కరోనా.. ఒక్క రోజులోనే 103 మంది మృతి | Coronavirus Cases Rises To 56342 In India | Sakshi
Sakshi News home page

కరోనా.. ఒక్క రోజులోనే 103 మంది మృతి

May 8 2020 9:19 AM | Updated on May 8 2020 1:41 PM

Coronavirus Cases Rises To 56342 In India - Sakshi

న్యూఢిలీ​ : భారత్‌లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. దేశంలో నమోదు అవుతున్న కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,390 కరోనా కేసులు నమోదుకాగా, 103 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 56,342కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 16,539 మంది డిశ్చార్జి కాగా, 1,886 మృతిచెందినట్టుగా తెలిపింది. ప్రస్తుతం దేశంలో 37,916 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వెల్లడించింది. 

దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువ భాగం మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, తమిళనాడులలోనే ఉన్నాయి. ఈ నాలుగు చోట్ల దాదాపు 36వేల కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 17, 974 కరోనా కేసులు నమోదు కాగా, 694 మంది మృతిచెందారు. ఆ తర్వాత గుజరాత్‌లో 7,012, ఢిల్లీలో 5,980, తమిళనాడులో 5,409, రాజస్తాన్‌ 3,427, మధ్యప్రదేశ్‌ 3,252, ఉత్తరప్రదేశ్‌లో 3,071 కరోనా కేసులు నమోదయ్యాయి. (చదవండి : వూహాన్‌ ల్యాబ్‌ నుంచే వచ్చింది: పాంపియో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement