@PTI_News) March 13, 2024 -
Supreme Court: న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం
న్యూఢిల్లీ: కోర్టు హాల్లో ఎలా ప్రవర్తించాలన్నదానిపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ సోమవారం సుప్రీంకోర్టులో ఓ న్యాయవాదికి క్లాస్ పీకారు. ఏ రైలు పడితే అది ఎక్కేయడానికి ఇది రైల్వేస్టేషన్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు రూమ్లో ఎలా మెలగాలన్నదానిపై ముందు మీరు వెళ్లి ఎవరైనా సీనియర్ న్యాయవాది వద్ద శిక్షణ తీసుకోండని సూచించారు. జ్యుడిషీయల్ సంస్కరణలపై తాను వేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని సోమవారం సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది ఒక్కసారిగా లేచి సీజేఐ బెంచ్ను అడగడం ప్రారంభించాడు. కేసు లిస్ట్ కాకుండా మీ వంతు రాకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఇలా మెన్షన్ చేయడమేంటని ఆ న్యాయవాదిని సీజేఐ ప్రశ్నించారు. అయినా వినిపించుకోని ఆ న్యాయవాది న్యాయవ్యవస్థలో సంస్కరణలు అత్యంత త్వరగా తీసుకురావాల్సి ఉందని చెప్పసాగాడు. న్యాయవాది ప్రవర్తన పట్ల ఆగ్రహించిన సీజేఐ అసలు మీరెక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారని అడిగారు. దీనికి ఆయన సమాధానమిస్తూ హైకోర్టు, దిగువ కోర్టుల్లో చేస్తా అని చెప్పాడు. దీనికి స్పందించిన సీజేఐ మీరు త్వరగా ఒక సీనియర్ వద్ద జాయిన్ అయి కోర్టు రూమ్లో ఎలా మెలగాలో నేర్చుకోండని చురకంటించారు. ఈ నెల ప్రారంభంలోనూ ఓ అడ్వకేట్ సుప్రీం కోర్టులో గొంతు పెంచి మాట్లాడుతుండగా సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంతు తగ్గించి వాదించాలని సూచించారు. ఇదీచదవండి.. ఈడీ ఎదుటకు లాలూ -
టెక్నాలజీతో న్యాయం మరింత చేరువ: సీజేఐ
రాజ్కోట్: ఆధునిక సాంకేతికత సాయంతో న్యాయాన్ని అందరికీ ప్రజాస్వామ్యయుతంగా చేరువ చేసేందుకు కృషి చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. శనివారం గుజరాత్లోని రాజ్కోట్లో నూతన జిల్లా కోర్టు భవనాన్ని ఆయన ప్రారంభించారు. కృత్రిమ మేధతో పని చేసే టెక్స్ట్ టు స్పీచ్ ‘కాల్–ఔట్’ సిస్టమ్ను, ఈ–ఫైలింగ్ 3.0 ప్లాట్ఫామ్ను ఆవిష్కరించారు. జిల్లా కోర్టుల ఆవశ్యకతను ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. న్యాయం కోసం ముందుగా అక్కడికే వస్తారని గుర్తు చేశారు. పౌరుల హక్కుల సాధనకు జిల్లా కోర్టులే పునాదిరాళ్లన్నారు. ‘‘ద్వారకలోని సోమ్నాథ్ ఆలయం, పూరీలోని జగన్నాథాలయంపై ఉండే ధ్వజం న్యాయవాదులు, న్యాయమూర్తులు, పౌరులందరినీ కలిపి ఉంచే మానవత్వానికి ప్రతీక. అలాంటి మానవత్వానికి రాజ్యాంగమే రక్ష’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. -
గొంతు పెంచి కోర్టును భయపెట్టలేరు: ఓ లాయర్పై సీజేఐ ఆగ్రహం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా గట్టిగా అరుస్తూ మాట్లాడిన ఓ న్యాయవాదిపై బుధవారం జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంతు పెంచి కోర్టును ఎవరూ భయపెట్టలేరని హెచ్చరించారు. న్యాయస్థానంలో అనుచితంగా ప్రవర్తించడం తగదని తేల్చిచెప్పారు. ‘‘నువ్వు లాయర్గా సాధారణంగా ఎక్కడ ప్రాక్టీస్ చేస్తుంటావు? బిగ్గరగా అరుస్తూ మాట్లాడి మమ్మల్ని భయపెట్టడం నీవల్ల కాదు. నా 23 ఏళ్ల న్యాయవాద వృత్తిలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో మాట్లాడే పద్ధతి ఇదేనా? న్యాయమూర్తుల ముందు ఎప్పుడూ ఇలాగే అరుస్తావా? నేను మరో ఏడాది లోగా పదవీ విరమణ చేయబోతున్నా. కోర్టులో లాయర్లు ఇష్టానుసారంగా మాట్లాడడం చూడాలని నేను కోరుకోవడం లేదు. నీ గొంతు తగ్గించు’’ అని సదరు లాయర్కు తేలి్చచెప్పారు. దీంతో ఆ లాయర్ వెనక్కి తగ్గారు. సుప్రీంకోర్టు నుంచి, జస్టిస్ చంద్రచూడ్ నుంచి క్షమాపణ కోరారు. -
ఇంకా లింగ వివక్ష: సీజేఐ
బెంగళూరు: ప్రాంతీయ భేదాలకు అతీతంగా చాలా కుటుంబాల్లో నేటికీ లింగ వివక్ష సూక్ష్మ రూపంలో కొనసాగుతూనే ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆవేదన వెలిబుచ్చారు. పైగా వాటిని ఎవరూ ప్రశ్నించరాదన్న ధోరణి కూడా గూడుకట్టుకుని పోయిందని ఆక్షేపించారు. ‘‘ఎవరు ఔనన్నా, కాదన్నా చేదు నిజం మాత్రం ఇదే. పైగా న్యాయస్థానాలు వ్యక్తిగత స్వేచ్ఛ కంటే వివాహ వ్యవస్థను నిలబెట్టడానికే ప్రాధాన్యతనిస్తూ రావడం ద్వారా దీనికి కొంతవరకు పరోక్షంగా ఆమోదముద్ర వేశాయి’’ అని అభిప్రాయపడ్డారు. ఆదివారం బెంగళూరులో ఆయన జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్య శతాబ్ది స్మారక ప్రసంగం చేశారు. సంతానంలో ఒకరికి మించి పై చదువులు చదివించలేకపోతే అత్యధిక కుటుంబాల్లో ఆ అవకాశం కచి్చతంగా మగ సంతానానికే దక్కుతుంది. స్త్రీకి ఉండే ఆంక్షలు, ఒత్తిళ్లు మగవాడికి ఉండవన్నది కూడా వాస్తవం’’ అని సీజేఐ అన్నారు. -
మణిపూర్ హింస కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ :మణిపూర్ హింసలో మృతి చెంది ఎవరూ క్లెయిమ్ చేయని మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు అపాయింట్ చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మార్చురీల్లో మగ్గుతున్న 175 మృతదేహాల్లో 169 మృతదేహాల వివరాలను గుర్తిచారు. ఆరు అన్ఐడెంటిఫైడ్గా మిగిలిపోయాయి.169 గుర్తించిన మృతదేహాల్లో 81 బాడీలను కుటుంబ సభ్యులు క్లెయిమ్ చేయగా 88 ఎవరూ క్లెయిమ్ చేయలేదు. మార్చురీల్లో మగ్గిపోతున్న మృతదేహాల పరిస్థితిపై సుప్రీంకోర్టుకు కమిటీ నివేదక ఇచ్చింది.దీనిపై సీజేఐ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరిపింది.క్లెయిమ్ చేయని మృతదేహాలను మార్చురీలో నిరవధికంగా ఉంచడం సరికాదని అభిప్రాయపడింది. మృతదేహాలను ఖననం లేదా దహనం చేయడానికిగాను మణిపూర్ ప్రభుత్వం 9 ప్రదేశాలను ఎంపిక చేసిందని కోర్టు తెలిపింది.క్లెయిమ్ చేసిన మృతదేహాలకు సంబంధించి అంత్యకక్రియలను వారి బంధువులు ఈ 9 ప్రదేశాల్లో ఎక్కడైనా చేసుకోవచ్చని పేర్కొంది.ఇక గుర్తించి క్లెయిమ్ చేయని మృతదేహాల అంత్యక్రియల సమాచారాన్ని వారి బంధువులకు తెలపాలని ఆదేశించింది. వారం రోజుల్లోపు ఎవరూ రాకపోతే ప్రభుత్వమే అంత్యక్రియలు చేయొచ్చని తెలిపింది. షెడ్యల్ తెగల జాబితాలో గిరిజనులు కాని మైతేయి సామాజిక వర్గాన్ని కలిపే విషయాన్ని పరిశీలించాలని హై కోర్టు ఇచ్చిన తీర్పుపై ఈ ఏడాది మేలో మణిపూర్లో భారీ ఎత్తున హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ హింసలో మొత్తం 170 మంది మరణించగా వందల మంది గాయపడ్డారు. ఇదీచదవండి..నీదే దయ.. దేవుని ముందు ప్రణమిల్లిన ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ -
ప్రధాన న్యాయమూర్తి ముందు... దివ్యాంగుల జాతీయ గీతాలాపన!
దేశరాజధాని ఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రాంగణంలో ‘మిట్టీ కేఫ్’ పేరిట దివ్యాంగుల ఒక స్టోర్ ఏర్పాటు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డివై చంద్రచూడ్ ఇతర న్యాయమూర్తులతో కలిసి దీనిని ప్రారంభించారు. నూతనంగా నిర్మితమైన ఈ కేఫ్ దివ్యాంగుల పర్యవేక్షణలో నడవనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో వికలాంగులు తమ ప్రతిభ చూపారు. సంకేత భాషలో జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రారంభోత్సవం సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ ఇక్కడకు వచ్చేవారు కేఫ్కు మద్దతుగా నిలవాలని కోరారు. VIDEO | CJI DY Chandrachud inaugurates 'Mitti Cafe' inside Supreme Court complex. The cafe is managed by differently-abled people. pic.twitter.com/MpRbpL4dy6 — Press Trust of India (@PTI_News) November 10, 2023 ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తులకు సంబంధించిన సంస్థ ద్వారా ఈ ‘మిట్టి కేఫ్’ నిర్వహణ కొనసాగనుంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో బెంగళూరు విమానాశ్రయంతో పాటు వివిధ బహుళజాతి కంపెనీల కార్యాలయాలలో ఇప్పటికే 35 కేఫ్లు నడుస్తున్నాయి. ఈ సంస్థ 2017లో ప్రారంభమయ్యింది. దివ్యాంగులకు ఉపాధి కల్పించేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంటుంది. ఈ కేఫ్లో పౌష్టికాహారాన్ని కూడా అందజేస్తారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో 51 ఘాట్లలో 24 లక్షల దీప కాంతులు! VIDEO | CJI DY Chandrachud and other judges watch as differently-abled children perform on National Anthem in sign language during an event inside the Supreme Court premises. pic.twitter.com/cDHRMX4wQv — Press Trust of India (@PTI_News) November 10, 2023 -
Electoral bonds case: పలు సమస్యలున్నాయి!
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్లతో పలు సమస్యలున్నాయంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విరాళాలు పొందేందుకు పారీ్టలన్నింటికీ అవి సమానావకాశం కలి్పంచకపోతే వివక్షే అవుతుందని అభిప్రాయపడింది. ‘అంతేగాక ఈ పథకంలో అస్పష్టత కూడా దాగుంది. బాండ్లు కొనేవారి వివరాలు ఎవరికీ తెలియకుండా సంపూర్ణ గోప్యత పాటించడమూ వీలు కాదు. వారి వివరాలను సంబంధిత బ్యాంకు (ఎస్బీఐ), దర్యాప్తు సంస్థలు తెలుసుకునే వీలుంది’ అని అభిప్రాయపడింది. అంతేగాక విపక్షాల బాండ్లను కొనేవారిపై అధికార పక్షాలు ప్రతీకారానికి దిగకుండా ఎటువంటి రక్షణా లేదని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆందోళన వెలిబుచ్చారు. ‘‘ఏ పార్టీ ఎంత పవిత్రమైనదో తేల్చడం మా ఉద్దేశం కాదు. ఎన్నికల బాండ్ల పథకానికి రాజ్యాంగబద్ధత ఉందా లేదా అన్నదానిపై మాత్రమే విచారణ జరుపుతున్నాం’’ అని స్పష్టం చేశారు. ఎన్నికల బాండ్ల చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన 4 ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సీజేఐ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం రోజంతా విచారణ జరిపింది. ‘‘ఎన్నికల ప్రక్రియలో నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలన్న ఈ పథకం ఉద్దేశం అభినందనీయమే. కానీ ఈ పథకంలో అతి పెద్ద సమాచార లోపముంది’’ అని అభిప్రాయపడింది. ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా, జస్టిస్ గవాయ్, జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా సభ్యులుగా ఉన్నారు. -
పిండం ఎదుగుదల ఎలా ఉంది?
న్యూఢిల్లీ: వివాహిత 26 వారాల గర్భవిచ్చిత్తి కేసులో ఆమె గర్భంలో ఉన్న పిండం ఎదుగుదల ఎలా ఉందో నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఎయిమ్స్ వైద్యులను ఆదేశించింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఆ మహిళ ప్రసవానంతర మానసిక సమస్యలకు చికిత్స తీసుకుంటోందని గర్భాన్ని మోయడానికి ఆమె సిద్ధంగా లేదంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనల్ని çపరిగణనలోకి తీసుకుంది. మానసిక సమస్యలకు ఆ మహిళ తీసుకుంటున్న మందులు ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువు ఆరోగ్యానికి ఏమైనా హాని చేస్తాయో పూర్తిగా పరీక్షలు చేసి వివరంగా కోర్టుకు నివేదించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఆ మహిళ శారీరక, మానసిక స్థితి ఎలా ఉందో పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. ‘‘ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లయిన ఆ మహిళ ప్రసవానంతరం వచ్చే మానసిక సమస్యలతో బాధపడుతోందని పరీక్షల్లో తేలితే ప్రత్యామ్నాయంగా మరేౖవైనా మందులు ఇవ్వొచ్చా పరిశీలించాలి’’ అని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. ఎయిమ్స్ వైద్యులకి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. -
మా ఆదేశాలే అపహాస్యమా?
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, వారి వర్గం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో అసెంబ్లీ స్పీకర్ చేస్తున్న జాప్యంపై సుప్రీంకోర్టు మండిపడింది. దీనిపై నిర్ణయాన్ని ఆయన నిరవధికంగా వాయిదా వేస్తూ పోజాలరని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. ‘‘స్పీకర్ కాస్త విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని మేం భావించాం. నిర్దిష్ట కాలావధిలోగా ఈ అంశాన్ని పరిష్కరించాల్సిందిగా గత విచారణ సమయంలోనే ఆయనకు మేం స్పష్టంగా నిర్దేశించాం. ఇందుకు కాలావధి కూడా పెట్టుకోవాల్సిందిగా సూచించాం. ఆయన దీన్ని సీరియస్గా తీసుకుంటున్నట్టు కని్పంచాలి. కానీ ఈ అంశంపై అసలు విచారణే జరపడం లేదు’’ అంటూ స్పీకర్ రాహుల్ నర్వేకర్కు తలంటిపోశారు. ‘‘గత జూన్ నుంచీ ఈ విషయం అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. మేమంతా గమనిస్తూనే ఉన్నాం. అసలు స్పీకర్ ఏమనుకుంటున్నారు? మా ఆదేశాలనే అపహాస్యం చేస్తారా? ఇదేమైనా ఆషామాషీ విషయమని అనుకుంటున్నారా?’’ అంటూ ఆగ్రహించారు. ‘‘ఈ విషయంలో స్పీకర్కు కచి్చతంగా ‘సలహా’ అవసరం. వెంటనే ఎవరైనా ఆ పని చేయడం మేలు‘‘ అని స్పీకర్ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సీజేఐ సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకపోతే ఈ మొత్తం ప్రక్రియకు అర్థమే లేకుండా పోతుందన్నారు. ఈ అంశాన్ని ఎప్పట్లోగా తేలుస్తారో స్పష్టంగా పేర్కొంటూ మంగళవారం నాటికి తమకు టైమ్లైన్ను సమరి్పంచాలని ఆదేశించారు. లేదంటే ఈ విషయమై తామే నేరుగా ఆదేశాలిస్తామని స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీకి మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. స్పీకర్ను బాధ్యున్ని చేయాల్సి వస్తుంది! మహారాష్ట్రలో పలువురు ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలు రద్దు చేయాలంటూ శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత ఉద్ధవ్ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం ముందు శుక్రవారం విచారణ కొనసాగింది. ఠాక్రే వర్గం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు కొనసాగించారు. దీనిపై జూలై 14న స్పీకర్కు ధర్మాసనం నోటీసులు జారీ చేసినా ఇప్పటికీ ఏమీ జరగలేదని సీజేఐ దృష్టికి తెచ్చారు. దాంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదుటి పక్షం వారి వాదనలను పరిగణనలోకి తీసుకోవడం, ఇందులో పలు అంశాలను స్పీకర్ ముందుగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్న సొలిసిటర్ జనరల్ మెహతా వివరణతో సంతృప్తి చెందలేదు. ‘‘ఈ విషయమై మేం జూలై 14న స్పష్టమైన సూచనలు జారీ చేశాం. సెప్టెంబర్ 18న ఆదేశాలు కూడా వెలువరించాం. అయినా స్పీకర్ చేసిందేమీ లేదు. కనుక రెండు నెలల్లోగా దీనిపై ఆయన నిర్ణయం తీసుకోవాలని మేం ఆదేశించక తప్పడం లేదు’’ అన్నారు. ‘‘స్పీకర్ పదవికున్న హుందాతనం దృష్ట్యా తొలుత మేం టైంలైన్ విధించలేదు. కానీ ఆయన తన బాధ్యతలను నెరవేర్చకపోతే అందుకు బాధ్యున్ని చేయక తప్పదు’’ అని అన్నారు. -
సీజేఐకి మీడియా సంస్థల లేఖ
ఢిల్లీ: న్యూస్క్లిక్ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల ఇళ్లలో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సంస్థ చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థను అరెస్టు కూడా చేశారు. అయితే.. ఈ వ్యవహారంపై మీడియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జర్నలిస్టులను విచారించేందుకు దర్యాప్తు సంస్థలకు ప్రత్యేక విధివిధానాలు ఉండాలని కోరుతూ 18 మీడియా సంస్థలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్కు లేఖ రాశారు. 'దేశంలో తమపై ప్రతీకార దాడులు జరుగుతాయని జర్నలిస్టులు భయంతో పనిచేస్తున్నారు. కొంతమంది జర్నలిస్టులు రాసే వార్తలను ప్రభుత్వం అంగీకరించడంలేదు. వీరిపై ప్రతికారంతో లక్షిత ప్రతీకార దాడులు జరుగుతాయనే భయభ్రాంతులకు గురిచేస్తోంది. చట్టం నుంచి జర్నలిస్టులకు మినహాయింపు ఇవ్వాలని కోరుకోవడం లేదు. కానీ పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటే ప్రజాస్వామ్య లక్ష్యాలు దెబ్బతింటాయి. ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉంటాం.' అని సీజేఐ చంద్రచూడ్కు మీడియా సంస్థలు లేఖ రాశాయి. న్యూస్క్లిక్ ఆన్లైన్ పోర్టల్ విదేశాల నుంచి నిధులను అక్రమంగా పొందిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు న్యూస్క్లిక్ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ల్యాప్ట్యాప్, మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం: నిందితుల జాబితాలో ఆప్! -
అనారోగ్యంతో బాధపడుతున్న మణెమ్మను స్వదేశానికి పంపిన దుబాయ్ సీజేఐ!
దుబాయ్లో పనిచేసేందుకు వెళ్లింది ఆంధ్రప్రదేశ్కి చెందిన మణెమ్మ. అనుకోకుండా ప్రాణాంతక వ్యాధి బారినపడింది. దీంతో తన సొంతూరుకి ఎలా పయనమవ్వాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అయితే దుబాయ్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా(సీజీఐ) ఏపిఎన్ఆర్టీఎస్ సాయంతో మణెమ్మను సురక్షితంగా స్వదేశంలోని హెల్త్కేర్సెంటర్కి పంపింది. వివారాల్లోకెళ్తే..ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాకు చెందిన ఎమ్ మణెమ్మ సెప్టెంబర్ 2022లో దుబాయ్లో ఓ ఇంట్లో పనిచేయడానికి వెళ్లింది. కానీ దురదృష్ణవశాత్తు డిసెంబర్ 22న ఆమెకు ప్రాణాంతక వ్యాధి టీబీ ఉందని వైద్య పరీక్షల్లో తేలింది. అప్పటి నుంచి మణెమ్మకు దుబాయ్లోనే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఐతే ఇప్పుడు ఆమె పూర్తి స్థాయిలో కోలుకుంది. భారతదేశం ప్రయాణించడానికి ఎలాంటి సమస్య లేదని వీల్చైర్ ద్వారా నర్సు సాయంతో పంపిచొచ్చని వైద్యులు సూచించారు. దీంతో దుబాయ్ సీజేఐ మణెమ్మను తన వివరాలను చెప్పల్సిందిగా కోరింది. అయితే తనకు కుటుంబసభ్యులు, స్నేహితులు ఎవ్వరూ లేరని చెప్పడంతో ఆమె సొంతూరుకు దగ్గరలో ఉన్న హెల్త్కేర్ సెంటర్లు గురించి తెలియజేయమంటూ ఏపిఎన్ఆర్టీఎస్ ప్రెసిడెంట్ వెంకట్ మేడపాటికి ఈ మెయిల్ పంపింది దుబాయ్ సీజేఐ. దీంతో ఏపీఎన్ఆర్టీఎస్ ఈ విషయాన్ని ఏలూరు కలెక్టర్ కార్యాలయానికి తెలియజేసింది. కలెక్టర్ కార్యాలయం వారు సెయింట్ ఆన్స్ లయోలా ప్రేమ్ నివాస్ రిహాబిలేషన్ సెంటర్లో ఉండటానికి అనుమతివ్వడంతో ఏపీఎన్ఆర్టీఎస్ ఆ విషయాన్ని దుబాయ్ సీజేఐకి తెలిపింది. దుబాయ సీజే మణెమ్మకు నర్సుని తోడుగా ఇచ్చి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి పంపగా, అక్కడ నుంచి ఏపీఎన్ఆర్టీసి అంబులెన్స్ సాయంతో లయోలా ప్రేమ్ నివాస్ రిహాబిలిటేషన్ సెంటర్కు మణెమ్మను సురక్షితంగా చేర్చారు. ఈ విషయంలో తమకు సహకరించినందుకు గానూ దుబాయ సీజేఏ ఏపీఎన్ఆర్టీఎస్ వారికి కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఏపీఎన్ఆర్టీఎస్ కూడా మణెమ్మను సురక్షితంగా తరలించడంలో సాయం చేసిన ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఐఏఎస్ గారికి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి విజయ లక్ష్మి, డిఆర్ఓ మూర్తి, జిల్లా పరిపాలన శాఖ అధికారులకు, దుబాయ్ సీజేఐకి ధన్యవాదాలు తెలిపింది. (చదవండి: యూరప్లో వైభవంగా మలయప్ప స్వామి కల్యాణం) -
ఏసీబీ కోర్టు విచారణను మేం అడ్డుకోలేం: సీజేఐ
-
International Lawyers Conference 2023: భారతీయ భాషల్లో భారత చట్టాలు
న్యూఢిల్లీ: దేశంలో అమల్లో ఉన్న చట్టాలను అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో భారతీయ భాషల్లో రచించడానికి కేంద్ర ప్రభుత్వం నిజాయితీగా కృషి చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. ఆయన శనివారం ఢిల్లీలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా సైబర్ ఉగ్రవాదం, మనీ లాండరింగ్ నేరాలు విపరీతంగా పెరిగిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. విధ్వంసకర కార్యకలాపాల కోసం అరాచక శక్తులు కృత్రిమ మేధ(ఏఐ)ను వాడుతున్నాయని చెప్పారు. ముష్కరుల కార్యకలాపాలకు, సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి దేశాలన్నీ చట్టాలకు లోబడి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. దేశాల మధ్య అమల్లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థల తరహాలోనే సైబర్ ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి గ్లోబల్ ఫ్రేమ్వర్క్ రూపొందించుకోవాలని చెప్పారు. 2047 నాటికి దేశం పూర్తిగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో భారత్ కృషి చేస్తోందని, ఇందుకోసం బలమైన, నిష్పక్షపాతంతో కూడిన న్యాయ వ్యవస్థ కావాలని చెప్పారు. రెండు రూపాల్లో చట్టాలు కక్షిదారులకు న్యాయం చేకూర్చడంలో న్యాయ ప్రక్రియ, చట్టాలను రాసేందుకు ఉపయోగించిన భాష కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. చట్టాలు రెండు రూపాల్లో ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. న్యాయ నిపుణులు ఉపయోగించే భాషలో, సామాన్య ప్రజలు ఉపయోగించే భాషలో చట్టాలు ఉండాలన్నారు. ప్రజల భాషలో చట్టాలు ఉన్నప్పుడు వారు వాటిని సొంతం చేసుకుంటారని తెలిపారు. చట్టాలను సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సులభతరంగా మార్చే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. అది పూర్తి కావడానికి సమయం పడుతుందన్నారు. డేటా ప్రొటెక్షన్ చట్టంతో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టామని వివరించారు. కక్షిదారులకు తీర్పు కాపీలను వారి మాతృభాషలో అందజేయాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. భారత న్యాయ వ్యవస్థను కాపాడడంలో జ్యుడీíÙయరీ, బార్ కౌన్సిల్ సాగిస్తున్న కృషి ప్రశంసనీయమని చెప్పారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఎంతోమంది న్యాయవాదులు ముందంజలో నిలిచారని గుర్తుచేశారు. అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్, యూకే న్యాయ సహాయ శాఖ మంత్రి అలెక్స్ చాక్ కె.సి., భారత అటార్నీ జనరల్ ఆర్.వెంటకరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, బార్ కౌన్సిల్ చైర్మన్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల పాత్ర మారాలి: జస్టిస్ చంద్రచూడ్ నేటి ప్రపంచీకరణ శకంలో అంతర్జాతీయంగా న్యాయరంగంలో సవాళ్లను ఎదుర్కొనే దిశగా న్యాయవాదుల పాత్ర మార్పు చెందాలని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. ఆధునిక పరిజ్ఞానాన్ని లాయర్లు అందిపుచ్చుకోవాలన్నారు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ వంటి అంశాల్లో సాంకేతికపరమైన మార్పులను కక్షిదారులు, ప్రభుత్వాలు అందిపుచ్చుకొనేలా లాయర్లు కృషి చేయాలని సీజేఐ తెలిపారు. -
నివేదిక ఇవ్వడం నేరం కాదు
న్యూఢిల్లీ: మణిపూర్ హింసపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(ఈజీఐ) సభ్యులిచి్చన నివేదికలోని అంశాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ నివేదికలో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే అంశం ఏమీ కనిపించడం లేదని పేర్కొంది. ఒక తప్పుడు ప్రకటన రాజ్యాంగంలో 153ఏ ప్రకారం నేరం కాదని స్పష్టం చేసింది. అది భావ ప్రకటన స్వేచ్ఛ కిందికి వస్తుందని వివరించింది. దేశంలో ఎందరో జర్నలిస్టులు నిత్యం ఇలాంటి అసత్య ప్రకటనలు చేస్తుంటారు. వారందరిపైనా అభియోగాలు మోపుతారా అని పోలీసులను ప్రశ్నించింది. ఈ కేసులో ఈజీఐకి చెందిన నలుగురు సభ్యులకు పోలీసు అరెస్ట్ నుంచి ఇచి్చన రక్షణను మరో రెండు వారాలు పొడిగిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈజీఐ సభ్యులపై నమోదైన కేసును ఎందుకు కొట్టివేయరాదని మణిపూర్ పోలీసులను ఆయన ప్రశ్నించారు. జర్నలిస్టులకు తమ అభిప్రాయాలను వెలిబుచ్చే హక్కు ఉంటుందన్నారు. మణిపూర్ హింసపై నిజ నిర్థారణలో భాగంగా నలుగురు సభ్యుల ఈజీఐ అక్కడికి వెళ్లి సెప్టెంబర్ 2న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ఘర్షణలను ప్రేరేపించేదిగా ఉందంటూ పోలీసులు ఈజీఐకి చెందిన నలుగురు స భ్యులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
మొదటి భార్య గురించి సీజేఐ చంద్రచూడ్ ఆసక్తికర విషయాలు..
బెంగళూరు: న్యాయవాద వృత్తిలో సవాళ్లపై ప్రసంగంలో సీజేఐ డీవే చంద్రచూడ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. లాయర్ వృత్తికి సమయం గురించి చెప్పే క్రమంలో చనిపోయిన తన మొదటి భార్య గురించిన విషయాలను వెల్లడించారు. ఉపన్యాసంలో భాగం కాకపోయినప్పటికీ బుక్ నాలెడ్జ్ కంటే తన వ్యక్తిగత అనుభవ పాఠాలు విద్యార్థులకు బాగా ఉపయోగపడతాయని తెలిపారు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీ(ఎన్ఎల్ఎస్ఐయూ)లో 31వ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 'చనిపోయిన నా మొదటి భార్య లాయర్గా పనిచేశారు. వృత్తి జీవితంలో ఓ న్యాయవాద సంస్థకు వెళ్లినప్పుడు ఆమె పని గంటల గురించి అడిగారు. అందుకు వారు ఆమెకు 365 రోజులు 24x7 అని సమాధానమిచ్చారు. కుటుంబానికి సమయం లేదని చెప్పారు. భార్యాపిల్లలు ఉన్నవారి పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించినప్పుడు.. ఇంటి పనులు చేసే భర్తను వెతుక్కోండని చెప్పారు' అని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. పనిచేసే ప్రదేశంలో మహిళలకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరాన్ని తెలిపారు. నేడు మహిళా క్లర్కులు బుుతుసమస్యల సమయంలో వర్క్ ఫ్రం హోమ్ చేయగలుగుతున్నారని చెప్పారు. సమాన అవకాశాలు ఉన్నచోట అన్ని అవసరాలను బహిరంగంగా అడగగలిగే పరిస్థితులను కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవల మహిళల గౌరవానికి భంగం కలిగించకుండా, వారి ఆత్మగౌరవాన్ని మరింత పెంచేలా సుప్రీంకోర్టు డిక్షనరీని కూడా మార్చినట్లు చెప్పారు. వేశ్య, పతిత, హౌజ్వైఫ్ వంటి పదాలను తొలగించినట్లు స్పష్టం చేశారు. మహిళా సాధికారతను సాధించే దిశగా సీజేఐ చంద్రచూడ్ ఎన్నో తీర్పులను ఇచ్చారు. ఆర్మీలో శాశ్వత మహిళా కమిషన్, శబరిమలకు మహిళల ప్రవేశంతో పాటు అబార్షన్ చట్టాలను కూడా చక్కదిద్దారు. మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసును కూడా ఆయన నేతృత్వంలోని ధర్మాసనమే విచారణలు జరుపుతోంది. ఇదీ చదవండి: అంబానీ కుటుంబంలో మొదటి ప్రేమ వివాహం ఎవరిది? -
తీర్పుల్లో మహిళల పట్ల అనుచిత పదాలు వాడొద్దు
ఢిల్లీ: న్యాయస్థానాల్లో కేసుల విచారణ, తీర్పులు వెల్లడించే సమయంలో మహిళలపై వివక్షకు తావు లేకుండా కీలక ముందడుగు పడింది, వేశ్య, పతిత, ఎఫైర్, హౌస్వైఫ్, ట్రాన్సెక్సువల్, వ్యభిచారం వంటి పదాలు ఇక ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు నిర్దేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ బుధవారం ఒక హ్యాండ్బుక్ను విడుదల చేశారు. ‘‘హ్యాండ్బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియో టైప్స్’’ పేరుతో ఉన్న ఈ హ్యాండ్బుక్లో న్యాయస్థానాలు గతంలో ఇచి్చన తీర్పుల సమయంలో మహిళల పట్ల అనుచితంగా ఉండే 100కి పైగా పదాలు అందులో ఉన్నాయి. ఆ పదాలకు బదులుగా ఏం వాడాలో కూడా అందులో వివరంగా రాశారు. రెచ్చగొట్టే దుస్తులు, పెళ్లి కాకుండానే తల్లి, ఎఫైర్, వేశ్య వంటి పదప్రయోగాలకు చేయకూడదని, వాటికి బదులుగా దుస్తులు, తల్లి, వివాహేతరం సంబంధం, సెక్స్ వర్కర్ అని మాత్రమే రాయాలని ఆ హ్యాండ్బుక్ స్పష్టంగా చెబుతోంది. ఈవ్టీజింగ్ బదులుగా స్ట్రీట్ సెక్యువల్ హెరాజ్మెంట్, హౌస్వైఫ్ బదులుగా హోమ్మేకర్ అన్న పదాలు వాడాలని నిర్దేశించింది. మూస పదాలు వద్దు ఈ హ్యాండ్బుక్ విడుదల చేసిన సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ మాట్లాడుతూ న్యాయ ప్రక్రియల్లో మహిళలపై మూస పద్ధతుల్లో ఎలాంటి పదాలు ఉపయోగిస్తారో ఈ పుస్తం చెబుతుందని అన్నారు. ‘‘తీర్పులు రాసే సమయంలో న్యాయమూర్తులు మహిళల పట్ల అనాలోచితంగా అనుచిత పదాలు వాడుతున్నారు. మూసపద్ధతుల్లో ఉండే పద ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో వచ్చిన తీర్పుల్ని విమర్శించడం ఉద్దేశం కాదు. భవిష్యత్లో న్యాయమూర్తులు ఆ పదాలు ఉపయోగించకుండా ఈ హ్యాండ్బుక్ ఉపయోగపడుతుంది. ఏ పదాలకు గుర్తింపు ఉందో స్పష్టంగా తెలుస్తుంది. భవిష్యత్లు ఇచ్చే తీర్పుల్లో న్యాయమూర్తులు సరైన పదాలు వాడితే వారిచ్చే తీర్పులపై అపోహలకు కూడా తావుండదు’’ అని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు. ఇదీ చదవండి: ఢిల్లీ చట్టంపై అసెంబ్లీ స్పెషల్ సెషన్..ఎల్జీ అభ్యంతరం -
సీఈసీ నియామకంలో సీజేఐకు అధికారం లేనట్టే
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య కొలీజియంపై విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరో వివాదాస్పద బిల్లును మోదీ సర్కార్ గురువారం రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించింది. ఆయన స్థానంలో కేబినెట్ మంత్రికి స్థానం కల్పించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఎన్నికల సంఘంపై కేంద్ర ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు లభిస్తాయి. కేంద్రం ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చే వరకు ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తు లతో కూడిన త్రిసభ్య కమిటీ సీఈసీ, ఇతర కమిషనర్ల నియామకాలు చేపడుతుందని గత మార్చిలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సీజేఐను తప్పించి కేబినెట్ మంత్రిని చేర్చడం వివాదానికి దారితీసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్స్ (అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీసు) బిల్లు, 2023ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ప్రధానమంత్రి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, ప్రధాని నామినేట్ చేసిన కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఆ కమిటీయే సీఈసీ, ఈసీలను ఎంపిక చేస్తుంది. కాంగ్రెస్, ఆప్ ఇతర విపక్ష పార్టీ సభ్యుల ఆందోళనల మధ్య ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సుప్రీం తీర్పుని లెక్క చేయరా ? సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఉత్తర్వుల్ని నీరు కార్చేలా ఈ బిల్లు ఉందని విపక్షాలు విమర్శించాయి. కమిటీ నుంచి సీజేఐని తప్పించడం అత్యంత ప్రమాదకరమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలపై ఇది ప్రభావం చూపిస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పులేమైనా బీజేపీకి నచ్చకపోతే వాటిని లెక్క చేయదని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం మొత్తాన్ని ప్రధాని మోదీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఆరోపించారు. కమిటీలో ఇద్దరు బీజేపీకి చెందినవారే ఉంటే నిష్పాక్షికంగా కమిషనర్ల ఎంపిక ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఏడాది ఈసీలో ఖాళీ కేంద్ర ఎన్నికల కమిషన్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఖాళీ ఏర్పడనుంది. ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండేకి 65 ఏళ్లు నిండనుండడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న పదవీ విరమణ చేస్తారు. 2024 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొద్ది రోజుల ముందే ఆయన పదవీ విరమణ చేస్తారు. ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాలి. తాము చెప్పినట్టు వినే కమిషనర్ను నియమించుకొని ఎన్నికల కమిషన్ను తన గుప్పిట్లో పెట్టుకోవడానికే కేంద్రం ఇదంతా చేస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సుప్రీం కోర్టు ఉత్తర్వుల కంటే ముందు కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమించే వారు. -
CJI DY Chandrachud: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గొప్పదనానికి వందనం చేయాల్సిందే
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తన పదవీకాలంలో అయోధ్య, శబరిమల, సెక్షన్ 377, గర్భ విచ్ఛిత్తి వంటి ఎన్నో చరిత్రాత్మక తీర్పులతో వార్తల్లో నిలిచారు. భారత అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ అయిన చంద్రచూడ్ నిజజీవితంలో మాత్రం ఎటువంటి ఆడంబరాలకు పోకుండా చాలా సాదాసీదాగా గడుపుతారన్న విషయం కొద్ది మందికే తెలుసు. తాజాగా చంద్రచూడ్ చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు. డీవై చంద్రచూడ్ మంచి న్యాయమూర్తే కాదు మంచి మనిషి కూడా అని అప్పుడే అందరికి తెలిసింది. భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ గతేడాది నవంబర్లో బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గతంలో పనిచేసిన జస్టిస్ వైవీ చంద్రచూడ్ కుమారుడే డీవై చంద్రచూడ్. ఆయన తండ్రి వైవీ చంద్రచూడ్ సుప్రీంకోర్టులో గరిష్టంగా ఏడేళ్ల సుదీర్ఘ కాలం సీజేఐగా పనిచేసిన రికార్డు కూడా ఉంది. అంతే కాదు డీవై చంద్రచూడ్ ఇప్పటికే సుప్రీంకోర్టులో గత రెండేళ్లుగా ఎన్నో కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఇందులో అయోధ్య తీర్పుతో పాటు పలు కీలక తీర్పులు ఉన్నాయి. నాణానికి ఒకవైపే.. ఈ విషయాలు తెలుసా? ఆయన తండ్రి గతంలో ఇచ్చిన రెండు తీర్పుల్ని తిరగ రాసిన చరిత్ర కూడా డీవై చంద్రచూడ్కు సొంతం. ఇవన్నీ నాణానికి ఒకవైపే. కానీ వ్యక్తిగతంగా చూస్తే ఆయనలో మనకి తెలియని మానవతామూర్తి ఉన్నారు. కన్నబిడ్డలు కాకపోయినా తల్లిలా లాలించే ఆయన మనసు చూస్తే ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు. ఈ విషయం గురించి విశ్రాంత జస్టిస్ అమర్ గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. డీవై చంద్రచూడ్ మంచి న్యాయమూర్తే కాదు మంచి మనిషి కూడా అని వ్యాఖ్యానించారు. పిల్లలిద్దరూ వికలాంగులే, అయినా దత్తత ఇటీవలే జస్టిస్ డీవై చంద్రచూడ్ తన ఇద్దరు దత్తత కూతుళ్లను సుప్రీంకోర్టుకు తీసుకువచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. వారిలో పెద్దకుమార్తె పేరు ప్రియాంక. చిన్న కూతురి పేరు మహీ. ఇద్దరూ వికలాంగులే. వీల్ ఛైర్లకే పరిమితం. కోర్టు ప్రారంభం కావడానికి అరగంట ముందే సుప్రీంకోర్టుకు వచ్చిన చంద్రచూడ్.. తన ఇద్దరు పిల్లలు ప్రియాంక, మహీలకు చాంబర్, కోర్ట్ హాల్, ఇతర న్యాయమూర్తుల చాంబర్స్ మొదలైనవి స్వయంగా చూపించారు. కోర్టులో న్యాయమూర్తి ఎక్కడ కూర్చుంటారు? న్యాయవాదులు ఎక్కడి నుంచి వాదనలు వినిపిస్తారు? సాధారణ పౌరులు ఎక్కడ కూర్చుంటారు? మొదలైన విషయాలను వారికి వివరించారు. విజిటర్స్ గ్యాలరీ నుంచి తను కూర్చునే కోర్టు హాల్ వరకు పిల్లలను వెంట తీసుకెళ్లారు. దీంతో పిల్లలిద్దరూ ఎంతగానో సంతోషించారు. కూతుళ్లను వారి కోరిక మేరకు సీజేఐ తీసుకువచ్చారని తెలిసి న్యాయవాదులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఆ ఇద్దరు కూతుళ్లు దివ్యాంగులు కావడం, వాళ్లను చంద్రచూడ్ దంపతులు దత్తత తీసుకొని మరీ కన్నబిడ్డల్లా పెంచుకుంటున్నారని చాలామందికి అప్పుడే తెలిసింది. ఆ పిల్లల సొంత తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో చంద్రచూడ్ దంపతులు వాళ్లను దత్తత తీసుకున్నారట. క్యాన్సర్తో మొదటి భార్య మరణం 1959లో జన్మించిన చంద్రచూడ్ 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన తండ్రి కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుమారు ఏడేళ్ల ఐదు నెలల పాటు సుధీర్ఘకాలం సేవలందించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన వ్యక్తి కుమారుడు కూడా సీజేఐగా కావడం భారత చరిత్రలో ఇదే తొలిసారి. 2024 నవంబర్ 10 వరకూ చంద్రచూడ్ సీజీఐగా కొనసాగనున్నారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే.. చంద్రచూడ్ మొదటి భార్య రష్మీ 2007లో క్యాన్సర్తో మరణించింది. ఆ తర్వాత కల్పనను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. వీరు మహి, ప్రియాంక అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. అప్పటికే మొదటి భార్యతో చంద్రచూడ్కు అభినవ్, చింతన్ అనే కుమారులున్నారు. అయనప్పటికీ దివ్యంగులైన ఆడపిల్లలను దత్తత తీసుకొని వాళ్లను కన్నబిడ్డలా చూసుకోవడం అభినందనీయం. -
సుప్రీంకోర్టులో ఉచిత వైఫై సేవలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు డిజిటైజేషన్ దిశగా మరో కీలక అడుగు పడింది. అత్యున్నత న్యాయస్థానంలోని మొదటి అయిదు కోర్టు రూముల్లో వైఫై సేవలను అందుబాటులో తెచ్చినట్లు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ సోమవారం ప్రకటించారు. లాయర్లు, కక్షిదారులు, మీడియా వ్యక్తులు, ఇతర సందర్శకులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ఇనిషియేటివ్లో భాగంగా తీసుకువచ్చిన ఈ వెసులుబాటును ‘ ఇఐ గిజీఊజీ‘ లాగిన్ చేయడం ద్వారా ఉపయోగించుకోవచ్చునన్నారు. ‘అన్ని కోర్టు రూములు ఇకపై పుస్తకాలు, పేపర్లు కనిపించవు. అయితే దీనర్థం, పుస్తకాలు, కాగితాలపై అస్సలు ఆధారపడబోమని కాదు’అని సీజేఐ పేర్కొన్నారు. కాగా, వేసవి సెలవుల అనంతరం సోమవారం సుప్రీంకోర్టు తిరిగి పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించింది. -
నాడు అద్దె గదిలో జూనియర్ లాయర్గా ప్రారంభమై..నేడు సుప్రీంకోర్టు జడ్జి స్థాయికి..
సుప్రీంకోర్టు జడ్జిగా సీనియర్ న్యాయవాది కల్పాతి వెంకటరామన్ విశ్వనాథన్ శుక్రవారమే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు విశ్వనాథన్ ఆగస్టు 11 2030న జేబీ పార్దివాలా పదవీ విరమణ చేసిన తదనంతరం భారత ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. ఆయన ఈ పదవిలో మే 25, 2031 వరకు కొనసాగుతారు. ఈ సందర్భంగా ఒక చిన్న లాయర్గా కెరీర్ మొదలు పెట్టిన జస్టిస్ విశ్వనాథన్ సుప్రీం కోర్టు జడ్జి హోదాకి అంచెలంచెలుగా సాగిన సుదీర్ఘ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. జస్టిస్ కేవీ విశ్వనాథన్ 1988లో తమిళనాడు నుంచి ఢిల్లీకి వచ్చి ఆర్కేపురంలో ఓగదిలో ఉంటూ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. ఆయన తమిళనాడులోని పొల్లాచి పట్టణానికి చెందినవారు. తండ్రి కేవీ వెంకటరామన్ కోయంబత్తూరులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేయడంతో ఆయన విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. కోయంబత్తూరు న్యాయ కళాశాలలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు పూర్తి అయిన వెంటనే సుప్రీం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాలనే కోరికతో 1988లో ఢిల్లీకి వచ్చేశారు. అక్కడ నుంచే విశ్వనాథన్ న్యాయవాది వృత్తి జర్నీ ప్రారంభమైంది. అక్కడే ఆర్కేపురంలో స్నేహితుడితో ఓ అద్దె గదిలో ఉంటూ లాయర్గా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. ఆ తదనంతరం ఢిల్లీలోని సీనియర్ లాయర్ దగ్గర జూనియర్గా పనిచేశారు. ఆ తర్వాత సీఎస్ వైద్యనాథన్తో కలిసి పనిచేశారు. అతనితో విశ్వనాథన్ 1988 నుంచి 1990 వరకు హైకోర్టు, సుప్రీంకోర్టు, దిగువ కోర్టులలో పనిచేశారు. ఆ తర్వాత సీనియర్ న్యాయవాది కెకె వేణుగోపాల్ వద్ద 1990 నుంచి 1995 వరకు పనిచేశారు. అంతేగాదు అయోధ్య కేసులో లార్డ్ రామ్లాల తరుఫును కేసు వాదించారు. ఇదిలా ఉండగా, 1991 నాటి ఆసక్తికరమైన సంఘటనలో, కాంగ్రెస్ నాయకుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య కేసు జస్టిస్ ఎమ్సి జైన్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతున్నప్పుడూ జస్టిస్ విశ్వనాథన్ తన ప్రత్యర్థి వర్గానికి ట్రాన్స్లేటర్గా కూడా పని చేశారు. ఆ కేసులో రాజకీయ నేతలంతా ఇంగ్లీషలో మాట్లాడుతుండగా.. డీఎంకే అధినేత ఎం కరుణానిధి మాత్రం తమిళంలో మాట్లాడటంతో జస్టీస్ జైన్కు ఏం చేయాలో తోచలేదు. దీంతో కరుణానిధి మాటలను నా కోసం అనువదించగలరా అని విశ్వానథ్ని అడిగారు. తాను ఏఐఏడీఎంకేకు వాదిస్తున్నానని జస్టిస్ విశ్వనాథన్ చెప్పడంతో ఆయన అనువాదించడంలో ఎవరికైనా అభ్యంతరం ఉందా అని జస్టిస్ జైన్ అడిగారు. ఐతే ఎవ్వరూ ఏ సమస్య లేవనెత్తకపోయేసరికి విశ్వానాథనే తన ప్రత్యర్థి వర్గానికి ట్రాన్స్లేటర్గా చేశారు. 2009లో కేంద్ర ప్రభుత్వానికి అదనపు న్యాయవాదిగా కూడా పనిచేశారు. అంతేగాదు సుప్రీంకోర్టులో అనేక ముఖ్యమైన కేసులలో ప్రాతినిధ్యం వహించడమే గాక చాలా సున్నితమైన కేసులలో అమికస్ క్యూరీగా నియమితులయ్యారు. కాగా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తమిళనాడు నుంచి నియమితులైన మూడవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అంతకుముందు తమిళనాడు నుంచి జస్టిస్ పతంజలి శాస్త్రి 1951 నుంచి 1954 వరకు సీజేఐగా పనిచేశారు. 2013లో జస్టిస్ పీ సదాశివం తొమ్మిది నెలల పాటు ఈ పదవిలో ఉన్నారు. (చదవండి: ‘అది పనిష్మెంట్ కాదు.. మోదీ విజన్’) -
Bilkis Bano: ప్రత్యేక ధర్మాసనానికి ఓకే
ఢిల్లీ: గుజరాత్ అల్లర్ల అత్యాచార బాధితురాలు బిల్కిస్ బానో అభ్యర్థనకు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎట్టకేలకు సానుకూలంగా స్పందించింది. ఆమె పిటిషన్ను విచారించేందుకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు బుధవారం అంగీకరించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ మేరకు స్వయంగా బాధితురాలి తరపు న్యాయవాదికి ఈ విషయమై స్పష్టత ఇచ్చారు. బానో తరపున లాయర్ శోభా గుప్తా విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం ఇందుకు అంగీకరించింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్తో పాటు జస్టిస్ పీఎస్ నరసింహా, జేబీ పార్దివాలాలతో కూడిన బెంచ్.. ఈ మేరకు బెంచ్ ఏర్పాటునకు అంగీకరించారు. ఈ కేసులో దోషులను రెమిషన్ మీద విడుదల చేయడం సరికాదు. ఈ(బానో) పిటిషన్పై అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని, దానికి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయల్సి ఉందని లాయర్ గుప్తా.. త్రిసభ్య ధర్మాసనాన్ని కోరారు. దీనికి ‘‘ నేను బెంచ్ ఏర్పాటు చేస్తా. సాయంత్రమే దాన్ని పరిశీలిస్తా’’ అని స్వయంగా సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, గుప్తాకు తెలిపారు. ఈ పిటిషన్తో పాటు నిందితుల విడుదలను సవాల్ చేస్తూ బానో ప్రత్యేకంగా మరో పిటిషన్ను సైతం సుప్రీంలో దాఖలు చేశారు. 2002 గుజరాత్ అలర్ల సమయంలో.. బిల్కిస్ బానో దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైంది. అదే అల్లర్లలో ఆమె కుటుంబ సభ్యులు సైతం హత్యకు గురయ్యారు. ఇక ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న పదకొండు మందిని.. గుజరాత్ ప్రభుత్వం కిందటి ఏడాది ఆగష్టు 15వ తేదీన రెమిషన్ కింద విడుదల చేసింది. దీనిని సవాల్ చేస్తూ గత డిసెంబర్లో బిల్కిస్ బానో సుప్రీంను ఆశ్రయించగా.. ఆ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇక.. ఈ ఏడాది జనవరి 24వ తేదీన సైతం ఆమె మరో పిటిషన్ దాఖలు చేయగా.. ఆ సమయానికి ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మరో పిటిషన్తో బిజీగా ఉండడం వల్ల ముందుకు కదల్లేదు. -
మల్లన్నను దర్శించుకున్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
శ్రీశైలం టెంపుల్(నంద్యాల జిల్లా): శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ధనుంజయ వై.చంద్రచూడ్, కల్పనాదాస్ దంపతులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ, సత్యప్రభ దంపతులు శనివారం రాత్రి దర్శించుకున్నారు. వీరికి ఆలయ రాజగోపురం వద్ద శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న, అర్చకస్వాములు, వేదపండితులు ఆలయ మర్యాదలు, మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి దంపతులు రత్నగర్భ స్వామిని దర్శించుకుకున్నారు. ఆ తర్వాత మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మల్లికా గుండంలో ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని, అనంతరం భ్రమరాంబాదేవి అమ్మ వారిని దర్శించుకున్నారు. వీరి వెంట పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, శ్రీశైలం శాసన సభ్యుడు శిల్పాచక్రపాణి రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, రాష్ట్ర రిజి్రస్టార్ జనరల్ వై.లక్ష్మణరావు, తెలంగాణ రాష్ట్ర రిజి్రస్టార్ జనరల్ కె.సుజన, దేవదాయ శాఖ కమిషనర్ ఎం హరిజవహర్లాల్, కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎన్.శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. -
వివక్షతోనే ఆత్మహత్యలు: సుప్రీం సీజే డీవై చంద్రచూడ్
‘‘ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల మార్కులను, ఆంగ్ల ప్రావీణ్యాన్ని అపహాస్యం చేయడం వంటి ఘటనలు ఉన్నత విద్యా సంస్థల్లో కొనసాగుతున్నాయి. ఆంగ్లం రాని వారిని అంటరానివారిగా వివక్షతో చూడటం, అసమర్థులుగా ముద్ర వేయడం వంటి విధానాలకు స్వస్తి పలకాలి. ఇలాంటివాటి వల్ల అణగారిన వర్గాల విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు పెరుగుతున్నాయి. ఈ బలవన్మరణాల్లో గ్రామీణ ప్రాంతాల వారు, ముఖ్యంగా దళిత, ఆదివాసీ వర్గాల విద్యార్థులే ఎక్కువని పరిశీలనల్లో తేలింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచి్చన వారిలో ఒత్తిడిని దూరం చేసి, సానుభూతితో వ్యవహరిస్తే.. ఇలాంటి ఘటనలు జరగకుండా వ్యవహరించవచ్చు. ఎదుటివారిని అర్థం చేసుకునే విధానంతో కూడిన విద్యను ఉన్నత విద్యాసంస్థల్లో అందించడం అవసరం’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ధనుంజయ వై.చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. సుప్రీం చీఫ్ జస్టిస్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రానికి తొలిసారి వచ్చిన జస్టిస్ చంద్రచూడ్ శనివారం నల్సార్ యూనివర్సిటీ 19వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్, నల్సార్ వర్సిటీ చాన్సలర్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణ్యన్, జస్టిస్ పీఎస్ నరసింహతోపాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ముందుగా వర్సిటీ సంప్రదాయం ప్రకారం స్నాతకోత్సవ ఊరేగింపుతో రిజిస్టార్ కె.విద్యుల్లతారెడ్డి సీజేఐకి స్వాగతం పలికారు. వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం సీజేసీ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తమకు చదువు చెప్పినవారినే కాదు.. చదువుకున్న సంస్థ అభివృద్ధికి పాటుపడిన సిబ్బంది, కార్మికుల శ్రమను కూడా విద్యార్థులు గుర్తించాలి. న్యాయశాస్త్ర విద్యార్థులు.. లా సబ్జెక్టులతోపాటు సాహిత్యం తదితర అంశాలపైనా అవగాహన పెంపొందించుకోవాలి. నేను చదువుకున్న రోజులతో పోలిస్తే ప్రస్తుత తరం విద్యార్థులకు సమాచారం, విజ్ఞానం పొందేందుకు అవకాశాలు చాలా విస్తృతంగా ఉన్నాయి. విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించడమే కాదు. సమాజంపై బాధ్యత కూడా ఉంటుంది. సానుభూతి దయాగుణం అవసరం ఉన్నత–నిమ్న, ధనిక–పేద అనే తేడా లేకుండా అందరినీ న్యాయస్థానాలు సమానంగా చూస్తాయి. ఇదే విధానాన్ని అన్నింటా పాటించాలి. చట్టం అమలు, న్యాయం అందించడంలో సానుభూతి, దయాగుణం, తాతి్వకత అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇది అన్యాయమైన స్థితి నుంచి న్యాయమైన సమాజ నిర్మాణానికి బాటలు వేస్తుంది. పెద్ద సంఖ్యలో మోటార్ ప్రమాద కేసులను పరిష్కరించేటప్పుడు సాంకేతిక అంశాలతో మానవీయ కోణాన్ని సమతూకం వేస్తూ సుప్రీంకోర్టు ఎన్నో తీర్పులు ఇచ్చింది. ఒత్తిడితో కూడిన విద్య మంచిది కాదు మనం విద్యను కూడా సానుభూతి కోణం నుంచే చూడాలి. చదువులో, వృత్తిలో రాణిస్తేనే మన జీవితాలు మెరుగ్గా ఉంటాయని విద్యా సంస్థల్లో మెదళ్లకు ఎక్కిస్తున్నారు. అలాగే విద్యార్థుల మధ్య తీవ్ర పోటీతత్వం, మార్కులు, ర్యాంకుల ఆధారిత విద్య వారిని మరింత ఒత్తిడికి గురిచేస్తుంది. పట్టణాలు, గ్రామాల్లోని విద్యార్థుల సామర్థ్యం ఒకేలా ఉండదన్న విషయం గ్రహించాలి. విద్య నేర్పడంలోనూ సానుభూతి, కరుణ, స్నేహభావం ఉన్నప్పుడే అది సంపూర్ణమవుతుంది. నైతికతతో కూడిన విద్యా విధానం అవసరం. ఆ మేరకు ప్రమాణాలు మారాలి. ఒత్తిడికి సంబంధించిన విద్యా విధానం మంచిది కాదు. 75 ఏళ్ల స్వాతంత్య్రంలో ఎన్నో ప్రముఖ విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఎదుటి వారికి సాయం చేయాలనే దృక్పథంతో కూడిన విద్యా విధానం లేకపోవడం గమనించాల్సిన విషయం. న్యాయవిద్యలోనూ క్లినికల్ విధానం అవసరం. విద్యా సంస్థలు, బార్ కౌన్సిల్ దీని కోసం ప్రయత్నించాలి. ఆ ఆత్మహత్యలు కలచివేశాయి ముంబై ఐఐటీలో దళిత విద్యారి్థ, ఒడిశా న్యాయ విశ్వవిద్యాలయంలో ఆదివాసీ విద్యార్థుల ఆత్మహత్యలు కలిచివేశాయి. అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూనే.. సామాజిక మార్పు కోసం సమాజంతో చర్చలు జరపడంలో న్యాయమూర్తులు కీలకపాత్ర పోషించాలి. న్యాయ, పరిపాలన వివాదాల పరిష్కారంతోపాటు సమాజం ఎదుర్కొంటున్న నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించేందుకు కూడా సుప్రీంకోర్టు ప్రయత్నిస్తోంది. సీజేఐగా విద్యార్థులు చదువుకునేందుకు ఆరు దశాబ్దాలకు సంబంధించిన తీర్పులన్నింటినీ అందుబాటులో ఉంచాం. ఆటో ఇంటెలిజెన్స్ ద్వారా కోర్టు విచారణను రికార్డు చేస్తున్నాం. దీంతో విద్యార్థులు విచారణ తీరును తెలుసుకోవచ్చు’’ అని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు. ఈ కార్యక్రమంలో నల్సార్ యూనివర్సిటీ వ్యవస్థాపక వైస్ చాన్సలర్ రణబీర్ సింగ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఎస్ఎం ఖాద్రీ, జస్టిస్ పీవీ రెడ్డి, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, హెచ్సీఏఏ చైర్మన్ రఘునాథ్, కార్యదర్శులు మల్లారెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా పీహెచ్డీ (బ్లాక్ గౌన్–రెడ్క్యాప్), ఎల్ఎల్ఎం (బ్లాక్ గౌన్–ఎల్లో క్యాప్), ఎంబీఏ (బ్లాక్ గౌన్–ఎల్లో క్యాప్), బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్) (బ్లాక్ గౌన్–మెరున్ క్యాప్)తో పాటు పలు విభాగాల విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. ఆ ఇద్దరికి పతకాల పంట.. నల్సార్ స్నాతకోత్సవంలో బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్) విద్యార్థి తన్వీ ఆప్టేకు ఏకంగా పదకొండు పసిడి పతకాలు లభించాయి. మరో రెండు పసిడి పతకాలను ఉమ్మడిగా పొందారు. ‘‘ఇన్ని గోల్డ్ మెడల్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. నా తల్లిదండ్రుల కృషి మూలంగానే నేను ఈ పతకాలు సాధించగలిగాను. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని తన్వీ పేర్కొన్నారు. ఇక బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్) విద్యార్థి మంజరి సింగ్కు 10 పసిడి పతకాలు లభించాయి. మొత్తంగా స్నాతకోత్సవంలో 58 గోల్డ్ మెడల్స్ పంపిణీ చేశారు. -
మన రాజ్యాంగం ‘పక్కా లోకల్’
ముంబై: ‘‘భారత రాజ్యాంగం అతి గొప్ప స్వదేశీ రూపకల్పన. ఆత్మగౌరవం, స్వతంత్రం, స్వపరిపాలనకు అత్యుత్తమ కరదీపిక’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ కొనియాడారు. ‘‘కానీ కొందరు దాని విజయాలను అతిగా కొనియాడుతుంటే మరికొందరు పూర్తిగా పెదవి విరుస్తుంటారు. ఇది నిజంగా బాధాకరం. మన రాజ్యాంగం ఎన్నో గొప్ప ఘనతలు సాధించిందన్నది నిస్సందేహం. అయితే సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. ముఖ్యంగా భారత సమాజంలో లోతుగా వేళ్లూనుకుపోయిన అసమానతలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి’’ అని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ స్ఫూర్తిని సమాజం పూర్తిస్థాయిలో అందిపుచ్చుకున్నప్పుడే ఈ అసమానతలు పోతాయన్నారు. శనివారం నాగపూర్లోని మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ తొలి కాన్వకేషన్లో సీజేఐ పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్దేశిత విలువలకు కట్టుబడితే రాణిస్తారంటూ యువ న్యాయ పట్టభద్రులకు ఈ సందర్భంగా ఉద్బోధించారు. ‘‘నేడు మనం అనుభవిస్తున్న రాజ్యాంగ హక్కులు, పరిహారాలకు అంబేడ్కర్కు రుణపడి ఉండాలి. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఆయన ప్రపంచంలోనే అతి గొప్ప సామాజిక సంస్కర్తగా ఎదిగారు’’ అంటూ కొనియాడారు. -
కూతుళ్లతో సుప్రీం కోర్టుకు సీజేఐ
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ శుక్రవారం సుప్రీం కోర్టు హాలులో లాయర్లందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. దివ్యాంగులైన తన ఇద్దరు పెంపుడు కూతుళ్లను ఆయన న్యాయస్థానానికి తీసుకువచ్చారు. విజిటర్స్ గ్యాలరీ గుండా వారిద్దరినీ ఫస్ట్కోర్ట్కు తీసుకువచ్చారు. తను కూర్చునే చాంబర్ను చూపించారు. ఇతర జడ్జీలు కూర్చుని ఉండే చోటును, లాయర్లు వాదించే సమయంలో ఎక్కడి ఉండేదీ వారికి చెబుతూ.. కోర్టు పని విధానాన్ని వివరించారు. కూతుళ్లను వారి కోరిక మేరకు సీజేఐ తీసుకువచ్చారని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. వచ్చిన అతిథులను చూసి న్యాయవాదులంతా ఆశ్చర్యానికి గురయ్యారని పేర్కొన్నాయి. ఇదీ చదవండి: Haldwani Eviction: సుప్రీంకోర్టు కీలక ఆదేశం.. 50వేల మందికి ఊరట.. ఎవరు వీరు? ఎక్కడి వాళ్లు? -
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్తో సీఎం భేటీ
-
సీజేఐతో సీఎం వైఎస్ జగన్ భేటీ
-
సుప్రీంకోర్టుకు శీతాకాల సెలవులు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు డిసెంబర్ 17 నుంచి వచ్చే జనవరి ఒకటో తేదీ దాకా శీతాకాల సెలవులని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనాలేవీ పనిచేయవని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టుకు రోజుల తరబడి సెలవులు న్యాయార్థులకు ఏమాత్రం సౌకర్యవంతంగా లేదని ప్రజలు భావిస్తున్నారంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు గురువారం రాజ్యసభలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో సీజేఐ తాజా నిర్ణయం వెలువరించడం గమనార్హం. ఇదీ చదవండి: వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడేందుకే... మేమున్నది: సుప్రీంకోర్టు -
వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడేందుకే... మేమున్నది: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘అది రాజ్యాంగమే గుర్తించిన అత్యంత అమూల్యమైన, విస్మరించేందుకు వీల్లేని హక్కు. దానికి విఘాతం కలిగిందంటూ వచ్చే విన్నపాలను ఆలకించడం మా రాజ్యాంగపరమైన విధి. అది మా బాధ్యత కూడా’’ అని స్పష్టం చేసింది. యూపీకి చెందిన ఓ వ్యక్తికి రాష్ట్ర విద్యుత్ శాఖ పరికరాలు దొంగిలించిన కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహలతో కూడిన ధర్మాసనం విచారించింది. నిందితునికి 18 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. 9 అభియోగాల్లో ఒక్కోదానికి రెండేళ్ల చొప్పున అతనికి విధించిన జైలు శిక్షను మొత్తంగా రెండేళ్లకు కుదించింది. ‘‘వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విన్నపాలను ఆలకించి న్యాయం చేయని పక్షంలో మేమిక్కడ కూర్చుని ఇంకేం చేస్తున్నట్టు? మేమున్నదే అలాంటి పిటిషనర్ల ఆక్రందనను విని ఆదుకునేందుకు! అలాంటి కేసులను విచారణకు స్వీకరించకపోవడమంటే న్యాయ ప్రక్రియకు తీవ్ర విఘాతం కలిగించడమే. చూసేందుకు అప్రాధాన్యమైనవిగా కనిపించే ఇలాంటి చిన్న కేసుల విచారణ సమయంలోనే న్యాయ, రాజ్యాంగపరమైన కీలక ప్రశ్నలు, అంశాలు తెరపైకి వస్తుంటాయి. సుప్రీంకోర్టు చరిత్రే ఇందుకు రుజువు. పౌరుల స్వేచ్ఛను కాపాడేందుకు సుప్రీంకోర్టు జోక్యానికి ఆర్టికల్ 136లో పేర్కొన్న రాజ్యాంగ సూత్రాలే స్ఫూర్తి’’ అంటూ సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అందుకే ఏ కేసు కూడా సుప్రీంకోర్టు విచారించకూడనంత చిన్నది కాదు, కాబోదు’’ అని స్పష్టం చేశారు. పెండింగ్ కేసులు కొండంత పేరుకుపోయిన నేపథ్యంలో చిన్నాచితకా బెయిల్ దరఖాస్తులు, పసలేని ప్రజాప్రయోజన వ్యాజ్యాల వంటివాటిని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించొద్దని కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రిజిజు రెండు రోజుల క్రితం అభిప్రాయపడటం తెలిసిందే. అంతేగాక కొలీజియం వ్యవస్థ విషయంలో కేంద్రానికి, సుప్రీంకోర్టు మధ్య కొంతకాలంగా ఉప్పూనిప్పు మాదిరి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సీజేఐ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
సుప్రీం జడ్జీలుగా ఐదుగురికి పదోన్నతి
న్యూఢిల్లీ: పేరుకుపోతున్న కేసుల సత్వర పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానం మరో ముందడుగు వేసింది. ఐదుగురు హైకోర్టు జడ్జీలను సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అంతకుముందు ఢిల్లీలో మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమైంది. ఆ తర్వాత సంబంధిత జడ్జీల పేర్ల జాబితాను కేంద్రానికి పంపింది. ఈ వివరాలను సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో పొందుపరిచింది. రాజస్తాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ పంకజ్ మిట్టల్, పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్, మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్, పట్నా హైకోర్టులో మరో జడ్జి జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ మనోజ్ మిశ్రాలను సుప్రీంకోర్టులో జడ్జీలుగా ఎంపికచేయాలంటూ కేంద్రానికి సిఫార్సుచేసింది. ఈ సిఫార్సులకు కేంద్రం ఆమోదముద్ర వేస్తే సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 33కు పెరుగుతుంది. మరోవైపు, ఉత్తరాఖండ్ హైకోర్టులో జడ్జి జస్టిస్ సంజయకుమార్ మిశ్రాను జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, గువాహటి హైకోర్టు జడ్జి ఎన్ కోటీశ్వర్ సింగ్ను జమ్మూకశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.వినోద్ చంద్రన్ను గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుచేసింది. -
చిన్నారులపై లైంగిక వేధింపులు.. తీవ్రమైన సమస్య: సీజేఐ
న్యూఢిల్లీ: చిన్నారులపై కొనసాగుతున్న లైంగిక వేధింపులపై సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులపై లైంగిక నేరాల నిరోధక చట్టం(పోక్సో)పై ఢిల్లీలో రెండు రోజుల జాతీయ సదస్సులో శనివారం పాల్గొన్న సందర్భంగా సీజేఐ చంద్రచూడ్ ప్రసంగించారు. ‘ పిల్లలపై లైంగిక అకృత్యాల అంశం సమాజంలో పెనుసమస్యగా తయారైంది. చిన్నారి లైంగిక హింసకు గురైనప్పుడు ఆ విషయాన్ని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయకుండా బాధిత కుటుంబం మౌనంగా ఉంటున్న సందర్భాలే ఎక్కువ. ఈ సంస్కృతి మారాలి. నిందితుడు సొంత కుటుంబసభ్యుడైనా సరే ఫిర్యాదు చేసేలా బాధిత కుటుంబాల్లో ధైర్యం, చైతన్యం, అవగాహన పెరగాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వాలే ముందుకు రావాలి. బాధిత చిన్నారుల వేదన వెంటనే తీర్చలేని స్థితిలో, తక్షణ న్యాయం చేకూర్చలేని స్థితిలో మన నేర శిక్షాస్మృతి ఉందనేది వాస్తవం. ఆ చిన్నారులకు సత్వర న్యాయం సాధ్యపడాలన్నా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అడ్డుకట్ట వేయాలన్నా న్యాయవ్యవస్థతో కార్యనిర్వాహక వ్యవస్థలు చేతులు కలిపాల్సిందే. చిన్నారులు లైంగిక వేధింపుల బారిన పడకుండా ముందుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అత్యంత ముఖ్యం. పిల్లలను ఎవరైనా తాకినప్పుడు అందులో తప్పుడు ఉద్దేశం ఉందా లేదా అనేది కనిపెట్టే ‘తెలివి’ని పిల్లలకు బోధించాలి. లైంగిక వేధింపుల బారిన పడిన చిన్నారుల తల్లిదండ్రులు.. కుటుంబపరువు పోతుందని మౌనంగా ఉంటున్నారు. ఇలా మౌనంవహిస్తే బాధిత చిన్నారి వర్ణనాతీత వేదన తీరేదెలా? చిన్నారికి న్యాయం దక్కేదెలా ? ఆ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసే స్థాయికి వారిలో ధైర్యం, అవగాహన పెంచాలి. ఇది రాష్ట్రాలు, సమాజంలో సంబంధిత వర్గాల సమిష్టి బాధ్యత’ అని అన్నారు. ‘ కొన్ని రకాల కేసులు న్యాయస్థానాల్లో చూస్తుంటాం. మైనర్లు సమ్మతితో లైంగిక చర్యకు పాల్పడినా.. పోక్సో చట్టంలోని 18 ఏళ్లలోపు వయసు పరిమితి కారణంగా అది నేరమే. 16 ఏళ్లు.. 18 ఏళ్లు.. అనే దానిపై ఎలా తీర్పు ఇవ్వాలనే అంశంలో జడ్జీలు ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేని పరిస్థితి ప్రతిరోజూ ఎన్నో కోర్టుల్లో తలెత్తుతోంది. దీనికి పార్లమెంట్లో చట్ట సవరణ ద్వారా ప్రభుత్వమే సమస్యకు పరిష్కారం కనుగొనాలి’ అని ఆయన అన్నారు. ఇదీ చదవండి: విహారయాత్రలో విషాదం: అనంతపురానికి చెందిన ఫ్యామిలీ మృతి -
మూన్లైటింగ్పై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
ఒకచోట ఉద్యోగం చేస్తూనే రహస్యంగా మరొక ఉద్యోగం కూడా చేస్తుండటాన్ని ‘మూన్లైటింగ్’ అంటారు. అయితే టెక్ కంపెనీల చట్టం ప్రకారం ఒకేసారి రెండేసి ఉద్యోగాలు చేయకూడదన్న నిబంధన ఉంది. ఆ నిబంధనను ఉల్లంఘించారన్న కారణంతోనే విప్రో 300 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. ఆ తొలగింపులే ఐటీ రంగంలో ప్రకంపనలు పుట్టించి, ఆ ఐటీ దిగ్గజం చేసిన పని సమంజసమేనా అనే చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో భారత నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ మూన్లైటింగ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వారం సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన సీజేఐ చంద్రచూడ్ మూన్లైటింగ్పై స్పందించారు. తాను ఆల్ ఇండియా రేడియో(ఏఐఆర్)లో రేడియో జాకీగా పనిచేసే సమయంలో మూన్లైటింగ్కు పాల్పడినట్లు తెలిపారు. ఓవైపు లాయర్గా పనిచేస్తూనే ఏఐఆర్లో ‘ప్లే ఇట్ కూల్, ఏ డేట్ విత్ యూ, సండే రిక్వెస్ట్’ అనే షోస్గా వ్యవహరించినట్లు ఓ సమావేశంలో చెప్పారు. ఆ వీడియోని బార్ అండ్ బెంచ్ ట్విటర్ పేజీలో పోస్ట్ చేసింది. అదనపు ఆదాయం కోసం సంస్థలో పనిచేస్తూ..మరో సంస్థలో మరో జాబ్ చేయడానికి మూన్లైటింగ్ అంటారు?. అయితే కాన్ఫరెన్స్లో సీజేఐ మాట్లాడుతూ..అప్పట్లో దీని గురించి (మూన్లైటింగ్) చాలా మందికి తెలియదు. నా 20 ఏళ్ల వయసులో నేను మూన్లైటింగ్ చేశా. రేడియో జాకీగా పైన పేర్కొన్న ప్రోగ్రామ్స్ చేసినట్లు తెలిపారు.‘ఈ సందర్భంగా తన అభిరుచిల్ని బయటపెట్టారు.నేటికీ సంగీతంపై నాకున్న అభిమానం కొనసాగుతోంది. అందుకే ప్రతిరోజూ న్యాయ విధులు నిర్వహిస్తూనే..ఇంటికి వెళ్లి మ్యూజిక్ వింటున్నట్లు వెల్లడించారు. మూన్లైటింగ్ అంటే మోసం చేయడమే ఇటీవల మనదేశంలో పలు కంపెనీలు మూన్లైటింగ్ను వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్లో ఐటీ కంపెనీ హ్యాపిహెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ రెండో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది. విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్జీ ట్విటర్లో మూన్లైటింగ్ అంటే సంస్థల్ని మోసం చేయడంతో సమానమేనని అన్నారు. అప్పటి నుంచి దేశీయ ఐటీ పరిశ్రమలో మూన్లైటింగ్ చర్చంశనీయంగా మారింది. Did you know CJI DY Chandrachud moonlighted as a RADIO JOCKEY in his early 20's - Do listen to him#SupremeCourt #SupremeCourtofIndia #cjichandrachud Video Credit - BCI pic.twitter.com/EdvRqntXST — Bar & Bench (@barandbench) December 4, 2022 చదవండి👉 ‘మీ ఉద్యోగం పోయింది కదా..మీకెలా అనిపిస్తుంది?’ -
సీజేఐ సమక్షంలో.. ఉపరాష్ట్రపతి తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిపాదించిన జాతీయ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్జేఏసీ)ని సుప్రీం కోర్టు రద్దు చేయడంపై దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తీవ్రంగా స్పందించారు. ఎన్జేఏసీ సుప్రీం కోర్టు కొట్టివేసిన తర్వాత పార్లమెంటులో ఎటువంటి చర్చ లేదని, ఇది చాలా తీవ్రమైన సమస్య అని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సమక్షంలోనే ఉపరాష్ట్రపతి ధన్కర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పార్లమెంట్ ఒక చట్టం చేసిందంటే.. అది ప్రజల ఆకాంక్ష మేరకే ఉండి ఉంటుంది. అది ప్రజల శక్తి. అలాంటి దానిని సుప్రీం కోర్టు దానిని రద్దు చేసింది. ఇలాంటి ఉదాహరణ ప్రపంచానికి తెలియదంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారాయన. రాజ్యాంగంలోని నిబంధనలను ఉటంకించిన ఆయన.. చట్టం పరిధిలో ముఖ్యమైన ప్రశ్న ఇమిడి ఉన్నప్పుడు, సమస్యను కోర్టులు పరిశీలించవచ్చని అన్నారు. అయితే.. నిబంధనను రద్దు చేయవచ్చని ఎక్కడా చెప్పలేదు అంటూ పేర్కొన్నారాయన. ఆ సమయంలో రాజ్యాంగ పీఠికను సైతం ప్రస్తావించారు. ఎన్జేఏసీ చట్టం.. లోక్సభ, రాజ్యసభ రెండు సభల్లోనూ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా వోటింగ్ ద్వారా ఆమోదం పొందిందని ధన్కర్ గుర్తు చేశారు. పార్లమెంటు రాజ్యాంగ సవరణ చట్టంతో వ్యవహరించింది. రికార్డు విషయంగా మొత్తం లోక్సభ ఏకగ్రీవంగా ఓటు వేసింది. రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. మేధావులను, న్యాయవేత్తలను కోరేది ఒక్కటే. దయచేసి.. రాజ్యాంగ నిబంధనను రద్దు చేయగల ఈ ప్రపంచంలో.. ఒక సమాంతరాన్ని కనుగొనండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థను రద్దు చేసేందుకు ఉద్దేశించిన ఎన్జేఏసీ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న సుప్రీంకోర్టు.. దానిని కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26వ తేదీన ఉప రాష్ట్రపతి ధన్కర్ దాదాపుగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు కూడా. -
Constitution Day: ప్రాథమిక విధులే ప్రాథమ్యం
న్యూఢిల్లీ: ప్రాథమిక విధుల నిర్వహణే పౌరుల ప్రథమ ప్రాథమ్యంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అప్పుడే దేశం ఉన్నత శిఖరాలకు చేరుతుందన్నారు. వాటిని పూర్తి అంకితభావంతో, చిత్తశుద్ధితో పాటించాలని పిలుపునిచ్చారు. నాడు గాంధీ మహాత్ముడు కూడా ఈ మేరకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం సుప్రీంకోర్టులో జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. అన్ని రంగాల్లోనూ వృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతున్న భారత్వైపే ప్రపంచమంతా చూస్తోందన్నారు. వచ్చే ఏడాది జీ 20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్షత వహించనుండటాన్ని ప్రపంచ శ్రేయస్సులో మన పాత్రను అందరి ముందుంచేందుకు అతి గొప్ప అవకాశంగా అభివర్ణించారు. ‘‘ప్రపంచం దృష్టిలో దేశ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు మనమంతా కలసికట్టుగా కృషి చేయాలి. ఇది మనందరి బాధ్యత. కేంద్రం అనుసరిస్తున్న ప్రజానుకూల విధానాలు పేదలను, మహిళలను సాధికారత దిశగా నడుపుతున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రాచీనకాలం నుంచి వస్తున్న విలువలను కొనసాగిస్తూ ప్రజాస్వామ్యానికి మాతృకగా భారత్ అలరారుతోంది. ఈ గుర్తింపును మరింత బలోపేతం చేయాలి’’ అని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రానంతరపు కాలంలో జాతి సాంస్కృతిక, నైతిక భావోద్వేగాలన్నింటినీ మన రాజ్యాంగం అద్భుతంగా అందిపుచ్చుకుందని కొనియాడారు. స్వతంత్ర దేశంగా భారత్ ఎలా మనుగడ సాగిస్తుందోనన్న తొలినాటి అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ భిన్నత్వమే అతి గొప్ప సంపదగా అద్భుత ప్రగతి సాధిస్తూ సాగుతోందన్నారు. ‘‘వందేళ్ల స్వతంత్ర ప్రస్థానం దిశగా భారత్ వడివడిగా సాగుతోంది. ఇప్పటిదాకా నడిచింది అమృత కాలమైతే రాబోయే పాతికేళ్లను కర్తవ్య కాలంగా నిర్దేశించుకుందాం. ప్రాథమిక విధులను పరిపూర్ణంగా పాటిద్దాం. రాజ్యాంగంతో పాటు అన్ని వ్యవస్థల భవిష్యత్తూ దేశ యువతపైనే ఆధారపడి ఉంది. రాజ్యాంగంపై వారిలో మరింత అవగాహన పెంచాల్సిన అవసరముంది. అప్పుడే సమానత్వం, సాధికారత వంటి ఉన్నత లక్ష్యాలను వారు మరింతగా అర్థం చేసుకుని ఆచరిస్తారు’’ అని చెప్పారు. రాజ్యాంగ పరిషత్తులో మహిళా సభ్యుల పాత్రకు తగిన గుర్తింపు దక్కలేదని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘అందులో 15 మంది మహిళలుండేవారు. వారిలో ఒకరైన దాక్షాయణీ వేలాయుధన్ అణగారిన వర్గాల నుంచి వచ్చిన మహిళామణి’’ అని గుర్తు చేశారు. దళితులు, కార్మికులకు సంబంధించి పలు ముఖ్యమైన అంశాలు రాజ్యాంగంలో చోటుచేసుకునేలా ఆమె కృషి చేశారన్నారు. 26/11 మృతులకు నివాళి 2008 నవంబర్ 26న ముంబైపై ఉగ్ర దాడికి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వాటిలో అసువులు బాసిన వారిని మోదీ గుర్తు చేసుకున్నారు. వారికి ఘనంగా నివాళులర్పించారు. ఇ–కోర్టు ప్రాజెక్టులో భాగంగా తీసుకొచ్చిన వర్చువల్ జస్టిస్ క్లాక్, జస్ట్ఈజ్ మొబైల్ యాప్ 2.0, డిజిటల్ కోర్ట్, ఎస్3వాస్ వంటి సైట్లు తదితరాలను ప్రారంభించారు. వీటిద్వారా కక్షిదారులు, లాయర్లు, న్యాయవ్యవస్థతో సంబంధమున్న వారికి టెక్నాలజీ ఆధారిత సేవలందించేందుకు వీలు కలగనుంది. వేడుకల్లో కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
సుప్రీంకోర్టు ఆర్టీఐ పోర్టల్ ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు గురువారం సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)పోర్టల్ను ప్రారంభించింది. ‘‘సుప్రీంకోర్టు ఆర్టీఐ పోర్టల్ సిద్ధమైంది. ఒక వేళ ఏమైనా సమస్యలు ఉంటే సరిచేస్తాం’’అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్టీఐ దరఖాస్తుల ఫీజును ఇంటర్నెట్ బ్యాంకింగ్, మాస్టర్/వీసా క్రెడిట్ డెబిట్ కార్డు లేదా యూపీఐ ద్వారా చెల్లించొచ్చు. దరఖాస్తు ఖరీదు రూ.10. భారతీయ పౌరులు మాత్రమే దీనిని వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. మరోవైపు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అపారమైన పని భారంతో సతమతమవుతున్నారని ఓ కేసు విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. వచ్చే వారంలో 13 బెంచ్ల ముందు 525 అంశాలు జాబితా చేయాల్సి ఉందని సీజేఐ వ్యాఖ్యానించారు. ‘‘న్యాయమూర్తులు ఒత్తిడికి లోనవుతున్నారనే విషయాన్ని నమ్మాలి. ప్రతి బెంచ్ ముందు సుమారు 45 నుంచి 50 కేసులు ఉంటున్నాయి’’అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. -
సామాన్యుడి కోసం ధర్మపీఠం
సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల తన ప్రమాణ స్వీకారంలో జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నిర్మొహమాటంగా చేసిన ఒక ప్రకటన దేశ ప్రజల్లో ఆశలు రేకెత్తించేదిగా ఉంది. పాలక విధానాల ఫలితంగా దేశం నేడు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా దేశ దిశాగతిని మార్చడానికి తోడ్పడగల నిర్ణయాలు చేసే అవకాశం తన స్థాయిలో ఉందని ఆ ప్రకటన ద్వారా ఆయన సూచనప్రాయమైన భరోసాను ఇచ్చారు. తన ఎదుగుదలలో గాంధీ, నెహ్రూల ప్రజాస్వామ్య భావాల ప్రభావమే గాక కారల్ మార్క్స్ రూపొందించిన ప్రపంచ ప్రసిద్ధ మేనిఫెస్టో ప్రభావం కూడా ఉండి ఉండవచ్చునని అనిపిస్తోంది! కనుకనే చంద్రచూడ్ ‘సామాన్య పౌరుల ప్రయోజనాల పరిరక్షణే’ తన ధ్యేయంగా బాహాటంగా ప్రకటించుకోగలిగారు. ‘‘పేదసాదల కోసం మా ప్రభుత్వం అన్నీ చేస్తోందని మన పాలకులు చెప్పుకోవచ్చు గాక. కానీ అలాంటి ‘కోతలు’ బ్రిటిష్ పాలకులు కూడా కోస్తూండేవారు. కానీ అసలు నిజం – పేదల ప్రయోజనాలు మాత్రం స్వతంత్ర భారత ప్రభుత్వం కూడా నెరవేర్చడం లేదు. ఈ సత్యాన్ని మన పాలకులు హుందాగా అణకువతో ఒప్పుకుని తీరాలి’’ – మహాత్మాగాంధీ (1947 డిసెంబర్) ‘‘వెయ్యిన్నొక్క కత్తుల కన్నా ప్రజాభిప్రాయం అనేది అత్యంత బలమైన ఆయుధం. హైందవాన్ని క్షుద్ర పూజాదికాలతో రక్షించు కోలేము. పరాయి పాలన నుంచి విముక్తి పొందిన దేశం మనది. ఈ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కంటికి పాపలా కాపాడుకోవాలి. ఎలా? నీలో మానవత్వం, ధైర్య సాహసాలు, నిరంతర జాగరూకత ఉన్నప్పుడే నీ ధర్మం నీవు నెరవేర్చగలుగుతావు. ఈ అప్రమత్తత మనలో కొరవడిన నాడు, మనం అత్యంత ప్రేమతో సాధించుకున్న స్వాతంత్య్రం కాస్తా చేజారిపోతుంది. కానీ దురదృష్టవశాత్తూ దేశంలో ప్రస్తుత అశాంతికి అంతటికీ కొందరు కారణమని వింటున్నాను. భారత దేశం హిందువులకు ఎంతగా పుట్టినిల్లో, ముస్లిములకూ అంతే పుట్టినిల్లు అని మరచిపోరాదు. అలాగే ఎవరికి వారు తమ మతమే గొప్పదనీ, అదే నిజమైనదనీ భావించడం తప్పు. ఈ భావననే చిన్నప్పటి నుంచీ పిల్లల్లో కూడా నూరిపోయడం వల్ల అదే నిజమన్న ధోరణిని వారిలో పెంచిన వారవుతున్నారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకునేదే నిజమైన ప్రజా ప్రభుత్వం. ప్రజల దారిద్య్రాన్ని, నిరుద్యోగ పరిస్థితిని పట్టించుకోని పాలకులు ఒక్క రోజు కూడా అధికారంలో ఉండటానికి వీలు లేదు’’. – మహాత్మాగాంధీ (అదే ఏడాది మరొక సందర్భంలో) ‘‘దేశం కోసమే నా తపన అంతా. 365 రోజులూ పని చేస్తున్నా. నేను పునాది రాయి వేసిన ప్రాజెక్టులను నేనే ప్రారంభిస్తున్నా. ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం’’. – ప్రధాని నరేంద్రమోదీ (19.11.2022) ‘దేశం కోసమే నా తపనంతా..’ అనేంతగా ‘ఆత్మవిశ్వాసం’ కొంద రిలో పెల్లుబికి వస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సందర్భంగా ఆయన నిర్మొహమాటంగా చేసిన ఒక ప్రకటన దేశ ప్రజల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని ఆలోచింపజేసేదిగా ఉంది. జస్టిస్ చంద్రచూడ్ 2024 నవంబర్ 10 వరకు ఆ పదవిలో ఉంటారు. ఆ లోపుగా.. దేశం నేడు పాలక విధానాల వల్ల ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా దేశ దిశాగతిని మార్చడానికి ఆయన తన స్థాయిలో తోడ్పడగల నిర్ణయాలు చేసే అవకాశం ఉంది. ఆయన ప్రకటన సూచన ప్రాయంగా అదే తెలియజేస్తోంది. రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన భరోసాను పాలకవర్గాలు హరించేస్తున్న సమయంలో చంద్ర చూడ్.. ‘ఆధార్’ పత్రం పేరిట పాలకులు పౌరహక్కుల్ని కత్తిరించడానికి చేస్తున్న ప్రయత్నాలను ఏనాడో ఎదుర్కొని అడ్డుకట్ట వేశారు. ‘ఆధార్’ కార్డు పేరిట పౌరులకు ప్రశ్నించే హక్కును హరించడం ఎలా సాధ్యమో ఆయన నిరూపించారు. ‘ఆధార్’ కార్డు చెల్లుతుందంటూ ధర్మాసనంలోని మిగతా నలుగురు సభ్యులు మెజారిటీతో నిర్ణయిం చగా, అది ఎలా రాజ్యాంగ విరుద్ధమో నిరూపించి నెగ్గుకొచ్చిన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్! కనుకనే ఇప్పుడు దేశ ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్ పదవీ స్వీకారం చేసిన రోజున కూడా ‘సామాన్యుల సేవే తన తొలి ప్రాధాన్యమని’ ప్రకటించారు. ఆ ప్రకట నలో ఆయన పాలకులకు చేదోడువాదోడుగా ఉపయోగపడే ‘సీల్డ్ కవర్’ తతంగానికి కోర్టులు స్వస్తి చెప్పించాలని కూడా సూచించారు. న్యాయ వ్యవస్థపై కూడా ప్రజల నమ్మకం సడలిపోతున్న సమయంలో ఆయన ఇస్తున్న భరోసా నమ్మకాన్ని కలిగిస్తోంది. చంద్రచూడ్ ఎదుగుదలలో గాంధీ, నెహ్రూల ప్రజాస్వామ్య భావాల ప్రభావమే గాక వర్గరహిత సామాజిక వ్యవస్థ ప్రతిష్ఠాపన లక్ష్యంగా ప్రపంచ శ్రమజీవుల ప్రయోజనాల రక్షణకు కారల్ మార్క్స్ రూపొందించిన ప్రపంచ ప్రసిద్ధ మేనిఫెస్టో ప్రభావం కూడా ఉండి ఉండవచ్చు! కనుకనే చంద్రచూడ్ ‘ప్రతి అంశంలోనూ సామాన్య పౌరుల ప్రయోజనాల పరిరక్షణే’ తన ధ్యేయంగా బాహాటంగా ప్రక టించుకోగలిగారు. ఎలాగంటే ధనికవర్గంలో జన్మించిన ఫ్రెంచి మహా రచయిత బాల్జాక్ ఫ్రెంచి సామాజిక పరిణామ క్రమాన్నే సామాన్య ప్రజల ప్రయోజనాల రక్షణ కోసం మార్చేసిన వాడు. అందుకే మార్క్స్ అతణ్ణి సమాజ వాస్తవిక పరిస్థితులకు అద్దంపట్టిన మహా రచయితగా వర్ణించాడు. ధనిక, పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలు క్రమంగా ఏ దారుణ పరిస్థితుల వైపుగా సామాజిక వ్యవస్థల్ని నడిపిస్తాయో తన రచనల ద్వారా ధనికుడైన బాల్జాక్ వర్ణించడాన్ని మార్క్స్ ప్రశంసించాడు. అంతేగాదు, ధనిక వర్గ నాగరికతకూ, దాని అధీనంలో జరిగే నేరాలకూ మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయో కూడా మార్క్స్ అనేక సదృశాలతో నిరూపించాడు. అలాంటి ధనిక వర్గ సమాజాల్లో ‘ఎవరికివారే యమునాతీరే’గా ప్రజావసరాలతో నిమిత్తం లేకుండా జరిగే వస్తూత్పత్తి లాగానే నేరగాళ్లు వరుసగా నేరాలు సృష్టిస్తుంటారు. వాటితోపాటు నేర చట్టానికి దోహదం చేస్తారు. ఈ క్రమంలోనే నేర చట్టాన్ని గురించి ప్రొఫెసర్ గారు ఉపన్యాసాలు దంచేయడానికి ముందుకొస్తారు. ఆ తర్వాత ఆ ఉపన్యాసాలన్నింటినీ సంకలనం చేసుకుని ఓ గ్రంథం సిద్ధం చేసుకుని దాన్ని జనరల్ మార్కెట్లోకి ఓ ప్రత్యేక వస్తువు(కమాడిటీ)గా విడుదల చేస్తాడు. అమ్మి సొమ్ము చేసుకుంటాడు! అంతేనా, అలాంటి సమాజంలోని నేరగాడు మొత్తం పోలీస్ వ్యవస్థ సృష్టికి, తద్వారా క్రిమినల్ జస్టిస్, ఆ పిమ్మట జడ్జీలు, ఉరి తీసే తలార్లు, ఆ పిమ్మట జ్యూరీ వ్యవస్థ వగైరాల ఏర్పాటుకు కారణమౌతాడు. అటుపైన ‘తాటి తోనే దబ్బనం’ అన్నట్టుగా చిత్రహింసలు మొదలై, ఆ హింసాకాండ నిర్వహణకు గానూ అందుకు తగిన వృత్తి నిపుణుల సృష్టి అవసరం అవుతుంది (ఇలాంటివారు అవసరం అవబట్టే రా.వి. శాస్త్రి ‘సారో కథలు’, ‘సారా కథలూ’ రాయాల్సి వచ్చింది). అందుకే మార్క్స్ అంటాడు: ‘‘శ్రామిక వర్గాలు, సంపన్న వర్గాలు భిన్న ధ్రువాలు. రెండూ ప్రైవేట్ ఆస్తుల సృష్టి కారకులే!’’ అని. అందువల్ల ఈ రెండు ఒకే నాణేనికి రెండు ముఖాలని సరిపెట్టుకుంటే చాలదు. ప్రైవేట్ ఆస్తి ప్రత్యేక సంపదగా తనకు తాను రక్షించుకొనక తప్పదు, అలాగే శ్రామిక జీవులూ తమను తాము రక్షించుకొనక తప్పదు. కనుకనే వారిది అమానుషమైన దుఃస్థితి. ఈ స్థితిలోనే ప్రైవేట్ ఆస్తిపరుడు స్వార్థపరుడు అవుతాడు, కాగా తన అమానుష మైన దుఃస్థితిని వదిలించు కోవాలనుకున్న శ్రమజీవి సమాజానికి శత్రువుగా కన్పిస్తాడు. కనుకనే శ్రమజీవిని దోచుకోవడంపై ఆధార పడిన ప్రైవేట్ ఆస్తి రద్దు అయితేనే శ్రమజీవులకు బతుకు. అయితే అసమ సమాజ వ్యవస్థలోని అమానుష జీవన పరిస్థితులు రద్దు కాకుండా మాత్రం శ్రామికులకు శాశ్వత విమోచనం దుర్లభమని మార్క్స్–ఎంగెల్స్లు నిరూపించారు (కలెక్టెడ్ వర్క్స్: వాల్యూమ్ 4). అందువల్ల జస్టిస్ చంద్రచూడ్ను ‘న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకం కొనసాగేలా మీరు ఏం చర్యలు తీసుకొంటారన్న’ ప్రశ్నకు ‘చేతల్లోనే చూపిస్తానని’ భరోసా ఇచ్చారు. అంతవరకూ ప్రజల అస మ్మతిని ప్రజాస్వామ్యం మనుగడకు రక్షణ కవచంగా ప్రధాన న్యాయ మూర్తి సుప్రీంకోర్టును నిరంతరం తీర్చిదిద్దగలరని ఆశిద్దాం. సామా న్యుడికే తన ‘పెద్ద పీట’ అని చాటిన చంద్రచూడ్ దేశ దిశాగతిని తీర్చి దిద్దేందుకు తనకు సంక్రమించిన అనితరసాధ్యమైన అవకాశాన్ని 2024 ఎన్నికల సంవత్సరాని కన్నా ముందస్తుగానే తగినట్టుగా ఉపయోగించుకోగలరని ఆశిద్దాం! ఏబీకే ప్రసాద్,సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
సామాన్యుడికే పెద్దపీట: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
సాక్షి, న్యూఢిల్లీ: సామాన్యుల సేవే తన తొలి ప్రాథమ్యమని భారత నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ (62) పేర్కొన్నారు. ‘‘టెక్నాలజీ కావచ్చు, న్యాయ సంస్కరణలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ప్రతి అంశంలోనూ సామాన్య పౌరుల ప్రయోజనాల పరిరక్షణకే అగ్రతాంబూలమిస్తా’’ అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. మంగళవారం సీజేఐగా రిటైరైన జస్టిస్ యు.యు.లలిత్ నుంచి జస్టిస్ చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించారు. దైవసాక్షిగా ఆంగ్లంలో ప్రమాణం చేశారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, హర్దీప్సింగ్ పురి, కిరణ్ రిజుజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం భార్య కల్పనా దాస్తో కలిసి నూతన సీజేఐ సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. కోర్టు ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేశ న్యాయ వ్యవస్థకు సారథ్యం వహించడం గొప్ప అవకాశం, బాధ్యత అని అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకం కొనసాగేలా ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా చేతల్లో చూపిస్తానని బదులిచ్చారు. జస్టిస్ చంద్రచూడ్ 2024 నవంబరు 10 దాకా రెండేళ్లపాటు సీజేఐగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 16వ సీజేఐగా చేసిన ఆయన తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ 1978 నుంచి 1985 దాకా ఏకంగా ఏడేళ్ల పాటు ఆ పదవిలో ఉండటం విశేషం. అత్యధిక కాలం సీజేఐగా ఉన్న రికార్డు ఆయనదే. తర్వాత 44 ఏళ్లకు ఆయన కుమారుడు చంద్రచూడ్ సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. తండ్రి కుమారులిద్దరూ సీజేఐ కావడం దేశంలో ఇదే తొలిసారి. జస్టిస్ చంద్రచూడ్ను ప్రధాని నరేంద్ర మోదీ, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అభినందించారు. ఆయన పదవీకాలం ఫలవంతంగా సాగాలంటూ వారిద్దరూ ట్వీట్ చేశారు. జస్టిస్ చంద్రచూడ్ 1959 నవంబర్ 11న జన్మించారు. బీఏ ఆనర్స్ (ఎకనామిక్స్) అనంతరం ఢిల్లీ వర్సిటీ నుంచి ఎల్ఎల్బీ చేశారు. అమెరికాలోని హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్ఎల్ఎం, డాక్టరేట్ ఇన్ జ్యూరిడికల్ సైన్సెస్ (ఎస్జేడీ) చేశారు. ఆయన ప్రస్థానం 1998లో బాంబే హైకోర్టులో సీనియర్ అడ్వకేట్గా మొదలైంది. బాంబే హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ ప్రాక్టీస్ చేశారు. అదే ఏడాది అదనపు సొలిసిటర్ జనరల్గా నియమితులయ్యారు. 2013 నుంచి మూడేళ్లపాటు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. 2016 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. చరిత్రాత్మక తీర్పులు అయోధ్య భూ వివాదం, వ్యక్తిగత గోప్యత హక్కు, శబరిమలకు రుతుక్రమ మహిళల ప్రవేశం, అవివాహితలకూ 24 వారాల దాకా అబార్షన్ హక్కు తదితర కేసుల్లో చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు. ఆర్మీలో మహిళా ఆఫీసర్లకు పర్మినెంట్ కమిషన్, కమాండ్పోస్టింగులు ఇవ్వాల్సిందేనని ఆయన సారథ్యంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇటీవల జస్టిస్ యు.యు.లలిత్ హయాంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో కొలీజియం సభ్యుల అభిప్రాయాల సేకరణకు సర్క్యులేషన్లు జారీ చేసే పద్ధతిని వ్యతిరేకించిన ఇద్దరు న్యాయమూర్తుల్లో ఆయన ఒకరు. అసమ్మతిని స్వాగతిస్తారు అసమ్మతిని ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంగా జస్టిస్ చంద్రచూడ్ అభివర్ణిస్తుంటారు. ఆధార్ చెల్లుబాటును ఆయన చాలా గట్టిగా వ్యతిరేకించిన తీరు చాలాకాలం పాటు వార్తల్లో నిలిచింది. ఆధార్ చెల్లుతుందంటూ ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో మిగతా నలుగురు వెలువరించిన తీర్పుతో తీవ్రంగా విభేదించారు. యునిక్ బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్య రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. న్యాయప్రక్రియను డిజిటైజ్ చేయడంలోనూ ఆయనది కీలకపాత్ర. ప్రగతిశీల భావాలున్న న్యాయమూర్తి అని, ఏ అంశం మీదైనా స్పష్టమైన భావాలు కలిగి ఉంటారని, వాటిని అంతే సూటిగా వ్యక్తీకరిస్తారని పేరు. తొలి రోజు ఇలా... బుధవారం బాధ్యతలు స్వీకరించాక మధ్యాహ్న వేళ జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టులోని సీజేఐ కోర్టు గదిలోకి ప్రవేశించారు. ‘‘ప్రమాణ స్వీకారం ఉన్న కారణంగా బహుశా నా కెరీర్లో తొలిసారి ఆలస్యంగా విధులకు వచ్చాను. మళ్లీ ఇలా జరగదనుకుంటున్నా. ఇంతసేపూ లాయర్లు తదితరులందరినీ వేచిచూసేలా చేసినందుకు క్షమాపణలు చెబుతున్నా’’ అన్నారు. వాదనలు, కేసుల నిర్వహణల్లో లాయర్లపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండేలా చూస్తానన్నారు. భవిష్యత్తులో కూడా బార్ సహకారం కొనసాగాలని కోరారు. సహచర న్యాయమూర్తులు జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ జేబీ పార్డీవాలాతో కలిసి విచారణలు ప్రారంభించారు. సమాజ్వాదీ ఎమ్మెల్యే ఆజం ఖాన్ అనర్హత కేసు సహా తొలి రోజు సీజేఐ ధర్మాసనం ముందు 30 ప్రస్తావనలు జరిగాయి. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితర న్యాయవాదులు సీజేఐకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రెండేళ్ల పదవీకాలం ఫలవతంగా సాగాలని ఆకాంక్షించారు. ఇదీ చదవండి: సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్.. దేశ చరిత్రలో తండ్రీకొడుకులిద్దరూ.. -
ఒక్కరోజు ముందుగానే.. సీజేఐ వీడ్కోలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ నే తృత్వంలోని ప్రధాన ధర్మాసనం జరిపే చివరి సారి విచారణ ప్రత్యక్ష ప్రసారం కానుంది. జస్టిస్ లలిత్ మంగళవారం పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే.. గురునానక్ జయంతి సందర్భంగా సుప్రీంకోర్టుకు సెలవుదినం. ఈ నేపథ్యంలో జస్టిస్ లలిత్, కాబోయే సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం.త్రివేదీలతో కూడిన ధర్మాసనం సోమవారం జరిపే లాంఛన విచారణను తమ వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ చేయాలని కోర్టు నిర్ణయించింది. రిటైరయ్యే సీజేఐ చివరి విచారణను తన వారసునితో కలిసి చేపట్టడం ఆనవాయితీ. కేంద్ర ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై దాఖలైన పిటిషన్లపై సీజేఐ ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించనుంది. ఆగస్టు 26న సీజేఐగా రిటైరైన జస్టిస్ ఎన్.వి.రమణ చివరి రోజు చేపట్టిన విచారణను తొలిసారిగా కోర్టు లైవ్ స్ట్రీమ్ చేసింది. ఇదీ చదవండి: హైకోర్టులు అలాంటి ఆదేశాలివ్వొద్దు! -
‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’.. సీజేఐకి దీదీ వినతి
కోల్కతా: ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే దేశం రాష్ట్రపతి పాలన దిశగా వెళ్తుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థను కాపాడాలని భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐకి విజ్ఞప్తి చేశారు. కోల్కతాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జురిడికల్ సైన్స్ కాన్వకేషన్ కార్యక్రమానికి సీజేఐ యూయూ లలిత్ హాజరైన క్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు మమత. ‘ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. వారు ఎవరినైనా దుర్భాషలాడగలరా? వారు ఎవరినైనా నిందించగలరా? సర్, మన గౌరవం దెబ్బతింటోంది. తీర్పు వెలువడేలోపే ఎన్నో జరిగిపోతున్నాయని చెప్పేందుకు చింతిస్తున్నాను. నేను చెప్పేది తప్పు అనుకుంటే, క్షమించండి.’అని పేర్కొన్నారు మమతా బెనర్జీ. ఎన్యూజేఎస్ ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటిగా అభివర్ణించారు దీదీ. ఈ సందర్భంగా సీజేఐ యూయూ లలిత్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇదీ చదవండి: ‘తప్పుచేశా.. క్షమించండి’..గుడిలో చోరీ చేసిన సొత్తు తిరిగిచ్చిన దొంగ -
కొత్త సీజేఐ నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర
న్యూఢిల్లీ: నూతన సీజేఐగా జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ను నియమిస్తూ సంబంధిత ఉత్తర్వుపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం చేశారు. భారత ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ సిఫార్సు తర్వాత సంబంధించి ప్రతిని కేంద్ర న్యాయశాఖ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపగా ఆమె ఆమోదించారని ఆ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు తెలిపారు. నవంబర్ 9న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం చేస్తారని రిజిజు ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అప్పటి నుంచి రెండు సంవత్సరాలపాటు అంటే 2024 నవంబర్ పదో తేదీ దాకా ఆయన సీజేఐగా కొనసాగుతారు. కొత్త సీజేగా నియామకపత్రాన్ని ప్రధాని ప్రధాన సలహాదారు పీకే మిశ్రా, న్యాయశాఖ ఉన్నతాధికారులు స్వయంగా జస్టిస్ చంద్రచూడ్కు అందజేశారు. ప్రస్తుత సీజేఐ లలిత్ కేవలం 74 రోజులే ఆ బాధ్యతల్లో కొనసాగి రిటైర్కానున్నారు. ఇదీ చదవండి: Facebook Live: పోనీయ్.. 300 కి.మీ.లు దాటాలి -
హిజాబ్ తీర్పు: సుప్రీంలో ఊహించని పరిణామం
న్యూఢిల్లీ: కర్ణాటకలో విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించటంపై నిషేధం విధించటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై గురువారం తీర్పు సందర్భంలో.. సుప్రీం కోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు వెలువరించారు. దీంతో సరైన దిశానిర్దేశం కోసం ఈ పిటిషన్లను సీజేఐకి సిఫారసు చేస్తున్నట్లు జస్టిస్ హేమంత్ గుప్తా తెలిపారు. సుమారు పదిరోజులపాటు హిజాబ్ పిటిషన్లపై వాదనలు వినింది ద్విసభ్య న్యాయమూర్తుల ధర్మాసనం. చివరికి.. కర్ణాటక హైకోర్టును తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించగా.. తీర్పును తోసిపుచ్చారు జస్టిస్ సుధాన్షు దులియా. దీంతో ఈ వివాదం సీజేఐకి ముందుకు చేరగా.. మరో బెంచ్ లేదంటే రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యాసంస్థల్లో విద్యార్థుల దుస్తులపై కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. స్కూల్స్, పాఠశాలల్లో హిజాబ్ ధరించకూడదని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హిజాబ్పై నిషేధాన్ని ఎత్తివేయాటనికి నిరాకరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. 10 రోజుల పాటు వాదనలు విన్న జస్టిస్ హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాల ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఇరువురు జడ్జీలు హిజాబ్ నిషేధంపై ఏకాభిప్రాయానికి రాకపోవటం గమనార్హం. ఇదీ చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్ -
సుప్రీంకోర్టు 50 వ ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ చంద్ర చూడ్
-
భారత 50వ సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్
న్యూఢిల్లీ: భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులను మంగళవారం సమావేశపరిచి తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ పేరును ప్రకటించారు సీజేఐ జస్టిస్ యుయు లలిత్. సిఫారసు లేఖను జడ్జీల సమక్షంలో జస్టిస్ డీవై చంద్రచూడ్కు అందించారు. తర్వాత ఆ సిఫారసు లేఖ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ యుయు లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు.దీంతో 74 రోజులు మాత్రమే ఆయన సీజేఐ పదవిలో కొనసాగినట్లవుతుంది. సుప్రీంకోర్టులో ఉన్న అత్యంత సీనియర్ న్యాయమూర్తిని వారసుడిగా పేర్కొంటారు. ప్రస్తుతం ఉన్న వారిలో జస్టిస్ యుయు లలిత్ తర్వాత జస్టిస్ డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నందున ఆయన పేరును ప్రతిపాదించారు. ఇదీ చదవండి: టీఎంసీకి షాక్.. స్కూల్ జాబ్ స్కాం కేసులో ఎమ్మెల్యే అరెస్ట్ -
కొలీజియంలో విభేదాలు!
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త జడ్జీల నియామకప్రక్రియలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మధ్య సర్వామోదం సన్నగిల్లింది. నూతన జడ్జీల ఎంపికకు సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ చేపట్టిన ‘సర్కులేషన్’ పద్ధతిపై కొలీజియంలోని ఇద్దరు జడ్జీలు భిన్న స్వరం వినిపించడం తెలిసిందే. ఆ ఇద్దరి పేర్లను తొలిసారిగా బహిరంగంగా వెల్లడించడం గమనార్హం. 11 మంది నూతన జడ్జీల నియామకం కోసం సెప్టెంబర్ 26న సీజేఐ జస్టిస్ లలిత్ నేతృత్వంలోని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కేఎం జోసెఫ్ల కొలీజియం భేటీ జరిగింది. జస్టిస్ చంద్రచూడ్ హాజరుకాలేదు. 10 మంది జడ్జీల నియామక ప్రక్రియ కోసం నలుగురు జడ్జీలకు సీజేఐ లేఖలు రాశారు. తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ జస్టిస్ కిషన్ అక్టోబర్ ఒకటిన, జస్టిస్ జోసెఫ్ అక్టోబర్ ఏడున సీజేఐకు ప్రతిలేఖలు రాశారు. లేఖలు రాసే పద్ధతిపై జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నజీర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. అభిప్రాయం తెలపాలని అక్టోబర్ రెండున మరోసారి కోరినా స్పందించలేదు. సాధారణంగా కొలీజియంలో వ్యక్తమయ్యే బేధాభిప్రాయాలు, అభ్యంతరాలు తెలిపిన జడ్జీల పేర్లను వెల్లడించరు. కానీ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నజీర్ పేర్లను బయటపెడుతూ కొలీజియం ప్రకటన విడుదలచేసింది. ఇక నవంబరు 9న కొత్త సీజేఐ వచ్చాకే కొలీజియం సమావేశం కానుంది. జస్టిస్ దీపాంకర్ గుప్తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ ఇప్పటికే కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం విదితమే. -
సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్.. తండ్రి తీర్పులనే తిరగరాశారు
సాక్షి, న్యూఢిల్లీ: భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ నియమితులు కానున్నారు. ఆయన పేరును సిఫార్సు చేస్తూ సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ మంగళవారం ఫుల్ కోర్టు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర న్యాయ శాఖకు ప్రతిపాదన పంపారు. న్యాయ శాఖ దాన్ని ప్రధాని పరిశీలనకు పంపనుంది. ప్రధాని, తర్వాత రాష్ట్రపతి ఆమోదం అనంతరం జస్టిస్ చంద్రచూడ్ సీజేఐగా నియమితులవుతారు. జస్టిస్ లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. 9న జస్టిస్ చంద్రచూడ్ సీజేఐగా ప్రమాణం చేస్తారు. 2024 నవంబర్ 10 దాకా రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగుతారు. ఆయన తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ కూడా సీజేఐగా చేయడం విశేషం! ఆయన 1978 నుంచి 1985 దాకా ఏకంగా ఏడేళ్ల పాటు అత్యధిక కాలం సీజేఐగా పని చేశారు. తండ్రీకొడుకులిద్దరూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ప్రగతిశీల భావాలున్న న్యాయమూర్తిగా పేరొందిన జస్టిస్ చంద్రచూడ్ న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చారు. 1959 నవంబర్ 11న జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్, ప్రభ దంపతులకు మహారాష్ట్రలో జన్మించారు. ముంబైలోని కేథడ్రల్, జాన్కానన్లో పాఠశాల విద్య, 1979లో ఢిల్లీలో ఆర్థిక, గణిత శాస్త్రాల్లో ఆనర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 1982లో ఢిల్లీలో న్యాయ పట్టా పొందారు. 1983లో హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్ఎల్ఎం పట్టా పొందారు. 1986లో హార్వర్డ్లో డాక్టరేట్ ఆఫ్ జ్యూరిడికల్ సైన్స్ చదివారు. బాంబే హైకోర్టులో, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1998లో సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి పొందడంతోపాటు సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్గా నియమితులయ్యారు. 2000లో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యనిర్వాహక చైర్మన్గా ఉన్నారు. ఆయన ఇద్దరు కుమారులు అభినవ్, చింతన్ కూడా లాయర్లే. భిన్నాభిప్రాయాల వెల్లడికి వెనకాడరు విచారణ సమయంలో తన అభిప్రాయాలు వెల్లడించడానికి వెనకాడని న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్కు పేరుంది. మానవహక్కులు, లింగ సమానత్వం, ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, క్రిమినల్, రాజ్యాంగ చట్టాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, వికలాంగుల హక్కులు, ఆధార్, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు, గోప్యత హక్కు, అయోధ్య భూ వివాదంపై కీలక తీర్పులిచ్చారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతిచ్చి సంచలనం సృష్టించారు. రుతుక్రమం కారణంగా ఆలయంలోకి రానివ్వకపోవడం మహిళల ప్రాథమిక హక్కులకు భంగకరమని తీర్పు చెప్పారు. వివాహితులైన ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకోవడం చట్ట విరుద్ధం కాదంటూ వివాహేతర సంబంధాలపైనా సంచలన తీర్పు వెలువరించారు. కరోనా సమయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను గుర్తుచేస్తూ ప్రభుత్వ వైద్య సాయం నిరాకరించకూడదని పేర్కొన్నారు. అవివాహితలకు కూడా 24 వారాల దాకా అబార్షన్ చేయించుకునే హక్కు కల్పిస్తూ తాజాగా తీర్పు ఇచ్చారు. తండ్రి తీర్పులనే తిరగరాశారు కిస్సా కుర్చీకా అనే సినిమాకు సంబంధించిన కేసులో నాడు జస్టిస్ వైవీ చంద్రచూడ్ కాంగ్రెస్ నేత సంజయ్గాంధీని జైలుకు పంపారు! అయితే వ్యభిచారం, గోప్యత హక్కులకు సంబంధించి ఆయన ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ తోసిపుచ్చడం విశేషం! 1976లో ఏడీఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసులో అత్యవసర సమయాల్లో పౌరులకు ప్రాథమిక హక్కులుండవంటూ జస్టిస్ వైవీ చంద్రచూడ్ తీర్పు ఇచ్చారు. దాన్ని 2016లో జస్టిస్ చంద్రచూడ్ కొట్టేశారు. చదవండి: (కాంగ్రెస్లో దేనికి పట్టం?, పనితనమా? విధేయతా?) -
వ్యాపారం.. లాభాపేక్ష మాత్రమే కాకూడదు
హఫీజ్పేట్: వ్యాపారంలో లాభాపేక్ష మాత్రమే ప్రాధాన్యం కాకూడదని.. సమాజంలోని అసమానతలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో ‘లీడర్షిప్ సమ్మిట్–2022’ను జ్యోతి వెలిగించి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యాపార విద్య చదివే విద్యార్థులకు సైతం రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రాయోజిత వ్యాజ్యాలను నిలిపివేయాలని నిర్ణయించుకుంటే న్యాయవ్యవస్థలో సగం సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ఈ దేశంలో న్యాయపరమైన మౌలిక సదుపాయాల స్థితి ఇంకా కొనసాగుతోందన్నారు. పెండింగ్ కేసులు న్యాయవ్యవస్థకు ఎప్పుడూ ఒక సవాల్గానే ఉంటాయన్నారు. వాటిని తగ్గించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడం ఎప్పుడూ తాడుపై నడిచినట్లేనని ఆయన పేర్కొన్నారు. 16 నెలల్లో ఎన్నో మార్పులకు శ్రీకారం.. చీఫ్ జస్టి‹స్గా 16 నెలలు కొనసాగిన సమయంలో సుప్రీంకోర్టు కోర్టుకు 11 మంది న్యాయమూర్తులను, పలు హైకోర్టులకు 233 మందిని న్యాయమూర్తులను నియమించడం జరిగిందన్నారు. దేశంలో న్యాయవ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి తగిన ప్రణాళికతో ముందుకు సాగామని చెప్పారు. న్యాయ వ్యవస్థలో టెక్నాలజీ వినియోగం కూడా ప్రారంభించామని వివరించారు. ఇదిలా ఉంటే.. ఐఎస్బీ 20 ఏళ్ల కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా పురోభివృద్ధి సాధించిందని జస్టిస్ రమణ పేర్కొన్నారు. ఐఎస్బీ ఏర్పాటు సమయంలో 250 ఎకరాల స్థలాన్ని కేటాయించడంపై కోర్టులో కేసు వేయగా.. అదనపు అడ్వొకేట్ జనరల్గా ఉంటూ కేసులో పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్రెడ్డి ఇచ్చిన తీర్పు ఎప్పటికీ మరువలేమని చెప్పారు. ఆ తర్వాత 20 ఏళ్లకు ఇప్పుడు లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఐఎస్బీ భూ వ్యాజ్యానికి సంబంధించి అప్పటి జస్టిస్ సుదర్శన్రెడ్డి తీర్పు కాపీని డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్లకు జస్టిస్ ఎన్వీ రమణ అందజేశారు. అంతకుముందు లీడర్షిప్ సమ్మిట్ ప్రాధాన్యతను మదన్ పిల్లుట్ల వివరించారు. అనంతరం మైక్రోసాఫ్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్కుమార్, డాక్టర్ జయంతి కుమరేశ్, లైట్స్పీడ్ పార్ట్నర్ అభిషేక్నాగ్, ది బెటర్ ఇండియా సహ వ్యవస్థాపకుడు అనురాధ కేడియా, మైగేట్ సీఈఓ విజయ్ అరిశెట్టి, తెలంగాణ రాష్ట్ర సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఈడీ కేదార్లేలేతోపాటు పలువురు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఐఎస్బీ అధ్యాపకులు, అధికారులు, విద్యార్థులు, రాష్ట్ర హైకోర్టు జడ్జీలు, న్యాయవాదులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. -
49వ సీజేఐగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణం
-
సీజేఐగా ప్రమాణం చేసిన జస్టిస్ యుయు లలిత్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. జస్టిస్ యు.యు. లలిత్తో శనివారం ఉదయం ప్రమాణం చేయించారు. కాగా.. యు.యు. లలిత్ రెండు నెలల 12 రోజుల పాటు సీజేఐగా పదవిలో కొనసాగనున్నారు. నవంబర్ 8తో ఆయన పదవీకాలం ముగుస్తుంది. Delhi | Justice Uday Umesh Lalit takes oath as The Chief Justice of India at Rashtrapati Bhavan in the presence of President Droupadi Murmu pic.twitter.com/dxPMsS4IYE — ANI (@ANI) August 27, 2022 #WATCH | President Droupadi Murmu administers the oath of Office of the Chief Justice of India to Justice Uday Umesh Lalit at Rashtrapati Bhavan pic.twitter.com/HqayMJDwBB — ANI (@ANI) August 27, 2022 -
జర్నలిస్టులకు సుప్రీంకోర్టు తీపికబురు.. మంత్రి కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు హైదరాబాద్లో ఇళ్లస్థలాల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ జర్నలిస్టు సంఘం దీర్ఘకాలిక డిమాండ్ను పరిష్కరించినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది తెలంగాణ ప్రభుత్వం పాత్రికేయ మిత్రులకు తమ వాగ్ధానాన్ని నెరవేర్చడంలో సహాయపడుతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. చదవండి: జర్నలిస్టులకు గుడ్న్యూస్.. ఇళ్ల స్థలాల కేటాయింపుకు సుప్రీం గ్రీన్సిగ్నల్ తెలంగాణ జర్నలిస్టుల నివాసాల కోసం సుప్రీంకోర్టులో ఈ కేసు త్వరగా పరిష్కారమయ్యేందుకు ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుకి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ టీయూడబ్ల్యూజే అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ లు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ జర్నలిస్టుల కోసం.. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసును పరిష్కరించినందుకుగాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న జర్నలిస్టుల కుటుంబాలకు ఇది తెలంగాణ ప్రభుత్వ కృషి ద్వారా అందిన తీపి కబురు అని అల్లం నారాయణ అన్నారు. అలాగే, జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపు విషయంలో కృషి చేసి, చొరవ తీసుకున్న మంత్రి కేటీఆర్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. I would like to extend my gratitude to the Hon’ble Supreme Court & CJI Garu for clearing the long-standing demand of Telangana journalist society on house site allotments This will help Telangana Govt deliver on our promise to our Journalist friends 👍 — KTR (@KTRTRS) August 25, 2022 -
సత్వర న్యాయమే లక్ష్యం: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, అమరావతి: దేశంలోని న్యాయ స్థానాల్లో ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయని, అవకాశం ఉన్నంత వరకు ప్రజలకు తక్కువ సమయంలో న్యాయం అందేలా న్యాయవాదులు పని చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతే ప్రజాస్వామ్యం మనుగడ కష్టమని, ఆ పరిస్థితి తలెత్తకుండా న్యాయ వ్యవస్థ వనిచేసేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. శనివారం ఆయన విజయవాడ సిటీ సివిల్ కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన బహుళ కోర్టు సముదాయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కలిసి ప్రారంభించారు. ‘ముఖ్యమంత్రి తెలుగులో మాట్లాడటం శుభపరిణామం.. అందువల్ల నేను కూడా తెలుగులో మాట్లాడటమే సముచితం’ అంటూ సీజేఐ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. 2013 మే 11న ఈ భవనానికి శంకుస్థాపన చేసినప్పటికీ.. రాష్ట్ర విభజన, ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిర్మాణం పూర్తవ్వడానికి ఆలస్యమైందన్నారు. అయితే మళ్లీ తన చేతుల మీదుగానే ఈ భవనం ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు భారం పడకుండా న్యాయ వ్యవస్థకు ప్రత్యేక నిధులు ఇవ్వాలన్న తన ప్రతిపాదనలకు కేంద్రం అంగీకరించకపోయినా.. ఆంధ్రప్రదేశ్, బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులు మద్దతుగా నిలిచారని అభినందించారు. విజయవాడతో, బెజవాడ బార్ అసోíసియేషన్తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. విజయవాడ సిటీ సివిల్ కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన బహుళ కోర్టు సముదాయాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు న్యాయమూర్తుల నియామకాల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం సమాజంలో మార్పు కోసం అపార అనుభవం గల సీనియర్ న్యాయవాదులు జూనియర్లకు అన్ని అంశాలపై శిక్షణ ఇవ్వాలని జస్టిస్ ఎన్వీ రమణ కోరారు. ఈ సందర్భంగా తన ఉన్నతికి, తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడి పోయిందని, అందరూ కష్టపడి పనిచేసి, రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం కూడా అవసరమైన నిధులు ఇచ్చి రాష్ట్రానికి సహకరించాలని కోరారు. తన పదవీ కాలంలో 240 మంది హైకోర్టు న్యాయమూర్తులను, 15 మంది ప్రధాన న్యాయమూర్తులను నియమించానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కూడా హైకోర్టు న్యాయ మూర్తులను నియమించామని గుర్తు చేశారు. ఈ నియామకాల్లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామన్నారు. రూ.55 కోట్ల అంచనాతో మొదలైన విజయవాడ సిటీ సివిల్ కోర్టు భవన సముదాయం ప్రస్తుతం రూ.100 కోట్లు దాటిందని, ఏపీ ప్రభుత్వ సహకారంతో పనులు పూర్తి చేశామన్నారు. ఈ భవన నిర్మాణం కోసం కృషి చేసిన బెజవాడ బార్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులకు, పెద్దలరికీ ఆయన అభినందనలు తెలిపారు. విశాఖలో పెండింగ్లో ఉన్న కోర్టు సముదాయ భవన నిర్మాణానికి సీఎం సహకారం అందించాలని సీజేఐ కోరారు. భవన సముదాయంలో ఓ విభాగాన్ని ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఇది అరుదైన ఘట్టం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడ కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి 2013లో జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిందని, ఇప్పుడు అదే భవన సముదాయాన్ని ఆయనే ప్రారంభించడం అరుదైన ఘట్టమని సీఎం వైఎస్ జగన్ అన్నారు. జ్యూడీషియరీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. విజయవాడలో అధునాతన భవనంలో కోర్టులు ఏర్పాటవ్వడం ఆనందంగా ఉందన్నారు. బహుళ అంతస్తుల భవనాలలో కోర్టు హాల్స్ ఏర్పాటుతో కేసుల విచారణలో వేగం పెరుగుతుందని, పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కారం అవుతాయని చెప్పారు. ఈ కోర్టుల భవన నిర్మాణానికి సహకరించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. నూతన కోర్టు భవన సముదాయాన్ని పరిశీలిస్తున్న సీజేఐ, హైకోర్టు సీజే, సీఎం ఇదిలా ఉండగా, కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయిన సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్ను సన్మానించాలని సభ్యులు చేసిన అభ్యర్థనను సీఎం సున్నితంగా తిరస్కరించారు. న్యాయ వ్యవస్థలో అనుభవజ్ఞులైన జస్టిస్ ఎన్వీ రమణను సత్కరించడం సముచితమని వారికి సూచించారు. వేదికపై ఈ సన్నివేశాన్ని గమనించిన న్యాయవాదులు సీఎం నిరాడంబరతను ప్రశంసించారు. సీఎం తన ప్రసంగంలో ప్రత్యేకంగా న్యాయవాదులకు కృతజ్ఞతలు చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు. సీజేఐని గజమాలతో సత్కరించినప్పుడు వేదికపై సీఎం.. అందరిలో ఒక్కడిగా కలిసిపోయి సూచనలు ఇచ్చిన తీరును కరతాళ ధ్వనులతో అభినందించారు. కాగా, తొలుత కోర్టు ప్రాంగణంలో సీజేఐ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ విజయలక్ష్మి, జస్టిస్ బి.దేవానంద్, జస్టిస్ కృపాసాగర్, జస్టిస్ శ్రీనివాస్, జిల్లా జడ్జి అరుణ సాగరిక, హైకోర్టు న్యాయమూర్తులు, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
సీజేఐ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్
-
కోర్టు కాంప్లెక్స్ ప్రారంభోత్సవం.. పాల్గొన్న సీజే ఎన్వీ రమణ, సీఎం జగన్ (ఫొటోలు)
-
విజయవాడ కోర్టుల భవన సముదాయం ప్రారంభం
-
కోర్టు కాంప్లెక్స్ ప్రారంభించిన సీజే ఎన్వీ రమణ.. పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: నగరంలో జిల్లా కోర్టు నూతన భవన సముదాయాన్ని శనివారం ఉదయం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇతర న్యాయమూర్తులు హాజరయ్యారు. విజయవాడ కోర్టుతో జస్టిస్ నూతలపాటి వెంకటరమణకు ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడి నుంచే ఆయన తన న్యాయవాద వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. సిటీ సివిల్ కోర్టు భవన సముదాయ ప్రారంభ కార్యక్రమానికి ముందు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో సీజే రమణ, సీఎం జగన్లు కలిసి మొక్క నాటారు. ఇక విజయవాడ కోర్టు భవన సముదాయ ప్రారంభోత్సవం అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చేరుకుంటారు. ఏఎన్యూ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనడంతో పాటు యూనివర్సిటీ ప్రదానం చేసే డాక్టరేట్ను స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పట్టేటి రాజశేఖర్ తదితరులు పాల్గొంటారు. ఇదీ చదవండి: పొరబడిన ‘ప్రాప్తి’: నిషేధానికి గురైన రాష్ట్రాల జాబితా నుంచి ఏపీ పేరు తొలగింపు -
ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది: సీజేఐ ఎన్వీ రమణ
సాక్షి, తిరుపతి: తిరుపతిలో సీజేఐ ఎన్వీ రమణ పర్యటించారు. ఈ సందర్బంగా గాంధీజీ ఆత్మకథ 'సత్యశోధన' పుస్తకాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ జీవన సందేశాన్ని అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరంగా ఉందని ఎన్వీ రమణ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సత్యశోధన ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకమని అన్నారు. ఈ సందర్భంగా మహాత్మ గాంధీ సేవలను కొనియాడారు. అహింస అనే ఆయుధంతో గాంధీజీ పోరాటం చేసారని.. నిజాయతీగా జీవితాన్ని ఎలా గడపాలో నేర్పించిన వ్యక్తం గాంధీజీ అని అన్నారు. రాస్ నిర్వాహకులు, పద్మశ్రీ గ్రహీత స్వర్గీయ గుత్తా మునిరత్నం విగ్రహాన్ని సీజేఐ ఆవిష్కరించారు. అంతకుముందు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చదవండి: ‘పాడా' పనులను త్వరగా పూర్తి చేసేలా సీఎం జగన్ ఆదేశాలు తిరుమల శ్రీవారిని దర్శించకున్న సీజేఐ తిరుమల శ్రీవారిని సీజేఐ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో సీజేఐకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వామివారి పట్టు వస్త్రాలతో సత్కరించి శ్రీవారి చిత్రపటాన్ని అందించారు. -
అహింసా మార్గంలో స్వతంత్ర పోరాటానికి గాంధీ నడిపారు: సీజేఐ ఎన్వీ రమణ
-
ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
ఉచితహామీలు ఇచ్చే పార్టీల గుర్తింపు రద్దుపై ‘సుప్రీం’ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఉచిత హామీలు, సంక్షేమ పథకాలు రెండు విభిన్న అంశాలని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. ఆర్థిక వ్యవస్థ నష్టపోతున్న డబ్బు, సంక్షేమ చర్యల మధ్య సమతుల్యతను సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఉచిత హామీలు ఇచ్చి నెరవేర్చని పార్టీల గుర్తింపును రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. అది సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇవ్వటాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. అలా చేసే పార్టీల గుర్తులు, రిజిస్ట్రేషన్ను ఎన్నికల సంఘం రద్దు చేసేలా ఆదేశాలనివ్వాలని కోరారు. ఈ పిల్పై విచారణ చేపట్టింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ క్రిష్ణ మురారీల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్నికల సమయంలో నెరవేర్చలేని ఉచిత హామీలు ఇచ్చే పార్టీల గుర్తింపును రద్దు చేయటం అనేది అప్రజాస్వామికమని పేర్కొంది ధర్మాసనం. ‘రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు అనే అంశంలోకి వెళ్లదలుచుకోలేదు. అది అప్రజాస్వామికమైన ఆలోచన. మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అయితే, ఎన్నికల్లో ఉచిత హామీలు ఇవ్వటం తీవ్రమైన అంశం. కానీ, చట్టపరమైన అడ్డుకట్ట పడేవరకు జోక్యం చేసుకోలేము.’ అని పేర్కొన్నారు సీజేఐ ఎన్వీ రమణ. ఇప్పటికే పలువురు సీనియర్ న్యాయవాదులు పలు సూచనలు చేశారని, మిగిలిన వారు సైతం తన పదవీ విరమణలోపు సలహాలు ఇవ్వాలని కోరారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. ‘ ఉచితాలు, సంక్షేమ పథకాలు అనేవి వేరు వేరు. ఆర్థిక వ్యవస్థ నష్టం, ప్రజల సంక్షేమం మధ్య సమతుల్యత అవసరం. అందుకే ఈ చర్చ. ఆ దిశగా ఆలోచనలు, సూచనలను నా రిటైర్మెంట్లోపు చెప్పండి.’ అని పేర్కొన్నారు. తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేశారు. ఇదీ చదవండి: స్పైస్జెట్ విమానంలో సిగరెట్ తాగుతూ సెల్ఫీ వీడియో.. కేసు నమోదు -
అధికారికం: సుప్రీం కోర్టు సీజేగా యూయూ లలిత్
న్యూఢిల్లీ: భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నియామకం ఖరారు అయ్యింది. ఆయన నియామకాన్ని ఆమోదిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ కాలం ఆగస్టు 26తో ముగియనుంది. ఆయన స్థానంలో జస్టిస్ యూయూ లలిత్ బాధ్యతలు స్వీకరిస్తారు. భారత దేశ 49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ యూయూ లలిత్.. ఆగస్టు 27న బాధ్యతలు తీసుకోనున్నారు. నూతన సీజేఐగా జస్టిస్ యూయూ లలిత్ పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిపాదించారు. అయితే.. జస్టిస్ యూయూ లలిత్ కేవలం 74 రోజులు మాత్రమే ఈ పదవిలో కొనసాగనున్నారు. ఎందుకంటే.. ఆయన నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ యూయూ లలిత్ 1957, నవబర్ 9న జన్మించారు. 1983లో లీగల్ కెరీర్ను ప్రారంభించారు. 1985 డిసెంబర్ వరకు ముంబై హైకోర్టులో పని చేశారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లారు. 2004, ఏప్రిల్లో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. సుప్రీం కోర్టు జడ్జీగా నియమితులయ్యే వరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రత్యేక న్యాయవాదిగా పని చేశారు. 2014, ఆగస్టు 13న సుప్రీ కోర్టు జడ్జీగా నియమితులయ్యారు. ఇదీ చదవండి: పిల్లలు 7 గంటలకే స్కూల్కు వెళ్తుంటే... మేం తొమ్మిదింటికి కోర్టుకు రాలేమా? -
రాజ్యాంగ అవగాహన తప్పనిసరి: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
రాయ్పూర్: రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులు, బాధ్యతలు తదితరాలపై పౌరులందరికీ అవగాహన ఉన్నప్పుడే దేశం నిజమైన ప్రగతి సాధిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ‘‘తేలిక భాషలో వాటిపై అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ విషయంలో న్యాయ శాస్త్ర పట్టభద్రులు చురుకైన పాత్ర పోషించాలి. వారిని సోషల్ ఇంజనీర్లుగా రూపొందించే బాధ్యతను లా స్కూల్స్ తలకెత్తుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. ఆదివారం రాయ్పూర్లోని హిదాయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ (హెచ్ఎన్ఎల్యూ) ఐదో స్నాతకోత్సవంలో జస్టిస్ రమణ పాల్గొన్నారు. ‘‘ఆధునిక భారత ఆకాంక్షలకు అక్షర రూపమైన మన రాజ్యాంగం ప్రతి పౌరునికీ చెందినది. కానీ వాస్తవంలో అది కేవలం లా స్టూడెంట్లు, లాయర్ల వంటి అతి కొద్దిమందికి మాత్రమే పరిమితమైన ఓ పుస్తకంగా మారిపోవడం బాధాకరం’’ అన్నారు. న్యాయ రంగంలో కెరీర్ ఎంతటి సవాళ్లతో కూడినదో అంతటి సంతృప్తినీ ఇస్తుందని సీజేఐ అన్నారు. ‘‘లాయరంటే కేవలం కోర్టులో వాదించే వ్యక్తి కాదు. అన్ని రంగాలపైనా ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుంటూ సాగాలి. మార్పుకు శ్రీకారం చుట్టే నాయకునిగా ఎదగాలి. విమర్శలెదురైనా పట్టుదలతో ముందుకు సాగితే విజయం మీదే’’ అని లా గ్రాడ్యుయేట్లకు పిలుపునిచ్చారు. మానవ హక్కుల ఉల్లంఘనకు బలయ్యే అణగారిన వర్గాలకు చట్టపరంగా చేయూతనివ్వాలని సూచించారు. మెరుగైన సామాజిక మార్పుకు చట్టాలు కూడా తోడ్పడతాయని సీజేఐ అన్నారు. ‘‘యువతరం ప్రపంచంలో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారంచుడుతోంది. వాతావరణ సంక్షోభం మొదలుకుని మావన హక్కుల ఉల్లంఘన దాకా పెను సమస్యలెన్నింటినో ఎదుర్కోవడంలో సంఘటిత శక్తిగా తెరపైకి వస్తోంది. ఇక సాంకేతిక విప్లవం మనందరినీ ప్రపంచ పౌరులుగా మార్చేసింది. కనుక సామాజిక బాధ్యతలను నెరవేర్చేందుకు మనమంతా ముందుకు రావాలి’’ అన్నారు. ఛత్తీస్గఢ్లో న్యాయ వ్యవస్థకు మౌలిక సదుపాయాల కల్పన, బడ్జెట్ కేటాయింపులు తదితరాల్లో సీఎం భూపేశ్ భగెల్ పనితీరును ఈ సందర్భంగా ప్రశంసించారు. -
CJI NV Ramana: విశాఖకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
దొండపర్తి (విశాఖ దక్షిణ): భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ఆదివారం విశాఖకు రానున్నారు. విశాఖ రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రా మెడికల్ కళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ (అంకోస) ఆడిటోరియంలో సాయంత్రం జరిగే రాచకొండ విశ్వనాథశాస్త్రి (రావిశాస్త్రి) శత జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. కార్యక్రమం అనంతరం తిరిగి ఢిల్లీకి విమానంలో పయనమవనున్నారు. ఇదీ చదవండి: ఒక్క ఫొటో నా జీవితాన్నే మార్చేసింది -
జిల్లా న్యాయ వ్యవస్థపై గురుతర బాధ్యత
న్యూఢిల్లీ: పౌరులందరికీ సామాజిక, ఆర్థిక రాజకీయ న్యాయం అందిస్తామని రాజ్యాంగ ప్రవేశిక హామీ ఇస్తుంటే వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం బాధాకరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ‘‘చాలా తక్కువ శాతం మంది మాత్రమే న్యాయం కోసం కోర్టుల దాకా వెళ్లగలుగుతున్నారు. అవగాహన లోపం, అవకాశాల లేమి వల్ల అత్యధికులు ఆ అవకాశానికి దూరమై మౌనంగా వ్యథను అనుభవిస్తున్నారు’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘దేశ నిర్మాణంలో పౌరులందరి భాగస్వామ్యానికి అవకాశం కల్పించడమే నిజమైన ప్రజాస్వామ్య సమాజ లక్షణం. అందుకు సామాజిక అసమానతలను రూపుమాపడం అత్యవసరం. అందుకు న్యాయ ప్రక్రియ అందరికీ అందుబాటులో చాలా అవసరం’’ అని అభిప్రాయపడ్డారు. శనివారం ఇక్కడ మొదలైన ఆలిండియా జిల్లా న్యాయ సేవల సంస్థల తొలి సదస్సునుద్దేశించి ఆయన ప్రసంగించారు. నల్సా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రెండు రోజుల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రెజిజు, పలు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో పాటు దేశమంతటి నుంచీ 1,200 మందికి పైగా డెలిగేట్లు పాల్గొన్నారు. సీజేఐ మాట్లాడుతూ జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థను దేశ న్యాయ వ్యవస్థకు వెన్నెముకగా అభివర్ణించారు. కక్షిదారుల్లో అత్యధికులకు అందుబాటులో ఉండే తొలి న్యాయ గవాక్షం అదేనన్నారు. దాన్ని బలోపేతం చేయడం తక్షణావసరమని అభిప్రాయపడ్డారు. అక్కడ ఎదురయ్యే అనుభవాన్ని బట్టే మొత్తం న్యాయ వ్యవస్థపై ప్రజలు అభిప్రాయానికి వస్తారు కాబట్టి జిల్లా న్యాయ వ్యవస్థపై గురుతర బాధ్యత ఉందన్నారు. నల్సా సేవలు అమోఘం విచారణ ఖైదీల స్థితిగతులపై న్యాయ సేవల విభాగం తక్షణం దృష్టి సారించాలని జస్టిస్ రమణ అన్నారు. ఈ దిశగా జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) 27 ఏళ్లుగా గొప్పగా సేవలందిస్తోందని ప్రశంసించారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థలను బలోపేతం చేస్తేనే సత్వర న్యాయం, పెండింగ్ కేసుల భారం కూడా తగ్గుతుందన్నారు. న్యాయం పొందేందుకు సామాజిక, ఆర్థిక అశక్తతలు అడ్డంకిగా మారని సమ సమాజం కోసం జిల్లా, రాష్ట్ర స్థాయి న్యాయ వ్యవస్థలు కృషి చేయాలని జస్టిస్ చంద్రచూడ్ పిలుపునిచ్చారు. ఇందుకోసం టెక్నాలజీని మరింతగా వాడుకోవాల్సిన అవసరముందన్నారు. పేద, అణగారిన వర్గాలకు మరింత సమర్థంగా న్యాయ సేవలు అందించడం, న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం చేపట్టాల్సిన చర్యలు తదితరాలపై సదస్సు చర్చించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా న్యాయ సేవల కేంద్రాల మధ్య ఏకరూపత సాధించేందుకు అనుసరించాల్సిన పద్ధతులు తదితరాలు కూడా చర్చకు రానున్నాయి. సులువుగా న్యాయం: మోదీ సులభతర వాణిజ్యం మాదిరిగానే న్యాయప్రక్రియను కూడా సులభతరం చేయాల్సిన అవసరముందని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్ర అమృతోత్సవ సంబరాలు ఇందుకు సరైన తరుణమన్నారు. చిరకాలంగా జైళ్లలో మగ్గుతున్న విచారణ ఖైదీల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా న్యాయ వ్యవస్థకు మరోసారి సూచించారు. జిల్లా జడ్జిలే ఈ విషయంలో కీలక పాత్ర పోషించాలని అభిప్రాయపడ్డారు. ‘‘న్యాయ వ్యవస్థను ఆశ్రయించగల అవకాశం అందరికీ అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యం. సరైన న్యాయం సత్వరమే అందడమూ అంతే ముఖ్యం. న్యాయ వ్యవస్థకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా గత ఎనిమిదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. న్యాయ ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వాడుకోవాలి. పురాతన భారతీయ విలువలకు కట్టుబడుతూనే 21వ శతాబ్దపు వాస్తవాలకు అనుగుణంగా ముందుకెళ్లాలి’’ అని సూచించారు. ఆగస్టు 15కల్లా అత్యధికులకు విముక్తి: రిజిజు విచారణ ఖైదీల్లో అత్యధికులను పంద్రాగస్టు నాటికి విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు రిజిజు వివరించారు. ‘‘వారిని గుర్తించేందుకు నల్సా జూలై 16 నుంచి రంగంలోకి దిగింది. ఇందుకోసం ఆగస్టు 13 దాకా నిర్విరామంగా పని చేయనుంది’’ అని చెప్పారు. -
జస్టిస్ ఖన్విల్కర్ క్రమశిక్షణ గల జడ్జి: సీజేఐ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ శ్రమించేతత్వం, క్రమశిక్షణగల వ్యక్తి అని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. సుప్రీం కొలీజియంలో భాగమైన జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ ఖన్విల్కర్తో కలిసి తాము ఏడాది కాలంలో ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకాల కోసం 250 పేర్లను పరిశీలించినట్లు ఆయన వెల్లడించారు. సుప్రీం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటైన జస్టిస్ ఖన్విల్కర్ వీడ్కోలు కార్యక్రమంలో సీజేఐ ప్రసంగించారు. సుప్రీంకోర్టులో ఆయన 8,446 కేసులను పరిష్కరించడంతోపాటు 187 తీర్పులను రాశారన్నారు. ఆయన శ్రమించే తత్వం అందిరికీ తెలిసిందేనన్నారు. జస్టిస్ ఖన్విల్కర్ సుప్రీంకోర్టులో సుమారు ఆరేళ్లపాటు పనిచేశారు. ఆయన పదవీ విరమణ కారణంగా అత్యున్నత న్యాయస్థానంలోని 34 జడ్జీల పోస్టులకు గాను 31 మంది మిగిలారు. ఇదీ చదవండి: ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల పెండింగ్ కేసులు -
Droupadi Murmu: అత్యున్నత పీఠంపై గిరి పుత్రిక
న్యూఢిల్లీ: అత్యున్నత పీఠంపై గిరి పుత్రిక కొలువుదీరడానికి సమయం ఆసన్నమయ్యింది. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము(64) సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉదయం 10.15 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని, ముర్ముతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేయిస్తారని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ప్రమాణ స్వీకారం అనంతరం ముర్ముకు సైనిక సిబ్బంది 21 గన్ సెల్యూట్ సమర్పిస్తారని తెలిపింది. తర్వాత ఆమె ప్రసంగం ఉంటుందని పేర్కొంది. అంతకంటే ముందు రామ్నాథ్ కోవింద్, ముర్ము కలిసి పార్లమెంట్ సెంట్రల్హాల్కు చేరుకుంటారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రి మంత్రులు, దౌత్యవేత్తలు, పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సైనికాధిరులు పాల్గొంటారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ప్రమాణ స్వీకారం, ప్రసంగం తర్వాత ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్కు చేరుకుంటారు. అక్కడ సైనిక సిబ్బంది ఆమెకు గౌరవ వందనం సమర్పిస్తారు. రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపదీ ముర్ము ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. భారతదేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించిన తొలి రాష్ట్రపతిగా చరిత్రకెక్కారు. ప్రతిభా పాటిల్ తర్వాత రాష్ట్రపతి పదవిని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము మరో రికార్డు సృష్టించనున్నారు. -
రాజకీయాలపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు
-
NV Ramana: చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు
రాంచీ: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంచీలో(జార్ఖండ్) శనివారం జరిగిన ఒక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మీడియాలో డిబేట్ల పేరిట జరుగుతున్న ‘అతి’ విచారణలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే.. న్యాయవ్యవస్థ పాత్ర, న్యాయమూర్తుల ముందున్న సవాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా తమ టీవీ డిబెట్లతో కంగారు కోర్టులుగా(సరైన ఆధారాలు.. వాదప్రతివాదనలు లేని అనధికార న్యాయస్థానాలు) వ్యవహరిస్తున్నాయని, సోషల్ మీడియా కూడా అదే రీతిలో వ్యవహరిస్తూ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాయని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్ల ప్రవర్తన పక్షపాతం, అవగాహనలేమితో కూడిన సమాచారం, ప్రత్యేకించి ఒక ఎజెండా-ఆధారితంగా ఉంటోంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా.. ► సోషల్ మీడియాలో జడ్జిలకు వ్యతిరేకంగా క్యాంపెయిన్లు చేస్తున్నారు. జడ్జిలు వాటికి అత్యవసరంగా స్పందించాల్సిన అవసరం లేదు. దయచేసి దీనిని బలహీనతనో లేదంటే నిస్సహాయత అని పొరబడకండి అని న్యాయమూర్తులకు జస్టిస్ రమణ సూచించారు. ► ఈరోజుల్లో మీడియా టూల్స్ అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నాయి. కానీ, వాస్తవం ఏదో, ఏది మంచో, ఏది సరైందో నిర్ధారించలేకపోతున్నాయి. మీడియా విచారణలు.. కేసుల్లో మార్గనిర్దేశం చేయలేవు. అలాగే మీడియా ఛానెళ్లు ‘కంగారు కోర్టు’లను నడిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో.. కొన్నిసార్లు అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా సమస్యలపై నిర్ణయం తీసుకోవడం కష్టంగా ఉంటోంది. ► న్యాయం పంపిణీకి సంబంధించిన సమస్యలపై.. అవగాహన లేని, అజెండాతో కూడిన నడిచే చర్చలు ప్రజాస్వామ్య ఆరోగ్యానికి హానికరం. ► మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్న పక్షపాత అభిప్రాయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయి. వ్యవస్థకు హాని కలిగిస్తున్నాయి. ఈ ప్రక్రియలో.. న్యాయ పంపిణీ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. ► మీ బాధ్యతను(మీడియాను ఉద్దేశించి..) అతిక్రమించడం ద్వారా మీరు మన ప్రజాస్వామ్యాన్ని రెండడుగులు వెనక్కి తీసుకెళ్తున్నారు ► ప్రింట్ మీడియాకు ఇప్పటికీ కొంత స్థాయిలో జవాబుదారీతనం పని చేస్తోంది. ► ఎలక్ట్రానిక్ మీడియాకు మాత్రం జవాబుదారీతనం శూన్యంగా ఉంటోంది. ఇక సోషల్ మీడియా చాలా అధ్వాన్నంగా ఉంటోంది. ► దీనికి పరిష్కారం.. మీడియా స్వీయ నియంత్రణ పాటించడమే. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నేను కోరుతున్నా. ప్రజలకు అవగాహన కల్పించడానికి, దేశాన్ని ఉత్తేజపరిచేందుకు ఎలక్ట్రానిక్ మీడియా తమ గొంతుకను ఉపయోగించాలి ► జడ్జిల మీద దాడులు పెరిగిపోతున్నాయి. ప్రజాప్రతి నిధులు, రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసు అధికారులు.. ఇలా రిటైర్మెంట్ తర్వాత సున్నిత అంశాలతో ముడిపడిన వ్యక్తులకు రక్షణ ఇస్తోంది మన దేశం. కానీ, న్యాయమూర్తుల విషయంలోనే అది జరగడం లేదు. ► కొన్ని దశాబ్దాల క్రితం వరకు.. న్యాయమూర్తి అంటే కోర్టుల ముందు పార్టీల మధ్య వివాదాల పరిష్కారానికి మాత్రమే పరిమితం అనే అంచనాలు జనాలకు ఉండేవి. ఇప్పుడు, సమాజంలో ఆలోచించదగిన ప్రతి సమస్య న్యాయవ్యవస్థ ద్వారా పరిష్కరించబడుతుందని భావిస్తున్నారు. ► న్యాయం అమలు చేయడానికి, న్యాయమూర్తులు సామాజిక వాస్తవాల గురించి తెలుసుకోవాలి. సామాజిక ఏకాంతంగా పరిమితం కాకూడదు. నిష్పాక్షికత మరియు స్వతంత్రత అనేది మానసిక స్థితి అని మనం అర్థం చేసుకోవాలి. ► న్యాయమూర్తులంటే.. పది గంటలకు వచ్చి సాయంత్రం నాలుగు గంటలకు వెళ్లిపోతారు. సెలవుల్ని ఆస్వాదిస్తారు.. వాళ్లు వాళ్ల వాళ్ల జీవితాల్లో కంఫర్ట్గా ఉన్నారు అనేది ఒక దురభిప్రాయం మాత్రమే. అదంతా వాస్తవం కాదు. ► ఈరోజుల్లో.. న్యాయం అందించడం అంత తేలికైన బాధ్యత కాదు. ఇది రోజురోజుకూ సవాలుగా మారుతోంది. కొన్నిసార్లు, మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఏకీకృత ప్రచారాలు కూడా జరుగుతాయి ► సామాజిక వాస్తవాల విషయంలో న్యాయమూర్తులు.. చూసిచూడనట్లుగా, గుడ్డిగా వ్యవహరించకూడదు. వ్యవస్థను కాపాడటానికి నొక్కి చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ► ఈ క్రమంలో.. రాజకీయాలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో చేరాలనుకున్నా. విధి వేరే దారి చూపించింది. న్యాయమూర్తి అయినందుకు బాధపడడం లేదని సీజే ఎన్వీ రమణ పేర్కొన్నారు. -
దేశంలో అలాంటి అరెస్టులే అత్యవసర సమస్యలు: సీజేఐ
జైపూర్: దేశంలో తొందరపాటు, విచక్షణారహితంగా చేసే అరెస్టులు, బెయిల్ పొందటంలో ఇబ్బందులు, ట్రయల్స్లో దీర్ఘకాలం జైలులో ఉంచటం వంటివి ప్రస్తుతం అత్యవసర సమస్యలుగా పేర్కొన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు, సుప్రీం కోర్టు సీనియర్ జడ్జీల సమక్షంలో మాట్లాడారు. ఏ కేసును చూపకుండానే భారత క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలోని ప్రక్రియ ప్రజలకు శిక్షగా అభివర్ణించారు. 'సవాళ్లు చాలా ఉన్నాయి. మన నేర న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రక్రియ ఒక శిక్షగా మారింది. తొందరపాటు, విచక్షణారహితంగా చేసే అరెస్టుల నుంచి.. బెయిల్ పొందటంలో ఇబ్బంది, ట్రయల్స్లో ఉన్న వారు ఎక్కువ కాలం జైలులో ఉండటం వరకు ఇవన్నీ అత్యవసర సమస్యలే. నేర న్యాయ వ్యవస్థ పరిపాలన సామర్థ్యాన్ని పెంచడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం. పోలీసులకు శిక్షణ ఇవ్వటం, జైలు వ్యవస్థను ఆధునికీకరించటం వంటి వాటితో పరిపాలన సామర్థ్యాన్ని పెంచవచ్చు.' అని పేర్కొన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. ఈ సమస్యలపై నాల్సా(నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ), లీగల్ సర్వీసెస్ అథారిటీలు దృష్టి సారించి ఏ విధంగా పరిష్కరించవచ్చో చూడాలన్నారు. జైళ్లలో మగ్గుతున్న వారిని త్వరితగతిన విడుదల చేసేందుకు 'బెయిల్ యాక్ట్' తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలని ఇటీవల సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. ప్రస్తుతం ఆ వాదనలను జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు బలపరుస్తున్నట్లు కనిపిస్తోంది. రాజకీయ వ్యతిరేకత శత్రుత్వంగా మారకూడదు.. రాజకీయ వ్యతిరేకత అనేది శత్రుత్వం, శాసన పనితీరు నాణ్యతపై ప్రభావం చూపే విధంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ వ్యతిరేకత శత్రుత్వంగా మారకూడదని సూచించారు. ఇటీవల అలాంటి సంఘటనలు వెలుగు చూశాయని, అవి ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం సూచనలు కావన్నారు. ఇదీ చదవండి: Vice President Election 2022: వీడిన సస్పెన్స్.. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్ -
ఎర్రచందనం అక్రమ రవాణా.. హత్య కంటే తీవ్రం
తిరుపతి లీగల్: ఎర్రచందనం అక్రమ రవాణాను మనిషి హత్య కంటే తీవ్రమైన నేరంగా భావించి మరణశిక్ష విధించేలా చట్టంలో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. తిరుపతిలో ఎర్రచందనం కేసుల విచారణ నిమిత్తం గురువారం రెండు కోర్టులను ప్రారంభించిన అనంతరం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాలులో సమావేశం నిర్వహించారు. చదవండి: రాష్ట్రపతి ఎన్నికలో ఏపీ వాటా ఇదీ.. ప్రత్యేకతలెన్నో.. ఎన్నిక ఇలా.. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అత్యంత అరుదైన, విలువైన ఎర్రచందనం తిరుపతి శేషాచలం అడవుల్లో మాత్రమే లభిస్తుందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ అధికంగా ఉండడంవల్లే అక్రమ రవాణా జరుగుతోందన్నారు. స్మగ్లర్లు అటవీ సంపదను కొల్లగొట్టడమే కాకుండా ప్రజలకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా చట్టంలో శిక్షా కాలాన్ని, జరిమానాలను పెంచినా అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడలేదన్నారు. సత్వర న్యాయం అందించాలి.. న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల పాత్ర ఎంత ఉందో.. న్యాయవాదుల పాత్ర అంతే ఉందన్నారు. న్యాయవాదులు కేసులను వాయిదాలు తీసుకోకుండా కేసుల పరిష్కారానికి సహకరించాలన్నారు. భవిష్యత్తు డిజిటల్ వైపు పరుగులు తీస్తోందని, అందుకు తగ్గట్లుగా సీనియర్, జూనియర్ న్యాయవాదులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. ఇక దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టుల్లో 195 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండగా అందులో 167 పోస్టుల్లో హైకోర్టు న్యాయమూర్తులను నియమించినట్లు తెలిపారు. 11మంది సుప్రీంకోర్టు జడ్జిలను నియమించామన్నారు. 180 న్యాయమూర్తుల నియామక ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నట్లు సీజేఐ తెలిపారు. కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయి న్యాయమూర్తుల పనిలేకుండా కోర్టులు మాత్రమే ఉండేటట్లు భవిష్యత్తులో జరగాలని జస్టిస్ ఎన్వీ రమణ ఆకాంక్షించారు. కేసుల సంఖ్య పెరుగుతోంది : హైకోర్టు సీజేఐ అనంతరం, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోందని, ప్రధానంగా ఐదు జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు త్వరలో ఎర్రచందనం కేసుల విచారణకు మరికొన్ని కోర్టులను ఏర్పాటుచేస్తామన్నారు. అనంతరం సీజేఐని న్యాయమూర్తులు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల న్యాయవాదుల సంఘాల కార్యవర్గ సభ్యులు, న్యాయశాఖ ఉద్యోగులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పోర్ట్ఫోలియో జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి, బదిలీపై వెళ్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమానుల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా జడ్జి భీమారావ్, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, హైకోర్టు రిజి్రస్టార్ దుప్పల వెంకటరమణ, తిరుపతి న్యాయవాదుల సంఘ అధ్యక్షులు దినకర్, స్థానిక న్యాయమూర్తులు, న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయశాఖ సిబ్బంది, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు.. ఎర్రచందనం కేసుల విచారణకు ఏర్పాటుచేసిన రెండు కోర్టులను ప్రారంభించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక కోర్టు సెషన్స్ జడ్జిగా ఎన్.నాగరాజు, స్థానిక నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గ్రంధి శ్రీనివాస్ ఇన్చార్జ్ న్యాయమూర్తిగా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. మరిన్ని కోర్టులు ఏర్పాటుచేయాలి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎర్రచందనం కేసుల విచారణకు తాజాగా ఏర్పాటుచేసిన రెండు కోర్టులే కాకుండా మరిన్ని కోర్టులను రాష్ట్ర హైకోర్టు ఏర్పాటుచేయాలని సీజేఐ సూచించారు. కోర్టులతో పాటు న్యాయమూర్తులు, న్యాయ శాఖ సిబ్బంది నియామకాలు వెంటనే జరగాలని అభిప్రాయపడ్డారు. కోర్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతమిస్తున్న నిధులను పెంచాలన్నారు. ఇన్ని రోజులు ఎర్రచందనం విచారణకు ప్రత్యేక కోర్టు లేకపోవడంతో ప్రస్తుతం 2,340 కేసులకు పైగా పెండింగ్లో ఉన్నాయన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు అమాయక ప్రజలు వెళ్లకుండా అటవీ శాఖ సిబ్బంది అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్జీఓలను నియమించి అక్రమ రవాణాను ఆపాలని సీజేఐ సూచించారు. అడవులను కొల్లగొట్టడంవల్ల మానవజాతికి కలిగే దు్రష్పభావాలను అందరూ గమనించాలన్నారు. ఇక తుడా కాంప్లెక్స్లోని రెండు భవనాలను రెండు కోర్టుల ఏర్పాటుకు తక్కువ అద్దెకు ఇవ్వడానికి అంగీకరించిన చంద్రగిరి ఎమ్మెల్యే, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి సీజేఐ కృతజ్ఞతలు తెలిపారు. -
వికేంద్రీకరణతో సత్వర న్యాయం: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాల వికేంద్రీకరణతో ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. న్యాయవాదులు, కక్షిదారులు దీన్ని వినియోగించుకోవాలని సూచించారు. గురువారం హై కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మతో కలసి 32 జ్యుడీషియల్ జిల్లా కోర్టులను వర్చువల్గా ప్రారంభించిన అనంతరం సీజేఐ మాట్లాడారు. తగ్గనున్న కేసుల భారం ‘జిల్లా కోర్టుల్లో వేల సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో సత్వర న్యాయం అందించలేని పరిస్థితి. జిల్లా కోర్టుల విభనజతో భారం తగ్గి త్వరగా న్యాయం అందే అవకాశం లభించింది. కొత్త కోర్టుల ఏర్పాటుకు తగినట్లు న్యాయమూర్తులు, సిబ్బంది నియామకానికి సీఎం ఆమోదించడం శుభ పరిణామం. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటు, హైకోర్టులో సిబ్బంది పెంపు ఇలా న్యాయవ్యవస్థ పటిష్టతలో దేశానికి తెలంగాణ తలమానికంగా నిలిచింది. హైదరాబాద్లో వాణిజ్య కోర్టుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ ఐటీకి పేరుగాంచింది. కోర్టుల్లోనూ ఐటీ సేవలను వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు. వారికి నాణ్యమైన విద్య, వైద్యంతో పాటు న్యాయం అందించడం మన బాధ్యత ’అని సీజేఐ వివరించారు. త్వరలో మరో ఇద్దరు న్యాయమూర్తులు ‘సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి న్యాయవ్యవస్థను ప్రజలకు చేరువ చేయడానికి శాయశక్తుల కృషి చేస్తున్నా. న్యాయవ్యవస్థపై విశ్వాసం కలిగించేందుకు, అవగాహన పెంచేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి కొంతవరకు సఫలీకృతం అయ్యా. ప్రజలు ఆస్పత్రికి, ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినట్లు న్యాయస్థానాలను ఆశ్రయించేలా తీర్చిదిద్దాం. 111 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించా. 194 హైకోర్టు ఖాళీలకు సిఫారసు చేయగా, కేంద్రం 152కు ఆమోదం తెలిపింది. వీరిలో 33 మంది మహిళలు ఉన్నారు. తెలంగాణకు సంబంధించి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచాం. అలాగే ఇప్పటివరకు 19 మంది న్యాయమూర్తులను నియమించాం. మరో ఇద్దరిని త్వరలో నియమించనున్నాం. ఇందులో సామాజిక న్యాయం, మహిళా సాధికారతకు పెద్దపీట వేశాం..’అని తెలిపారు. ప్రజా సమస్యలకు పరిష్కారం: సీఎం ‘గతంలో తెలంగాణ హైకోర్టు ప్రారంభానికి ఇక్కడికి వచ్చా. మళ్లీ ఇప్పుడు 32 జ్యుడీషియల్ జిల్లా కోర్టుల ప్రారంభం సందర్భంగా రావడం ఆనందదాయకం. తలసరి ఆదాయం, ఐటీ, జీఎస్డీపీ, వ్యవసాయం, పరిశ్రమలు సహా అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగమనంలో దూసుకుపోతోంది. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని సీజేఐని కోరాం. ఆయన చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడి వెంటనే నియామకం చేపట్టారు. ఇది హైకోర్టు పటిష్టతకు దోహదం చేసింది. 32 జ్యుడీషియల్ జిల్లా కోర్టుల ఏర్పాటుతో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలకు స్వతంత్ర కోర్టులు రానున్నాయి. ఉమ్మడి జిల్లాలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నా స్వస్థలం మెదక్ జిల్లా సిద్దిపేట. మా దగ్గరి నుంచి సంగారెడ్డి కోర్టుకు వెళ్లాలంటే 150 కి.మీ.లు పోవాలి. ఎన్నో పాట్లు పడాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో పరిపాలనా సంస్కరణల్లో భాగంగా 33 జిల్లాలుగా విభజించాం. ములుగు, భూపాలపల్లి చిన్న ప్రాంతాలే అయినా జిల్లాలుగా ఏర్పాటు చేశాం. న్యాయస్థానాల వికేంద్రీకరణ, సత్వర న్యాయంతో ప్రజలకు చిక్కులు తొలగిపోతాయి..’అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. చదవండి: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు పరిధి దాటితే ఉపేక్షించం.. ‘న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలంటే న్యాయమూర్తుల నియామకంతో పాటు ఇతర వసతులు ఉండాలి. దీనిపై ఏప్రిల్లో జరిగిన సీఎం, హైకోర్టు సీజేల భేటీలో అందరూ ఏకాభిప్రాయం వెలిబుచ్చారు. అయితే కొంత అవగాహన లోపంతో జాతీయ న్యాయ వ్యవస్థ నిర్మాణం జరగడం లేదు. ఈ సమావేశంలో అందరి ఏకాభిప్రాయంతో దీనిపై తీర్మానం చేయాలని భావించినా సాధ్యంకాలేదు. ఇది కార్యరూపం దాలిస్తే రాష్ట్రాలకు మంచి జరిగేది. న్యాయవ్యవస్థ కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసేది కాదు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగబద్ధంగా పనిచేస్తోంది. ఇటీవలి కాలంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపై అభాండాలు వేయడం తేలికైపోయింది. కోర్టు తీర్పులకు, ప్రభుత్వ ఆదేశాలకు వక్రభాష్యం చెప్పడం పరిపాటిగా మారింది. ఇది దురదృష్టకరం. పరిధి దాటనంత వరకు న్యాయవ్యవస్థకు అందరూ మిత్రులే. పరిధి దాటితే ఉపేక్షించడం రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్యం నిలబడాలంటే న్యాయవ్యవస్థ చాలా ముఖ్యం. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది..’అని సీజేఐ చెప్పారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి: హైకోర్టు సీజే ‘కొత్త జ్యుడీషియల్ కోర్టుల ఏర్పాటుతో ప్రజలకు ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. న్యాయ వ్యవస్థ మరింత బలపడుతుంది’అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ నవీన్రావు, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ శ్రీదేవి, జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.లలిత, జస్టిస్ శ్రీసుధ, జస్టిస్ సుమలత, ఇతర న్యాయమూర్తులు, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నం అశోక్గౌడ్, కా ర్యదర్శులు కల్యాణ్రావు, సుజన్కుమా ర్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ సీఎస్పై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం
న్యూఢిల్లీ: ఢిల్లీలో ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సంయుక్త సదస్సు సందర్భంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని న్యాయవ్యవస్థ సమస్యల పరిష్కారంపై సీఎం, హైకోర్టు సీజే పలు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని అమలు చేయకుండా పెండింగ్లో ఉంచడంపై సీరియస్ అయ్యారు. తమ వ్యక్తిగత పనుల కోసం అడగడం లేదని.. న్యాయవ్యవస్థ బలోపేతం కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. కోర్టుల్లో దయనీయమైన పరిస్థితులు ఉన్నాయని ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కోర్టుల్లో ఒక న్యాయవాది లోపలకు వెళ్లి వెనక్కు వస్తే తప్ప మరొకరు వచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన తెలంగాణ న్యాయశాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ అంశాలను తాను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. చదవండి👉 (పంజాబ్లో టెన్షన్.. టెన్షన్.. ఇంటర్నెట్ సేవలు బంద్) -
ముఖ్యమంత్రులు-న్యాయమూర్తుల సంయుక్త సదస్సు 2022 (ఫొటోలు)
-
కోర్టుల్లో స్థానిక భాషలకు ఊతం
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ప్రోత్సహించడం చాలా ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తద్వారా ప్రజలు న్యాయ ప్రక్రియతో అనుసంధానమైనట్లు భావిస్తారని, వారిలో విశ్వాసం పెరుగుతుందని అన్నారు. అంతిమంగా న్యాయ ప్రక్రియపై ప్రజల హక్కు బలపడుతుందని తెలిపారు. ఇప్పటికే సాంకేతిక విద్యలో స్థానిక భాషలను ప్రోత్సహిస్తున్నట్లు గుర్తుచేశారు. చట్టాల గురించి సులభమైన భాషలో అర్థమయ్యేలా వివరించాలన్నారు. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో ప్రధాని ప్రారంభోపన్యాసం చేశారు. అండర్ ట్రయల్ ఖైదీల కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సూచించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... సదస్సుకు చాలా సీనియర్ని ‘‘దేశంలో న్యాయ వ్యవస్థ రాజ్యాంగ సంరక్షకుడి పాత్ర పోషిస్తోంది. సీఎంలు, సీజేల సంయుక్త సదస్సు రాజ్యాంగ సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం. నేను చాలాకాలంగా ఈ సదస్సుకు వస్తున్నా. మొదట ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రధానమంత్రిగా సదస్సుకు హాజరవుతున్నా. ఒకరకంగా చెప్పాలంటే ఈ సదస్సు విషయంలో నేను చాలా సీనియర్ని. డిజిటల్ ఇండియా మిషన్ డిజిటల్ ఇండియా మిషన్లో భాగంగా న్యాయ వ్యవస్థలో సాంకేతికతకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని సీఎంలు, ప్రధాన న్యాయమూర్తులు మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఈ–కోర్టుల ప్రాజెక్టును మిషన్ మోడ్లో అమలు చేస్తున్నాం. న్యాయ వ్యవస్థతో డిజిటల్ ఇండియాను అనుసంధానించాలి. బ్లాక్చెయిన్లు, ఎలక్ట్రానిక్ డిస్కవరీ, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోఎథిక్స్ వంటి సబ్జెక్టులను అనేక దేశాల్లో న్యాయ విశ్వవిద్యాలయాల్లో బోధిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత్లోనూ న్యాయ విద్యను అందించడం మన బాధ్యత. చట్టాల్లో సంక్లిష్టతలు, వాడుకలో లేని చట్టాలు చాలా ఉన్నాయి. 2015లో ప్రభుత్వం 1,800 చట్టాలను అప్రస్తుతంగా గుర్తించి ంది. ఇప్పటికే 1,450 చట్టాలను రద్దు చేశాం. పెండింగ్ కేసులకు మధ్యవర్తిత్వం స్థానిక కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఒక ముఖ్యమైన సాధనం. మన సమాజంలో మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం వేల సంవత్సరాలుగా ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మధ్యవర్తిత్వ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది.’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఖాళీల భర్తీకి కృషి చేస్తున్నాం మన దేశం స్వాతంత్య్రం పొంది 2047 నాటికి 100 ఏళ్లు పూర్తవుతుంది. అప్పుడు దేశంలో ఎలాంటి న్యాయ వ్యవస్థను చూడాలనుకుంటున్నాం? 2047 నాటికి దేశ ఆకాంక్షలను నెరవేర్చగలిగేలా మన న్యాయ వ్యవస్థను ఎలా సమర్థంగా తీర్చిదిద్దాలి? ఈ ప్రశ్నలే ఈ రోజు ప్రాధాన్యతగా ఉండాలి. అమృత్ కాల్లో మన విజన్(దార్శనికత) అంతా సులభ న్యాయం, సత్వర న్యాయం, సమ న్యాయం కల్పించే న్యాయ వ్యవస్థపై ఉండాలి. న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివిధ స్థాయిల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నాం. Delhi | PM Narendra Modi, Union Minister of Law & Justice Kiren Rijiju and Chief Justice of India NV Ramana attend the Joint Conference of CMs of States & Chief Justices of High Courts at Vigyan Bhawan pic.twitter.com/cmawTEOWOl — ANI (@ANI) April 30, 2022 న్యాయ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం ♦ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ♦ ప్రత్యక్షంగా ఎన్నికైన వారిని ♦ అందరూ గౌరవించాల్సిందే ♦ కోర్టుల నిర్ణయాలను ప్రభుత్వాలు ♦ ఏళ్ల తరబడి అమలు చేయట్లేదు ♦ అందుకే వ్యాజ్యాలు పెరుగుతున్నాయ్ సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని, అందుకు మరిన్ని చర్యలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకొన్న ప్రతినిధులను అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. కోర్టుల నిర్ణయాలు ఏళ్ల తరబడి అమలు కాకపోవడం వల్లే ప్రభుత్వాలపై ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాల విధి నిర్వహణ వైఫల్యం వల్ల కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. శనివారం ఢిల్లీలో రాష్ట్రాల సీఎంలు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్ర స్థాయిలో స్పెషల్ పర్సస్ వెహికల్స్ ఏర్పాటు చేయాలన్నారు. సీఎంలు లేదా వారి తరపు ప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలన్నారు. ఇందుకు ముఖ్యమంత్రులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలున్న ప్రజాప్రతినిధుల నుంచి ఎంతో నేర్చుకొనే అవకాశం వచ్చిందని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. న్యాయ వ్యవస్థ పనితీరును మెరుగుపర్చడానికి, ప్రస్తుతం ఉన్న సవాళ్లను గుర్తించి, పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని వివరించారు. సదస్సులో ఆయన ఇంకా ఏం చెప్పారంటే... పెండింగ్ కేసులు 4.11 కోట్లు: న్యాయ వ్యవస్థలో ఖాళీలను త్వరగా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. న్యాయమూర్తులు–జనాభా నిష్పత్తిని పెంచేందుకు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కృషి చేయాలి. అన్ని హైకోర్టుల్లో 1,104 జడ్జీల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయగా, ప్రభుత్వం 388 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీల భర్తీకి నేను పదవిలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రయత్నిస్తున్నా. మరోవైపు ఈ ఆరేళ్లలో పెండింగ్ కేసుల సంఖ్య 2.65 కోట్ల నుంచి 4.11 కోట్లకు పెరిగింది. ‘పిల్’ దుర్వినియోగం కోర్టుల్లో అనవసరమైన వ్యాజ్యాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) కొన్నిసార్లు వ్యక్తిగత ప్రయోజనాల వ్యాజ్యాలుగా మారుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజా ప్రయోజనాలను కాపాడాల్సిన ‘పిల్’ను కొన్నిసార్లు ప్రాజెక్టులను నిలిపివేయడానికి, ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకురావడానికి దుర్వినియోగం చేస్తున్నారు. రాజకీయ అవసరాలు నెరవేర్చుకోవడానికి, కార్పొరేట్లపై కక్ష తీర్చుకోవడానికి ‘పిల్’ ఓ సాధనంగా మారడం విచారకరం. కోర్టుల్లో భాషాపరమైన అడ్డంకులు తొలగించడం, సంస్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఖాళీల భర్తీ, న్యాయ వ్యవస్థ బలాన్ని పెంపొందించడం వంటివి తక్షణావసరం’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. కోర్టుల్లో స్థానిక భాషలు.. ఒక్కరోజులో సాధ్యం కాదు కోర్టుల్లో స్థానిక భాషను ప్రవేశపెట్టడం వంటిసంస్కరణలను అమలు చేయడం ఒక్కరోజులో సాధ్యం కాదని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. కొన్ని ప్రతికూలతలు ఉన్నందువల్ల దాన్ని అమలు చేయడానికి కొంత సమయం పడుతుందన్నారు. -
ఖాళీల భర్తీకి పేర్లు పంపండి: సీజే ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మహమ్మారి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలకు న్యాయ సేవలు అందించేందుకు న్యాయ వ్యవస్థ తన వంతు కృషి చేసిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. సమష్టి కృషితో వివిధ కోర్టుల్లో ఏడాదిలో 126 జడ్జీ పోస్టులను భర్తీ చేయగలిగామని అన్నారు. త్వరలో మరో 50 నియామకాలను పూర్తి చేస్తామని తెలిపారు. ఆరేళ్ల విరామం తర్వాత శుక్రవారం ఢిల్లీలో జరిగిన 39వ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. న్యాయ నిర్వహణను ప్రభావితం చేసే సమస్యలను గుర్తించి, చర్చించడం హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. హైకోర్టుల్లో ఇంకా ఖాళీలు ఉన్నాయని, వీటి భర్తీ కోసం వీలైనంత త్వరగా పేర్లను పంపించాలని, అందులో సామాజిక వైవిధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తులకు సూచించారు. హైకోర్టుల నుంచి ప్రభుత్వానికి 100 ప్రతిపాదనలు గత ఏడాది కాలంలో సుప్రీంకోర్టుకు 9 మంది నూతన న్యాయమూర్తులు, హైకోర్టులకు 10 మంది నూతన ప్రధాన న్యాయమూర్తులు వచ్చారని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి సంబంధించి కొన్ని హైకోర్టుల స్పందన ప్రోత్సాహకరంగా ఉందన్నారు. గతేడాది తాను సీజేఐగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైకోర్టుల్లో నియామకాల కోసం కొలీజియం ఇప్పటివరకు 180 సిఫార్సులు చేసిందని, ఇందులో 126 నియామకాలు జరిగాయని వెల్లడించారు. మరో 54 ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఆమోదం కోసం ఉన్నాయని చెప్పారు. వివిధ హైకోర్టుల నుండి ప్రభుత్వానికి దాదాపు 100 ప్రతిపాదనలు అందాయన్నారు. అయితే అవి ఇంకా సుప్రీం కోర్టుకు చేరలేదన్నారు. మిగిలిన 212 ఖాళీల భర్తీకి ప్రతిపాదనలను పంపే ప్రక్రియను వేగవంతం చేయాలని హైకోర్టులకు స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి వల్ల ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ ప్రదర్శించిన పట్టుదల, ధృఢ సంకల్పంతో న్యాయస్థానాల పనితీరు దెబ్బతినకుండా చూసుకోగలిగామని హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో కోర్టుల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడకుండా స్థిరమైన ఆన్లైన్ వ్యవస్థలను అభివృద్ధి చేశామన్నారు. సుప్రీంకోర్టులో వినూత్నమైన ఫాస్టర్ సిస్టమ్ను ప్రవేశపెట్టామని జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు. 2016లో జరిగిన ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో ఆమోదించిన తీర్మానాల్లో సాధించిన పురోగతిని సమీక్షించారు. ఐటీ, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, దేశంలోని అన్ని కోర్టు సముదాయాల కనెక్టివిటీ, మానవ వనరులు, జిల్లా కోర్టులు, మౌలిక సదుపాయాలు, కోర్టుల సామర్థ్యం పెంపు వంటి అంశాలపై చర్చించారు. సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ సహా అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొన్నారు. నేడు సీఎంలు, చీఫ్ జస్టిస్ల సదస్సు న్యూఢిల్లీ: రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ల ప్రధాన న్యాయమూర్తుల ఉమ్మడి సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హాజరవుతారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే ఈ సదస్సులో దేశంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రధానంగా చర్చిస్తారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలంటూ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన ప్రతిపాదనను సదస్సు ఎజెండాలో చేర్చారు. న్యాయస్థానాల్లో ఖాళీల భర్తీ, పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడం, ప్రజలకు న్యాయ సహాయం, న్యాయ సేవలు, ఈ–కోర్టుల ఏర్పాటు వంటి కీలక అంశాలపైనా చర్చించనున్నారు. ప్రారంభోత్సవంలో జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రసంగిస్తారు. సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ తరఫున సీఎం కేసీఆర్ బదులుగా న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పాల్గొననున్నారు. -
‘సత్వర న్యాయం’ దిశగా అడుగులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పౌరులకు సత్వర న్యాయం అందించే దిశగా జరిగే ప్రయత్నాల సమర్థ సమన్వయం కోసం జరిగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల çసంయుక్త సదస్సుకు రంగం సిద్ధమైంది. ఆరేళ్ల తర్వాత ఈ నెల 30న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. నేషనల్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఏర్పాటు ప్రధాన ఎజెండాగా ఈ సదస్సు కొనసాగనుంది. సమావేశంలో రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థలను ఏకీకృతం చేసేందుకు ఉమ్మడి కార్యాచరణను తీసుకొచ్చే దిశగా జరిగే ప్రయత్నాలపై చర్చించనున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీ రమణ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ప్రసంగిస్తారు. ప్రారంభ సమావేశం తర్వాత సదస్సు ఎజెండాపై ముఖ్యమంత్రులు, హైకోర్టుల సీజేలు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు చర్చలు జరుగుతాయి. దేశంలోని న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు నేషనల్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని సీజేఐ రమణ గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి సూచనలుచేశారు. న్యాయస్థానాల్లో సరైన మౌలిక సదుపాయాలు కొరవడి న్యాయపాలికల పనితీరు వెనుకబడిందని, ఈ సమస్యలన్నింటికీ అథారిటీ ఏర్పాటే పరిష్కారమని సీజేఐ వ్యాఖ్యానించారు. అథారిటీ ఏర్పాటుతో కేసులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. హైకోర్టులు, కింది కోర్టుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కీలకపాత్ర పోషిస్తున్నందున వారి అభిప్రాయాల కోసం ఈ ప్రతిపాదనను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పంపింది. త్వరగా కోర్టుల్లోని జడ్జి పోస్టులను భర్తీచేయాలని డిమాండ్లు ఎక్కువయ్యాయి. కరోనా నేపథ్యంలో కోర్టుల్లో వేల సంఖ్యలో కేసులు దాఖలయ్యాయి. దీనిపై సదస్సులో చర్చించనున్నారు. సీఎం, సీజేల సదస్సు సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సు తొలిసారిగా 1992లో అప్పటి ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు, జస్టిస్(రిటైర్డ్) మధుకర్ హీరాలాల్ కనియా సీజేఐగా ఉన్నపుడు జరిగింది. 2016 ఏప్రిల్ 24న చివరిసారిగా సదస్సు జరిగింది. ఇందులో సబార్డినేట్ కోర్టుల మౌలిక సదుపాయాలు, నేషనల్ మిషన్ ఫర్ జ్యుడీషియల్, సెలవు రోజుల్లో కోర్టుల పనితీరు, ట్రయల్ ఖైదీలకు సంబంధించిన ప్రత్యేక సూచనలతో జైళ్ల పరిస్థితులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమలు, న్యాయ–సహాయ కార్యక్రమాల బలోపేతం, హైకోర్టుల్లో ఖాళీల భర్తీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. నేడు సీజేల సమావేశం సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ, 25 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల 39వ సీజేల సమావేశం నేడు ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశం సైతం ఆరేళ్ల తర్వాత నిర్వహిస్తుండటం గమనార్హం. హైకోర్టుల్లో జడ్జీల నియామకాలు, సిబ్బంది కొరత, దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల మధ్య నెట్వర్క్ సమన్వయం మరింత పటిష్టవంతం చేయడం వంటి ప్రధాన అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. -
మూడు నెలల్లో.. ముగ్గురు సీజేలు!
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మూడు నెలల స్వల్ప వ్యవధిలో ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులను చూడబోతోంది. ఇద్దరు సీజేలు రిటైర్ కానుండటంతో ఈ అరుదైన సందర్భం రాబోతోంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీ కాలం ఆగస్టు 16తో ముగుస్తుంది. ఆయన తర్వాత జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నవంబర్ 8 వరకు దాదాపు రెండు నెలల పాటు సీజేగా కొనసాగుతారు. ఆ తర్వాత జస్టిస్ డివై చంద్రచూడ్.. ప్రధాన న్యాయమూర్తి అవుతారు. ఆయన రెండు సంవత్సరాల పాటు పదవీలో ఉంటారు. ఇంత తక్కువ వ్యవధిలో దేశం ముగ్గురు వేర్వేరు సీజేలను చూడటం ఇదే మొదటిసారి కానప్పటికీ.. ప్రధాన న్యాయమూర్తుల పదవీకాలానికి సంబంధించిన సమస్య మరోసారి తెరమీదకు వచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీకాలాన్ని కనీసం మూడేళ్లకు పెంచడంతోపాటు ప్రస్తుతం ఉన్న పదవీ విరమణ వయస్సును 65 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచడంపై చర్చలు జరుగుతున్నాయి. మరికొద్ది నెలల్లో ఇతర న్యాయమూర్తులు కూడా పదవీ విరమణ చేయబోతున్నందున సుప్రీంకోర్టులో మరిన్ని ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు. న్యాయమూర్తుల పదవీకాలం తక్కువగా ఉండటం వల్ల పెండింగ్ కేసులు అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయి. ఇప్పటికే 3 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొత్తగా వచ్చిన సీజేలకు తగింత సమయం ఉండకపోవడంతో కొత్త మార్పులను సమర్థవంతంగా అమలు చేయలేకపోతున్నారు. ప్రస్తుత వ్యవస్థను మరింత మెరుగ్గా నడిపించడానికి అవరసరమైన విధానాలను రూపొందించడానికి వీలు పడటం లేదు. చరిత్ర సృష్టించనున్న చంద్రచూడ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యలు చేపట్టనున్న జస్టిస్ డివై చంద్రచూడ్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. తండ్రీకొడుకులు సీజేలు సేవలు అందించిన అరుదైన ఖ్యాతిని వారు దక్కించుకోనున్నారు. ఆయన తండ్రి జస్టిస్ వైవి చంద్రచూడ్.. 1978, ఫిబ్రవరి నుంచి 1985, జూలై వరకు సీజేగా సేవలు అందించారు. (క్లిక్: రక్షణ వ్యయంలో ఆ మూడు దేశాలే టాప్!) రానున్న నెలల్లో భారీగా ఖాళీలు సుప్రీంకోర్టులో ప్రస్తుతం రెండు న్యాయమూర్తుల పదవులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. రానున్న నెలల్లో ఈ ఖాళీల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. జస్టిస్ వినీత్ శరణ్ మే 10న, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు జూన్ 7న, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ జూలై 29న పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీంకోర్టులో ఉన్న నలుగురు మహిళా న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ ఇందిరా బెనర్జీ సెప్టెంబర్ 23న రిటైర్ కానున్నారు. జస్టిస్ హేమంత్ గుప్తా అక్టోబర్ 16న పదవీ విరమణ చేయనున్నారు. భారత్లోనే తక్కువ! ఇతర దేశాల్లోని న్యాయమూర్తుల పదవీకాలంతో పోలిస్తే భారతీయ న్యాయమూర్తుల పదవీకాలం తక్కువ. జడ్జిల పదవీ విరమణ వయసు యూకేలో 75, కెనడాలో 70 సంవత్సరాలుగా ఉంది. ఆస్ట్రేలియా, బెల్జియం, నార్వే వంటి దేశాలల్లోనూ న్యాయమూర్తులు 70 సంవత్సరాల వయస్సు వరకు పని చేస్తారు. అమెరికా, రష్యా, న్యూజిలాండ్, ఐస్లాండ్ దేశాల్లో న్యాయమూర్తులు జీవితకాలం సేవలు అందించే అవకాశముంది. (క్లిక్: అంగన్వాడీలు గ్రాట్యుటీకి అర్హులే..) -
గచ్చిబౌలిలో న్యాయాధికారుల సమావేశం ప్రారంభం
-
మధ్యవర్తిత్వంతో న్యాయవ్యవస్థలో మార్పులు
కెవాడియా (గుజరాత్): మధ్యవర్తిత్వంతో పాటు ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారం (ఏడీఆర్) యంత్రాంగాన్ని అమలు చేస్తే భారత న్యాయవ్యవస్థలో సమూల మార్పులు వస్తాయని, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. అయితే ఇందులో ఉండే కొన్ని చిక్కుముళ్ల వల్ల దీనికి విస్తృత స్థాయిలో ఆమోదం ఉండాలన్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కూడా కోర్టు కేసుల పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని పేర్కొన్నారు. గుజరాత్లోని ఐక్యతా విగ్రహం దగ్గర టెంట్ సిటీలో మధ్యవర్తిత్వం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే అంశంపై శనివారం జరిగిన సదస్సులో రాష్ట్రపతి కోవింద్, సీజేఐ జస్టిస్ రమణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
ఏపీ విభజన కేసు విచారిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విభజనకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ దాఖలు చేసిన సవరణ పిటిషన్ను విచారిస్తామని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ చెప్పారు. శుక్రవారం సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమ కోహ్లిల ధర్మాసనం ముందు ఉండవల్లి అరుణ్కుమార్ న్యాయవాదులు ప్రశాంత్భూషణ్, రమేశ్ అల్లంకి ఈ అంశాన్ని ప్రస్తావించారు. 2014లో ఏపీ విభజన పూర్తికాలేదని, విభజన చట్టం కొట్టేయాలని ఉండవల్లి అరుణ్కుమార్, మరికొంతమంది పిటిషన్లు దాఖలు చేశారని న్యాయవాదులు తెలిపారు. ఆ సమయంలో జస్టిస్ హెచ్.ఎల్.దత్తు ప్రతివాదులకు నోటీసులు జారీచేశారని, కానీ ఆ పిటిషన్లపై ఇప్పటివరకు విచారణ జరగలేదని చెప్పారు. 2019లో ఉండవల్లి ఎర్లీ హియరింగ్ అప్లికేషన్ దాఖలు చేసినా ఇప్పటివరకు జాబితాలోకి రాలేదని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో తమ ప్రేయర్ను సవరిస్తూ పిటిషన్ వేశామన్నారు. 2014లో ఏపీ విభజన జరిగింది.. తప్పోఒప్పో ఏపీ విభజన జరిగిపోయిందని, భవిష్యత్తులో రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పాటించాల్సిన మార్గదర్శకాలు సూచించాలని కోరామన్నారు. అదే సమయంలో విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఆర్థికంగా సాయం చేయాలని సవరణ పిటిషన్ వేసినట్లు వివరించారు. తక్షణమే విచారించాలని తాము కోరడం లేదని, ఏదో ఒకరోజు తేదీని నిర్ణయించాలని న్యాయవాదులు అభ్యర్థించారు. సవరణ పిటిషన్ విచారణకు తేదీ కేటాయిస్తామని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ తెలిపారు. -
విజేత సీజేఐ ఎలెవెన్
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం టీ–20 క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించారు. మోడర్న్ స్కూల్ గ్రౌండ్లో సీజేఐ ఎలెవెన్, ఎస్బీఏ ఎలెవెన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన సీజేఐ–ఎలెవన్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా సుప్రీం బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) ప్రెసిడెంట్ వికాస్ సింగ్ వేసిన కొన్ని బంతులను సీజేఐ ఆడారు. సీజేఐ ఎలెవన్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా, లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎస్సీబీఏ ఎలెవెన్ జట్టు 12.4 ఓవర్లలో 88 పరుగులకు ఆలౌటైంది. -
శ్రీశైలంలో సీజేఐ ఎన్వీ రమణ ప్రత్యేక పూజలు
-
హిజాబ్ అంశాన్ని పెద్దది చేయకండి: సుప్రీం కోర్టు
కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్ వ్యవహారంపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో చెప్పింది. హిజాబ్ వివాదంలో జోక్యం చేసుకునేందుకు ఇది సరైన సమయం కాదని పేర్కొంది. ఈ మేరకు పిటిషన్ను తోసిపుచ్చుతూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. సాక్షి, న్యూఢిల్లీ: పిటిషన్పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. హిజాబ్ అంశంపై కర్ణాటక హైకోర్టును విచారణ చేయనివ్వండి. ఆదేశాలు వెలువడక ముందే ఏం చేయగలం?. ఏమి జరుగుతుందో మాకు తెలుసు. దయచేసి ఈ అంశాన్ని పెద్దది చేయొద్దు. అసలు ఈ అంశాన్ని జాతీయ స్థాయి.. ఢిల్లీకి తీసుకురావడం సరైందేనా? ఒక్కసారి ఆలోచించండి. దేశ పౌరులు అందరి ప్రాథమిక హక్కులను కాపాడేందుకే మేము ఇక్కడ ఉన్నాం. సరైన సమయంలో తప్పకుండా వాదనలు వింటాం. హిజాబ్ వ్యవహారాన్ని పెద్దది చేయకండి’’ అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. కర్ణాటక ప్రభుత్వం ముస్లిం స్టూడెంట్స్ హిజాబ్తో ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి అనుమతించకపోవడం తెలిసిందే. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు విచారిస్తోంది. అంతేకాదు విచారణ ముగిసే వరకు ఎవరూ మతపరమైన వస్త్రధారణతో రావద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ పై తదుపరి విచారణను ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఆదేశాలతో ముస్లిం మహిళలకే నష్టమని, దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని ఓ విద్యార్థి పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్ విచారణకు సుప్రీం నో చెప్పింది. ఇదే పిటిషన్పై వాదనల సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. కర్ణాటక హైకోర్టు ఇంకా ఆదేశాలు (తుది) ఇవ్వకుండా.. సుప్రీం కోర్టులో ఎలా సవాలు చేస్తారు? అని ప్రశ్నించారు. హైకోర్టును తేల్చనీయండి. దీన్ని రాజకీయం, మతపరం చేయవద్దు అని తుషార్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. గురువారం ఫాతిమా బుష్రా అనే విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్ను సైతం సుప్రీం తోసిపుచ్చింది. ఆమె తరపున వాదనలు వినిపించిన కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. ఈ అంశం దేశవ్యాప్తంగా వ్యాపిస్తోందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ‘‘మేం పరిశీలిస్తాం’ అంటూ చీఫ్ జస్టిస్ రమణ అన్నారు. -
విషయాన్ని పెద్దది చేయాలనే ప్రయత్నాలు వద్దు: సీజేఐ
-
ఏడుగురు న్యాయవాదులకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి పదోన్నతి
సాక్షి, న్యూఢిల్లీ: ఏడుగురు న్యాయవాదులకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు మేరకు సోమవారం జాబితా విడుదలైంది. జడ్జిలుగా పదోన్నతి పొందిన వాళ్లలో కొనగంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, రాజశేఖర్ రావు, సత్తి సుబ్బారెడ్డి, రవి చీములపాటి, వి.సుజాత ఉన్నారు. -
వార్తల్లో అభిప్రాయాలను జొప్పించొద్దు: సీజేఐ
ముంబై: సొంత అభిప్రాయాలతో కూడిన వార్తలు ప్రమాదకరమైనవని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ హెచ్చరించారు. ఆరోగ్యవంతమైన పజ్రాస్వామ్యానికి నిర్భయమైన, స్వతంత్య్రమైన పత్రికా వ్యవస్థ అవసరమని, అయితే వార్తలను ఊహలతో నింపడం వ్యవస్థకు ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. సొంత ఆలోచనలను వార్తాకథనాల్లోకి చొప్పించడం కూడదని, స్వీయ అభిప్రాయాలను నిజ నివేదికలకు దూరంగా ఉంచాలని జర్నలిస్టులకు సూచించారు. రెడ్ ఇంక్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అవార్డు పొందిన విజేతలను ఆయన అభినందించారు. స్వీయ భావాలు వార్తలను ప్రభావితం చేయకుండా పనిచేయాలని, ఒకరకంగా జర్నలిస్టులు సైతం న్యాయమూర్తులేనని ఆయన అన్నారు. నిజాలను మాత్రమే రిపోర్టు చేయాలని కోరారు. జడ్జిలను విలన్లుగా చూపడం వంటి విషయాలపై పరిశీలన చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, జాతీయ ప్రయోజనాల కోసం అంతా కలిసిపనిచేయాలని కోరారు. 2020 జర్నలిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు మరణానంతరం సిద్ధిఖీని ఎంపిక చేశారు. అఫ్గాన్లో రిపోర్టింగ్ చేస్తూ సిద్ధిఖీ తాలిబన్ కాల్పుల్లో మరణించారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు రమణ నివాళులర్పించారు. -
ప్రజల మనిషి నవలను చదివాను: సీజేఐ ఎన్వీ రమణ
సాక్షి, హైదరాబాద్: ప్రతిఒక్కరూ పుస్తకం చదివి, ఇతరులతో చదివించడాన్ని ఒక ఉద్యమంలా ముం దుకు తీసుకెళ్లాలని భారత ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ప్రపంచగతిని సాహిత్యమే మార్చిందని, ఎంతోమంది మహానుభావులు ప్రపంచాన్ని అర్థం చేసుకొని రాసిన గ్రం థాలే సమాజాలను ముందుకు నడిపించేందుకు దోహదం చేశాయని అన్నారు. గాంధీజీ, నెహ్రూ వంటి జాతీయనేతలు రాసిన పుస్తకాలు జాతీయోద్యమానికి స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు. హైదరాబాద్ 34వ జాతీయ పుస్తక ప్రదర్శన ముగింపు సందర్భంగా మంగళవారం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జస్టిస్ రమణ మాట్లాడుతూ చదివేవాళ్లు కరువవుతున్నారని, పుస్త కం భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన చెందుతున్న తరుణంలో వేలాదిమంది యువత పుస్తక ప్రదర్శనలో కనిపించడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. పుస్తకం భవిష్యత్తు ప్రశ్నార్థం కాబోదని, అది సజీవంగానే ఉంటుందనే ఆశ చిగురించిందని చెప్పారు. తాను చదువుకొనే రోజుల్లో కోఠిలోని నవయుగ, విశాలాంధ్ర వంటి పుస్తకాల షాపుల్లోనే పుస్తకాలు లభించేవని పేర్కొన్నారు. డిజిటల్ రీడింగ్ ప్రమాదకరం ఇప్పుడు చదవాల్సిన అవసరం లేకుండా, చదివి వినిపించే డిజిటల్ రీడర్స్ అందుబాటులోకి వచ్చాయని, కానీ ఈ పద్ధతి ప్రమాదకరమని జస్టిస్ రమణ చెప్పారు. పుస్తకాలు, పత్రికలు చదివినప్పుడే మేధోవికాసం లభిస్తుందని, తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలు పుస్తకాలను చదివేవిధంగా ప్రోత్సహించాలని సూచించారు. తాను చిన్నప్పుడు రోజూ గ్రంథాలయానికి వెళ్లి మూడు, నాలుగు గంటలపాటు పత్రికలు, పుస్తకాలు చదివేవాడినని పేర్కొన్నారు. ప్రస్తుతం స్కూళ్లలో గ్రంథాలయాలు, ఆటస్థలాలులేవని, వాటి ఏర్పాటుకు అందరూ కృషి చేయాలన్నారు.భావాల వ్యక్తీకరణకు లేఖలు రాయడానికి మించిన మార్గం లేదని చెప్పారు. నేనూ ఓ పుస్తకం రాస్తా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, తగి నన్ని నిధులు ఇవ్వాలని జస్టిస్ రమణ కోరారు. మహాకవి శ్రీశ్రీ 1930 నుంచే రచనలు చేసినప్పటికీ ఆయన మహాప్రస్థానం వెలువడిన తరు వాతే ఎంతోమంది చదివి చైతన్య వంతులయ్యా రని అన్నారు. పుస్తక ప్రచురణ సంస్థల కష్టాలు తనకు తెలుసునని, లా చదివే రోజుల్లో కొంతకాలంపాటు ‘నడుస్తున్న చరిత్ర’పత్రిక నిర్వహించి చాలా కష్టాలు పడ్డానని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎన్నో అద్భుతమైన పుస్తకాలు తెలుగులో వస్తున్నాయని, హైదరాబాద్ బుక్ ట్రస్టు ప్రచురించిన మేరీ టైలర్ జైలు జీవితం పుస్తకం చాలా బాగుందన్నారు. తాను చదువుకొనే రోజుల్లో అమ్మ నవలను ఎన్నోసార్లు చదివినట్లు చెప్పారు. పదవీ విరమణ అనంతరం పుస్తకాలు చదువుతానని, ఒక పుస్తకం కూడా రాస్తానని జస్టిస్ రమణ చెప్పారు. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా వెల్లంకికి చెందిన ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం వ్యవస్థాపకుడు, దాశరథీ పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృ తిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ కార్యదర్శి కోయ చంద్రమోహన్, కోశాధికారి పి.రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. తెలుగులోనే తీర్పులివ్వాలి మన తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టు తీర్పులను తెలుగు, హిందీ భాషల్లో వెలువరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. సుప్రీంకోర్టు తీర్పులను ఇప్పటికే కొంతకాలంగా ప్రాంతీయ భాషల్లోకి అనువదించి వెబ్సైట్లో ఉంచుతున్నట్లు చెప్పారు. తాను గతంలో హైకోర్టులో పనిచేసిన సమయంలో తెలుగులోనే తీర్పులివ్వాలనే ఉద్దేశంతో అప్పట్లో జూబ్లీహాలులో జడ్జిలకు సంవత్సరం పాటు శిక్షణ ఇప్పించామన్నారు. ఈ శిక్షణ పొంది తెలుగులోనే తీర్పులిచ్చిన వారిని అభినందించి, అవార్డులు కూడా అంద చేశామని ఆయన గుర్తుచేశారు. -
సీజేఐ ఎన్వీ రమణకు గవర్నర్ తేనీటి విందు
-
రాజ్భవన్లో సీజేఐ ఎన్వీ రమణకు తేనీటి విందు
-
సీజేఐకి గవర్నర్ తేనీటి విందు
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గౌరవార్థం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం రాజ్భవన్లో తేనీటి విందు ఇచ్చారు. రాజ్భవన్కు చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణ, శివమాల దంపతులను గవర్నర్ ప్రత్యేకప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా స్వాగతం పలికారు. రాజ్భవన్ వద్ద పోలీసులు ప్రధాన న్యాయమూర్తికి గౌరవ వందనం సమర్పించారు. అప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు రాజ్భవన్కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జస్టిస్ ఎన్వీ రమణకు ఎదురేగి స్వాగతం పలికి దర్బార్ హాల్లోకి తోడ్కొని వచ్చారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులతో తేనీటి విందులో సతీ సమేతంగా పాల్గొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ జేకే మహేశ్వరి, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయిన సీజేఐ కాసేపు సమకాలీన అంశాలపై చర్చించారు. ఈ విందు సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ జేకే మహేశ్వరి, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, శివమాల దంపతులను సత్కరించి జ్ఞాపికలు అందించారు. గవర్నర్తో సీజేఐ ఎన్వీ రమణ, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ జేకే మహేశ్వరి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రా, సీఎం వైఎస్ జగన్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ జేకే మహేశ్వరి, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రాలను కూడా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఉన్నతాధికారులు ప్రవీణ్ప్రకాశ్, ధనుంజయ్రెడ్డి, ముత్యాల రాజు, కృష్ణాజిల్లా కలెక్టర్ జె. నివాస్, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందు -
న్యాయవాదులు సమాజానికి మార్గ దర్శకులు
-
రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలకపాత్ర
సాక్షి, అమరావతి/పెనమలూరు:సవాళ్లను ఎదుర్కొంటూనే రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తోందని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అన్నారు. విజయవాడలోని సిద్ధార్థ లా కళాశాలలో ఆదివారం దివంగత జస్టిస్ లావు వెంకటేశ్వర్లు స్మారక సభలో ‘భారత న్యాయవ్యవస్థ–భవిష్యత్తు సవాళ్లు’ అనే అంశంపై ప్రసంగించారు. స్వాతంత్య్రం అనంతరం దేశం ఎన్నో సవాళ్లను, సంస్కరణలను చూసిందన్నారు. ఈ క్రమంలోనే పరిపాలన వ్యవస్థ నుంచి సరైన సహకారం లేకపోవడం కూడా న్యాయ వ్యవస్థకు ప్రధాన సమస్యగా మారిందన్నారు. సమాజంలో న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకుంటారనే అపోహ ఉందన్నారు. న్యాయ వ్యవస్థతో కలిసి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు న్యాయమూర్తిని ఎంపిక చేస్తాయనే విషయాన్ని తెలిసిన వారు కూడా అసత్య ప్రచారంలో ఉండటం విచారకరమన్నారు. సీజేఐ ఏమన్నారంటే.. సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి.. ఇంటర్నెట్ ద్వారా ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. హ్యాకింగ్, మనీలాండరింగ్, వర్చువల్ కరెన్సీ ద్వారా క్రైమ్ ఫండింగ్ చేస్తున్నారు. క్రిమినల్ చట్టంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు రావాలి. న్యాయ వ్యవస్థలో సాంకేతిక నిపుణులకు భాగస్వామ్యం కల్పించాలి. న్యాయాధికారులు కూడా సాంకేతిక విజ్ఞానంపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత జడ్జిలకు సరైన భద్రత లభించడంలేదు. గృహ, వైద్య సదుపాయాలు కూడా దక్కడంలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4.60 కోట్ల కేసులు పెండింగ్లో ఉండగా వీటిల్లో ఎక్కువ శాతం ప్రభుత్వ కేసులే. అందరి సహకారం ఉంటేనే న్యాయవ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతకుముందు.. జస్టిస్ లావు వెంకటేశ్వర్లు చిత్రపటానికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పూలమాల వేసి నివాళులర్పించారు. వెంకటేశ్వర్లు సతీమణి నాగేంద్రమ్మకు పాదాభివందనం చేశారు. విద్యతోనే యువతకు మంచి భవిష్యత్తు అని విశ్వసించి ఆయన స్వగ్రామం పెదనందిపాడులో గ్రంథాలయ స్థాపనతో పాటు వాలీబాల్ క్రీడను వెంకటేశ్వర్లు ప్రోత్సహించారని జస్టిస్ రమణ చెప్పారు. ఆయన ఆదర్శాలే తనయుడు జస్టిస్ లావు నాగేశ్వరరావుకు స్ఫూర్తి అయ్యాయని కొనియాడారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ వీఎస్ నరసింహ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా పాల్గొన్నారు. ఇది దురదృష్టం.. న్యాయాధికారులపై భౌతిక దాడులు పెరుగుతున్నాయి. తీర్పులు అనుకూలంగా రాకపోతే సామాజిక మాధ్యమాల ద్వారా జడ్జిలపై బురదజల్లుతున్నారు. కోర్టులు జోక్యం చేసుకుని ఉత్తర్వులు జారీచేస్తే తప్ప అధికారులు ఈ విషయంలో స్పందించకపోవడం దురదృష్టకరం. న్యాయవ్యవస్థ నిర్భయంగా పనిచేసే వాతావరణాన్ని ప్రభుత్వాలు కల్పించాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు స్వతంత్రంగా వ్యవహరించాలి. వారు కోర్టులకు మాత్రమే జవాబుదారీగా ఉండాలి. వారి ఎంపిక కోసం స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి. న్యాయ వ్యవస్థలోని ఖాళీలను భర్తీచేయడంలో కేంద్రం సత్వర చర్యలు చేపడుతోంది. మీడియా ట్రయల్స్ (వ్యాఖ్యలు, కథనాలు) కేసుల నిర్ణయానికి మార్గదర్శకం కావు. చట్టసభలు చట్టాలు చేసే ముందు న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటే సమస్యలు ఉత్పన్నం కావు. మెజార్టీ ఉన్నంత మాత్రాన ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలు చేయడం కుదరదు. తప్పనిసరిగా రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాల్సిందే. న్యాయస్థానాల ఆదేశాలను ప్రభుత్వాలు గౌరవించకపోవడం వ్యవస్థల్లో ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. న్యాయ సమీక్ష పరిధిని పరిమితం చేయాలనుకోవడం కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చదవండి: ఇది శుభపరిణామం: జస్టిస్ ఎన్వీ రమణ -
ఏపీలో మూడవ రోజు సీజేఐ ఎన్వీ రమణ పర్యటన
-
ఇది శుభపరిణామం: జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, అమరావతి: దేశంలో ప్రస్తుతం సామాన్యుడు సైతం రాజ్యాంగం గురించి చర్చించే పరిస్థితి వచ్చిందని, ఇది ఎంతో శుభ పరిణామమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అన్నారు. రాజ్యాంగం గురించి, హక్కుల గురించి ప్రజల్లో పెరుగుతున్న అవగాహనకు ఇది నిదర్శనమన్నారు. రాజ్యాంగం కేవలం గ్రంథాలయాలకు, బహిరంగ సభల్లో ప్రసంగాలకు పరిమితం కాకూడదని, దానిపై చర్చోప చర్చలు జరిగినప్పుడే ప్రజలకు తమ హక్కుల గురించి పూర్తి స్థాయి అవగాహన ఏర్పడుతుందని తెలిపారు. శనివారం విజయవాడ సిద్దార్థ కాలేజీ ఆడిటోరియంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆయనకు పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రోటరీ క్లబ్ ప్రతినిధులు జస్టిస్ రమణకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. అనంతరం సీజేఐ మాట్లాడుతూ.. జీవిత సాఫల్య పురస్కారం ద్వారా తాను సాధించాల్సింది, చేయాల్సింది ఇంకా చాలా ఉందన్న విషయాన్ని గుర్తు చేశారని తెలిపారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. తనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా ఓ తెలుగువాడిగా శాయశక్తులా తన పరిధి మేరకు పని చేసి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానని చెప్పారు. తెలుగువాడి గౌరవాన్ని ఏ మాత్రం తగ్గించకుండా తెలుగువాడి కీర్తిని ఎగురవేస్తానని, ఇది తాను ఇస్తున్న హామీ అని స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. కోర్టులో జరిగేది కక్షిదారుడికి అర్థం కావాలి ► రాజ్యాంగంపై ప్రజల్లో చర్చ మొదలైన నేపథ్యంలో వారికి వారి హక్కుల గురించి తెలియచేసి చైతన్య పరచాలి. ఇందులో రోటరీ క్లబ్ భాగస్వామ్యం కావాలి. ► దేశం ఎంత అభివృద్ధి సాధించినా.. నిరక్షరాస్యత, అనారోగ్యం, మౌలిక సదుపాయాల లేమి, ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం వంటి సమస్యలు పీడిస్తున్నాయి. ఇవి పరిష్కారం కావాలంటే ప్రజల్లో చైతన్యం అవసరం. ఈ దిశగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ► న్యాయ పాలన అన్నది చాలా ముఖ్యం. అది లేకపోతే అరాచకం పెరిగిపోతుంది. ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. న్యాయ పాలన అమలు కోసం న్యాయమూర్తులు, న్యాయవాదులు కృషి చేయాలి. న్యాయ పాలన గురించి ప్రజలకు తెలిసేలా మేధావి వర్గం పనిచేయాలి. ► కోర్టులు, పోలీసుల దగ్గరకు వెళ్లకూడదన్న నిశ్చిత అభిప్రాయంలో ప్రజలు ఉన్నారు. అయితే హక్కులకు భంగం కలిగినప్పుడు పౌరులు కచ్చితంగా న్యాయ స్థానాలను ఆశ్రయించాలి. అలాంటి పరిస్థితిలో న్యాయ స్థానాలు తప్పక జోక్యం చేసుకుంటాయి. ఇందులో మరో మాటకు తావు లేదు. ► కోర్టులో జరిగేది ప్రతిదీ కక్షిదారునికి అర్థమైనప్పుడే న్యాయ వ్యవస్థపై విశ్వాసం రెట్టింపు అవుతుంది. కోర్టుల్లో మౌలిక వసతులు పెరగాలి. కోర్టు భవనాల నిర్మాణాలు జరగాలి. ఇందు కోసమే జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో జ్యుడిషియల్ ఇన్ఫ్రా సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సంస్కరణలు అవసరమే ► న్యాయ వ్యవస్థలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయ వ్యవస్థ గురించి అట్టడుగు వర్గాల ప్రజలు కూడా తెలుసుకునేలా సరళీకరణ, భారతీయీకరణ జరగాలి. ► ఓ వ్యక్తి దాఖలు చేసిన కేసులో ఏం వాదనలు జరుగుతున్నాయి.. కోర్టు ఏమంటోంది.. ఏం తీర్పు చెప్పింది.. అన్న విషయాలు అతనికి స్వయంగా అర్థమైనప్పుడే న్యాయ వ్యవస్థ సరళీకరణ అయినట్లుగా భావించాలి. న్యాయ వ్యవస్థ అర్థం కాని బ్రహ్మ పదార్థంలా ఉండకూడదు. ► న్యాయ వ్యవస్థకు సంబంధించిన వ్యవహారాలు అర్థం కానప్పుడు ప్రజలు న్యాయ స్థానాలకు బదులు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతారు. ఇలా ప్రత్యామ్నాయాల వైపు వెళ్లడం బెజవాడ ప్రజలకు అలవాటు. ఆ దిశగా వెళ్లొద్దని కోరుతున్నా. పెండింగ్లో 4.60 కోట్ల కేసులు ► ప్రస్తుతం దేశంలో 4.60 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 150 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఈ కేసుల సంఖ్య పెద్దది కాదు. వాయిదాలు వేయకుండా సత్వర పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలి. ఈ దిశగా ప్రభుత్వానికి సైతం పాత్ర ఉంది. ► ప్రతి ఒక్కరూ చట్ట పరిధికి లోబడి పనిచేస్తే కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం ఉందదు. అన్ని వ్యవస్థలు తమ పరిధులకు లోబడి పని చేయాలి. తప్పు జరిగినప్పుడు ప్రశ్నించేలా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలి. ► న్యాయ వ్యవస్థలో మార్పు దిశగా చర్యలు చేపట్టాం. భారీ స్థాయిలో ఖాళీలను భర్తీ చేస్తున్నాం. అవసరమైన చోట గట్టిగా మాట్లాడుతున్నా. తెలుగు శిథిలం కాకుండా చూడాలి ► తెలుగు భాష శిథిలం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మాతృభాషలో విద్య చాలా అవసరం. మాతృభాషలో ఆలోచనలు చేసినప్పుడే పనుల్లో విజయం సాధ్యమవుతుంది. ► మన విజయానికి మాతృభాషే పునాది. ఆ పునాదిని కూల్చేసే పరిస్థితి రాకూడదు. తెలుగు భాష గొప్పదనం, సంస్కృతి, సాహిత్యాన్ని ప్రపంచానికి చాటాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ► అనంతరం నిర్వాహకులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మలను సన్మానించారు. జీవిత సాఫల్యం పురస్కారంతో పాటు ఇచ్చే నగదు బహుమతిని సీజేఐ జస్టిస్ రమణ.. అనాథ బాలల ఆశ్రమాలకు వితరణ కింద అందజేశారు. ► ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, రోటరీ క్లబ్ ప్రతినిధులు పట్టాభి రామయ్య, సుబ్బరామయ్య నాయుడు, ఎం.రామారావు, డాక్టర్ మోహన్ ప్రసాద్, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా నివాసంలో ఏర్పాటు చేసిన విందులో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. విజయవాడ చైతన్యం చూపాలి ► విజయవాడ ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. ఇక్కడి నుంచి ఎంతో మంది నేతలు జాతీయ స్థాయిలో కీర్తి గడించారు. విజయవాడతో నాకు ఎన్నో గొప్ప స్మృతులు ఉన్నాయి. న్యాయ విద్యను పూర్తి చేసి హైదరాబాద్కు వెళ్లాను. అతికష్టం మీద విజయవాడను వీడాల్సి వచ్చింది. ► అయినప్పటికీ ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ వచ్చి శని, ఆదివారాలు ఇక్కడే గడిపే వాడిని. కళలు, సంస్కృతి, రచనలకు బెజవాడ ఎంతో పేరుగాంచింది. అయితే ఇప్పుడు నేను ఊహించిన విధంగా బెజవాడ లేదు. ఇందుకు నేను విచారిస్తున్నా. మరోసారి జూలు విదిల్చి చైతన్యం చూపాల్సిన సమయం ఆసన్నమైంది. నా ఉన్నతికి కారణమైన ఈ ప్రాంతాన్ని ఎన్నటికీ మరువను. -
సీజేఐ ఎన్వీ రమణ దంపతులకు ఘన సత్కారం
-
సీజేఐ ఎన్వీ రమణ దంపతులకు ఘన సత్కారం
విజయవాడ: ఏపీ రాష్ట్ర పర్యటనలో ఉన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు ఘన సత్కారం లభించింది. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను శనివారం ఘనంగా సన్మానించారు. ఈ క్రమంలోనే జస్టిస్ ఎన్వీ రమణకు జీవిత సాఫల్య పురస్కారాన్ని రోటరీ క్లబ్ అందజేసింది. మరొకవైపు నగరంలోని సిద్ధార్ధ అకాడమీ ఆడిటోరియంలో నిర్వహించిన పౌర సన్మానసభలో సీజేఐ దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు జడ్జి జేకే మహేశ్వరి, ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా, టీఎస్ హైకోర్టు సీజే సతీష్ చంద్రలు హాజరయ్యారు. చదవండి: సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందు -
సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందు
విజయవాడ: ఏపీ పర్యటనలో ఉన్న సీజేఐ ఎన్వీ రమణకు ప్రభుత్వం తేనీటి విందు ఇచ్చింది. ఇందిరాగాంధీ స్టేడియంలో సీజేఐకు ఇచ్చిన తేనీటీ విందులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన సీజేఐ ఎన్వీ రమణకు సీఎం వైఎస్ జగన్ దంపతులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు, మంత్రులు పాల్గొన్నారు. ఈ తేనీటి విందుకు హాజరైన వారిలో పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు ఏపీ, తెలంగాణ చీఫ్ జస్టిస్లు, రెండు రాష్ట్రాల న్యాయమూర్తులు ఉన్నారు. అంతకుముందు నోవాటెల్ హోటల్లో సీజేఐ ఎన్వీ రమణను సీఎం వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్సార్ జిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించుకున్న తర్వాత నేరుగా విజయవాడ చేరుకున్న సీఎం జగన్.. నోవాటెల్ హోటల్లో సీజేఐని కలిసి తేనీటి విందుకు ఆహ్వానించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: సీజేఐ ఎన్వీ రమణను కలిసిన సీఎం జగన్ -
దుర్గమ్మ సేవలో సీజేఐ దంపతులు
-
సీజేఐ ఎన్వీ రమణను కలిసిన సీఎం జగన్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల వైఎస్సార్ జిల్లా పర్యటన ముగిసింది. పలు అభివృద్ధికార్యక్రమాల శంకుస్థాపన, పథకాల అమలు, ఇతర కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే. అనంతరం శనివారం మధ్యాహ్నం విజయవాడ చేరుకున్నారు. ముందుగా నోవాటెల్ చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిశారు. -
మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ కీలకపాత్ర: సీజేఐ ఎన్వీ రమణ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) శనివారం ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో ఐఏఎంసీ ప్రారంభించడం ఆనందంగా ఉందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. రాజీ-మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. తక్కువ కాలంలో మంచి వసతులతో ఐఏఎంసీ ఏర్పాటైందని.. ఐఏఎంసీ ఏర్పాటుకు సహకరించిన సీఎం కేసీఆర్కు ఎన్వీ రమణ ధన్యవాదాలు తెలిపారు. చదవండి: వచ్చే ఐదేళ్లలో 50 వేల ఉద్యోగాలు! అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా హైదరాబాద్: సీఎం కేసీఆర్ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా హైదరాబాద్ పురోగమిస్తోందని.. అనేక రంగాల్లో హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారుతోందన్నారు. ఐఏఎంసీ ఏర్పాటుకు జస్టిస్ ఎన్వీ రమణ ప్రధాన పాత్ర పోషించారన్నారని సీఎం కేసీఆర్ అన్నారు. -
కోర్టుకు రావడం అనేది ఆఖరి ప్రయత్నం కావాలి: సీజేఐ
సాక్షి, హైదరాబాద్: ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్లో వివాదాలకు పరిష్కారం లభిస్తుందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హెచ్ఐసీసీలో మీడియేషన్, ఆర్బిట్రేషన్పై జరిగిన సదస్సులో జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ, వివిధ కారణాల వల్ల పరిశ్రమల్లో వివాదాలు తలెత్తుతున్నాయన్నారు. వివాదాల పరిష్కరానికి మధ్యవర్తిత్వాలు ముఖ్యమన్నారు. ఆర్బిట్రేషన్ సెంటర్కు హైదరాబాద్ అనుకూలమని తెలిపారు. పెండింగ్ కేసుల పరిష్కారం సత్వరమే జరగాలన్నారు. కోర్టుకు రావడం అనేది ఆఖరి ప్రయత్నం కావాలన్నారు. ఏళ్ల తరబడి కోర్టు కేసుల ద్వారా సమయం వృధా అవుతోందన్నారు. ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి సీజేఐ ధన్యవాదాలు తెలిపారు. చదవండి: Omicron: హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు ‘లార్డ్ కృష్ణ కౌరవులకు, పాండవులకు మధ్యవర్తిత్వం చేశాడు. ఎవరికైనా వ్యక్తి గత జీవితంలో సమస్యలు వస్తే వారిని మనం దూరంగా పెడుతాం. ప్రతిరోజు సమస్యలు వస్తూనే ఉంటాయి. సమస్యలు లేకుండా మనిషి ఉండడు. బిజినెస్లో సమస్యలు వస్తే కోర్టులకు వస్తారు. 40 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా ఆర్బిట్రేషన్ చివరి దశలో జరగాలి. అంతర్జాతీయ పరిస్,సింగపూర్, లండన్, హంకాంగ్లో ఆర్బిట్రేషన్ సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్లో ఈ సెంటర్ను పెట్టడం చాలా సంతోషం. హైదరాబాద్లో ఈ సెంటర్ను పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఫార్మా కంపెనీలు, ఐటి కంపెనీలు సహకారం కూడా ఎంతో అవసరం. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నంబర్వన్గా ఉంది. ఆర్బిట్రేషన్ సెంటర్ను నెలకొల్పడంలో జస్టిస్ హిమా కోహ్లీ సహకారం మర్చిపోలేనని’’ సీజేఐ అన్నారు. త్వరలో శాశ్వత భవనం: సీఎం కేసీఆర్ హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (IAMC) ఏర్పాటు చేయడం సంతోషకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు(కేసీఆర్) అన్నారు. ఆర్బిట్రేషన్ కేంద్రానికి హైదరాబాద్ అన్నివిధాలా అనువైన ప్రాంతమని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రస్తుతం 25 వేల చదరపు అడుగుల స్థలం కేటాయించామని, శాశ్వత భవనం కోసం త్వరలో పుప్పాలగూడలో భూమి కేటాయిస్తామని సీఎం తెలిపారు. -
విచక్షణతో వ్యాఖ్యలు చెయ్యాలి
న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో జడ్జీలు వ్యాఖ్యలు చేసేటప్పుడు విచక్షణతో చేయాలని రాష్ట్రపతి కోవింద్ హితవు పలికారు. జడ్జీలు తమ వ్యాఖ్యలకి తప్పుడు భాష్యాలు కల్పించే అవకాశం ఇవ్వకూడదన్నారు. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ విక్షచణారహితంగా వ్యాఖ్యలు చేస్తే వాటిని సరిగా అర్థం చేసుకోలేరని అన్నారు. అంతిమంగా న్యాయవ్యవస్థ సక్రమంగా నడవదని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగదినోత్సవాల ముగింపు సమావేశంలో శనివారం కోవింద్ మాట్లాడారు. భారతీయ సంప్రదాయంలో న్యాయమూర్తులకు ఒక హోదా ఉందని, స్థితప్రజ్ఞతకు, నైతికతకు మారుపేరుగా వారు ఉంటారని కొనియాడారు. ‘మన దేశంలో తీర్పులిచ్చిన సమయంలో ఎంతో వివేకాన్ని ప్రదర్శిస్తూ వ్యాఖ్యలు చేసే న్యాయమూర్తులు ఎందరో ఉన్నారు. వారు చేసే వ్యాఖ్యలు భవిష్యత్ తరాలకు బాటలు వేసేలా ఉన్నాయి. అత్యున్నత ప్రమాణాలకే న్యాయవ్యవస్థ కట్టుబడి ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది’’ అని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ‘ప్రజాస్వామ్యానికి న్యాయం మూలాధారం లాంటిది. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు సామరస్యపూర్వక ధోరణిలో కలిసి ముందుకు సాగినపుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. రాజ్యాంగంలో ప్రతి వ్యవస్థకూ దాని పరిధిని నిర్దేశించారు. దానికి లోబడే ఈ వ్యవస్థలు పనిచేస్తాయి’ అని కోవింద్ అన్నారు. ఆ చట్టాలతో న్యాయవ్యవస్థపై భారం: సీజేఐ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ శాసనవ్యవస్థ తాను చేసే చట్టాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అంచనా వేయకుండా, అధ్యయనాలు నిర్వహించకుండా వాటిని ఆమోదించడం వల్ల ఒక్కోసారి అతి పెద్ద సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. దాని వల్ల కేసుల సంఖ్య పెరిగిపోయి న్యాయవ్యవస్థపై పెనుభారం పడుతోందన్నారు. న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల్ని పెంచనంతవరకు పెండింగ్ కేసులు తగ్గుముఖం పట్టవని అన్నారు. పార్లమెంటు లేదంటే రాష్ట్రాల అసెంబ్లీలు చేసిన చట్టాలను, న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను అమలు చేయడం కష్టసాధ్యమనే పరిస్థితులు ఎప్పటికీ ఏర్పడకూడదని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. -
ఢిల్లీలో కాలుష్యాన్ని కట్టడి చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం నానాటికీ పెరిగిపోతుండడం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. నగరంలో కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా పలు కీలకమైన చర్యలు చేపట్టబోతున్నట్లు బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. నగరంలోకి నిత్యావసర సరుకు రవాణాల వాహనాలు తప్ప ఇతర భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించనున్నట్లు తెలిపింది. విద్యా సంస్థలను మూసివేయడంతోపాటు కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరును 50 శాతానికి పరిమితం చేయనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 11 థర్మల్ పవర్ ప్లాంట్లలో కేవలం ఐదు ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తికి అనుమతిస్తామని, మిగిలినవి ఈ నెలాఖరు వరకూ మూసివేయనున్నట్లు పేర్కొంది. ఎన్టీపీసీ ఝాజ్జర్, మహాత్మాగాంధీ టీపీఎస్, సీఎల్పీ ఝాజ్జర్, పానిపట్ టీపీఎస్, హెచ్పీజీఎల్సీ, నభాపవర్ లిమిటెడ్ టీపీఎస్ రాజ్పురా, తల్వాండి సాబో టీపీఎస్ మాన్సాలను అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఒక అఫిడవిట్ను సమర్పించారు. ఈ అఫిడవిట్ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించడానికి వీలుగా పరిసర రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తొలగించడానికి రైతులకు ఉచితంగా యంత్రాలను అందజేయాలని కోరుతూ పర్యావరణ కార్యకర్త ఆదిత్య దూబే, న్యాయ విద్యార్థి అమన్ బాంకా దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ‘గాలి నాణ్యత నిర్వహణ కమిషన్’ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని ఢిల్లీతోపాటు పరిసర రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు నవంబర్ 15న ఇచ్చిన ఆదేశాల ప్రకారం నవంబర్ 16న గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ అత్యవసర సమావేశం ఏర్పాట చేసినట్లు కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. నిర్వహణ కమిషన్ నిర్ణయాలు/ఆదేశాలు ► ఢిల్లీ, పరిసర రాష్ట్రాలు గ్యాస్తో అనుసంధానమైన పరిశ్రమలను గ్యాస్తోనే నడిపేలా చూడాలి. అనుమతి లేని ఇంధనాలతో నడిచే పరిశ్రమలను వెంటనే మూసివేయాలి. ► నిత్యావసర సరకులను తరలించే ట్రక్కులు మినహా మిగతా ట్రక్కులకు ఈ నెల 21 వరకు ఢిల్లీలోకి ప్రవేశం నిషేధించాలి. పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలు రహదారులపై తిరగకుండా చూడాలి. ఢిల్లీ ప్రభుత్వం మరిన్ని సీఎన్జీ బస్సులను అందుబాటులో తీసుకురావాలి. ► నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను నిలిపివేయాలి, స్మాగ్ టవర్లు ఉపయోగించాలి. కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో (హాట్స్పాట్లు) రోజుకి కనీసం మూడుసార్లు స్ప్రింకర్లు, డస్ట్ సప్రెసెంట్లు ఉపయోగించాలి. ► అత్యసవర సేవలకు మినహా డీజిల్ జనరేటర్లు వినియోగాన్ని కచ్చితంగా నిషేధించాలి. ► దేశ రాజధాని ప్రాంత రాష్ట్రాలు నవంబరు 21 వరకూ కనీసం 50 శాతం ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించాలి. ప్రైవేట్ సంస్థలను ఆ దిశగా ప్రోత్సహించాలి. ► తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలను మూసివేయాలి. ఆన్లైన్లో తరగతులు నిర్వహించాలి. నిర్ణయాలన్నీ కోర్టులే తీసుకోవాలా?: సుప్రీం ఢిల్లీలో కాలుష్యానికి కారణం పంట వ్యర్థాల దహనమేనని అనడం సమంజసం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కొందరు వ్యక్తులు స్టార్ హోటళ్లలో కూర్చొని, నాలుగైదు శాతం కాలుష్యానికి కారణమయ్యే రైతులపై నిందలు వేస్తున్నారని ఆక్షేపించింది. పంట వ్యర్థాల దహనం కారణంగా రైతులపై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది. ‘వారం రోజులపాటు పంట వ్యర్థాలు దహనం చేయొద్దని రైతుల్ని కోరాలని ఇప్పటికే కేంద్రానికి సూచించాం. టీవీల్లో చర్చా కార్యక్రమాల్లో ఎవరి అజెండా ప్రకారం వారు మాట్లాడుతున్నారు. ఇదే ఎక్కువ కాలుష్యాన్ని సృష్టిస్తోంది’ అని కోర్టు పేర్కొంది. నిర్మాణాలు, పరిశ్రమల కార్యకలాపాలు ఏడాది పొడవునా సాగుతూనే ఉంటాయని, వాటిపై చర్యలు తీసుకోకుండా పంట వ్యర్థాల దహనం గురించే ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీసింది. ప్రభుత్వ అధికార యంత్రాంగంలో ఒక రకమైన ఉదాసీనత పెరిగిందని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. నిర్ణయాలు తీసుకోవాలని అధికారులు కోరుకోవడం లేదని తప్పుపట్టారు. అన్ని నిర్ణయాలు కోర్టులే తీసుకోవాలని వారు ఆశిస్తున్నారని వ్యాఖ్యానించారు. నిష్క్రియాపరత్వం ఎందుకని ప్రశ్నించారు. పిటిషనర్ తరపున అడ్వొకేట్ వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. వాయు కాలుష్యంపై అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారే గానీ ఏదీ జరగడం లేదని తెలిపారు. పంట వ్యర్థాల దహనాన్ని కూడా తీవ్రంగా పరిగణించాలని కోరారు. పంట వ్యర్థాల దహనం 36 శాతం కాలుష్యానికి కారణమవుతున్నట్లు ‘సఫర్’ అధ్యయనం చెబుతోందని ఢిల్లీ ప్రభుత్వం తరఫు లాయర్ అభిషేక్ మనుసింఘ్వీ పేర్కొన్నారు. గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ సూచనలను పాటించాలని ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హరియాణా, పంజాబ్ రాష్ట్రాలను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఏడాదికి రూ.లక్ష కోట్ల నష్టం కరోనా ధాటికి ఢిల్లీ విలవిలలాడిపోయింది. కోవిడ్తో గత 18 నెలల్లో 25 వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఏడాదిన్నరలో ఎన్నోసార్లు కఠినమైన లాక్డౌన్లు విధించి కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ కరోనా కంటే ప్రతీ ఏడాది కాలుష్యం అనే భూతం ఢిల్లీని భయపెడుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టైనా ఎందుకు లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాలుష్యం కారణంగా వచ్చిన అనారోగ్య సమస్యలతో గత ఏడాది ఢిల్లీలో 54 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఢిల్లీలో కాలుష్యంతో నిండిన ఒక రహదారి కరోనా తరహాలో కాలుష్యం ఆరోగ్యంతో పాటు ఆర్థిక రంగాన్ని కుదేలు చేస్తోంది. ప్రతీ ఏడాది దేశ రాజధానికి లక్ష కోట్ల రూపాయల నష్టం వస్తోంది. అయినప్పటికీ కోర్టులు జోక్యం చేసుకుంటే తప్ప ప్రభుత్వాల్లో కదలిక రావడం లేదు. ప్రఖ్యాత లాన్సెట్ మ్యాగజైన్ ప్రకారం 2019లో భారత్లో కాలుష్యం బారిన పడి 16.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు ఏడాది శిలాజ ఇంధనాల కాలుష్యంతో దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని హార్వార్డ్ అధ్యయనం తేటతెల్లం చేస్తోంది. కాలుష్య నష్టాన్ని ఎలా లెక్కిస్తారు ? కాలుష్యం వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని రెండు పద్ధతుల్లో లెక్కిస్తారు. ఉత్పత్తి సామర్థ్యమున్న ప్రజలు ముందుగానే మరణించడం, కాలుష్యంతో అనారోగ్యం పాలైన వారికి చికిత్స చెయ్యడానికైన ఖర్చు, పని చేసే ప్రాంతాల్లో దగ్గు, జలుబుతో బాధపడడం వల్ల పడిపోయిన ఉత్పాదకత వంటి వాటినన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కాలుష్యంతో ఏర్పడిన నష్టాన్ని లెక్కిస్తారు. ఆ విధంగా చూసుకుంటే కాలుష్యంతో దేశ జీడీపీలో 4.5 శాతం నష్టం ప్రతీ ఏడాది వాటిల్లుతోంది. గ్రీన్పీస్ సంస్థ వేసిన అంచనాల ప్రకారం గత ఏడాది కాలుష్యంతో ఢిల్లీ రాష్ట్ర జీడీపీలో 13 శాతం అంటే దాదాపు రూ.60 వేల కోట్ల నష్టం వాటిల్లింది. విల్లింగ్ టు పే (డబ్ల్యూటీపీ) అనే విధానంలోనూ కాలుష్య నష్టాన్ని లెక్కిస్తారు. దీని ప్రకారం కాలుష్య నివారణకు ప్రజలు ఎంత ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్న లెక్కల ఆధారంగా చూస్తే ఢిల్లీకి ఏడాదికి లక్ష కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లుతోంది. కాలుష్య సమస్య నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేవీ శాశ్వత చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అవసరమైతే ఢిల్లీలో 2రోజులు లాక్డౌన్ విధించాలన్న సీజేఐ
-
సమన్యాయం అందించేందుకు సహకరించండి!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, అందరికీ సమన్యాయం అందించడానికి ప్రజా ప్రభుత్వాలు సహకారమందించాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కోరారు. వివిధ కోర్టుల్లో ఖాళీల పూరింపునకు కొలీజయం చేసిన సిఫార్సులను సత్వరమే ఆమోదించాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. సిఫార్సుల సత్వర అమలుతో పెండింగ్ కేసుల సమస్యను కొంతవరకు పరిష్కరించవచ్చన్నారు. ఇప్పటికే పలు సిఫార్సులను ఆమోదించామని, త్వరలో మిగిలినవాటికి అనుమతినిస్తామన్న కేంద్ర న్యాయమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్తో న్యాయవ్యవస్థలో నెలకొన్న లోతైన సమస్యలు బయటపడ్డాయన్నారు. బలహీనవర్గాలకు సత్వర సమన్యాయం అందాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని నల్సా(జాతీయ న్యాయసేవల అథారిటీ) ఆధ్వర్యంలో ఆరువారాలు సాగే ‘పాన్ ఇండియా లీగల్ అవేర్నెస్, అవుట్రీచ్ క్యాంపెయిన్’ను రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్ శనివారం ఆరంభించారు. ఈ కార్యక్రమంలో సీజేఐ పాల్గొన్నారు. బలహీన వర్గాల సంక్షేమంతోనే సమ్మిళిత అభివృద్ధి సాధ్యమని గాంధీ భావించేవారని రమణ గుర్తు చేశారు. సమ్మిళిత వృద్ధి మాత్రమే స్థిరమైన, శక్తిమంతమైన ప్రజాస్వామ్యానికి దారి తీస్తుందనేది కాదనలేని సత్యమని తెలిపారు. సమన్యాయం తక్షణ అవసరం సమన్యాయం అందించకుండా సామాజిక ఆర్థిక సమానత్వం సాధించడం అసాధ్యమన్నారు. దీన్ని గుర్తించి అందరికీ సమన్యాయం అందించేందుకు కార్యనిర్వాహక, చట్టసభలు, న్యాయవ్యవస్థలు కలిసి పనిచేయాలన్నారు. ప్రజాస్వామ్య నాణ్యత నాణ్యమైన న్యాయంపైనే ఆధారపడి ఉంటుందని, ప్రజాస్వామ్య దేశంలో సంస్థల్ని నిలబెట్టేది ప్రజల విశ్వాసం, నమ్మకమేనని పునరుద్ఘాటించారు. రెండున్నర దశాబ్దాల క్రితం ప్రారంభమైన నల్సా కోట్లాదిమందికి సేవలందించిందన్నారు. గాందీజీ జయంతినాడు మొదలైన ఈ కార్యక్రమం నెహ్రూ జయంతి రోజున ముగుస్తుందన్నారు. న్యాయం కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు చేరుకోవడానికి యతి్నస్తున్నామని, దీనికి అందరి సహకారం కావాలన్నారు. న్యాయవాది అయిన రాష్ట్రపతిని పొందడం అదృష్టంగా భావిస్తున్నట్లు రమణ చెప్పారు. చట్టపరమైన సంస్కరణలు మరింత ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్రపతి అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళాభివృద్ధికి పాటుపడాలి సీనియర్ న్యాయవాదులు మహాత్మా గాంధీ ఆదర్శాలను పాటించి, పేదలకు సేవలందించాలని రాష్ట్రపతి కోవింద్ సూచించారు. మహిళాభివృద్ధికి అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళాభివృద్ది భావన నుంచి మహిళల వల్ల అభివృద్ధి అనే భావనకు మరలాలన్నారు. సహేతుకమైన మూల్యానికి ఉత్తమ న్యాయ ప్రతిభ అందుబాటులో ఉండాలని గాంధీ కోరుకునేవారన్నారు. లాయర్లు తమ సమయంలో కొంత బలహీనవర్గాల సేవలకు కేటాయించాలన్నారు. కోర్టు బయట పరిష్కారాలను గాం«దీజీ బలంగా విశ్వసించేవారన్నారు. న్యాయవాద వృత్తిలో మహిళల పాత్ర మరింత పెరగాలన్నారు. స్వాతంత్య్రోద్యమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. అందరికీ న్యాయ సేవలు అందించడానికి నల్సా చేస్తున్న సేవలనుకోవింద్ ప్రశంసించారు. -
పోలీసులపై ఫిర్యాదుల విచారణకు స్థాయీ సంఘం
న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ నాయకులకు, పోలీసు అధికారులకు మధ్య ఉండే సన్నిహిత సంబంధాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీల అండ చూసుకొని బ్యూరోక్రాట్లు ,ముఖ్యంగా పోలీసు అధికారులు ఎలా ప్రవర్తిస్తారో తనకు తెలుసునన్నారు. పోలీసుల అకృత్యాలపై అందిన ఫిర్యాదులను విచారించడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో ఒక స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. ఛత్తీస్గఢ్కు చెందిన సస్పెండైన పోలీసు అధికారి గుర్జీందర్ పాల్ సింగ్ తనపై దేశద్రోహం, అవినీతి, బలవంతపు వసూళ్లకు సంబంధించి నమోదైన క్రిమినల్ కేసుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం విచారించింది. నేతల అండతో చెలరేగే పోలీసు అధికారుల్ని న్యాయవ్యవస్థ కాపాడలేదని సీజేఐ వ్యాఖ్యానించారు. పోలీసు అధికారుల దౌర్జన్యాలపై దాఖలైన పిటిషన్ల విచారణకు స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన ఉందని చెప్పారు. -
ధిక్కారణాధికారాన్ని తొలగించలేరు!
న్యూఢిల్లీ: కోర్టులకు ఉండే ధిక్కార శిక్షాధికారాన్ని ఎలాంటి చట్టంతో తొలగించలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక ఎన్జీఓ చైర్పర్సన్ను కోర్టు ధిక్కారం కింద విచారిస్తూ గతంలో విధించిన రూ.25 లక్షల జరిమానాను చెల్లించకపోవడం ధిక్కరణేనని స్పష్టం చేసింది. ముద్దాయివి ధిక్కరణ చర్యలేనని, అలాంటి వాటిని శిక్షించకుండా కోర్టు వదిలేయదని జస్టిస్ సంజయ్ కిషన్తో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. సూరజ్ ట్రస్ట్ ఇండియా అనే సంస్థ అధిపతి రాజీవ్ దైయాపై కోర్టు ధిక్కార ఆరోపణలను సుప్రీం విచారించింది. గతంలో రాజీవ్ 64 ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. అయితే ఒక్కదాంట్లో కూడా విజయం సాధించలేదు. దీంతో రాజీవ్కు సుప్రీంకోర్టు రూ.25 లక్షల జరిమానాను 2017లో విధించింది. దీనిపై పునఃపరిశీలన జరపాలని రాజీవ్ తాజాగా దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన కోర్టు రాజీవ్ది ధిక్కారమేనని తేలి్చచెప్పింది. రాజీవ్ కోర్టులపై బురద జల్లుతున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు ధిక్కారణాధికారం తమకు రాజ్యాంగం ఇచి్చందని తెలిపింది. రాష్ట్రపతితో జస్టిస్ ఎన్.వి. రమణ భేటీ సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్తో భేటీ అయ్యారు. శనివారం విజ్ఞాన్ భవన్లో న్యాయ సేవలపై అవగా హనా కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఈ సదస్సు వివరాలను జస్టిస్ ఎన్.వి.రమణ రాష్ట్రపతికి వివరించారు. -
50 శాతం మీ హక్కు: జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: యాభై శాతం రిజర్వేషన్లు మహిళల హక్కు అని, పోరాడి సాధించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ‘‘వేలాది సంవత్సరాల అణచివేత ఇక చాలు, న్యాయవ్యవస్థలోని అన్ని స్థాయిల్లోనూ మహిళలకు 50 రిజర్వేషన్లు కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది మీ హక్కు.. ఇదేదో దాతృత్వానికి సంబంధించిన అంశం కాదు. మీరు చింతిస్తూ కూర్చోకూడదు. ఆగ్రహంతో గట్టిగా నినదించాలి. 50 శాతం రిజర్వేషన్లు కావాలని బలంగా డిమాండ్ చేయాలి. నా మద్దతు మీకు ఉంటుంది’’ అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్లోని మహిళా న్యాయవాదులు ఆదివారం ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. న్యాయవాదుల్లో మహిళలు 15 శాతమే ‘‘దిగువ న్యాయస్థానాల్లో మహిళా జడ్జీలు కేవలం 30 శాతం లోపే ఉన్నారు. హైకోర్టుల్లో 11.5 శాతం ఉన్నారు. సుప్రీంకోర్టులో 11 నుంచి 12 శాతం ఉన్నారు. దేశంలోని మొత్తం 17 లక్షల న్యాయవాదుల్లో 15 శాతం మాత్రమే మహిళలున్నారు. బార్ కౌన్సిళ్లలో ఎన్నికైన ప్రతినిధుల్లో కేవలం 2 శాతం మాత్రమే మహిళలు. బార్కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మహిళల ప్రాతినిధ్యం లేదు. దీన్ని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమైన దిద్దుబాటు చర్యల గురించి కార్యనిర్వాహక వ్యవస్థపై ఒత్తిడి తీసుకొస్తా. ఉన్నత న్యాయస్థానాల్లో అంతరాన్ని తగ్గించడానికి సహచర కొలీజియం సభ్యులు కూడా చొరవ చూపడం సంతోషంగా ఉంది. న్యాయవాద వృత్తిలోకి రావడానికి మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ అడ్డంకులు, లింగ వివక్ష ఎదుర్కొంటున్నారు. చాలామంది క్లయింట్లు పురుష న్యాయవాదులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కోర్టు గదుల్లో సౌలభ్యంగా లేని వాతావరణం, మౌలికవసతుల లేమి, రద్దీగా ఉండే కోర్టు గదులు, వాష్రూమ్స్ లేమి వంటివి మహిళలు న్యాయవాద వృత్తిలోకి రావడానికి అడ్డంకిగా ఉంటున్నాయి. 6 వేల ట్రయల్ కోర్టుల్లో 22 శాతం కోర్టుల్లో మహిళలకు మరుగుదొడ్లు లేవని నా సర్వేలో తేలింది. మహిళలకు మరింతగా స్వాగతం పలికే వాతావరణం కల్పించాలి. న్యాయ విద్యలో లింగ నిష్పత్తిపై దృష్టి సారించాలి. తొలి చర్యగా న్యాయ కళాశాలలు, యూనివర్సిటీలలో మహిళలకు తగినంతగా రిజర్వేషన్లు కలి్పంచాలి. మహిళా జడ్జీలు, లాయర్లు గణనీయంగా పెరుగుతారు. అన్ని రంగాల్లోకి మహిళలు వచ్చేలా స్ఫూర్తి కావాలి. న్యాయవాద వృత్తిలో లింగ అసమానతలు తొలగించడానికి తీసుకొనే చర్యలకు నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. సీనియర్ న్యాయవాదుల ఎంపికకు త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తాం. ప్రత్యక్ష విచారణ విషయానికొస్తే.. దీని వల్ల జడ్జీలకు ఎలాంటి ఇబ్బంది లేదు. లాయర్లకే ఒకింత ఇబ్బంది. దసరా తర్వాత ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని భావిస్తున్నాం. థర్డ్వేవ్ రాకూడదని ప్రారి్థద్దాం. ప్రత్యక్ష విచారణకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పట్ల అడ్వొకేట్ల అసోసియేషన్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వాటిని సరిచేయాలని రిజిస్ట్రీని ఆదేశించా. మధ్యవర్తిత్వంపై శిక్షణ కార్యక్రమం త్వరలోనే ప్రారంభిస్తాం’’ అని సీజేఐ జస్టిస్ ఎన్ వీ రమణ పేర్కొన్నారు. వలస పాలకుల చట్టాలతో ఇబ్బందులు: జస్టిస్ పి.ఎస్.నరసింహ వలస పాలకుల హయాం నాటి కాలం చెల్లిన చట్టాలు, వాటికి ఇచ్చిన భాష్యాలతో భారత్ 70 ఏళ్లకు పైగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాలను లోతుగా అధ్యయనం చేసి వాటికి కొత్త వివరణ ఇవ్వాల్సిన బాధ్యత న్యాయమూర్తులపైనే ఉందని అన్నారు. సుప్రీంకోర్టు బెంచ్లో నలుగురు మహిళా న్యాయమూర్తులు ఉండడం అసాధారణమైన విషయమన్నారు. కోర్టుల్లో 50 శాతానికి మహిళలు పరిమితమవకుండా ఇంకా ఎక్కువ మంది ఉండాలన్నదే తన ఆకాంక్షని చెప్పారు. ప్రతిభ ఆధారంగా ఎంత ఎక్కువ మంది మహిళలుంటే అంత మంచిదని, మగవారి కంటే మహిళలే లోతైన ఆలోచన చేస్తారని జస్టిస్ నరసింహ కొనియాడారు. -
పెగాసెస్ విచారణకు నిపుణుల కమిటీ ఏర్పాటు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: దేశరాజకీయాలను కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణకు నిపుణుల కమిటీకి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. కాగా ఈ కమిటీ ఏర్పాటు కోసం కొంత మంది నిపుణులను తాము ఎంపిక చేయాలని భావించగా, కొందరు మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల విముఖత చూపుతున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు. ఈ కారణంగానే కమిటీ ఏర్పాటు ఆలస్యమైందని తెలుపుతూ.. కమిటీ సభ్యుల నియామకంపై తుది నిర్ణయం తీసుకొని వచ్చే వారం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సీజేఐ తెలిపారు. ఇజ్రాయెల్ సంస్థ అభివృద్ధి చేసిన పెగాసెస్ సాఫ్ట్వేర్ ద్వారా భారత్లోని పలువురు ప్రముఖులు, జర్నలిస్టుల ఫోన్పై నిఘా పెట్టినట్లు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పౌరుల వ్యక్తిగత గోప్యతను ఈ చర్య భంగం కలిగించిందని ప్రతిపక్షాలు మండిపడుతూ పెగాసెస్ నిఘాపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ కూడా చేశాయి. అయితే, ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. చదవండి: రాహుల్, ప్రియాంకలకు అనుభవం లేదు: అమరీందర్ -
న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల లేమి!
అలహాబాద్: భారతీయ కోర్టులు ఇప్పటికీ అసంపూర్ణ మౌలిక సదుపాయాలతో పనిచేస్తున్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటి‹Ùపాలన అనంతరం న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం రాజ్యమేలిందన్నారు. పరిష్కారానికే జాతీయ జ్యుడీíÙయల్ ఇన్ఫ్రా కార్పొరేషన్(ఎన్జేఐసీ) ఏర్పాటుతోనే ఈసమస్యకు పరిష్కారమని సూచించారు. ఉత్తరప్రదేశ్జాతీయ లా యూనివర్సిటీ, అలహాబాద్ హైకోర్టు నూతన భవన సదుపాయం శంకుస్థాపనలో రాష్ట్రపతితో పాటు ఆయన పాల్గొన్నారు. దేశీయ కోర్టుల్లో మెరుగైన వసతులు లేకపోవడం విచారకరమని, దీనివల్ల న్యాయసిబ్బంది పనితీరుపై ప్రభావం కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారం ఎన్జేఐసీ ఏర్పాటేనని అభిప్రాయపడ్డారు. దేశంలోని జాతీయ ఆస్తుల నిర్మాణ సంస్థలతో కలిసి ఎన్జేఐసీ పనిచేస్తుందని, జాతీయ కోర్టు డెవలప్మెంట్ ప్రాజెక్టుకు నమూనాలను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. సరైన మౌలికవసతుల కల్పనతో న్యాయం పొందే మార్గం మరింత సుగమం అవుతుందన్నారు. అలహాబాద్ హైకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడాన్ని ప్రస్తావిస్తూ, నూతన భవనంతో జ్యుడీషియరీ మరింత చురుగ్గా పనిచేసి పెండింగులను తగ్గిస్తుందని ఆశించారు. తీర్పులను వ్యవహారిక భాషలోకి అనువదించాన్న సూచన రాష్ట్రపతి కోవింద్దేనని ఆయన ప్రశంసించారు. ఆ తీర్పు సాహసోపేతం 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి జగ్మోహన్లాల్ సిన్హా ఇచి్చన తీర్పు అత్యంత సాహసోపేతమైనదని సీజేఐ రమణ ప్రశంసించారు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఇందిర ఎన్నికను చెల్లకుండా చేసిన ఈ తీర్పు దేశంలో ఒక కుదుపు తెచ్చిందన్నారు. దీనికారణంగానే చివరకు ఇందిర ఎమర్జెన్సీ విధించారని గుర్తు చేశారు. అలహాబాద్ హైకోర్టుకు 150 సంవత్సరాల చరిత్రుందని కొనియాడారు. ఇక్కడనుంచి అనేకమంది గొప్ప న్యాయవాదులు, న్యాయమూర్తులు వచ్చారన్నారు. దీంతో పాటు అలహాబాద్ నగర ప్రాశస్త్యాన్ని కూడా ఆయన ప్రస్తుతించారు. -
హైకోర్టు జడ్జిలుగా 68 మంది పేర్లు
న్యూఢిల్లీ: వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా 68మంది పేర్లను సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసింది. ఆగస్టు25, సెపె్టంబర్1న జరిపిన సమావేశాల్లో సీజేఐ జస్టిస్ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కొలిజియం 112మంది పేర్లను పదోన్నతి కోసం పరిశీలించింది. ఇందులో 82మంది బార్కు చెందినవారు కాగా, 31మంది జ్యుడిషియల్ సర్వీసెస్కు చెందినవారు. వీరిలోనుంచి 68మంది పేర్లను 12 హైకోర్టులకు కొలిజియం రికమండ్ చేసింది. వీరిలో 44మంది బార్కు, 24 మంది జ్యుడిషియల్ సర్వీసెస్కు చెందినవారు. ఈ దఫా సిఫార్సుల్లో కూడా కొలిజియం చరిత్ర సృష్టించింది. తొలిసారి మిజోరాం నుంచి హైకోర్టు జడ్జి పదవికి ఒకరిని ఎంపిక చేసింది. మిజోరాంకు చెందిన ఎస్టీ జ్యుడిషియల్ అధికారి మర్లి వాంకుంగ్ను గౌహతి హైకోర్టుకు జడ్జిగా కొలిజియం రికమండ్ చేసింది. అలాగే సిఫార్సు చేసిన 68మందిలో 10మంది మహిళలున్నారు. ప్రస్తుతం సిఫార్సు చేసిన జడ్జిలను అలహాబాద్, రాజస్తాన్, కలకత్తా, జార్ఖండ్, జమ్ము కాశ్మీర్, మద్రాస్, మధ్యప్రదేశ్, కర్నాటక, పంజాబ్ అండ్ హర్యానా, కేరళ, చత్తీస్గఢ్, అస్సాం హైకోర్టుల్లో నియమిస్తారు. ఇటీవలే కొలిజయం ఏడుగురు జడ్జిలను తెలంగాణ హైకోర్టుకు, 9మందిని సుప్రీంకోర్టుకు రికమండ్ చేసింది. వీరందరితో ఒకేరోజు సీజేఐ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో సుప్రీంలో జడ్జిల సంఖ్య 33కు చేరింది. -
ఇదేం బాధ్యతారాహిత్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఎలాంటి జవాబుదారీతనం లేకుండా కొన్ని సామాజిక మాధ్యమాలు, వెబ్ పోర్టళ్లలో నకిలీ వార్తల ప్రచారంపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో గతేడాది కోవిడ్ వ్యాప్తికి నిజాముద్దీన్ మర్కజ్ కారణమంటూ కొన్ని ప్రింట్, ఎల్రక్టానిక్ మీడియాల్లో వచి్చన వార్తలకు వ్యతిరేకంగా జమియత్ ఉలేమా ఇ హింద్, పీస్ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ను గురువారం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ దాఖలు చేసిన సవరణ విజ్ఞప్తి పిటిషన్ను అనుమతించిన ధర్మాసనం ప్రతులను సొలిసిటర్ జనరల్కు అందజేయాలని పిటిషనర్ న్యాయవాదికి సూచించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఫేస్బుక్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాలపై సీజేఐ పలు వ్యాఖ్యలు చేశారు. ‘ఫేస్బుక్, యూట్యూబ్ ఇతర సామాజిక మాధ్యమాలు మాకు కూడా స్పందించడం లేదు. వ్యక్తులనే కాదు సంస్థలపైనా ప్రచురణ విషయంలో బాధ్యతగా వ్యవహరించడం లేదు. వారు న్యాయమూర్తులు, సంస్థలు, వ్యక్తుల గురించి చింతించరు.. కానీ శక్తిమంతులైన వారు చెబితే వింటారు’ అని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ‘యూట్యూబ్ చూస్తే తెలుస్తుంది అందులో ఎన్ని నకిలీ వార్తలు ఉంటాయో. వెబ్ పోర్టళ్లపై ఎలాంటి నియంత్రణ లేదు. దేశంలో ఓ వర్గం మీడియా ప్రతీదీ మతపరమైన కోణంలో చూపుతోంది. వార్తలకు మత రంగు పులమడం పెద్ద సమస్యగా మారింది. చివరికి ఇది దేశానికి చెడ్డపేరు తెస్తుంది. ఈ ప్రైవేట్ చానళ్లను నియంత్రించే చర్యలు ఎప్పుడూ కేంద్రం చేపట్టలేదా?’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. వార్తా పత్రికలు, టీవీ చానళ్లను నియంత్రించే యంత్రాంగం ఉంది. వెబ్పోర్టళ్లను నియంత్రించే యంత్రాంగం ఉండాలని కేంద్రానికి సూచించలేదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. మతపరంగానే కాదని వార్తలు కూడా సృష్టిస్తున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. సోషల్, డిజిటల్ మీడియాను నూతన ఐటీ రూల్స్, 2021 నియంత్రిస్తాయని మెహతా తెలిపారు. ముస్లిం సంస్థల తరఫున హాజరైన న్యాయవాది సంజయ్ హెగ్డే సొలిసిటర్ జనరల్ వ్యాఖ్యలను సమర్థించారు. ఐటీ రూల్స్ను సవాల్ చేస్తూ వేర్వేరు హైకోర్టుల్లో ఉన్న పిటిషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని తుషార్ మెహతా కోరారు. వేర్వేరు హైకోర్టులు వేర్వేరుగా ఆదేశాలు ఇస్తున్నాయని, దేశం మొత్తానికి సంబంధించిన నేపథ్యంలో సమగ్రత కోసం పిటిషన్లు బదిలీ చేయాలన్నారు. కేంద్రం దాఖలు చేసిన బదిలీ పిటిషన్ను ప్రస్తుత పిటిషన్తో కలిపి జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించిన ధర్మాసనం ఆరు వారాలపాటు విచారణ వాయిదా వేసింది. -
తెలుగు అభివృద్ధికి సాంకేతికతను వాడుకోవాలి
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు భాష అభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగిం చుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ఏ సమాజంలో నైనా భాష, సంస్కృతి, ఒకదానినొకటి పెన వేసుకుని ఉంటాయని, సమాజం మార్పు కోరుతు న్నప్పుడు, తగిన సర్దుబాట్లు చేసుకోకపోతే, సమాజంతో పాటు భాషకూ, సంస్కృతికి తిప్పలు తప్పవన్నారు. కాలానుగుణంగా భాషలో మార్పు రాకపోతే, ఆ భాష, ఆ సంస్కృతి పతనమైన ఘటనలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. శని వారం దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు– నార్వేలు ప్రపంచవ్యాప్తంగా 75కు పైగా తెలుగు సంఘాలతో కలసి చేపట్టిన అంతర్జాతీయ సెమినార్లో ఆయన మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాష, సంస్కృతి, కీర్తి పతాకను వినువీధుల్లో ఎగురవేస్తున్న తెలుగు తల్లి ముద్దుబిడ్డ లందరికీ వందనాలు అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. క్రీస్తుపూర్వం 400 సంవత్సరం నుంచి ఉనికిలో ఉన్న తెలుగు భాష ఒక ఉద్యమ రూపం దాల్చడానికి ఒకానొక కారణం మహాభార తాన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడలు తెనుగించ డమేనని వివరించారు. ‘‘ముందుచూపుతో, తగు మార్పులతో ప్రగతి శీలంగా భాషను మలిచిన యుగపురుషుల్లో గిడుగు వేంకట రామ్మూర్తి పంతులు అగ్రగణ్యులు. దాదాపు సమకాలికులైన కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తిల త్రయం, సాహితీ సామాజిక సంస్కరణలతో తెలుగు భాషను సామాన్య ప్రజల భాషగా మలిచారు. వాడుక భాష అవసరం గురించి ఆ మహానుభావులు ముందు చూపుతో హెచ్చరించి, విప్లవాత్మక చర్యలు చేపట్టక పోతే, మన తెలుగు భాష నేడు ఈ స్థితిలో ఉండేది కాదు’’అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో కూడా మాతృభాష ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగలించిందని చెప్పారు. అగ్రశ్రేణి సినీనటుడు కావడం వల్లనే ఎన్టీ రామా రావు ముఖ్యమంత్రి కాలేదని, ఊరూరా చైతన్య రథంపై తిరిగి సరళమైన సామాన్యుడి భాషలో మాట్లాడడమే కారణమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు భాషను వధించడంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నా యన్నారు. తెలుగు సినిమాలు కూడా ఆంగ్ల సబ్ టైటిల్స్ చూసి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగును కాపాడే బాధ్యత ప్రసార మాధ్యమాలపై కూడా ఉందని చెప్పారు. తెలుగు భాషకు గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర ముప్పు పొంచి ఉందని, దాన్ని కాపాడుకోవడానికి మరోసారి ఉద్యమ స్థాయిలో భాషాభిమానులందరూ పూనుకోవాలని పిలుపునిచ్చారు. పోటీని తట్టుకోవాలంటే ఆంగ్లం తప్పనిసరి అని అలాగని తెలుగును విస్మరించ రాదన్నారు. ‘‘ప్రతి ఒక్కరిలో తెలుగంటే గౌరవం పెరగాలి. సగర్వంగా నేను తెలుగువాడినని, నా మాతృ భాష తెలుగని ఎక్కడికెళ్లినా, ఏ పీఠమెక్కినా చెప్పుకోగలగాలి’’ అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఆగస్టు 29న గిడుగు రామ్మూర్తి పంతులు 158వ జయంతి సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ నివాళులర్పించారు. తెలుగు భాష అభివృద్ధికి దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు చేస్తున్న కృషిని ప్రశంసించారు. మండలి బుద్ధ ప్రసాద్, గరికిపాటి నరసింహారావు, కొలకలూరి ఇనాక్, గిడుగు స్నేహలత, పెట్లూరు విక్రమ్, తరిగోపుల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.